ఆపసోపాల మధ్య ధాన్యం అమ్మకాలు
యాసంగిలో చేతికొచ్చిన ధాన్యం విక్రయానికి అన్నదాతలు ఆపసోపాలు పడ్డారు. ఓ వైపు అకాల వర్షాలు.. మరో వైపు తూకం వేసినా మిల్లులకు తరలించడంలో తీవ్ర జాప్యం చోటుచేసుకుంది.
ఎట్టకేలకు తుది దశకు చేరుకున్న వైనం
మిల్లు వద్ద నిలిచిన వాహనాలు
శివ్వంపేట సహకార సంఘం ఆధ్వర్యంలో 16 కేంద్రాలు ఏర్పాటయ్యాయి. ఇప్పటి వరకు 1.40 లక్షల క్వింటాళ్ల ధాన్యం సేకరించగా, మరో పది వేల క్వింటాళ్ల మేర మిగిలి ఉంది. శివ్వంపేట, పెద్దగొట్టిముక్ల, కొత్తపేట తదితర గ్రామాల్లో కేంద్రాలు కొనసాగుతున్నాయి. ఐకేపీ ఆధ్వర్యంలో ఏడు కేంద్రాలు మూసివేయగా, 20 వేల క్వింటాళ్లు కొనుగోలు చేశారు.
న్యూస్టుడే, మెదక్, శివ్వంపేట, చిలప్చెడ్: యాసంగిలో చేతికొచ్చిన ధాన్యం విక్రయానికి అన్నదాతలు ఆపసోపాలు పడ్డారు. ఓ వైపు అకాల వర్షాలు.. మరో వైపు తూకం వేసినా మిల్లులకు తరలించడంలో తీవ్ర జాప్యం చోటుచేసుకుంది. లారీల కొరతతో రైతులు చాలా చోట్ల రోడ్డెక్కారు. అధికార యంత్రాంగం చెమటోడ్చి వాహనాలు సమకూర్చినా ఖాళీ చేసేందుకు రోజుల కొద్ది వేచి చూడక తప్పలేదు. మరో వైపు బస్తాకు అదనంగా వసూలు చేశారు. ఈ క్రమంలో జిల్లాలో ధాన్యం కొనుగోళ్లు తుది దశకు చేరుకుంది. ఇప్పటికే సగం కేంద్రాలు మూతపడగా, నాలుగైదు రోజుల్లో ప్రక్రియ పూర్తికి దృష్టి సారించారు.
మెతుకుసీమలో వ్యవసాయమే అత్యధికులకు ఆధారం. 3.51 లక్షల టన్నుల ధాన్యం సేకరణకు అధికారులు కార్యాచరణ రూపొందించి, అవసరమైన యంత్రాలు, సామగ్రి సిద్ధం చేసి కేంద్రాలను అందుబాటులో తీసుకొచ్చారు. 407 కేంద్రాలు ఏర్పాటు చేసి సేకరణ షురూచేశారు. ప్రక్రియ మొదలైనప్పటి నుంచి సమస్యలు ఎదురయ్యాయి.
తూప్రాన్లో లారీలు ఆపుతున్న అధికారులు
అదనంగా తూకం..
పలు కేంద్రాల్లో ధాన్యాన్ని 40 కిలోల కంటే అదనంగా మూడు కిలోల వరకు తూకం వేశారు. వర్షాలతో తడిసి ముద్దవడంతో నష్టపోతామని మిల్లర్లు తూకం ఎక్కువ వేయించారు. కౌడిపల్లి, శివ్వంపేట, మనోహరాబాద్ తదితర ప్రాంతాల్లో కాంటాల నిర్వాహకులతో మిల్లర్లు కుమ్మకై తక్కువ తూకం వచ్చేలా చేశారు. అధికారులు తనిఖీ చేసి కాంటాలను సైతం మూసివేయించారు.
లారీల కొరత..
నర్సాపూర్ నియోజకవర్గ వ్యాప్తంగా లారీల కొరత వేధించింది. అన్ని మండలాల్లో ధర్నాలు జరిగాయి. తూప్రాన్, నర్సాపూర్ రెవెన్యూ, పోలీసులు అధికారులు రోడ్డెక్కి లారీలను ఆపి నచ్చజెప్పి కేంద్రాలకు పంపించారు. తారీ బస్తాలను మిల్లులకు తీసుకెళ్తే అక్కడ హమాలీలు లేక దించుకోవడంలో జాప్యం చోటుచేసుకుంది. లారీలు రాకపోవడం.. రోజుల తరబడి ధాన్యం కేంద్రాల్లోనే ఉండటం, సంచుల బరువు తగ్గడం అన్నదాత ఆగ్రహానికి గురిచేసింది.
రూ.567.40 కోట్లు
జిల్లాలో ఇప్పటి వరకు 62,189 మంది నుంచి రూ.567.40 కోట్ల విలువైన 2,75,434 టన్నుల (78.25 శాతం) ధాన్యాన్ని కొనుగోలు చేశారు. ఇందులో 2,66,079 టన్నులు మిల్లులకు తరలించారు. 2.33 లక్షల టన్నులకు సంబంధించి వివరాలు ట్యాబ్లో నమోదు చేశారు. ఇంకా 76,556 టన్నుల మేర సేకరించాల్సి ఉంది. పలు మండలాల్లో ధాన్యం సేకరణ పూర్తవగా, ఇంకా ఆయా చిలప్చెడ్, తూప్రాన్, మనోహరాబాద్, నర్సాపూర్, మెదక్, హవేలిఘనపూర్ తదితర మండలాల్లో కొనుగోళ్లు జరగాల్సి ఉంది. ఈసారి సైతం ధాన్యం నిల్వకు ఇబ్బందులు తలెత్తాయి. మెదక్ మండలం ఎన్డీఎస్ఎల్ గోదాములోనూ నిల్వ చేశారు. మిల్లుల్లో స్థలాభావం కారణంగా ఇతర జిల్లాలకూ తరలించారు. సరిపడా గోదాంలు లేకపోవడంతో ఈ సమస్య ఎదురైంది.
నాలుగైదు రోజుల్లో పూర్తి..
- శ్రీనివాస్, జిల్లా పౌరసరఫరాలశాఖ అధికారి
నాలుగైదు రోజుల్లో పూర్తి చేయాలని లక్ష్యంగా నిర్దేశించుకున్నాం. ఇప్పటి వరకు 214 కేంద్రాలను మూసి వేశాం. లారీలతో పాటు ట్రాక్టర్లలో సైతం తరలిస్తున్నాం. మిల్లుల వద్ద ఎప్పటికప్పుడు వాహనాలను ఖాళీ చేసి కేంద్రాలకు పంపించాం.
చిలప్చెడ్ మండలంలో 1,68,147 క్వింటాళ్ల ధాన్యం కొనుగోళ్లు లక్ష్యంగా నిర్ణయించారు. ఇప్పటి వరకు 1,42,453 క్వింటాళ్లు సేకరించారు. ఇంకా 44,522 క్వింటాళ్లు సేకరించాల్సి ఉంది. లారీలు సమస్య వేధిస్తోంది. దీంతో బస్తాల్లో తేమశాతం పడిపోయి బరువు తగ్గుతోంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
బడులకు నిర్వహణ నిధులు
[ 28-03-2024]
ప్రభుత్వ పాఠశాలల నిర్వహణకు సంబంధించి రెండో విడత నిధులు విడుదలయ్యాయి. 2023-24 విద్యా సంవత్సరానికి సంబంధించి మొదటి విడత 50శాతం నిధులు గత ఏడాది జులైలో ప్రభుత్వం విడుదల చేసింది. -
కొత్త రేషన్కార్డులకు.. కోడ్ అడ్డంకి
[ 28-03-2024]
ప్రభుత్వ పథకాల అమలుకు రేషన్కార్డును ప్రామాణికంగా తీసుకుంటున్నారు. కొందరికే ఇవి ఉండగా, చాలా మందికి లేకపోవడంతో సంక్షేమ పథకాలకు దూరమవుతున్నారు. కేవలం పథకాలే కాకుండా వైద్య సేవలు పొందే అవకాశం లేక ఆర్థికభారం పడుతోంది. -
సర్పంచి నుంచి.. ఎంపీ అభ్యర్థిగా..
[ 28-03-2024]
సేవా కార్యక్రమాల నిర్వహణతో రాజకీయాల్లో అదృష్టం పరీక్షించుకుంటున్న ఆయనను ఎంపీ టికెట్ వరించింది. ఏకంగా జాతీయ పార్టీ తరఫున పోటీ చేసే అవకాశం కలిగింది. కాంగ్రెస్లో చేరిన కొద్దిరోజులకే ఎంపీ టికెట్ పొందడం గమనార్హం. -
గడువు ముంగిట పనుల హడావుడి
[ 28-03-2024]
పల్లెల్లో మట్టి దారులను సీసీగా మార్చేందుకు కేంద్ర ప్రభుత్వం ఏటా జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద నిధులు మంజూరు చేస్తోంది. ఇందుకోసం గత నెల తొలి వారంలో ఉత్తర్వులు జారీ చేయగా.. ఈ నెలాఖరుకు గడువు విధించారు. -
కార్మికులకు గుర్తింపు.. పథకాలతో ప్రయోజనాలు
[ 28-03-2024]
కార్మికులకు తెలంగాణ భవన, ఇతర కార్మిక సంక్షేమ మండలి జారీ చేసే గుర్తింపు కార్డులు చాలా ముఖ్యం. దీంతో సంఘంలో గుర్తింపు పాటు ప్రభుత్వ పథకాలకు అర్హులవుతారు. -
విద్యార్థులకు ప్రేరణ
[ 28-03-2024]
ఉన్నత పాఠశాలలు, కళాశాలల విద్యార్థుల్లోని సృజనను వెలికి తీసేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక కార్యక్రమానికి రూపకల్పన చేసింది. ప్రేరణ పేరుతో వారికి ఐదు రోజుల పాటు ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తారు. -
ఈత కొలను తెరవరా?
[ 28-03-2024]
సిద్దిపేటలోని ఈత కొలను నిర్వహణ కొరవడుతోంది. నిత్యం కొనసాగించాల్సిన ఈ కొలను.. వేసవి ఆరంభమైన ఇంకా తెరవడం లేదు. ఆరేళ్ల కిందట అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలను పాటిస్తూ రూ.5 కోట్ల వరకు ప్రభుత్వ నిధులు వెచ్చించి అందుబాటులోకి తెచ్చారు. -
అరచేతిలో లక్షల పుస్తకాలు
[ 28-03-2024]
ఉద్యోగ ప్రకటనలు వెలువడటంతో నిరుద్యోగులు సన్నద్ధమవుతున్నారు. గ్రంథాలయాలు, కోచింగ్ కేంద్రాలకు పరుగులు తీస్తున్నారు. పుస్తకాలతో కుస్తీ పడుతూ ఉద్యోగ సాధనే లక్ష్యంగా తీవ్రంగా శ్రమిస్తున్నారు. -
స్పందించండి.. సంధించండి
[ 28-03-2024]
ప్రజలు రాకపోకలు సాగించేటపుడు దారిలో అనేక సంఘటనలు చూస్తుంటారు. కొన్ని హృదయవిదారకంగా, ఎలాగైనా సాయం చేయాలనిపించేలా.. ఇంకొన్ని అన్యాయంగా, అక్రమంగా.. అగుపిస్తాయి. బిజీ జీవితమైనా ఉత్తమ పౌరులుగా స్పందించాలనిపిస్తుంది. -
మహిళాభ్యున్నతికి సహకారం
[ 28-03-2024]
సహకార బ్యాంకులు మహిళల అభ్యున్నతికి ప్రాధాన్యం ఇస్తున్నాయి. రైౖతులకు రుణాలు ఇవ్వడం..వసూలు చేయడానికి ఇవి గతంలో పరిమితమయ్యేవి. ఇప్పుడు మహిళలు అర్థికంగా ఎదిగేలా ప్రోత్సహించడంలోనూ ముందుంటున్నాయి. -
దాత ఔదార్యం.. భక్తులకు సౌకర్యం
[ 28-03-2024]
వారి కులదైవమంటే ఆ దంపతులకు చాలా నమ్మకం. సొంత ఖర్చుతో దైవానికి ఆలయం నిర్మించారు. సరైన దారి లేక దర్శనానికి ఇబ్బంది పడుతున్న విషయం గమనించి తాజాగా వంతెన నిర్మిస్తున్నారు. -
ఆస్తి కోసం చిన్నమ్మనే కడతేర్చాడు
[ 28-03-2024]
ఈనెల 21న టేక్మాల్ మండలం తంపులూరులో హత్యకు గురైన మహిళను ఆమెకు వరుసకు కొడుకయ్యే వ్యక్తే చంపినట్లు పోలీసులు గుర్తించారు. టేక్మాల్లో అల్లాదుర్గం సీఐ రేణుకారెడ్డి బుధవారం విలేకరులకు కేసు వివరాలు వెల్లడించారు. -
నిండు మనసుతో ఆశీర్వదించండి
[ 28-03-2024]
ఈ ప్రాంత ప్రజాసమస్యలపై లోతైన అవగాహన ఉందని, ఎన్నికల్లో నిండు మనసుతో ఆశీర్వదించాలని మెదక్ పార్లమెంట్ భారాస అభ్యర్థి వెంకట్రామిరెడ్డి కోరారు. సిద్దిపేటలో పార్టీ శ్రేణుల సమావేశాన్ని బుధవారం నిర్వహించారు. -
మాజీ కలెక్టర్కు వేల కోట్లు ఎక్కడివి?
[ 28-03-2024]
భారాస మెదక్ లోక్సభ అభ్యర్థి, మాజీ కలెక్టర్ వెంకట్రామిరెడ్డికి రూ.వేల కోట్లు ఎక్కడి నుంచి వచ్చాయో చెప్పాలని భాజపా మెదక్ లోక్సభ అభ్యర్థి రఘునందన్రావు.డిమాండ్ చేశారు. -
భారాస విజయం తథ్యం: కొత్త ప్రభాకర్రెడ్డి
[ 28-03-2024]
మెదక్ పార్లమెంటు స్థానం నుంచి భారాస అభ్యర్థి వెంకట్రామిరెడ్డి భారీ ఆధిక్యంతో విజయం సాధించటం తథ్యమని ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్రెడ్డి అన్నారు. బుధవారం గజ్వేల్లో మాట్లాడుతూ.. 100 రోజుల కాంగ్రెస్ పాలనపై ప్రజల్లో అప్పుడే వ్యతిరేకత మొదలైందని అన్నారు.
తాజా వార్తలు (Latest News)
-
జగన్.. ఈ 7 ప్రశ్నలకు సమాధానం చెప్పగలరా?: చంద్రబాబు సవాల్
-
సూచీల దూకుడు.. 900+ పాయింట్ల లాభంలో సెన్సెక్స్.. కారణమేంటి?
-
వరుస ఫ్లాప్స్ వల్లే రాజకీయాల్లోకి అడుగుపెట్టారా: కంగన సమాధానం ఏమిటంటే..?
-
రషీద్ బౌలింగ్లో సిక్స్లు.. ధోనీ సలహాలు పాటించా: సమీర్ రిజ్వీ
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
-
గూగుల్ కృత్రిమ మేధ నిపుణులకు జుకర్బర్గ్ గాలం?