‘భూగర్భం’.. ఆగమాగం
ప్రభుత్వం దాదాపు రూ.100 కోట్ల భారీ అంచనా వ్యయంతో గజ్వేల్-ప్రజ్ఞాపూర్ బల్దియాలో నిర్మించిన భూగర్భ మురుగు నీటిపారుదల వ్యవస్థ (అండర్ గ్రౌండ్ డ్రైనేజీ) లోపభూయిష్టంగా మారింది.
మురుగు పారుదల గొట్టాల నిర్మాణాల్లో తలెత్తుతున్న లోపాలు
యంత్రం ద్వారా శుభ్రం చేస్తున్న సిబ్బంది
న్యూస్టుడే, గజ్వేల్: ప్రభుత్వం దాదాపు రూ.100 కోట్ల భారీ అంచనా వ్యయంతో గజ్వేల్-ప్రజ్ఞాపూర్ బల్దియాలో నిర్మించిన భూగర్భ మురుగు నీటిపారుదల వ్యవస్థ (అండర్ గ్రౌండ్ డ్రైనేజీ) లోపభూయిష్టంగా మారింది. అధికారుల పర్యవేక్షణ లోపం, గుత్తేదారు ఇష్టారీతిన చేపట్టిన నిర్మాణాలు అస్తవ్యస్తంగా తయారయ్యాయి. పనులు ముగిసిన చోట నెలలు గడువక ముందే లోపాలు తలెత్తుతున్నాయి. మురుగు గొట్టాలు స్తంభించిపోయి దుర్వాసన వెదజల్లుతోంది. మ్యాన్హోళ్లు నిండిపోయి మురుగు నీరంతా రోడ్లపై పారుతూ దుర్వాసన వస్తోంది.
పనులు తాత్కాలికమే
రెండు నెలల కిందట 14వ వార్డులో పైపులైన్లలో స్తంభించటంతో యంత్రాల ద్వారా నీటి ఒత్తిడిని ప్రయోగించి సమస్యను తాత్కాలికంగా పరిష్కరించారు. ప్రస్తుతం ప్రజ్ఞాపూర్లోని బాలుర ప్రభుత్వ పాఠశాల ముందు రోడ్డుపై మ్యాన్హోళ్లు నిండిపోయి మురుగు పారుతుంది. మిగతా వార్డుల్లో చాలా చోట్ల ఇదే పరిస్థితి నెలకొంది. రోడ్డుపై ప్రజల రాకపోకలకు ఇబ్బందులు పడుతున్నారు. దుర్వాసనతో వెళ్లలేక పోతున్నారు. చాలా మ్యాన్హోళ్లను సరిగా నిర్మించలేదు. మురుగు సరిగా వెళ్లటం లేదు. అధికారులు స్పందించి తగు పరిష్కార చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.
130 కి.మీ. పూర్తి
గజ్వేల్-ప్రజ్ఞాపూర్ బల్దియా పరిధిలో మురుగు సమస్యకు శాశ్వత పరిష్కారం కోసం ముఖ్యమంత్రి కేసీఆర్ అండర్ డ్రైనేజీ నిర్మాణం కోసం ప్రత్యేక నిధులు మంజూరు చేశారు. మొత్తం 20 వార్డుల పరిధిలో మొత్తం 138 కిలోమీటర్ల మేర గొట్టాల నిర్మాణం చేపట్టాలని నిర్ణయించారు. 2020 జూన్లో పనులు ప్రారంభమయ్యాయి. ఇప్పటివరకు దాదాపు 5 వేలకుపైగా మ్యాన్హోళ్లు, 4వేల వరకు చిన్న మ్యాన్హోళ్లుతో సహా 130 కిలోమీటర్ల మేర పనులు పూర్తయినట్లు అధికారులు చెబుతున్నారు. కాలువలు తవ్వి గొట్టాలు బిగించే సమయంలో ఎత్తుపల్లాల కొలత సరిగా వేయకుండానే నిర్మాణాలు చేశారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ సమయంలో కాలనీ ప్రజల నుంచి తీవ్ర నిరసన వ్యక్తమైనా అధికారులు, గుత్తేదారు ప్రజల ఆవేదనను ఏమాత్రం పరిగణనలోకి తీసుకోకుండానే నిర్మాణాలు చేశారని స్థానికులు ఆరోపిస్తున్నారు. 14వ వార్డులో ఎయిర్టెల్ కాలనీలో మంచినీళ్ల పైపులపై నుంచే తక్కువ లోతు గుంతలు తీసి మ్యాన్హోళ్లు నిర్మిస్తున్నారని స్థానికులు గతంలో ఆందోళన చేపట్టారు. ప్రజ్ఞాపూర్,గజ్వేల్ బీటీ రోడ్లపై నిర్మించిన పైప్లైన్లు, మ్యాన్హోళ్లను రెండేసి సార్లు సవరించినా సమస్య తీరకపోవటంతో వాటిని అలాగే వదిలిపెట్టారు.
సమస్య తలెత్తకుండా చూస్తాం
ఎన్సీ రాజమౌళి, బల్దియా ఛైర్మన్
మురుగు సమస్యకు శాశ్వత పరిష్కారం కోసమే ప్రభుత్వం బల్దియాలో అండర్ డ్రైనేజీ వ్యవస్థను ఏర్పాటు చేయించింది. దీనిని అందరూ కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. కొందరు మ్యాన్హోళ్లలో వ్యర్థాలు వేస్తున్నట్లు దృష్టికి వచ్చింది. అవగాహన కల్పిస్తాం. స్తంభించిన చోట బాగు చేయించి సమస్య తలెత్తకుండా చర్యలు తీసుకుంటాం.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
‘ఉపాధి’ పని.. లక్ష్యానికి హామీ
[ 29-03-2024]
వ్యవసాయ కార్యకలాపాలు ప్రస్తుతం సన్నగిల్లడంతో జిల్లాలో ఉపాధి హామీ పనులు ఊపందుకున్నాయి. ఆర్థిక సంవత్సరం ముగింపు గడువు దగ్గర పడుతుండటంతో లక్ష్యాన్ని చేరుకునేందుకు గ్రామీణాభివృద్ధి జిల్లా అధికారులు కూలీల సంఖ్య పెంచేందుకు ప్రత్యేక కార్యక్రమం చేపట్టారు. -
ప్రజాభాగస్వామ్యం.. పర్యావరణహితం
[ 29-03-2024]
‘పర్యావరణం బాగుంటే.. సమస్త జీవజాతుల మనుగడ సాఫీగా సాగుతుంది. ఇందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టడంతో పాటు ప్రజాభాగస్వామ్యం పెరగాలి. గ్రామస్థాయి నుంచే చైతన్యం, అవగాహన పెరగాలి. -
డంపింగ్యార్డుల్లా ఖాళీ స్థలాలు!
[ 29-03-2024]
పురపాలికల్లో పారిశుద్ధ్యం అస్తవ్యస్తంగా మారుతోంది. ఖాళీ స్థలం కనబడితే చాలు చెత్త వేస్తున్నారు. మరోవైపు మురుగు నీరు నిలిచి దుర్వాసన వెదజల్లుతోంది. -
ప్రకృతివనం భూమి ధారాదత్తం
[ 29-03-2024]
చేగుంట మండలం అనంతసాగర్ శివారులో నాలుగేళ్ల క్రితం సుమారు పది ఎకరాల్లో రూ.40 లక్షలు వెచ్చించి బృహత్ పల్లెప్రకృతివనం ఏర్పాటు చేశారు. అధికారులు ఉపాధి హామీ పథకంలో అభివృద్ధి చేశారు. -
ఖాళీ బిందెలతో కనిపించొద్దు: కలెక్టర్
[ 29-03-2024]
గ్రామాలు, పట్టణ ప్రాంతాల్లో మహిళలు ఖాళీ బిందెలతో నీళ్ల కోసం కనబడితే అధికారులపై చర్యలు తప్పవని కలెక్టర్ రాహుల్ రాజ్ హెచ్చరించారు. మిషన్ భగీరథ నీళ్లు తప్పనిసరిగా ప్రతి గడపకు అందాలన్నారు. -
బార్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడిగా సుభాష్చంద్రబోస్
[ 29-03-2024]
మెదక్ జిల్లా బార్ అసోసియేషన్ అధ్యక్షుడిగా సుభాష్చంద్రబోస్ ఎన్నికయ్యారు. గురువారం మెదక్ పట్టణంలోని న్యాయస్థాన ప్రాంగణంలో ఎన్నిక నిర్వహించారు. -
జీవ వైవిధ్యం.. సంరక్షణతో పదిలం
[ 29-03-2024]
జీవవైవిధ్య సంరక్షణలో మొక్కల పాత్ర కీలకం.. ఇదే క్రమంలో అంతరించిపోతున్న వాటిని సంరక్షించాలి.. మానవాళికి ఉపయోగపడే వాటిని దరిచేర్చాల్సిన ఆవశ్యకతను సిద్దిపేట స్వయం ప్రతిపత్తి కలిన ప్రభుత్వ డిగ్రీ... -
బస్సులెక్కే మహిళలే లక్ష్యంగా చోరీలు
[ 29-03-2024]
ఆర్టీసీ ప్రయాణ ప్రాంగణాల్లో మహిళలను లక్ష్యంగా చేసుకుని, వారి బ్యాగులో నుంచి బంగారు ఆభరణాలను చోరీ చేస్తున్న ముఠా సభ్యులను గురువారం పోలీసులు అరెస్టు చేశారు. -
ఒక్క ప్రమాదం.. నాలుగిళ్లలో విషాదం
[ 29-03-2024]
ఒక్క రోడ్డు ప్రమాదం.. నాలుగిళ్లలో తీరని విషాదాన్ని నింపింది. ఓ వైపు పెళ్లి బాజాలు, మరోవైపు బంధువులు, మిత్రుల సంతోషం, ముచ్చట్లతో సంతోషంగా ఉన్న ఆ పెళ్లి ఇల్లు శోకసంద్రంలో మునిగిపోయింది. -
సంపాదనలో పేదలకు 2.5 శాతం
[ 29-03-2024]
పవిత్ర రంజాన్ మాసం రెండో దశ కొనసాగుతోంది. ఈ మాసంలో సంపాదనలో 2.5 శాతం పేదలకు దానధర్మాలు చేస్తుంటారు. ముస్లింలు నెల రోజుల పాటు తరావీ నమాజుకు ఎంతగా ప్రాధాన్యం ఇస్తారో, -
జీపు, ఆటో ఢీకొని ప్రయాణికుడి దుర్మరణం
[ 29-03-2024]
జీపు, ఆటో ఢీ కొని ఒకరు మృతి చెందగా, ఆరుగురికి గాయాలయ్యాయి. ఈ ఘటన యాలాల మండల పరిధిలోని అగ్గనూర్లో గురువారం చోటుచేసుకుంది. ఎస్ఐ శంకర్ తెలిపిన ప్రకారం.. -
అప్పుల బాధతో కార్పెంటర్ ఆత్మహత్య
[ 29-03-2024]
అప్పుల బాధతో యువకుడు ఆత్మహత్య చేసుకున్న ఘటన మండల పరిధిలోని మంబోజిపల్లిలో గురువారం చోటుచేసుకుంది. గ్రామీణ ఠాణా ఏఎస్ఐ శివకుమార్ తెలిపిన వివరాలు.. -
వైభవంగా విగ్రహ ప్రతిష్ఠాపనోత్సవం
[ 29-03-2024]
ప్రసిద్ధ వర్గల్ విద్యాధరి క్షేత్రంలో శ్రీపరివార సమేత చంద్రమౌళీశ్వర స్వామి ప్రతిష్ఠాపనోత్సవం వైభవంగా జరిగింది. ఆలయ వ్యవస్థాపక ఛైర్మన్ యాయవరం చంద్రశేఖర శర్మ నేతృత్వంలో వేదపండితుల మంత్రోచ్చరణల మధ్య... -
సీనియర్ సివిల్ జడ్జికి పీహెచ్డీ ప్రదానం
[ 29-03-2024]
తెలంగాణ విశ్వవిద్యాలయం(తెవివి) న్యాయ కళాశాల పరిశోధక విద్యార్థి, సంగారెడ్డి సీనియర్ సివిల్ జడ్జి ఎం.రాధాకృష్ణ చవాన్కు గురువారం పీహెచ్డీ ప్రదానం చేశారు. -
ఆలయ డబ్బుల దుర్వినియోగంలో ఆడిటర్ ధనుంజయ్ రిమాండ్
[ 29-03-2024]
సిద్దిపేట జిల్లా కొమురవెల్లి మల్లికార్జునస్వామి ఆలయం ఆదాయపన్ను, జీఎస్టీ రిటర్న్స్ దాఖలు డబ్బుల దుర్వినియోగం కేసులో ప్రైవేట్ ఆడిటర్ ధనుంజయ్ని రిమాండ్కు తరలించామని చేర్యాల సీఐ ఎల్.శ్రీనివాస్ గురువారం రాత్రి తెలిపారు.
తాజా వార్తలు (Latest News)
-
అనపర్తి స్థానం మార్పు వైకాపా కుట్ర: నల్లమిల్లి
-
బరిలో ఐదుగురు ఓ.పన్నీర్సెల్వంలు.. అందరి నామినేషన్లు ఆమోదం
-
గుండెపోటుతో గ్యాంగ్స్టర్ ముఖ్తార్ అన్సారీ మృతి.. యూపీలో 144 సెక్షన్
-
వేడుకగా బర్రెలక్క వివాహం.. విషెస్ చెబుతోన్న నెటిజన్లు..
-
మర్మాంగంలోకి ఎయిర్ బ్లోయర్ నాజిల్.. యువకుడు మృతి
-
IPL 2024: కోల్కతా, రాజస్థాన్ జట్లలో ఒక్కో మార్పు.. కొత్తగా ఎవరొచ్చారంటే..