రుణం ఇస్తామని రూ.80 వేలకు టోకరా
రూ.50 వేల రుణం ఇస్తామని చెప్పి రూ.80 వేలు వసూలు చేసిన సైబర్ మోసం వెల్దుర్తి మండలం మానేపల్లిలో చోటుచేసుకుందని ఎస్సై మధుసూదన్గౌడ్ తెలిపారు.
వెల్దుర్తి, న్యూస్టుడే: రూ.50 వేల రుణం ఇస్తామని చెప్పి రూ.80 వేలు వసూలు చేసిన సైబర్ మోసం వెల్దుర్తి మండలం మానేపల్లిలో చోటుచేసుకుందని ఎస్సై మధుసూదన్గౌడ్ తెలిపారు. ఆయన కథనం మేరకు.. ‘గ్రామానికి చెందిన యాజాల శేఖర్ చరవాణికి ఈనెల 18న ఓ అపరిచితుడి నుంచి కాల్ వచ్చింది. బ్యాంక్ రుణం ఇస్తామని చెప్పగా, వద్దని ఫోన్ పెట్టేశారు. విషయం తెలుసుకున్న అదే గ్రామానికే చెందిన శేఖర్ బావమరిది నర్సింలు ఆ ఫోన్ నంబరు తీసుకుని తనకు రుణం కావాలని అవతలి వ్యక్తిని కోరగా మీకు రూ.50 వేల రుణం ఇస్తామని చెప్పి ఛార్జీల పేరుతో మొత్తం రూ.80 వేలు వసూలు చేసి చరవాణి ఆపేశాడు. తాను మోసపోయానని గుర్తించిన నర్సింలు గురువారం ఠాణాలో ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేశారు.
టీవీ కొందామని..
నర్సాపూర్ రూరల్: నర్సాపూర్ మండలం మంతూరుకు చెందిన దంపతులు నాగభూషణం, ప్రణీతలు వ్యవసాయం చేసుకుంటూ జీవిస్తున్నారు. ఈ నెల 8న ఓఎల్ఎక్స్లో టీవీ అమ్మకం ప్రకటన చూశారు. కొనడానికి సిద్ధమై.. ప్రకటనలోని చరవాణి నంబరుకు ఫోన్ చేశారు. అవతలి వ్యక్తి సూచించిన మేరకు దఫాలుగా రూ.40,000 పంపించారు. తర్వాత ఫోన్ చేయగా మరింత నగదు పంపాలని కోరాడు. మోసపోయామని గుర్తించి ఎస్సై శివకుమార్కు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేశారు.
చేపల వేటకు వెళ్లి మత్స్యకారుడి మృతి
హత్నూర, న్యూస్టుడే: చేపల వేటకు వెళ్లిన మత్స్యకారుడు మృతి చెందాడు. ఎస్సై సుభాష్ తెలిపిన వివరాలు.. మండల పరిధి బ్రాహ్మణగూడకు చెందిన బొట్ల యాదయ్య(60) చేపలు పట్టి విక్రయిస్తూ జీవనోపాధి పొందుతున్నాడు. ఆయనకు భార్య, ఇద్దరు కుమారులున్నారు. బుధవారం గ్రామ శివారు అయ్యవారి చెరువుకి చేపలు పట్టేందుకు ఒంటరిగా వెళ్లాడు. ప్రమాదవశాత్తు నీటిలో పడి మృత్యువాత పడ్డాడు. బుధవారం అర్ధరాత్రి దాటాక మృతదేహం లభ్యమైంది. ఆయన కుమారుడి ఫిర్యాదు మేరకు గురువారం కేసు నమోదు చేశారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
దామోదర తీన్మార్
[ 08-12-2023]
మాజీ మంత్రి, అందోలు ఎమ్మెల్యే దామోదర రాజనర్సింహకు అనుభవం కలిసొచ్చింది. తాజాగా రాష్ట్ర మంత్రిగా అవకాశం దక్కగా.. గురువారం హైదరాబాద్లోని ఎల్బీ స్టేడియంలో జరిగిన కార్యక్రమంలో ప్రమాణ స్వీకారం చేశారు. -
అల్పాహారం కొందరికే!
[ 08-12-2023]
విద్యార్థుల ఆకలి తీర్చేందుకు గత ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన అల్పాహారం పంపిణీ కార్యక్రమం జిల్లాలో పూర్తి స్థాయిలో అమలు కావడం లేదు. అక్షయ పాత్ర ద్వారా మధ్యాహ్న భోజనం అందిస్తున్న 17 మండలాల్లో కేవలం పదుల సంఖ్యలోని బడుల్లో మాత్రమే అల్పాహారం పంపిణీ చేస్తున్నారు. -
ఇంట్లో శుభకార్యం.. అంతలోనే విషాదం
[ 08-12-2023]
కొత్త ఇంటి సంబరం.. కుటుంబీకులు, బంధువులతో సందడిగా ఉంది.. అందరూ సంతోషంగా ఉన్నారు.. ఇంతలోనే సరకులు తెచ్చేందుకు సైకిల్పై వెళ్లిన బాలుడిని మృత్యురూపంలో కంటెయినర్ దూసుకొచ్చి బలితీసుకోవడంతో ఆ ఇంట విషాదం నెలకొంది. -
ప్రమాణ శ్రీకారం
[ 08-12-2023]
త్రివర్ణ పతాకాల రెపరెపలు.. జై కాంగ్రెస్... జై సోనియమ్మ .. జై రేవంతన్నా.. నినాదాలతో గురువారం ఎల్బీ స్టేడియం పరిసరాలు హోరెత్తాయి. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి భారీ సంఖ్యలో తరలివచ్చిన కార్యకర్తలు, అభిమానులు... ఎటు చూసినా పార్టీ హోర్డింగులు, ఫ్లెక్సీలతో బషీర్బాగ్ పరిసరాలు గురువారం సందడిగా మారాయి. -
పథకాల అమలులో పారదర్శకత
[ 08-12-2023]
విద్యార్థులకు ప్రభుత్వం వివిధ రూపాల్లో సహకారం అందిస్తోంది. మధ్యాహ్న భోజనం.. అల్పాహారం.. విద్యార్థులకు ఏకరూప దుస్తులు.. పుస్తకాలు.. ఉపకార వేతనాలు.. రవాణా భత్యం ఇలా పలు రకాల పథకాలు అమలవుతున్నాయి. -
హుస్నాబాద్.. మంత్రి పదవితో హుషార్
[ 08-12-2023]
పొన్నం ప్రభాకర్ మంత్రిగా గురువారం ప్రమాణ స్వీకారం చేయడంతో నియోజకవర్గంలో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. ఈ నియోజకవర్గం నుంచి మొదటిసారి మంత్రి పదవి దక్కడంతో అభివృద్ధికి బాటలు పడతాయని సంతోషం వ్యక్తం చేస్తున్నారు. -
రొయ్యల పెంపకం.. ఆదాయానికి మార్గం
[ 08-12-2023]
మత్స్యకారుల జీవితాల్లో వెలుగులు నింపాలన్న లక్ష్యంతో నీటి వనరుల్లో చేపలు, రొయ్యల పెంపకాన్ని చేపడుతున్నారు. ప్రస్తుతం మత్స్యశాఖ ఆధ్వర్యంలో చేప పిల్లలు విడిచే కార్యక్రమం ఇప్పటికే పూర్తి చేశారు. -
అన్నదాతల హైరానా
[ 08-12-2023]
పాడి పశువులపై అడవి జంతువులు దాడి చేసి చంపేస్తున్నాయి. నిత్యం ఎక్కడో ఒకచోట మూగజీవులు బలవుతున్నాయి. ముఖ్యంగా వ్యవసాయ బావులు, పొలాల వద్ద కట్టేసిన దూడలను చంపుతుండడంతో రైతులకు తీవ్ర నష్టం వాటిల్లుతోంది. -
సన్మార్గంలో నడిస్తేనే విశ్వశాంతి
[ 08-12-2023]
ప్రతి ఒక్కరూ సన్మార్గంలో ముందుకు సాగితే విశ్వశాంతి సాధ్యమవుతుందని గుంటూరు విశ్వగురు పీఠాధిపతి విశ్వయోగి విశ్వంజీ మహరాజ్ తెలిపారు. -
దుర్గమ్మ సన్నిధిలో ఎమ్మెల్యే రోహిత్
[ 08-12-2023]
ప్రసిద్ధ పుణ్యక్షేత్రం ఏడుపాయల వనదుర్గమ్మను కొత్తగా ఎంపికైన మెదక్ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్రావు, తండ్రి మాజీ ఎమ్మెల్యే హన్మంతరావు కుటుంబ సభ్యులతో కలిసి గురువారం సాయంత్రం దర్శించుకున్నారు. -
కేసీఆర్ వద్దకు భారాస నాయకులు
[ 08-12-2023]
గజ్వేల్ నియోజకవర్గంలోని కుకునూరుపల్లి మండల ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు ఎంపీటీసీల ఫోరం రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షులు దేవి రవీందర్ ఆధ్వర్యంలో మాజీ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావును ఎర్రవల్లిలోని వ్యవసాయ క్షేత్రంలో గురువారం కలిశారు. -
సీఎంను కలిసిన సిద్దిపేట నాయకులు
[ 08-12-2023]
ముఖ్యమంత్రి రేవంత్రెడ్డిని కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు తూంకుంట నర్సారెడ్డి, పట్టణ అధ్యక్షుడు అత్తూఇమామ్ గురువారం సచివాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. -
కార్యకర్తలను కాపాడుకుంటా: హరీశ్
[ 08-12-2023]
ఎమ్మెల్యేగా గెలిచిన హరీశ్రావు గురువారం మొదటిసారి సిద్దిపేటకు రాగా ఆయన్ను కలిసేందుకు భారాస ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున క్యాంపు కార్యాలయానికి తరలి వచ్చారు. -
అదృశ్యమైన మహిళ దారుణ హత్య
[ 08-12-2023]
అదృశ్యమైన మహిళ హత్యకు గురైంది. పట్టణ సీఐ రాజేందర్రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. కర్ణాటక రాష్ట్రం గుల్బర్గా జిల్లా సేడం తాలూకా మద్కల్కు చెందిన దంపతులు మొహమ్మద్, సర్వాబీ(42) బతుకుదెరువు కోసం తాండూరుకు వచ్చారు. -
బాల్య వివాహం చేసుకున్న యువకుడిపై కేసు
[ 08-12-2023]
బాల్య వివాహం చేసుకున్న యువకుడిపై కేసు నమోదు చేసినట్లు అల్లాదుర్గం పోలీసులు తెలిపారు. వారు తెలిపిన వివరాలు.. మండల పరిధిలోని ఓ గ్రామానికి చెందిన 20 ఏళ్ల యువకుడు..


తాజా వార్తలు (Latest News)
-
Meenakshi Chaudhary: ‘గుంటూరు కారం’.. ఆరోజు ఎంతో కంగారుపడ్డా: మీనాక్షి చౌదరి
-
Team India: యువ టాలెంట్కు కొదవేం లేదు.. జట్టు కూర్పే భారత్కు సవాల్: మాజీ క్రికెటర్
-
డిజిటల్ రుణాలపై ఆర్బీ‘ఐ’.. లోన్ అగ్రిగేటర్లకు త్వరలో రూల్స్
-
Top Ten News @ 5 PM: ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు
-
TSRTC: పల్లెవెలుగు, ఎక్స్ప్రెస్ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం
-
Canada visa: కెనడా కీలక నిర్ణయం.. స్టూడెంట్ వీసా డిపాజిట్ రెట్టింపు!