గజ్వేల్ జిగేల్
ఒకప్పుడు అనేక సమస్యలతో సతమతమైన గజ్వేల్ నియోజకవర్గం నేడు అభివృద్ధి పనుల్లో రాష్ట్రానికే నమూనాగా నిలిచింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత 2014లో గజ్వేల్ నియోజకవర్గం నుంచి కేసీఆర్ ఎమ్మెల్యేగా పోటీ చేసి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు.
రూ.540 కోట్లతో అభివృద్ధి పనులు పూర్తి
నేడు ప్రారంభించనున్న మంత్రి హరీశ్రావు
రింగు రోడ్డు
న్యూస్టుడే, గజ్వేల్ గ్రామీణ, గజ్వేల్: ఒకప్పుడు అనేక సమస్యలతో సతమతమైన గజ్వేల్ నియోజకవర్గం నేడు అభివృద్ధి పనుల్లో రాష్ట్రానికే నమూనాగా నిలిచింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత 2014లో గజ్వేల్ నియోజకవర్గం నుంచి కేసీఆర్ ఎమ్మెల్యేగా పోటీ చేసి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. దీంతో గజ్వేల్ నియోజకవర్గం దశ మారిపోయింది. అన్ని రంగాల్లో అభివృద్ధి చేసి రాష్ట్రానికి నమూనాగా చేయాలని సీఎం కేసీఆర్ పలు సందర్భాల్లో ఉన్నతాధికారులకు ఆదేశించారు. రంగంలోకి దిగిన అధికారులు నియోజకవర్గంలోని అన్ని గ్రామాల్లో శాఖల వారీగా ప్రణాళికలు రూపొందించారు. ఈ పనులను దశల వారీగా పూర్తి చేస్తూ ప్రారంభోత్సవాలు చేస్తున్నారు. ఇప్పటికే రూ.వేల కోట్ల విలువైన పనులను పూర్తి చేసిన వినియోగంలోకి తీసుకువచ్చారు. తాజాగా గజ్వేల్ నియోజకవర్గంలో రూ.540 కోట్లతో చేపట్టిన అభివృద్ధి పనులను నేడు మంత్రి హరీశ్రావు ప్రారంభించనున్నారు. ఈ అభివృద్ధి పనులపై ‘న్యూస్టుడే’ ప్రత్యేక కథనం.
రూ.34కోట్లతో మాతా శిశు సంరక్షణ కేంద్రం
నియోజకవర్గ ప్రజలకు మెరుగైన వైద్య సౌకర్యాలను అందించాలనే లక్ష్యంగా గజ్వేల్ పట్టణంలో మాతా శిశుసంక్షేమ ఆరోగ్య కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. రూ.34 కోట్లతో అధునాతన సౌకర్యాలతో కూడిన మూడు అంతస్తులతో ప్రత్యేకంగా వార్డులు ఏర్పాటు చేశారు. మూడు ఆపరేషన్ థియేటర్లు, చిన్నపిల్లల కోసం ప్రత్యేక వార్డులు, ఐసీయూ, ఆక్సిజన్ సరఫరా చేసే కేంద్రంతో నిర్మించారు.
మరిన్ని అభివృద్ధి పనులు
- ములుగు మండలం బండమైలారం, తున్కిబొల్లారం పారిశ్రామికవాడల్లో రూ.9 కోట్లతో నిర్మించిన విద్యుత్తు ఉపకేంద్రాలు, బైలంపూర్ ఆర్అండ్ఆర్ కాలనీలో రూ.35లక్షలు, చిన్నతిమ్మాపూర్లో రూ.50లక్షలతో నిర్మించిన పంచాయతీ కార్యాలయ భవనాలను ప్రారంభిస్తారు.
- వర్గల్ మండలం అవుసులోనిపల్లిలో పంచాయతీ భవనం(రూ.30లక్షలు), గజ్వేల్ మండలం, బల్దియాలతో పత్తి మార్కెట్ యార్డు(రూ.2.70కోట్లు), తూప్రాన్ రోడ్డులో మోడల్ బస్టాండ్ (రూ.5కోట్లు), బయ్యారంలో అభివృద్ధి పనులు(రూ.2.36కోట్లు), బల్దియాలో భూగర్భ మురుగు కాల్వలు, అంబేడ్కర్ భవనం(రూ.కోటి), పద్మశాలి భవనం(రూ.1.30కోట్లు), రాజీవ్ పార్క్(రూ.2.50కోట్లు)లను ప్రారంభిస్తారు.
- కొండపాక మండలంలో రూ.82కోట్లతో నిర్మించిన సమీకృత కార్యాలయ భవనాన్ని ప్రారంభిస్తారు.
రింగు రోడ్డుతో తీరిన కష్టాలు2014లో ఎమ్మెల్యేగా గజ్వేల్లో తొలిసారి నామినేషన్ వేసేందుకు కేసీఆర్ ఇక్కడికి వచ్చారు. ట్రాఫిక్ ఇబ్బందులు స్వయంగా చూసి.. శాశ్వత పరిష్కారంగా రింగు రోడ్డు నిర్మాణం చేపడతామని హామీ ఇచ్చారు. ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టగానే రింగు రోడ్డు నిర్మాణానికి భూసేకరణ చేయాలని ఆదేశాలు జారీ చేశారు. భూసేకరణ పూర్తి చేయడంతో 2016లో రూ.303 కోట్ల భారీ వ్యయంతో గజ్వేల్, ప్రజ్ఞాపూర్, క్యాసారం, రిమ్మనగూడ, శ్రీగిరిపల్లి, ముట్రాజ్పల్లి, ధర్మారెడ్డిపల్లి, జాలిగామ, సంగాపూర్, సంగుపల్లి గ్రామాలను కలుపుతూ రహదారి నిర్మాణాన్ని పూర్తిచేశారు. రైల్వేస్టేషన్ సమీపంలో, సంగాపూర్ శివారులో రెండు చోట్ల కొంత మేరకు పనులు మిగిలిపోయాయి. 12 కూడళ్లతో చేపట్టిన ఈ రోడ్డు ప్రజ్ఞాపూర్ శివారులోని పాతూర్ జంక్షన్ నుంచి రిమ్మనగూడ శివారు వరకు 6 కూడళ్ల పరిధిలో మూడు వంతెనలతో 6 వరుసలుగా నిర్మించి విభాగినిపై హైమాస్ట్ దీపాలను బిగించారు.
ప్రగతి చరిత్రలో రికార్డు
నియోజకవర్గ వ్యాప్తంగా చేపట్టిన దాదాపు రూ.540 కోట్ల విలువైన అభివృద్ధి పనులకు మంత్రి హరీశ్రావు నేడు ప్రారంభోత్సవాలు చేయనున్నారు. ఇందుకోసం అధికార యంత్రాంగ సర్వం సిద్ధం చేసింది. గజ్వేల్ నియోజకవర్గ చరిత్రలో ఇంత పెద్ద అభివృద్ధి పనులు ఒకేరోజు జాతికి అంకితం చేయటం ఇదే ప్రథమమని అధికారులు చెబుతున్నారు. ఈ అభివృద్ధి పనులను ఎఫ్డీసీ ఛైర్మన్ వంటేరు ప్రతాప్రెడ్డి పర్యవేక్షించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ధాన్యం కొనుగోళ్లు వేగవంతం
[ 09-12-2023]
జిల్లాలో ధాన్యం కొనుగోళ్లు శరవేగంగా సాగుతున్నాయి. నిర్దేశించిన లక్షంలో ఇప్పటి వరకు 50 శాతం పూర్తయ్యాయి. ఎప్పటికప్పుడు ట్యాబ్లో వివరాలు నమోదు చేస్తుండడంతో అన్నదాతల ఖాతాల్లో డబ్బులు జమ అవుతున్నాయి. పంట పెట్టుబడికి ప్రభుత్వం నుంచి సాయం ఇంకా రాకపోవడంతో ధాన్యం డబ్బులు ఉపయోగించుకోనున్నారు. -
మెదక్ను అన్ని రంగాల్లో తీర్చిదిద్దుతా
[ 09-12-2023]
పదేళ్లలో మెదక్ పట్టణం పూర్తిగా వెనుకబడిందని, రాబోయే రోజుల్లో అన్ని రంగాల్లో ఆదర్శంగా తీర్చిదిద్దుతానని ఎమ్మెల్యేగా గెలిచిన మైనంపల్లి రోహిత్రావు అన్నారు. గెలుపొందాక ఆయన తొలిసారి మెదక్కు వచ్చారు. శుక్రవారం క్యాంపు కార్యాలయ ప్రవేశ కార్యక్రమంలో పాల్గొని పూజలు చేశారు. అనంతరం ఆయన మాట్లాడారు. -
పారిశ్రామికవాడల్లో మత్తు దందా
[ 09-12-2023]
మత్తు పదార్థాల తయారీ యథేచ్ఛగా సాగుతోంది. పటాన్చెరు నియోజకవర్గ పరిధిలోని పలు పారిశ్రామికవాడలు ఇందుకు కేంద్రాలుగా మారుతున్నాయి. ఏడాదిలో ఒకటి, రెండు ఘటనలు వెలుగు చూస్తున్నా.. గుట్టుచప్పుడు కాకుండా దందా భారీగా కొనసాగుతోందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. -
వంతెన పూర్తి.. ప్రయాణం సాఫీ
[ 09-12-2023]
జాతీయ రహదారి బైపాస్ సర్కిల్ అంటేనే ప్రతి ఒక్కరిలో దడ.. సర్కిల్ వద్ద ఎటు నుంచి ప్రమాదం పొంచి ఉంటుందో తెలియని పరిస్థితి. ఎంతోమంది ప్రాణాలు కోల్పోయిన చోట కొత్తగా ఉపరితల వంతెన నిర్మించారు. ఇప్పుడు ఎలాంటి సమస్యల్లేకుండా ప్రయాణం సాఫీగా సాగుతోంది. -
‘సొంతం’ లేవాయె.. బాధలు తీరవాయె
[ 09-12-2023]
పట్టణంలోని చాలా ప్రభుత్వ కార్యాలయాలకు అతిథిగృహాలే దిక్కయ్యాయి. ప్రభుత్వ స్థలాలు లేవనే సాకుతో సొంత భవనాలు నిర్మించడం లేదు. నిధులున్నా పనులు చేయడం లేదు. అద్దె భవనాల్లో అవస్థల మధ్య కొనసాగిస్తున్నారు. -
ఆరింట అభయ హస్తం
[ 09-12-2023]
శాసనసభ ఎన్నికల మ్యానిఫెస్టోలో కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన ఆరు గ్యారెంటీల దస్త్రంపై నూతన ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి తొలి సంతకం చేసిన నేపథ్యంలో ఉమ్మడి మెదక్, వికారాబాద్ జిల్లాలవాసుల్లో ఆశలు చిగురించాయి. ఆరు పథకాలతో లబ్ధి పొందేందుకు పలువురు ఉవ్విళ్లూరుతున్నారు. -
తిప్పలు తప్పేలా.. అత్యాధునిక క్యూ కాంప్లెక్స్
[ 09-12-2023]
గంటల కొద్ది బారులు తీరాల్సిందే.. ఆరు బయట ఎండలో ఎండుతూ, వానకు తడుస్తూ నిల్చోవాల్సిందే.. కనీస సౌకర్యాలు లేక ఇబ్బందులు పడాల్సిందే.. ఇవి కొమురవెల్లి మల్లన్న దర్శనానికి వచ్చే భక్తుల బాధలు. మల్లన్న దర్శనానికి రద్దీ పెరుగుతుండటంతో అవస్థలు ఎదురవుతున్నాయి. వీటిని అధిగమించడంపై ఆలయ అధికారులు ప్రత్యేక దృష్టి సారించారు. -
విద్యార్థులూ.. విజ్ఞానం వైపు అడుగులేద్దాం
[ 09-12-2023]
విద్యార్థుల ఆలోచనలను కార్యరూపంలోకి తీసుకొచ్చి వారిని భావి శాస్త్రవేత్తలుగా తీర్చిదిద్దాలన్నదే వైజ్ఞానిక ప్రదర్శన కార్యక్రమ ఉద్దేశం. ఇందుకు ప్రభుత్వాలు అన్ని రకాలుగా సహకారం అందిస్తున్నాయి. జిల్లా నుంచి జాతీయ స్థాయి వరకు పోటీలు నిర్వహించి అవార్డులు ఇస్తూ ప్రోత్సహిస్తున్నాయి. -
ఉపాధికి కార్యాచరణ
[ 09-12-2023]
రెక్కాడితేనే డొక్క నిండని నిరుపేద కూలీలకు జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం వరంలా మారింది. సొంత ఊరిలోనే పనులు చేసుకోవడానికి ఈ పథకం దోహద పడుతోంది. వారికి భరోసా కల్పించేందుకు జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ కార్యాచరణ సిద్ధం చేసింది. -
సకాలంలో స్పందిస్తేనే ఉపకారం
[ 09-12-2023]
పేదరికం కారణంగా ఉన్నత చదువు భారంగా మారిన కుటుంబాలు ఇప్పటికీ ఉన్నాయి. అలాంటి పేదలకు ఉపకార వేతనాలు, బోధనా రుసుం పథకాలు వరంలా మారాయి. ఈ పథకాలను దృష్టిలో పెట్టుకునే విద్యార్థులు ధైర్యంగా ప్రైవేటు కళాశాలల్లోనూ చేరేందుకు ముందుకు వస్తున్నారు. -
చలిగాలికి వదిలేసి..
[ 09-12-2023]
అసలే చలికాలం.. ఆపై వాన.. అందుకు ఈదురుగాలులు తోడవడంతో జిల్లాలోని వసతిగృహాల విద్యార్థులు సతమతమవుతున్నారు. సరైన వసతులు లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. చన్నీటి స్నానంతో వణుకుతున్నారు. ప్రత్యామ్నాయ చర్యలు, ఉన్నతాధికారుల పర్యవేక్షణ లేక సమస్యల నడుమ కొనసాగుతున్నాయి. -
ప్రజా దర్బార్లో బెజ్జంకి నాయకుల వినతి
[ 09-12-2023]
ప్రజా దర్బార్లో సీఎం రేవంత్రెడ్డి, మంత్రి సీతక్కను కలిసి పలు సమస్యలపై వినతిపత్రాలు అందజేసినట్లు ఆర్టీఐ ప్రచార కమిటీ ఛైర్మన్ రాసూరి మల్లికార్జున్ తెలిపారు. మండలాన్ని పూర్వపు కరీంనగర్ జిల్లాలో చేర్చాలని కోరారు. బెజ్జంకి శివారులోని సర్వేనంబర్ 961, 962లోని భూమిని కొందరు అక్రమంగా పట్టా చేసుకున్నందున లబ్ధిదారులకు న్యాయం చేయాలని కోరినట్లు పేర్కొన్నారు. -
కొత్తవి రాకముందే.. పాతవి అమ్మేసి
[ 09-12-2023]
అధికారుల తొందరపాటు చర్యల కారణంగా విద్యార్థులు అవస్థలు పడాల్సి వస్తోంది. సిద్దిపేట జిల్లా వర్గల్ మండలం వేలూరు ఉన్నత పాఠశాలలో కొత్త డెస్కులు రాకముందే, వస్తాయే.. రావో కచ్చితంగా తెలియకుండానే పాతవన్నీ ముందే అమ్మేసి కూర్చున్నారు. దీంతో విద్యార్థులు నేలపైనే కూర్చొని అవస్థలు పడుతున్నారు. -
3.85 లక్షల ఎకరాల్లో సాగు
[ 09-12-2023]
జిల్లాలో యాసంగి(రబీ) సాగు ప్రణాళికలను వ్యవసాయ శాఖ సిద్ధం చేసింది. ఈసారి దాదాపు 3.85 లక్షల ఎకరాల్లో వివిధ పంటలు సాగవుతాయని వ్యవసాయ శాఖ అధికారులు ప్రతిపాదనలు సిద్ధం చేశారు. అత్యధికంగా 3.60 లక్షల ఎకరాల్లో వరి సాగయ్యే అవకాశాలుండటంతో విద్యుత్తు సరఫరాపై ప్రాధాన్యత సంతరించుకుంది. -
మహిళ హత్య కేసులో నిందితుడికి రెండేళ్ల జైలు
[ 09-12-2023]
మహిళ హత్య కేసులో నిందితుడికి రెండేళ్ల జైలు శిక్ష విధిస్తూ జిల్లా కోర్టు న్యాయమూర్తి కె.ప్రభాకర్రావు శుక్రవారం తీర్పు వెలువరించారని సంగారెడ్డి గ్రామీణ ఎస్ఐ రాజేశ్ నాయక్ తెలిపారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం.. పుల్కల్ మండలం కోడూరుకు చెందిన సగ్గల లక్ష్మి(39) అడ్డా కూలి. -
ఆదుకోవాలని సీఎంకు వినతి
[ 09-12-2023]
‘నా భర్త ఖదీర్ఖాన్ పోలీసు లాఠీ దెబ్బలకు చనిపోయినా.. ఇప్పటి వరకు ఎలాంటి సాయం అందలేదు. మీరైనా ఆదుకోండి’ అంటూ మెదక్ పట్టణానికి చెందిన సిద్దేశ్వరి సీఎం రేవంత్రెడ్డిని కోరారు. శుక్రవారం హైదరాబాద్లోని జ్యోతిబా ఫులే ప్రజాభవన్లో ముఖ్యమంత్రి నిర్వహించిన ప్రజాదర్బార్కు కుమారుడు ఇమ్రాన్తో కలిసి వెళ్లారు.


తాజా వార్తలు (Latest News)
-
Chandra Babu: తుపాను బాధితులకు ప్రభుత్వం ₹25వేల ఆర్థిక సాయం అందించాలి: చంద్రబాబు
-
Chiranjeevi: చిరంజీవితో సినిమా చేస్తా: సందీప్ రెడ్డి వంగా
-
సంరక్షకుడికి రూ.97వేల కోట్ల ఆస్తి.. రాసివ్వనున్న బిలియనీర్!
-
Allu Aravind: మీ సందేహాలు ఇంకొన్నాళ్లు అలాగే ఉంచండి: అల్లు అరవింద్
-
TS News: ఆరు గ్యారంటీలను 100 రోజుల్లో అమలు చేస్తాం: సీఎం రేవంత్ రెడ్డి
-
IND vs SA: సఫారీలతో టీ20 సిరీస్.. గత రికార్డులు ఎలా ఉన్నాయంటే?