చెరువు మాదంటే మాది
చేపల కోసం రెండు గ్రామాల మధ్య పంచాయతీ ఏర్పడింది. గురువారం ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. హుస్నాబాద్ మండలంలోని ఉమ్మాపూర్, నాగారం గ్రామాల శివారులో మహాసముద్రం చెరువు, భైరోని చెరువు ఉన్నాయి.
బైరోని చెరువు గట్టుపై నాగారం గ్రామస్థులు
హుస్నాబాద్ గ్రామీణం, న్యూస్టుడే: చేపల కోసం రెండు గ్రామాల మధ్య పంచాయతీ ఏర్పడింది. గురువారం ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. హుస్నాబాద్ మండలంలోని ఉమ్మాపూర్, నాగారం గ్రామాల శివారులో మహాసముద్రం చెరువు, భైరోని చెరువు ఉన్నాయి. మత్స్యకార్మికులు కలిసి చేపలు పట్టుకునే వారు. వారి వాటా(పాలు) ప్రకారం పంచుకునేవారు. మహాసముద్రం చెరువు గండి పూడ్చివేసినప్పటి నుంచి రెండు గ్రామాల మత్స్యకార్మికుల మధ్య వివాదం తలెత్తింది. చెరువు మాదంటే మాదని, చేపలు పట్టుకునే హక్కు మాకేనని రెండు గ్రామాలవారు పట్టుబడుతున్నారు. రెండేళ్ల క్రితం పరస్పరం దాడులు చేసుకున్నారు. నాగారానికి బైరోని చెరువు, ఉమ్మాపూర్కు మహాసముద్రం చొప్పున ఎమ్మెల్యే సతీశ్కుమార్ సూచనతో గతంలో పంపకాలు జరిగాయంటున్నా అభ్యంతరాలు వ్యక్తం అయ్యాయి. నాగారం గ్రామస్థులు గురువారం ఉదయం చేపలు పట్టేందుకు వెళ్లగా ఉమ్మాపూర్ వారు ఆందోళనకు దిగారు. నాగారం వాసులు చెరువు గట్టునే వంటావార్పుతో నిరసన తెలిపారు. గొడవ జరుగుతుండగా 100 నంబరుకు ఫోన్ చేస్తే పోలీసు స్టేషన్కు వచ్చి ఫిర్యాదు చేయాలని సూచించారు. పరిష్కారమయ్యే వరకు చేపలు ఎవరూ పట్టొద్దని అక్కడి నుంచి వెళ్లిపోయారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
నామపత్రాలతో నాంది
[ 18-04-2024]
జిల్లా స్థాయిలో లోక్సభ ఎన్నికల రిటర్నింగ్ అధికారి, కలెక్టర్ రాహుల్రాజ్ నోటిఫికేషన్ విడుదల చేయనున్నారు. అనంతరం మెదక్ లోక్సభ నియోజకవర్గానికి కలెక్టరేట్లో ప్రతిరోజు ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు నామినేషన్లు స్వీకరించనున్నారు. -
కమనీయం.. రాములోరి కల్యాణం
[ 18-04-2024]
రఘుకుల నందన.. వారధి బంధన.. శ్రీరామ జయరామ’ అంటూ భక్తుల జయజయద్వానాలతో జిల్లా వ్యాప్తంగా రామాలయాలు మార్మోగాయి -
పడిలేచిన కెరటం.. అర్పిత
[ 18-04-2024]
అనాథ పిల్లల జీవితాలే ఆ యువతి సివిల్ సర్వీసెస్ పరీక్షల్లో మెరిసేలా చేశాయి. మూడు సార్లు పరీక్షలో విఫలమైనా నిరాశ చెందకుండా ముందడుగు వేసి విజయం సాధించి నేటి యువతకు స్ఫూర్తిగా నిలిచింది -
ఉక్కపోత.. బిల్లుల మోత
[ 18-04-2024]
జిల్లాలో ఎండల తీవ్రత అధికమవ్వడంతో ఉక్కపోత మొదలైంది. దీంతో విద్యుత్తు వినియోగం పెరగడంతో రూ.వందల్లో రావాల్సిన బిల్లులు రూ.వేలల్లో వస్తున్నాయి. -
పరస్పర సహకారం..ఆర్థికవృద్ధికి దోహదం
[ 18-04-2024]
సభ్యులకు బీమా సేవల పంచాయతీలో పారిశుద్ధ్య కార్మికుడిగా పని చేస్తున్నా. సంఘంలో 18 ఏళ్ల క్రితం చేరా. రూ.17 వేలు పొదుపు చేశా -
ఉల్లంఘనలపై డేగకళ్ల నిఘా
[ 18-04-2024]
ఎన్నికల నిర్వహణలో నిఘా వ్యవస్థ ఎంతో ప్రధానం. పోటీ చేసే అభ్యర్థులు ఎన్నికల నియమావళి పాటిస్తున్నారా లేదంటే ఉల్లంఘనలకు పాల్పడుతున్నారా అని పర్యవేక్షించడం కీలకం -
నియోజకవర్గ ఇన్ఛార్జులెవరో?
[ 18-04-2024]
-
గెలుపు వ్యూహాలు
[ 18-04-2024]
జహీరాబాద్ పార్లమెంటు నియోజకవర్గ ఎన్నికల పోరులో గెలుపు అవకాశాలపై పార్టీలు బేరీజు వేసుకుంటున్నాయి. మొదటిసారి త్రిముఖ పోటీ నెలకొనడంతో ఎన్నికలు రసవత్తరంగా జరిగే అవకాశం ఉన్నట్లు అంచనా వేస్తున్నారు. -
చెప్పుల దండ వేసినందుకు భారాస నుంచి సస్పెన్షన్
[ 18-04-2024]
భారాస అభ్యర్థి ప్రచార రథంపై ఉన్న చిత్రపటానికి చెప్పుల దండ వేసిన కాసులాబాద్ 78వ బూత్ అధ్యక్షుడు యాదగిరిపై చర్యలు తీసుకున్నారు.