పేదలకు ఊరట
రెక్కాడితేనే డొక్క నిండని నిరుపేద కుటుంబాలు ఇప్పటికీ ఉన్నాయి. రోజూ పనికి వెళితేనే కుటుంబ పోషణ సాగేది. ఇలాంటి కుటుంబాల్లో ఎవరైనా అనారోగ్యం బారినపడితే ఆర్థికంగా ఎదురయ్యే ఇబ్బందులు అన్నీఇన్నీ కావు.
జనరిక్ ఔషధ దుకాణాల ఏర్పాటుకు కార్యాచరణ
మహిళా సంఘాలకు అవకాశం
సంగారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రి వద్ద మందుల దుకాణం
న్యూస్టుడే, సంగారెడ్డి టౌన్, జోగిపేట: రెక్కాడితేనే డొక్క నిండని నిరుపేద కుటుంబాలు ఇప్పటికీ ఉన్నాయి. రోజూ పనికి వెళితేనే కుటుంబ పోషణ సాగేది. ఇలాంటి కుటుంబాల్లో ఎవరైనా అనారోగ్యం బారినపడితే ఆర్థికంగా ఎదురయ్యే ఇబ్బందులు అన్నీఇన్నీ కావు. చికిత్స కోసం ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లినా మందులు(ఔషధాలు) ఎక్కువగా బయటే కొనాల్సి ఉండటమే దీనికి కారణం. దుకాణదారులు ఎంత చెబితే అంత చెల్లించాల్సిందే. అప్పు చేసి కొనుగోలు చేయాల్సిన పరిస్థితి. ఇలాంటి పేదలకు ఊరట కల్పించాలన్న లక్ష్యంతో ప్రభుత్వం జనరిక్ మందుల దుకాణాలను నిర్వహిస్తోంది. మహిళా సంఘాల ఆధ్వర్యంలోనూ ఈ ఆర్థిక సంవత్సరంలో జనరిక్ మందుల దుకాణాలకు స్త్రీనిధి రుణాల మంజూరుకు నిర్ణయించిన నేపథ్యంలో కథనం.
స్త్రీనిధి రుణ సదుపాయం
జనరిక్ దుకాణంలో తక్కువ ధరకే మందులు అందుబాటులో ఉంటాయి. ఉదాహరణకు బయటి దుకాణాల్లో రూ.30 విలువచేసే కొన్ని మందులు ఇక్కడ రూ.10కే విక్రయిస్తారు. ప్రస్తుతం జనరిక్ దుకాణం సంగారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రి వద్ద రెడ్క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నారు. తక్కువ ధరకే ఔషధాలు లభిస్తుండటంతో ఎప్పుడూ రద్దీగా ఉంటుంది. జిల్లా వ్యాప్తంగా ప్రజలకు జనరిక్ ఔషధాలు అందుబాటులోకి తీసుకురావాలని జిల్లా యంత్రాంగం ముందుకు సాగుతోంది. మహిళా సంఘాల సభ్యుల్లో అర్హులకు దుకాణాల ఏర్పాటుకు స్త్రీనిధి రుణాలను ఇచ్చి ప్రోత్సహించాలని నిర్ణయించారు. ఒక్కో దుకాణం ఏర్పాటుకు రూ.3లక్షల వరకు రుణం అందించనున్నారు. మండలానికి ఒకటి, మున్సిపాలిటీల్లో అంతకంటే ఎక్కువ ఏర్పాటు చేయాలన్న లక్ష్యంతో ముందుకు సాగుతున్నారు.
మంజూరు ఇలా..
* స్వయం సహాయక సంఘాల్లో సభ్యురాలు కావడంతో పాటు వారి కుటుంబం, దగ్గరి బంధువుల్లో ఎవరైనా డిఫార్మసీ, బీ ఫార్మసీ, ఎంఫార్మసీ విద్యార్హత కలిగి ఉండాలి.
* రుణం పొందడానికి ముందు సంబంధిత సభ్యురాలి సంఘం, గ్రామైక్య సంఘం తీర్మానం తప్పనిసరి.
* దుకాణం నిర్వహణకు డ్రగ్ ఇన్స్పెక్టర్ అనుమతి, ధ్రువీకరణపత్రం, కొటేషన్, విద్యార్హత తదితర పత్రాలతో స్త్రీనిధి అధికారులకు దరఖాస్తు చేయాలి.
* అధికారులు దరఖాస్తులు పరిశీలించి అర్హులుగా భావిస్తే వివరాలను సంబంధిత వెబ్సైట్లో నమోదు చేస్తారు * జనరిక్ దుకాణం కోసం తీసుకునే రుణాన్ని ప్రతినెలా వాయిదాల రూపంలో ఐదేళ్లలోపు తిరిగి చెల్లించాల్సి ఉంటుంది.
సద్వినియోగం చేసుకోవాలి
జనరిక్ మందుల దుకాణాల ఏర్పాటుకు స్త్రీనిధి ద్వారా తక్కువ వడ్డీకే ఇస్తున్న రుణాలను మహిళా సంఘాల సభ్యులు సద్వినియోగం చేసుకోవాలి. కుటుంబంలో ఎవరైనా దుకాణం ఏర్పాటుకు అవసరమైన విద్యార్హత కలిగి ఉంటే దరఖాస్తు చేసుకోవాలి. సులభ వాయిదాల పద్ధతిలో తిరిగి చెల్లించే వెసులుబాటు ఉంటుంది.
మోహన్రెడ్డి, స్త్రీనిధి ప్రాంతీయ మేనేజర్.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
హస్తగతం చేసుకోవాలని..!
[ 20-04-2024]
రాష్ట్రంలోని అత్యధిక ఎంపీ స్థానాలను కైవసం చేసుకునే దిశగా అధికార కాంగ్రెస్ పార్టీ పావులు కదుపుతోంది. మిషన్-15 పేరుతో ప్రత్యేక వ్యూహంతో ముందుకెళ్తోంది. -
నిందితులను అరెస్టు చేయండి
[ 20-04-2024]
అంబేడ్కర్ విగ్రహాన్ని ధ్వంసం చేసిన వారిని అరెస్టు చేయాలని రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ ఛైర్మన్ బక్కి వెంకటయ్య అన్నారు -
ఓటు నమోదుకు కదిలిన యువత
[ 20-04-2024]
కొత్తగా ఓటు నమోదుకు ఎన్నికల సంఘం అవకాశం కల్పించడంతో పెద్దఎత్తున అర్జీలు వచ్చాయి. 18 ఏళ్లు నిండిన వారితో పాటు చిరునామా మార్పు, దిద్దుబాటు, అభ్యంతరాలకు అవకాశం ఇచ్చారు. -
పక్కాగా నిఘా
[ 20-04-2024]
లోక్సభ ఎన్నికల నేపథ్యంలో అన్ని జిల్లాల్లో పలుచోట్ల చెక్పోస్టులు ఏర్పాటుచేశారు. పోలీసులు ప్రతి వాహనాన్ని క్షుణ్నంగా పరిశీలిస్తున్నారు. అక్రమంగా నగదు తరలిస్తున్నారా, మద్యం తీసుకెళ్తున్నారా నిఘా వేసి ఉంచారు -
వేర్వేరు ప్రమాదాల్లో నలుగురి దుర్మరణం
[ 20-04-2024]
ఉమ్మడి మెదక్ జిల్లాలో వేర్వేరుచోట్ల జరిగిన రోడ్డు ప్రమాదాల్లో నలుగురు దుర్మరణం చెందారు. ప్రచార రథం ఢీకొని రైతు మృతి చెందాడు. -
పాము కాటుతో బాలుడి మృతి
[ 20-04-2024]
పాము కాటుతో బాలుడు మృతి చెందిన సంఘటన లక్ష్మాపూర్లో జరిగింది. కుటుంబ సభ్యులు తెలిపిన ప్రకారం.. గుమ్మడిదల మండలం కొత్తపల్లి పంచాయతీ లక్ష్మాపూర్లో నివాసం ఉండే రవి, అనిత దంపతులు కుటుంబ సభ్యులతో కలిసి గురువారం రాత్రి ఇంటి ముందు వాకిట్లో పడుకున్నారు. -
రెండో రోజు.. ముగ్గురు స్వతంత్రుల నామినేషన్లు
[ 20-04-2024]
జహీరాబాద్ పార్లమెంట్ స్థానానికి రెండో రోజైన శుక్రవారం ముగ్గురు స్వతంత్ర అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు -
సమస్యలు అటుంచి..విధానాలే ముందుంచి!
[ 20-04-2024]
శాసనసభ నియోజకవర్గాలతో పోలిస్తే లోకసభ స్థానం పరిధి ఎక్కువగా ఉన్న నేపథ్యంలో రాజకీయ పార్టీలు గ్రామస్థాయిలో ఇంటింటి ప్రచార బాధ్యతలను ముఖ్య కార్యకర్తలకే అప్పగిస్తున్నారు. -
వడగండ్ల వానతో అతలాకుతలం
[ 20-04-2024]
ద్దిపేట జిల్లాలోని పలు ప్రాంతాల్లో శుక్రవారం మధ్యాహ్నం నుంచి రాత్రి వరకు వడగండ్లతో కూడిన గాలివాన కురిసింది. నారాయణరావుపేట మండలంలో అతలాకుతలం చేసింది. పంటలు నేలకొరిగాయి. -
‘కాంగ్రెస్ పాలనలో ఆటో కార్మికుల జీవితం ఆగం’
[ 20-04-2024]
కాంగ్రెస్ ప్రభుత్వం అంటేనే మోసం, కష్టాలమయమని.. ఆటో కార్మికుల జీవితాలు ఆగమవడం అందుకు నిదర్శనమని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్రావు విమర్శించారు. -
రెండో రోజు 4 నామినేషన్లు దాఖలు
[ 20-04-2024]
లోక్సభ నియోజకవర్గానికి రెండో రోజు నాలుగు నామినేషన్లు దాఖలయ్యాయి. ప్రజా వెలుగు పార్టీ నుంచి యాదగిరిగౌడ్, పిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియా తరఫున గొల్లపల్లి సాయగౌడ్, స్వతంత్ర అభ్యర్థులుగా బొమ్మల విజయ్కుమార్, తుమ్మలపల్లి పృథ్విరాజ్ నామినేషన్ వేశారు. -
ప్రవాసులు వేలల్లో.. నమోదు వందల్లో
[ 20-04-2024]
ఇక్కడే పుట్టారు.. చదివింది ఇక్కడే. ఉద్యోగం, ఉపాధి కోసం వెళ్లి ప్రస్తుతం ఇతర దేశాల్లో ఉంటున్నారు. వీరిని ప్రవాస భారతీయులుగా పిలుస్తాం.
తాజా వార్తలు (Latest News)
-
తెదేపా కార్యాలయం వద్ద టాస్క్ఫోర్స్ కదలికలు
-
ఒలింపిక్స్లో పతకం తెస్తే బీఎండబ్ల్యూ కారు
-
సుప్రీం లీడర్ పుట్టిన రోజే ఇరాన్పై దాడులు.. అమెరికాకు చివరి క్షణంలో తెలిసిందట!
-
వేసవి రద్దీకి రైల్వే సిద్ధం.. రికార్డు స్థాయిలో 9,111 అదనపు ట్రిప్పులు!
-
కావ్య బాధ.. శారీలో లావణ్య, మౌనీరాయ్
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (20/04/24)