logo

సంక్షేమ పథకాల అమలులో ఆదర్శం

సంక్షేమ, అభివృద్ధి పథకాల అమలులో రాష్ట్రం దేశానికే ఆదర్శంగా నిలిచిందని నర్సాపూర్‌ ఎమ్మెల్యే మదన్‌రెడ్డి అన్నారు.

Published : 10 Jun 2023 01:47 IST

చెక్కు అందజేస్తున్న మదన్‌రెడ్డి, సునీతారెడ్డి, ప్రతిమాసింగ్‌, దేవేందర్‌రెడ్డి తదితరులు

నర్సాపూర్‌, న్యూస్‌టుడే: సంక్షేమ, అభివృద్ధి పథకాల అమలులో రాష్ట్రం దేశానికే ఆదర్శంగా నిలిచిందని నర్సాపూర్‌ ఎమ్మెల్యే మదన్‌రెడ్డి అన్నారు. శుక్రవారం నర్సాపూర్‌లోని ఓ వేడుక మందిరంలో సంక్షేమ సంబరాలు నిర్వహించారు. ఈసందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పనిచేసిన ప్రభుత్వాన్ని మూడోసారి ఆశీర్వందించాలని కోరారు. రాష్ట్ర మహిళా కమిషన్‌ ఛైరపర్సన్‌ సునీతాలక్ష్మారెడ్డి మాట్లాడుతూ.. భారసతోనే అన్ని వర్గాలకు న్యాయం జరుగుతుందన్నారు. అదనపు పాలనాధికారి ప్రతిమాసింగ్‌ మాట్లాడుతూ.. బీసీల కోసం తీసుకొచ్చిన కొత్త పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. అసంఘటిత రంగ కార్మికుల సామాజిక భద్రత బోర్డు అధ్యక్షుడు దేవేందర్‌రెడ్డి మాట్లాడుతూ కార్మికుల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. అనంతరం లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి, షాదీముబారక్‌, బీసీ పథకం రుణాల చెక్కులు పంపిణీ చేశారు. ఎంపీపీ జ్యోతి, జిల్లా గ్రంథాలయ సంస్థ అధ్యక్షుు చంద్రాగౌడ్‌, జడ్సీకోఆప్షన్‌ సభ్యుడు మన్సూర్‌ పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని