TS Politics: కేసీఆర్‌ ప్రభుత్వానికి ప్రజలు గోరీ కట్టడం ఖాయం : ఈటల

రానున్న ఎన్నికల్లో కేసీఆర్‌ ప్రభుత్వానికి తెలంగాణ ప్రజలు గోరీ కట్టడం ఖాయమని, రాష్ట్రంలో భాజపా జెండా

Updated : 28 Nov 2021 13:16 IST

చౌటుప్పల్‌ : రానున్న ఎన్నికల్లో కేసీఆర్‌ ప్రభుత్వానికి తెలంగాణ ప్రజలు గోరీ కట్టడం ఖాయమని, రాష్ట్రంలో భాజపా జెండా ఎగరబోతోందని హుజూరాబాద్‌ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ ధీమా వ్యక్తం చేశారు. లింగోజీగూడెంలో అంబేడ్కర్‌ విగ్రహానికి నివాళులర్పించిన అనంతరం చౌటుప్పల్‌లోని భాజపా కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు.

సీఎం కేసీఆర్‌ అహంకారం, ఆధిపత్య ధోరణి, రాచరిక పోకడలు తెలంగాణ గడ్డ మీద చెల్లవని హుజూరాబాద్‌ ఎన్నికల్లో రుజువైందని ఈటల చెప్పారు. ఓడించారనే అక్కసుతోనే ధాన్యం కొనకుండా రైతులను వేధింపులకు గురిచేస్తున్నాడని దుయ్యబట్టారు. రైతులు పండించిన పంటను కొనే బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానిది కాదా? అని ఈ సందర్భంగా సీఎంను ఈటల ప్రశ్నించారు. కేసీఆర్‌ అసమర్థ సీఎం అని పలు జాతీయ సర్వేలు చెబుతున్నాయని విమర్శించారు. ప్రజలు అన్నీ గమనిస్తున్నారని, సందర్భం వచ్చినప్పుడు కర్రు కాల్చి వాతపెట్టడానికి సిద్ధంగా ఉన్నారన్నారు. భాజపా రాష్ట్ర ఉపాధ్యక్షుడు గంగిడి మనోహర్‌రెడ్డి, జిల్లా అధ్యక్షుడు శ్యామ్ సుందర్‌ రావు, ఉపాధ్యక్షుడు రమణగోని శంకర్‌, నాయకులు గూడల బిక్షంగౌడ్‌, వెంకటేశం గౌడ్‌ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని