వ్యక్తిని బలిగొన్న పొలం వివాదం
పొలం వివాదంపై ఉన్న కక్షతో ముగ్గురు దాడి చేయడంతో తీవ్రంగా గాయపడిన వ్యక్తి చికిత్స పొందుతూ శుక్రవారం మృతి చెందాడు.
దాడిలో గాయపడి చికిత్స పొందుతూ మృతి
చిన్నశంకరంపేట, న్యూస్టుడే: పొలం వివాదంపై ఉన్న కక్షతో ముగ్గురు దాడి చేయడంతో తీవ్రంగా గాయపడిన వ్యక్తి చికిత్స పొందుతూ శుక్రవారం మృతి చెందాడు. మృతదేహాన్ని తీసుకువచ్చిన సమయంలో గ్రామంలో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. మెదక్ జిల్లా చిన్నశంకరంపేట మండలం సూరారం గ్రామానికి చెందిన ముచ్చర్ల యాదగిరి(58)కి పొలం విషయంలో అదే గ్రామానికి చెందిన సురేష్తో వివాదం ఉంది. గత నెల 21న యాదగిరి వరి పంటను కోసి సురేష్ ఖాళీ స్థలంలో ఆరబెట్టాడు. అర్ధరాత్రి వర్షం కురియడంతో వడ్లపైన టార్పలిన్లను కప్పి సురేష్ పొలం నుంచి బండరాయిని తీసుకువచ్చి కుప్పపై ఉంచాడు. ఇది గమనించిన సురేష్, దిడ్డికిని మహిపాల్, దిడ్డికిని కిషన్లు కలిసి యాదగిరిపై మూకుమ్మడి దాడికి పాల్పడి విచక్షణారహితంగా కొట్టారు. అపస్మారక స్థితిలోకి వెళ్లిన యాదగిరిని కుటుంబసభ్యులు గాంధీ ఆసుపత్రికి తరలించారు. ఎస్సై సుభాష్గౌడ్ గ్రామంలో విచారణ చేపట్టి సురేష్, మహిపాల్, కిషన్లు ఉద్దేశపూర్వకంగానే యాదగిరిపై దాడికి పాల్పడినట్లు తేలడంతో ఆదివారం వారిని అదుపులోకి తీసుకొని రిమాండ్కు తరలించారు. శుక్రవారం యాదగిరి గాంధీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. మృతుడికి భార్య మంజుల, ముగ్గురు పిల్లలున్నారు.
గ్రామంలో ఉద్రిక్త పరిస్థితి
యాదగిరి మరణించిన విషయం తెలియగానే సురేష్, మహిపాల్, కిషన్ కుటుంబ సభ్యులు ఇళ్లకు తాళం వేసి పరారయ్యారు. గ్రామంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చేగుంట, నార్సింగ్, నిజాంపేట, రామాయంపేట నుంచి భారీగా పోలీసులు వచ్చారు. రాత్రి మృతదేహాన్ని గ్రామానికి తీసుకురాగానే గ్రామస్థులు అంబులెన్సును చుట్టుముట్టారు. నిందితుల కుటుంబ సభ్యులు వచ్చి మాట్లాడే వరకు అంబులెన్స్ నుంచి మృతదేహాన్ని తీసేదిలేదని పట్టుబట్టారు. తూప్రాన్ డీఎస్పీ యాదగిరిరెడ్డి గ్రామస్థులతో మాట్లాడినప్పటికీ శాంతించలేదు. దీంతో నిందితుల కుటుంబసభ్యులు ఎక్కడ ఉన్నారని డీఎస్పీ ఆరా తీసి వారిని గ్రామానికి తీసుకువచ్చేలా చర్యలు తీసుకుంటున్నారు.
గ్రామస్థులతో మాట్లాడుతున్న డీఎస్పీ యాదగిరిరెడ్డి
విద్యుదాఘాతంతో రైతు మృతి
వర్గల్, న్యూస్టుడే: మొరాయించిన బోరు మోటారును సరి చేసేందుకు రైతు యత్నించగా విద్యుదాఘాతంతో మృతి చెందాడు. ఈ ఘటన ఘటన సిద్దిపేట జిల్లా వర్గల్ మండలం దండుపల్లి గ్రామంలో జరిగింది. బేగంపేట ఎస్ఐ అరుణ్కుమార్ తెలిపిన వివరాలు.. గ్రామానికి చెందిన టెంకంపేట నర్సింలు (55) గురువారం రాత్రి తన పొలం వద్దకు వెళ్లాడు. మోటారు నడిచేలా చేసేందుకు ప్రయత్నిస్తుండగా విద్యుత్తు తీగలు తాకి అక్కడికక్కడే కింద పడి చనిపోయాడు. రాత్రి ఎంతసేపైనా ఇంటికి రాకపోయే సరికి కుటుంబ సభ్యులు పొలానికి వెళ్లి చూడగా నర్సింలు విగతజీవిగా పడి కనిపించాడు. కుమారుడు రాజు శుక్రవారం ఫిర్యాదు చేయడంతో కేసు దర్యాప్తు చేస్తున్నారు. నర్సింలుకు భార్య, నలుగురు సంతానం ఉన్నారు. ముగ్గురికి వివాహాలయ్యాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఆత్మహత్య చేసుకుంటున్నానని.. యువకుడి వాట్సాప్ వీడియో
[ 19-04-2024]
చెట్టుకు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకుంటున్నానని యువకుడు పంపిన వీడియో గురువారం వాట్సాప్ గ్రూపుల్లో వైరల్ కావడంతో స్పందించిన పోలీసులు రక్షించారు. గ్రామస్థులు తెలిపిన వివరాలు.. -
పోరుగడ్డ.. ప్రముఖుల అడ్డా
[ 19-04-2024]
ఉద్యమ ఖిల్లా, చారిత్రక నేపథ్యమున్న మెదక్ లోక్సభ స్థానం 19వ సారి ఎన్నికలకు సిద్ధమవుతోంది. ఆసియా ఖండంలో రెండో అతిపెద్ద చర్చి, ఏడుపాయల వనదుర్గామాత, -
అట్టహాసంగా ఆరంభం
[ 19-04-2024]
లోక్సభ ఎన్నికల నామినేషన్ల సందడి మొదలైంది. కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు గురువారం మెదక్ పార్లమెంట్ నియోజకవర్గానికి ఉదయం 11 గంటలకు రిటర్నింగ్ అధికారి, మెదక్ కలెక్టర్ రాహుల్రాజ్ నోటిఫికేషన్ విడుదల చేశారు. -
గూడు పూర్తికాక.. నీడ లేక
[ 19-04-2024]
గత ప్రభుత్వం పేదలకు రెండు పడక గదుల ఇళ్లు నిర్మించి ఇవ్వాలని పనులు చేపట్టి అసంపూర్తిగా వదిలేసింది. దీంతో అవి నిరుపయోగంగా మారాయి. -
రేషన్ ఈ-కేవైసీకి మరో అవకాశం
[ 19-04-2024]
ఆహార భద్రతా కార్డుల ఈ-కేవైసీ నమోదుకు ప్రభుత్వం మరో అవకాశం కల్పించింది. ఫిబ్రవరి 29తో గడువు ముగిసినప్పటికీ రేషన్ దుకాణాల్లో ప్రభుత్వ సూచన మేరకు ప్రస్తుతం ఈ ప్రక్రియ కొనసాగుతుంది. -
ప్రతి వాహనాన్ని తనిఖీ చేయాలి
[ 19-04-2024]
నర్సాపూర్లోని హైదరాబాద్ మార్గంలో మల్లన్న గుడి వద్ద ఏర్పాటు చేసిన చెక్పోస్ట్ను సాధారణ ఎన్నికల జిల్లా వ్యయ పరిశీలకుడు సునీల్ కుమార్ రాజ్వాన్ష్ గురువారం తనిఖీ చేశారు. -
ఓటరు చైతన్యంతోనే.. ప్రజాస్వామ్య పరిరక్షణ
[ 19-04-2024]
ఎన్నికలు ప్రజాస్వామ్యానికి ఆయువుపట్టుతో సమానం. పారదర్శకంగా ఎన్నికయ్యే నేత హితానికి కట్టుబడతారు. ప్రజల అవసరాలకు అనుగుణంగా పని చేస్తుంటారు. -
సువిధతో.. అంతా అరచేతిలోనే..
[ 19-04-2024]
ప్రస్తుతం సాంకేతిక యుగం నడుస్తోంది.. ఏదైనా స్మార్ట్గా జరిగిపోవాల్సిందే.. కాగితాలతో పని లేకుండా.. దూరాభారం కాకుండా ఉన్న చోటే క్షణాల్లో పని ముగించుకునే వెసులుబాటు కలిగింది. -
గెలిపించండి.. కొట్లాడే బలాన్నివ్వండి: హరీశ్రావు
[ 19-04-2024]
అబద్ధపు హమీలతో గద్దెనెక్కిన కాంగ్రెస్ ప్రభుత్వానికి పార్లమెంట్ ఎన్నికల్లో ఓటుతో గుణపాఠం చెప్పాలని, భారాసకు మద్దతుగా నిలుస్తూ ప్రభుత్వంపై కొట్లాడే బలాన్ని ఇవ్వాలని మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్రావు అన్నారు. -
‘ఆర్నెల్లకోసారి ఉద్యోగ మేళా నిర్వహిస్తా’
[ 19-04-2024]
నిరుద్యోగ భృతి ఇస్తానని దుబ్బాక నియోజకవర్గంలో రఘునందన్రావు మోసం చేశారని మెదక్ లోక్సభ స్థానం కాంగ్రెస్ అభ్యర్థి నీలం మధు ముదిరాజ్ అన్నారు. -
ప్రచారం.. ఇక ముమ్మరం
[ 19-04-2024]
జహీరాబాద్ లోక్సభ నియోజకవర్గంలో విజయమే లక్ష్యంగా ప్రధాన పార్టీలు వ్యూహాలు రచిస్తున్నాయి. నామినేషన్ల దాఖలు కార్యక్రమం మొదలు కావడంతో క్షేత్రస్థాయిలో ప్రచారాన్ని ముమ్మరం చేయాలని భారాస, కాంగ్రెస్, భాజపా భావిస్తున్నాయి. -
వలపు వలతో అసలుకే ఎసరు
[ 19-04-2024]
సులభంగా డబ్బు సంపాదించాలనే ఆశతో ఒకరు, వలపు వలలో చిక్కుకుని మరొకరు ‘సైబర్’ బాధితులుగా మారారు. సంబంధిత వివరాలను సిద్దిపేట పోలీసు కమిషనర్ అనూరాధ గురువారం వెల్లడించారు.
తాజా వార్తలు (Latest News)
-
త్వరలో ఫీల్డింగ్కు వస్తా.. 40 ఓవర్లూ మైదానంలో ఉంటా: సూర్య
-
వైకాపా అడ్డుపడుతోంది.. మీ ఇళ్ల వద్దకు రాలేకపోతే మన్నించండి: సునీత
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
-
దుబాయ్ నుంచి ఆలస్యంగా పునియా, సుజీత్.. ఒలింపిక్ క్వాలిఫయర్స్ మిస్
-
నెస్లే ఉత్పత్తులపై ఆరోపణలు.. FSSAIకి సీసీపీఏ ఆదేశాలు
-
నేడు చంద్రబాబు తరఫున నామినేషన్.. నారా భువనేశ్వరి ప్రత్యేక పూజలు