అన్నీ అందితేనే.. చదువు సాగేది!
మరో మూడు రోజుల్లో పాఠశాలలు తెరుచుకోనున్నాయి. పిల్లలకు పాఠాల బోధనకు ఉపాధ్యాయులు సిద్ధమవుతున్నారు. 12 నుంచి ప్రభుత్వ పాఠశాలలు విద్యార్థులతో కళకళలాడనున్నాయి.
కొన్నేళ్లుగా సకాలంలో పంపిణీ చేయక తిప్పలు
ఈసారి పకడ్బందీగా అధికారుల చర్యలు
మరో మూడు రోజుల్లో పాఠశాలలు తెరుచుకోనున్నాయి. పిల్లలకు పాఠాల బోధనకు ఉపాధ్యాయులు సిద్ధమవుతున్నారు. 12 నుంచి ప్రభుత్వ పాఠశాలలు విద్యార్థులతో కళకళలాడనున్నాయి. ఈ తరుణంలో అన్ని వసతులు కల్పించేందుకు ప్రభుత్వం కృషి చేస్తోంది. విద్యాసంవత్సరం ప్రారంభం రోజునే పాఠ్య, రాత పుస్తకాల పంపిణీకి ప్రభుత్వం నిర్ణయించింది. ఏకరూప దుస్తులు సైతం అందించేలా ప్రణాళిక రూపొందించింది. మరోవైపు సర్కారు బడుల్లో చేరికలు పెంచేలా బడి బాటను ప్రారంభించారు. ఈ నేపథ్యంలో ఆయా అంశాలపై ఉమ్మడి మెదక్, వికారాబాద్ జిల్లాల్లోని పరిస్థితిపై కథనం.
ఈనాడు, సంగారెడ్డి, న్యూస్టుడే, సిద్దిపేట, సంగారెడ్డి మున్సిపాలిటీ, మెదక్: కరోనా మహమ్మారితో రెండేళ్ల పాటు బోధన అంతంతే సాగిన విషయం విదితమే. ఆ తర్వాతి నుంచి పాఠ్యపుస్తకాలకు తిప్పలు తప్పలేదు. బడులు మొదలై చాలారోజులైనా అందరికీ సరిపడా అందక సమస్య తలెత్తింది. గత విద్యాసంవత్సరం సంగారెడ్డి, సిద్దిపేట, మెదక్, వికారాబాద్ జిల్లాల్లోని చాలా బడులుకు ఆగస్టు నెలాఖరు వరకు కూడా పూర్తిస్థాయిలో పుస్తకాలు పంపిణీ కాలేదు. దీంతో ఉపాధ్యాయులు పాత విద్యార్థుల నుంచి పాత పుస్తకాలు తెప్పించి సర్దుబాటు చేశారు. ఇది ఫలితాల సాధనపై ప్రభావం చూపిందని నిపుణులు సూచిస్తున్నారు. ఆంగ్ల మాధ్యమం ప్రవేశపెట్టినా అవసరాల మేర పాఠ్యపుస్తకాలు సకాలంలో ఇవ్వకపోవడంతో ఆశించిన లక్ష్యాన్ని చేరుకోలేని పరిస్థితి. ఈసారి ప్రభుత్వం కొత్తగా రాతపుస్తకాలూ పంపిణీ చేస్తామని చెప్పింది. ఈ అంశమై ఇంకా జిల్లాస్థాయిలో తమకు పూర్తి స్పష్టత రాలేదని అధికారులు వివరించారు.
పిల్లల సంఖ్య పెంచేలా..
సిద్దిపేటలో బడిబాట ర్యాలీ
ప్రబుత్వ పాఠశాలల్లో పిల్లల సంఖ్య పెంచేందుకు ఈనెల 3న బడిబాట కార్యక్రమం ప్రారంభించారు. ప్రైవేటు బడుల్లో చదువుతున్న వారితో పాటు బడి బయట పిల్లలను రప్పించేలా కసరత్తు కొనసాగుతోంది. ఉపాధ్యాయులు ఇంటింటికి తిరుగుతూ ప్రభుత్వం అందిస్తోన్న సదుపాయాల గురించి వివరిస్తున్నారు. పలు చోట్ల అప్పటికప్పుడే ప్రవేశాలు చేయిస్తున్నారు. డీఈవోలు ఎప్పటికప్పుడు దిశానిర్దేశం చేస్తూ ప్రోత్సహిస్తున్నారు. వీలైనంత మేర పిల్లలను చేర్చుకోవడమే లక్ష్యంగా కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నారు.
చొరవ చూపాలి..
పంపిణీకి సిద్ధంగా పుస్తకాలు
నాలుగు జిల్లాల పరిధిలో పరిశీలిస్తే సంగారెడ్డి, సిద్దిపేట, వికారాబాద్లలో అవసరమైన పాఠ్యపుస్తకాల్లో 80 శాతానికి పైగా జిల్లాకు చేరుకున్నాయి. జిల్లా కేంద్రం నుంచి మండలాలకూ పంపిణీ సైతం మొదలైంది. మెదక్ జిల్లాలో అధికారులు ఈ విషయమై ప్రత్యేక దృష్టిసారించాల్సిన అవసరం ఉంది. ఇప్పటి వరకు కేవలం 49 శాతం మాత్రమే జిల్లా కేంద్రానికి వచ్చినట్లు గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. బడులు ప్రారంభమయ్యేలోపు మిగతా వాటినీ తెప్పించాలి. మండల కేంద్రాలకు చేరిన పుస్తకాలను ఆయా బడుల ఉపాధ్యాయులు వచ్చి తీసుకెళ్తుంటారు. ఈనెల 12 నుంచి ప్రక్రియ మొదలవుతుంది. మిగతావి సైతం జిల్లాకు అందేలా ఉన్నతాధికారులు చొరవ చూపాలి.
ఏకరూప దుస్తులూ ఆలస్యమే
గతేడాది వస్త్రం రాక ఆలస్యం కావడంతో ఏకరూప దుస్తుల పంపిణీలో తీవ్ర జాప్యం చోటు చేసుకుంది. మొదట్లో ఆగస్టులో పూర్తిచేస్తామన్నా సాధ్యం కాలేదు. జనవరిలో విద్యార్థులకు వాటిని అందించారు. ఈసారి మొదట్లోనే ఇవ్వాలని నిర్ణయించారు. ఈనెల 20న విద్యాదినోత్సవం రోజు పంపిణీకి కసరత్తు చేస్తున్నారు. తొలుత కనీసం ఒక జత ఇచ్చి సాధ్యమైనంత త్వరగా మరోటి అందించేలా కార్యాచరణ రూపొందించారు. దుస్తుల నాణ్యత సరిగా లేక కొన్ని రోజులకే చినుగుతుండటం విద్యార్థులను ఇబ్బంది పెడుతోంది. ఈ సారైనా పరిస్థితిలో మార్పు ఉంటుందో లేదో వేచిచూడాలి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కట్టుదిట్టం.. కట్టలు స్వాధీనం
[ 24-04-2024]
ఈ నెల 19న వికారాబాద్ జిల్లా నవాబుపేటలో పోలీసుల తనిఖీల్లో ఎలాంటి పత్రాలు లేకుండా కారులో తీసుకెళ్తున్న రూ.1.05 కోట్లు స్వాధీనం చేసుకున్నారు. -
సిద్దిపేట కోర్టులో హిజ్రాకు ఉద్యోగం
[ 24-04-2024]
సిద్దిపేట జిల్లా కోర్టులో న్యాయసేవాధికార సంస్థ విభాగంలో హిజ్రాకు పొరుగు సేవల కింద ఉద్యోగం కల్పించారు. పట్టణంలోని ఇందిరమ్మ కాలనీకి చెందిన ప్రశాంతిని ఆఫీస్ సబార్డినేట్గా నియమిస్తూ సిద్దిపేట జిల్లా ప్రధాన న్యాయమూర్తి డా.టి.రఘురాం, న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి స్వాతిరెడ్డి మంగళవారం నియామక పత్రం అందజేశారు. -
ధర లేక రైతన్న దిగాలు
[ 24-04-2024]
యాసంగిలో రైతులు ఎంతో ఆశతో సాగుచేసిన సన్నధాన్యానికి ధర లేకపోవటంతో నష్టపోవాల్సి వచ్చింది. ప్రస్తుతం సన్న బియ్యంకు ధర ఎక్కువగా ఉండటంవల్ల చాలా మంది కర్షకులు దానిని సాగు చేసేందుకు ముందుకు వచ్చారు. -
వేసవి శిబిరాలు.. నైపుణ్యాలకు నిలయాలు
[ 24-04-2024]
క్రీడలు మానసిక ఉల్లాసానికి తోడ్పడుతాయి. ఒత్తిడిలో ఉన్నవారు కాసేపు ఆటలు ఆడితే ఎంతో ఉపశమనం పొందవచ్చు. వేసవి వస్తే విద్యార్థులు ఇంట్లోనే ఉంటూ చరవాణులకు అతుక్కుపోతుంటారు. -
పెరుగుతున్న ప్రచార వేడి
[ 24-04-2024]
లోక్సభ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల నామినేషన్ దాఖలుకు తుది గడువు ఇంకా రెండు రోజులే ఉంది. ఇప్పటికే భాజపా అభ్యర్థి నామినేషన్ వేయగా, కాంగ్రెస్ అభ్యర్థి తరఫున మెదక్ ఎమ్మెల్యే నామపత్రాలు దాఖలు చేశారు. -
ఇలా ఫిర్యాదు.. అలా పరిష్కారం
[ 24-04-2024]
విద్యుత్తు సరఫరాలో అంతరాయం లేకుండా వినియోగదారులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఉండేందుకు ఆ శాఖ అధికారులు చర్యలు చేపట్టారు. -
త్రిలింగ ప్రాంతం.. భిన్న సంప్రదాయం
[ 24-04-2024]
జహీరాబాద్ లోక్సభ స్థానం పరిధిలోని నారాయణఖేడ్ అసెంబ్లీ నియోజకవర్గం రాష్ట్ర సరిహద్దులో ఉంటుంది. కర్ణాటక, మహారాష్ట్ర ప్రాంతాలు ఆనుకొని ఉన్నాయి. -
సొంత గడ్డ... ఆధిక్యపు అడ్డా
[ 24-04-2024]
భారాస అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఇప్పటి వరకు వివిధ నియోజకవర్గాల నుంచి అయిదు సార్లు ఎంపీగా పోటీ చేయగా.. అత్యధిక ఆధిక్యం మాత్రం సొంతగడ్డ మెదక్లోనే సాధ్యమైంది. -
వివాహేతర సంబంధమే హత్యకు దారితీసింది
[ 24-04-2024]
భార్యతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడనే అనుమానమే ప్రభుత్వ ఉపాధ్యాయుడి హత్యకు దారి తీసింది. ఈ కేసులో సదరు మహిళ భర్తతోపాటు మరో ఇద్దరి నిందితులను మంగళవారం అరెస్టు చేశారు. -
హత్యలతో కలవరం
[ 24-04-2024]
మెదక్, సంగారెడ్డి జిల్లాల్లో చోటుచేసుకున్న రెండు హత్యలు కలవరానికి గురిచేశాయి. భార్య కాపురానికి రాకపోవడానికి అత్తే కారణమని అల్లుడు గొడ్డలితో హత్య చేశాడు. -
అవకాశాలు అందిపుచ్చుకోవాలని..
[ 24-04-2024]
లోక్సభ ఎన్నికల్లో ప్రచారం పట్టాలెక్కింది. పోలింగ్ తేదీ సమీపిస్తుండడంతో అభ్యర్థులు రోజువారీ ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నారు. -
ఓటున్న ప్రవాసీ.. పెరగాలి చైతన్య దీప్తి
[ 24-04-2024]
వజ్రాయుధంతో సమానమైన ఓటు హక్కును సద్వినియోగం చేసుకుంటేనే సార్థకత. ప్రజాస్వామ్య పరిరక్షణకు బాటలు వేసే ఎన్నికల క్రతువులో దేశ భవితను ‘ఓటు’ నిర్దేశిస్తుంది.