భూములిచ్చేవారు ఆందోళన చెందొద్దు
సాగునీటి కాలువలు, ఇతరత్రా నిర్మాణాల కోసం భూములిచ్చే రైతులకు మెరుగైన పరిహారమిచ్చే బాధ్యత తనదేనని మంత్రి హరీశ్రావు అన్నారు. వారికి ఏ కష్టం రానీయకుండా కడుపులో పెట్టి దాచుకుంటామన్నారు.
మెరుగైన పరిహారమిప్పించే బాధ్యత తీసుకుంటా..
రాష్ట్ర ఆర్థిక, వైద్యారోగ్యశాఖ మంత్రి హరీశ్రావు
సాగునీటి రంగం అభివృద్ధిపై రూపొందించిన పుస్తకాన్ని ఆవిష్కరిస్తున్న హరీశ్రావు. చిత్రంలో రఘోత్తంరెడ్డి, క్రాంతికిరణ్, బీబీపాటిల్, మంజుశ్రీ తదితరులు
ఈనాడు, సంగారెడ్డి, న్యూస్టుడే, మునిపల్లి: సాగునీటి కాలువలు, ఇతరత్రా నిర్మాణాల కోసం భూములిచ్చే రైతులకు మెరుగైన పరిహారమిచ్చే బాధ్యత తనదేనని మంత్రి హరీశ్రావు అన్నారు. వారికి ఏ కష్టం రానీయకుండా కడుపులో పెట్టి దాచుకుంటామన్నారు. రెండుశాతం భూములు పోయినా 98శాతానికి సాగునీరు అందుతుందన్నారు. సంగమేశ్వర, బసవేశ్వర ఎత్తిపోతలను పూర్తి చేసి సంగారెడ్డి జిల్లాను మరో కోనసీమగా తీర్చిదిద్దుతామన్నారు. దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా బుధవారం నిర్వహించిన సాగునీటి దినోత్సవం సందర్భంగా మంత్రి హరీశ్రావు సంగమేశ్వర ఎత్తిపోతల పథకంలో భాగంగా నిర్మించనున్న పంప్హౌజ్ నిర్మాణానికి భూమిపూజ నిర్వహించారు. మునిపల్లి మండలం చిన్నచెల్మడలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో జడ్పీ అధ్యక్షురాలు మంజుశ్రీ, కలెక్టర్ శరత్, ఎమ్మెల్సీ రఘోత్తంరెడ్డి, చేనేత అభివృద్ధి సంస్థ అధ్యక్షుడు చింతా ప్రభాకర్, ఎమ్మెల్యేలు క్రాంతికిరణ్, మాణిక్రావు, డీసీఎంఎస్ అధ్యక్షుడు మల్కాపురం శివకుమార్, గ్రంథాలయ సంస్థ అధ్యక్షుడు నరహరిరెడ్డి, మునిపల్లి జడ్పీటీసీ మీనాక్షి తదితరులు పాల్గొన్నారు.
ఇంటింటికీ తాగు నీరిస్తున్నాం..
భూమిపూజ చేసిన అనంతరం అక్కడే సభ నిర్వహించారు. ఈ సందర్భంగా హరీశ్రావు మాట్లాడుతూ.. ఒకప్పుడు ఈ ప్రాంత ప్రజలు తాగునీటి కోసం ఎంతో గోసపడే వారన్నారు. నేడు ఆ బాధలు తొలగిపోయాయన్నారు. ఇంటింటికీ నల్లా ద్వారా తాగునీరు సరఫరా చేస్తున్నామన్నారు. ఒకప్పుడు సింగూరు అంటే హైదరాబాద్ వారిదేనన్నట్లు పరిస్థితి ఉండేదన్నారు. సీఎం కేసీఆర్ సింగూరు జలాలను ఉమ్మడి మెదక్ జిల్లా వారికి అందేలా ప్రత్యేక చొరవ చూపారన్నారు. గతంలో ఇక్కడ ఉపముఖ్యమంత్రి సహా పెద్ద పెద్ద మంత్రులున్నా ఏనాడూ సింగూరు జలాలు స్థానికులకు రావాలని పోరాటం చేయలేదన్నారు. ఈ నీళ్లను హైదరాబాద్కు అప్పజెప్పి జిల్లాలోని సాగు భూములను బీళ్లుగా మార్చారన్నారు. సీఎం కేసీఆర్ ఎంతో దూరదృష్టితో ఈ రెండు ఎత్తిపోతల పథకాలకు రూపకల్పన చేశారన్నారు. అందోలు నియోజకవర్గంలో రహదారుల అభివృద్ధికి ఇటీవలే రూ.100 కోట్లు మంజూరు చేశామన్నారు. సాధ్యమైనంత త్వరగా పనులు పూర్తయ్యేలా చూస్తామన్నారు. ఈ సందర్భంగా రాష్ట్రసాగునీటి రంగంలో జరిగిన మార్పులను వివరించేలా రూపొందించిన పుస్తకాలను ఆయన ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి ముందుగా చిన్నచెల్మడ గ్రామంలో తెలంగాణ తల్లి విగ్రహానికి ఆయన పూలమాల వేశారు. గ్రామంలో నూతనంగా అందుబాటులోకి తెచ్చి క్రీడా ప్రాంగణాన్ని ప్రారంభించారు. సర్పంచి విజయ్భాస్కర్తో పాటు స్థానిక నేతలు మంత్రి హరీశ్రావుకు ఘన స్వాగతం పలికారు.
ధరిణితో భూసమస్యల పరిష్కారం
సదాశివపేట: భూ సమస్యలు పరిష్కరించేందుకు ప్రభుత్వం ధరణి పోర్టల్ తీసుకొచ్చిందని మంత్రి హరీశ్రావు అన్నారు. బుధవారం సదాశివపేట తహసీల్దార్ కార్యాలయాన్ని ఆయన సందర్శించి ధరణి పోర్టల్ పనితీరును పరిశీలించారు. రైతులతో మాట్లాడారు. ధరణి సేవల తీరుపై ఆరా తీశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ గతంలో రిజిస్ట్రేషన్ కోసం అనేక సమస్యలు ఉండేవని ధరణి వల్ల తొలగిపోయాయన్నారు. అనంతరం పలువురు కర్షకులకు రిజిస్ట్రేషన్ పత్రాలు అందించారు. పట్టణానికి చెందిన గిరిజారాణికి మెరుగైన వైద్య చికిత్సకోసం ముఖ్యమంత్రి సహాయనిధి నుంచి మంజూరైన రూ.రెండు లక్షలకు సంబంధించిన ఎల్వోసీ పత్రాన్ని అందజేశారు. కార్యక్రమంలో చేనేత అభివృద్ధి సంస్థ ఛైర్మన్ చింతా ప్రభాకర్, జిల్లా పాలనాధికారి డాక్టర్ శరత్, అదనపు కలెక్టర్ వీరారెడ్డి, తహసీల్దార్ మనోహర్ చక్రవర్తి తదితరులు పాల్గొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కోహీర్లో యువకుడి దారుణ హత్య
[ 23-04-2024]
కోహీర్లో యువకుడు దారుణ హత్యకు గురయ్యాడు. పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల ఆవరణలో అర్ధరాత్రి దాటాక దాడి చేసి హత్య చేశారు. -
మెదక్ నుంచి ఇందిర.. ఎందుకు పోటీ చేశారంటే?
[ 23-04-2024]
అది 1977 సంవత్సరం.. అంతకుముందే దేశంలో అత్యవసర పరిస్థితి ఎత్తివేశారు. ఆ తర్వాతి సార్వత్రిక ఎన్నికల్లో ఇందిరాగాంధీ నేతృత్వంలోని కాంగ్రెస్ పార్టీ ఘోర పరాజయం పాలైంది. ఉత్తరప్రదేశ్లోనూ ఇందిర ఓడిపోయారు. -
ప్రతి ఓటును ఒడిసిపట్టేలా..
[ 23-04-2024]
సిట్టింగ్ స్థానాన్ని నిలబెట్టుకోవాలని భారాస.. పాతికేళ్ల తర్వాత అవకాశాలు మెరుగ్గా ఉన్నాయని కాంగ్రెస్... ఈసారి సత్తా చాటాలని భాజపా.. పక్కా వ్యూహంతో ముందుకు కదులుతున్నాయి. -
కాంగ్రెస్ది అవినీతి, కుటుంబ పాలన
[ 23-04-2024]
తెలంగాణలో కొత్తగా ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వం అవినీతి, అక్రమాలకు పాల్పడుతోందని కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి పీయూష్ గోయల్ ఆరోపించారు. సోమవారం సంగారెడ్డిలో జహీరాబాద్ భాజపా ఎంపీ అభ్యర్థి బీబీపాటిల్ నామినేషన్ దాఖలు చేశారు. -
ఏడు నామినేషన్ల దాఖలు
[ 23-04-2024]
మెదక్ లోక్సభ స్థానానికి సోమవారం ఏడుగురు నామినేషన్లు వేశారు. తెలంగాణ రాజ్య సమితి నుంచి తుపాకుల మురళీకాంత్, ఇండియా ప్రజాబంధు పార్టీ నుంచి మైసన్గారి సునీల్ నామపత్రాలను దాఖలు చేశారు. -
భాజపా దుష్ప్రచారం నమ్మొద్దు: హరీశ్రావు
[ 23-04-2024]
భారాస ఎంపీ అభ్యర్థి వెంకట్రామిరెడ్డిపై సామాజిక మాధ్యమాల్లో భాజపా సాగిస్తున్న దుష్ప్రచారం అబద్ధమని, గోబెల్ ప్రచారాన్ని నమ్మొద్దని మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్రావు అన్నారు. -
చితికిపోతున్న.. చిరు వ్యాపారులు
[ 23-04-2024]
జిల్లాలోని పురపాలికల్లో వీధి వ్యాపారుల కోసం షెడ్ల నిర్మాణం ప్రతిపాదనల దశ దాటడం లేదు. మెదక్లో నిర్మాణం చేపట్టినా ప్రారంభించకుండా అలాగే వదిలేశారు. -
విజ్ఞాన నేస్తం.. మార్గదర్శనం
[ 23-04-2024]
పుస్తకం.. సమస్త విజ్ఞానాన్ని సమకూర్చుతుంది. మనిషిని మనీషిగా మార్చేందుకు బాటలు వేస్తుంది. చిరిగిన చొక్కా అయినా తొడుక్కో.. ఒక మంచి పుస్తకం కొనుక్కో.. అంటూ సంఘ సంస్కర్త కందుకూరి వీరేశలింగం ఆ ప్రాధాన్యాన్ని స్పష్టం చేశారు. -
అటు ఇటు మారి.. భువనగిరిలో చేరి..
[ 23-04-2024]
పార్లమెంట్ నియోజకవర్గాలు ఆవిర్భావమై దాదాపు ఏడు దశాబ్దాలు కాగా ఇప్పటి వరకు నాలుగు నియోజకవర్గాలకు మారడం గమనార్హం. పునర్విభజన జరిగినప్పుడల్లా పార్లమెంటరీ నియోజకవర్గం మారింది. -
ఈవీఎం, వీవీప్యాట్లకు ఇదే తేడా..
[ 23-04-2024]
ఎలక్టాన్రిక్ ఓటింగ్ మెషీన్ (ఈవీఎం)లోని ఒక భాగమే ఓటర్ వెరిఫైడ్ పేపర్ ఆడిట్ ట్రయల్ (వీవీ ప్యాట్). అభ్యర్థి పేరు, గుర్తు, సీరియల్ నంబరు దీనిపై కనిపిస్తాయి. అది కేవలం 7 సెకన్లు మాత్రమే ఉంటుంది. -
లంచం కేసులో ఎస్సై, కానిస్టేబుల్ సస్పెన్షన్
[ 23-04-2024]
లంచం కేసులో డబ్బులు తీసుకున్నట్లు అవినీతి నిరోధక శాఖ(అనిశా) విచారణలో తేలడంతో మెదక్ గ్రామీణ ఎస్సై, కానిస్టేబుల్ను సస్పెండ్ చేస్తూ మల్టీ జోన్-1 ఐజీ రంగనాథ్ ఉత్తర్వులు జారీ చేశారు. -
ప్రజాచైతన్యంలో గ్రంథాలయాలు కీలకం
[ 23-04-2024]
ప్రజాచైతన్యానికి ఆ నాటి గ్రంథాలయాలు కీలకంగా పనిచేశాయని.. నిజాం నిరంకుశ పాలన, దొరల పెత్తనాన్ని మట్టుబెట్టేందుకు ఉపయోగపడ్డాయని ఆచార్య కోదండరామ్ అన్నారు. -
ఓటర్లకు చేరువ
[ 23-04-2024]
సార్వత్రిక ఎన్నికల ప్రక్రియ సజావుగా నిర్వహించేందుకు ఎన్నికల సంఘం ప్రాధాన్యం ఇస్తోంది. ఎన్నికల సంఘం షెడ్యూలుకు అనుగుణంగా జిల్లా యంత్రాంగం ఏర్పాట్లలో నిమగ్నమైంది. -
పురపాలికల్లో పట్టు.. విజయానికి మెట్టు
[ 23-04-2024]
మెదక్, జహీరాబాద్ లోక్సభ స్థానాల్లో విజయమే లక్ష్యంగా పార్టీలు వ్యూహరచన చేస్తున్నాయి. ప్రధానంగా పట్టణ ఓటర్లను తమ వైపు తిప్పుకొంటే సులువుగా విజయం సాధించవచ్చని భావిస్తున్నాయి. -
పోరు.. ఇక హోరు
[ 23-04-2024]
జహీరాబాద్ లోకసభ నియోజకవర్గంలో ప్రధాన పార్టీల అగ్రనేతల ప్రచారానికి రంగం సిద్ధమైంది. కాంగ్రెస్, భారాస, భాజపాలు ఇప్పటికే నియోజకవర్గం పరిధిలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో మండల, నియోజకవర్గ స్థాయి సమావేశాలు నిర్వహించి కార్యకర్తలకు దిశానిర్దేశం చేశాయి. -
ఈసారి అవకాశం ఇవ్వండి
[ 23-04-2024]
భారాస అభ్యర్థి వినోద్కుమార్, భాజపా అభ్యర్థి బండి సంజయ్లను ఒక్కోసారి గెలిపించిన కరీంనగర్ లోక్సభ ఓటర్లు, ఈసారి తనను గెలిపించాలని కాంగ్రెస్ పార్టీ తరఫున నామపత్రాలు దాఖలు చేసిన వెలిచాల రాజేందర్రావు కోరారు. -
విత్తనోత్పత్తికి అనుకూలం.. ప్రోత్సహించాల్సిన అవసరం
[ 23-04-2024]
వ్యవసాయంలో కీలకమైన విత్తనాలను కర్షకులు సేకరించడానికి అధిక ఖర్చు చేయాల్సి వస్తోంది. ఎక్కడో తయారు చేసిన వాటిని ఇక్కడి భూముల్లో విత్తితే చివరికి పంట ఎదుగుతుందో లేదోననే అనుమానం.
తాజా వార్తలు (Latest News)
-
కేజ్రీవాల్, కవిత జ్యుడీషియల్ కస్టడీ మళ్లీ పొడిగింపు
-
ఫొటోకు పోజులిస్తూ... అగ్నిపర్వతంలో జారిపడిన పర్యటకురాలు
-
విమానాల్లో 12 ఏళ్లలోపు వారికి తల్లిదండ్రుల పక్కనే సీటివ్వాలి: డీజీసీఏ
-
జగన్పై రాయి దాడి కేసు.. నిందితుడి కస్టడీ పిటిషన్పై తీర్పు వాయిదా
-
కొంతమంది ముంబయి ఆటగాళ్లు రోహిత్ శర్మనే కెప్టెన్ అనుకుంటున్నారు: ఇర్ఫాన్ పఠాన్
-
మాధురి దీక్షిత్తో నటించాలంటే భయమేసింది: మనీషా కొయిరాలా