ద్రవరూప ఎరువు.. సాగుకు ఆదరువు
తునికి గ్రామ శివారులో ఏకలవ్య కృషి విజ్ఞాన కేంద్రంలో రెండు నెలల క్రితం ఇండియన్ రైల్వే క్యాటరింగ్ టూరిజం కార్పొరేషన్ (ఐఆర్సీటీసీ) ఆధ్వర్యంలో సీఎస్ఆర్ నిధుల కింద రూ.55 లక్షలు వెచ్చించి అత్యాధునిక జీవ నియంత్రణ ప్రయోగశాలను నెలకొల్పారు.
తునికి కేవీకేలో 7 రకాలు ఉత్పత్తి
ఉత్పత్తులను పరిశీలిస్తున్న పాలనాధికారి రాజర్షిషా
న్యూస్టుడే, కౌడిపల్లి: ఆరుగాలం శ్రమించి పంటలు సాగు చేస్తాడు రైతు. సరైన దిగుబడులు అందక నష్టపోతుంటాడు. ఈ సమస్యల నుంచి గట్టెక్కించడంతో పాటు సాగును లాభాలమయం చేయాలన్న కృతనిశ్చయంతో కృషి జరుగుతోంది. పెట్టుబడి తగ్గించి లాభసాటి వ్యవసాయం దిశగా రైతులను ప్రోత్సహిస్తున్నారు. అన్ని పంటల్లో జీవన ఎరువుల ఆవశ్యకతను వివరిస్తూ వినియోగానికి అవగాహన కల్పిస్తున్నారు. ఇందుకు తగ్గట్టుగా మెదక్ జిల్లా కౌడిపల్లి మండలం తునికిలోని కృషి విజ్ఞాన కేంద్రం పలు పరిశోధనలతో నాణ్యమైన ద్రవరూప ఎరువులను తయారుచేస్తూ రైతులకు అందిస్తుండటం విశేషం.
తునికి గ్రామ శివారులో ఏకలవ్య కృషి విజ్ఞాన కేంద్రంలో రెండు నెలల క్రితం ఇండియన్ రైల్వే క్యాటరింగ్ టూరిజం కార్పొరేషన్ (ఐఆర్సీటీసీ) ఆధ్వర్యంలో సీఎస్ఆర్ నిధుల కింద రూ.55 లక్షలు వెచ్చించి అత్యాధునిక జీవ నియంత్రణ ప్రయోగశాలను నెలకొల్పారు. మార్కెట్ ధర కంటే తక్కువకే ద్రవరూపంలో జీవ ఎరువులను ఉత్పత్తి చేయడమే లక్ష్యంగా దీన్ని ఏర్పాటుచేశారు. ఇక్కడి శాస్త్రవేత్తలు ద్రవరూపంలోని జీవ ఎరువులను తయారు చేస్తూనే రైతులకు వాటిపై అవగాహన కల్పిస్తున్నారు. రసాయనాలు తగ్గించుకోవాల్సిన ఆవశ్యకతను వివరిస్తున్నారు. ఇటీవల పాలనాధికారి రాజర్షిషా, జిల్లా వ్యవసాయాధికారి గోవింద్ ప్రయోగశాలను సందర్శించి ఉత్పత్తులను పరిశీలించి దిశానిర్దేశం చేశారు. కేవీకే హెడ్ డాక్టర్ నల్కర్, ప్రొడక్షన్ మేనేజర్ హింగె, ల్యాబ్ ఇన్ఛార్జి శాస్త్రవేత్త రవికుమార్ ఆధ్వర్యంలో ఉత్పత్తి జరుగుతోంది.
అందుబాటులో ఇవే..
కేవీకేలో ప్రస్తుతం ఏడు రకాల ద్రవరూపం ఎరువులు అందుబాటులో ఉన్నాయి.
- రైజోబియం
- అజటోబ్యాక్టర్
- అజోస్ప్రెరిల్లమ్
- ఫాస్పరస్ సాల్యుబిలైజింగ్ బ్యాక్టీరియా
- మైకో రైజా
- పొటాషియాన్ని విడుదల చేసే బ్యాక్టీరియా
- జింక్ను కరిగించే బ్యాక్టీరియా
ఏయే పంటల్లో..
పప్పు, నూనె పంటలతో పాటు అన్ని రకాల కూరగాయలు, పండ్ల తోటల్లో ద్రవ రూపంలోని జీవ ఎరువులను వాడుకోవచ్చు. జొన్న, వరి, మొక్కజొన్న, చెరకు, గోధుమ, పత్తి పంటల్లోనూ వేసుకోవచ్చు. విత్తన శుద్ధికి ఎంచక్కా ఉపయోగించుకోవచ్చు.
ఉపయోగాలు
జీవ ఎరువుల వాడకం వల్ల భూసారం పెరుగుతుంది. నాణ్యమైన దిగుబడులకు అవకాశం ఉంటుంది. నేలలోని పోషకాల సమతుల్యత దెబ్బతినకుండా కాపాడుతుంది. జీవ ఎరువుల సిఫారసు మేరకు అన్ని పంటల్లో వినియోగించవచ్చు. మొక్క ఎదుగుదలకు దోహదపడుతుంది. ప్రధాన పోషకాలైన నత్రజని, భాస్వరం, పొటాషియం, సూక్ష్మపోషకాలైన జింక్ సమృద్ధిగా అందుతాయి. వివిధ రకాల హార్మోన్లు, యాంటిబయాటిక్స్ను ఉత్పత్తి చేయడం వల్ల మొక్కలకు తెగుళ్లు సోకకుండా రోగనిరోధక శక్తిని పెంపొందిస్తుంది.
లీటరు రూ.160
మార్కెట్లో వివిధ రకాల జీవ ఎరువులు లభిస్తున్నాయి. వాటన్నింటి కంటే తక్కువ ధరకే అందిస్తున్నారు. నాణ్యత ప్రమాణాల మేరకు తయారు చేస్తున్నారు. లీటరుకు రూ.160 చొప్పున రైతులకు అందిస్తున్నారు. అవసరమైన వారు నేరుగా కృషి విజ్ఞాన కేంద్రానికి వెళ్లి కొనుగోలు చేయవచ్చు.
రైతులను ప్రోత్సహిస్తున్నాం
ద్రవ రూప జీవ ఎరువులతో రైతులకు ఎన్నో విధాలుగా ప్రయోజనాలు ఉన్నాయి. సాగు ఖర్చు తగ్గించుకోవడంతో పాటు నాణ్యమైన దిగుబడులను ఉత్పత్తి చేసుకోవచ్చు. మొక్కల ఎదుగుదల ఎక్కువగా ఉంటుంది. నాణ్యతా ప్రమాణాలు పాటిస్తూ ఉత్పత్తి చేస్తున్నాం. ఈ దిశగా రైతులను ప్రోత్సహిస్తున్నాం. సలాహాలు, సూచనలు కావాలంటే నేరుగా కేంద్రంలోని శాస్త్రవేత్తలను సంప్రదించవచ్చు.
రవికుమార్, శాస్త్రవేత్త, ల్యాబ్ ఇన్ఛార్జి
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
దామోదర తీన్మార్
[ 08-12-2023]
మాజీ మంత్రి, అందోలు ఎమ్మెల్యే దామోదర రాజనర్సింహకు అనుభవం కలిసొచ్చింది. తాజాగా రాష్ట్ర మంత్రిగా అవకాశం దక్కగా.. గురువారం హైదరాబాద్లోని ఎల్బీ స్టేడియంలో జరిగిన కార్యక్రమంలో ప్రమాణ స్వీకారం చేశారు. -
అల్పాహారం కొందరికే!
[ 08-12-2023]
విద్యార్థుల ఆకలి తీర్చేందుకు గత ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన అల్పాహారం పంపిణీ కార్యక్రమం జిల్లాలో పూర్తి స్థాయిలో అమలు కావడం లేదు. అక్షయ పాత్ర ద్వారా మధ్యాహ్న భోజనం అందిస్తున్న 17 మండలాల్లో కేవలం పదుల సంఖ్యలోని బడుల్లో మాత్రమే అల్పాహారం పంపిణీ చేస్తున్నారు. -
ఇంట్లో శుభకార్యం.. అంతలోనే విషాదం
[ 08-12-2023]
కొత్త ఇంటి సంబరం.. కుటుంబీకులు, బంధువులతో సందడిగా ఉంది.. అందరూ సంతోషంగా ఉన్నారు.. ఇంతలోనే సరకులు తెచ్చేందుకు సైకిల్పై వెళ్లిన బాలుడిని మృత్యురూపంలో కంటెయినర్ దూసుకొచ్చి బలితీసుకోవడంతో ఆ ఇంట విషాదం నెలకొంది. -
ప్రమాణ శ్రీకారం
[ 08-12-2023]
త్రివర్ణ పతాకాల రెపరెపలు.. జై కాంగ్రెస్... జై సోనియమ్మ .. జై రేవంతన్నా.. నినాదాలతో గురువారం ఎల్బీ స్టేడియం పరిసరాలు హోరెత్తాయి. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి భారీ సంఖ్యలో తరలివచ్చిన కార్యకర్తలు, అభిమానులు... ఎటు చూసినా పార్టీ హోర్డింగులు, ఫ్లెక్సీలతో బషీర్బాగ్ పరిసరాలు గురువారం సందడిగా మారాయి. -
పథకాల అమలులో పారదర్శకత
[ 08-12-2023]
విద్యార్థులకు ప్రభుత్వం వివిధ రూపాల్లో సహకారం అందిస్తోంది. మధ్యాహ్న భోజనం.. అల్పాహారం.. విద్యార్థులకు ఏకరూప దుస్తులు.. పుస్తకాలు.. ఉపకార వేతనాలు.. రవాణా భత్యం ఇలా పలు రకాల పథకాలు అమలవుతున్నాయి. -
హుస్నాబాద్.. మంత్రి పదవితో హుషార్
[ 08-12-2023]
పొన్నం ప్రభాకర్ మంత్రిగా గురువారం ప్రమాణ స్వీకారం చేయడంతో నియోజకవర్గంలో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. ఈ నియోజకవర్గం నుంచి మొదటిసారి మంత్రి పదవి దక్కడంతో అభివృద్ధికి బాటలు పడతాయని సంతోషం వ్యక్తం చేస్తున్నారు. -
రొయ్యల పెంపకం.. ఆదాయానికి మార్గం
[ 08-12-2023]
మత్స్యకారుల జీవితాల్లో వెలుగులు నింపాలన్న లక్ష్యంతో నీటి వనరుల్లో చేపలు, రొయ్యల పెంపకాన్ని చేపడుతున్నారు. ప్రస్తుతం మత్స్యశాఖ ఆధ్వర్యంలో చేప పిల్లలు విడిచే కార్యక్రమం ఇప్పటికే పూర్తి చేశారు. -
అన్నదాతల హైరానా
[ 08-12-2023]
పాడి పశువులపై అడవి జంతువులు దాడి చేసి చంపేస్తున్నాయి. నిత్యం ఎక్కడో ఒకచోట మూగజీవులు బలవుతున్నాయి. ముఖ్యంగా వ్యవసాయ బావులు, పొలాల వద్ద కట్టేసిన దూడలను చంపుతుండడంతో రైతులకు తీవ్ర నష్టం వాటిల్లుతోంది. -
సన్మార్గంలో నడిస్తేనే విశ్వశాంతి
[ 08-12-2023]
ప్రతి ఒక్కరూ సన్మార్గంలో ముందుకు సాగితే విశ్వశాంతి సాధ్యమవుతుందని గుంటూరు విశ్వగురు పీఠాధిపతి విశ్వయోగి విశ్వంజీ మహరాజ్ తెలిపారు. -
దుర్గమ్మ సన్నిధిలో ఎమ్మెల్యే రోహిత్
[ 08-12-2023]
ప్రసిద్ధ పుణ్యక్షేత్రం ఏడుపాయల వనదుర్గమ్మను కొత్తగా ఎంపికైన మెదక్ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్రావు, తండ్రి మాజీ ఎమ్మెల్యే హన్మంతరావు కుటుంబ సభ్యులతో కలిసి గురువారం సాయంత్రం దర్శించుకున్నారు. -
కేసీఆర్ వద్దకు భారాస నాయకులు
[ 08-12-2023]
గజ్వేల్ నియోజకవర్గంలోని కుకునూరుపల్లి మండల ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు ఎంపీటీసీల ఫోరం రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షులు దేవి రవీందర్ ఆధ్వర్యంలో మాజీ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావును ఎర్రవల్లిలోని వ్యవసాయ క్షేత్రంలో గురువారం కలిశారు. -
సీఎంను కలిసిన సిద్దిపేట నాయకులు
[ 08-12-2023]
ముఖ్యమంత్రి రేవంత్రెడ్డిని కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు తూంకుంట నర్సారెడ్డి, పట్టణ అధ్యక్షుడు అత్తూఇమామ్ గురువారం సచివాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. -
కార్యకర్తలను కాపాడుకుంటా: హరీశ్
[ 08-12-2023]
ఎమ్మెల్యేగా గెలిచిన హరీశ్రావు గురువారం మొదటిసారి సిద్దిపేటకు రాగా ఆయన్ను కలిసేందుకు భారాస ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున క్యాంపు కార్యాలయానికి తరలి వచ్చారు. -
అదృశ్యమైన మహిళ దారుణ హత్య
[ 08-12-2023]
అదృశ్యమైన మహిళ హత్యకు గురైంది. పట్టణ సీఐ రాజేందర్రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. కర్ణాటక రాష్ట్రం గుల్బర్గా జిల్లా సేడం తాలూకా మద్కల్కు చెందిన దంపతులు మొహమ్మద్, సర్వాబీ(42) బతుకుదెరువు కోసం తాండూరుకు వచ్చారు. -
బాల్య వివాహం చేసుకున్న యువకుడిపై కేసు
[ 08-12-2023]
బాల్య వివాహం చేసుకున్న యువకుడిపై కేసు నమోదు చేసినట్లు అల్లాదుర్గం పోలీసులు తెలిపారు. వారు తెలిపిన వివరాలు.. మండల పరిధిలోని ఓ గ్రామానికి చెందిన 20 ఏళ్ల యువకుడు..


తాజా వార్తలు (Latest News)
-
Chandrababu: రైతుల కష్టాలు జగన్కు ఏం తెలుసు?: చంద్రబాబు
-
Vadhuvu: రివ్యూ: వధువు.. అవికా గోర్ నటించిన వెబ్సిరీస్ ఎలా ఉందంటే?
-
TS Assembly: శనివారం ఉదయం కొలువుదీరనున్న తెలంగాణ శాసనసభ
-
Mamata Banerjee: ‘ఈ యుద్ధాన్ని మహువా గెలుస్తుంది’: బహిష్కరణను ఖండించిన దీదీ
-
Meenakshi Chaudhary: ‘గుంటూరు కారం’.. ఆరోజు ఎంతో కంగారుపడ్డా: మీనాక్షి చౌదరి
-
Team India: యువ టాలెంట్కు కొదవేం లేదు.. జట్టు కూర్పే భారత్కు సవాల్: మాజీ క్రికెటర్