సంక్షిప్త వార్తలు
నల్గొండ పట్టణంలోని కాపురాల గుట్టను టూరిజం పార్కుగా అభివృద్ధి పర్చడానికి కేంద్ర పర్యాటక శాఖ తన విన్నపాన్ని స్వీకరించిందని ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మానుమెంట్స్, సైట్స్ సభ్యులు ఆదోని వెంకటరమణారావు...
కాపురాల గుట్ట అభివృద్ధికి కేంద్ర పర్యాటక శాఖ అనుమతి!
నీలగిరి: నల్గొండ పట్టణంలోని కాపురాల గుట్టను టూరిజం పార్కుగా అభివృద్ధి పర్చడానికి కేంద్ర పర్యాటక శాఖ తన విన్నపాన్ని స్వీకరించిందని ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మానుమెంట్స్, సైట్స్ సభ్యులు ఆదోని వెంకటరమణారావు తెలిపారు. కాపురాల గుట్టపైన పద్మనాయక రాజ వంశస్తులు నిర్మించిన కోటను, శివాలయాన్ని పునరుద్ధరించి ఈకో టూరింజంగా అభివృద్ధి చేయాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు విన్నవించగా రాష్ట్ర ప్రభుత్వం అంగీకరించిందని తెలిపారు. స్థానిక ఎమ్మెల్యే కంచర్ల భూపాల్రెడ్డి గుట్టను పరిశీలించి ఈకో టూరిజం అభివృద్ధికి కృషిచేస్తానని ప్రకటించారని తెలిపారు. కేంద్ర మంత్రి కిషన్రెడ్డికి వినతి పత్రం ఇవ్వగా స్వదేశ్ దర్శన్ పథకం కింద పరిశీలనకు స్వీకరించామని తెలియజేస్తూ కేంద్ర టూరిజం డిప్యూటీ డైరెక్టర్ జనరల్ తనకు లేఖరాశారని తెలిపారు.
అధిక ఎరువుల వాడకంతో దెబ్బతింటున్న భూసారం
నల్గొండ సంక్షేమం, న్యూస్టుడే: ఎరువులు అధికంగా వాడటం వల్ల భూసారం దెబ్బతింటుందని జిల్లా వ్యవసాయశాఖాధికారి జి.శ్రీధర్రెడ్డి తెలిపారు. ప్రపంచ నేల ఆరోగ్య దినోత్సవాన్ని పురస్కరించుకుని శనివారం నల్గొండ మండలం దండంపల్లిలో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. భూమిని కాపాడుకోవాల్సిన ఆవశ్యకత ఉందన్నారు. భూసారాన్ని పెంచుకొని సేంద్రియ పద్ధతులు చేపట్టాలని, చెరువుమట్టి వేయడం, పెంటఎరువు, పచ్చిరొట్టపైరు, పచ్చిఆకుఎరువులు, జీవన ఎరువులు వాడటం వల్ల భూసారం పెరుగుతుందని వివరించారు. పంటలో అధిక దిగుబడి సాధించాలంటే భూమిలో అన్ని పోషక పదార్ధాలు సమపాళ్లలో అందాలని తెలిపారు. నత్రజని, భాస్వరం, పోటాషియం, ద్వితీయ శ్రేణి పోషక పదార్థాలైన సున్నం, మెగ్నీషియం, గందకం, సూక్ష్మ పోషక పదార్థాలు జింక్, రాగి, ఇనుము, మాంగనీసు, బోరాన్, క్లోరిన్ను పంటలకు అందించాలని తెలిపారు. ఏడీఏ హుస్సేన్బాబు, ఉద్యానవన శాఖాధికారి సంగీతలక్ష్మి, అధికారులు శాంతినిర్మల, సుమన్ రమన, కీర్తి, చంద్రకళ, హరిత, వీణ, వాసుదేవరెడ్డి, సురేష్గుప్త, తదితరులు పాల్గొన్నారు.
ఎస్సై కొట్టారంటూ వీడియో వైరల్
ఈనాడు, నల్గొండ: నల్గొండ పురపాలిక పరిధిలోని అర్జాలబావిలో ఉన్న ఓ భూమి తగాదాలో జోక్యం చేసుకొని, తనను అకారణంగా కేసులో ఇరికించి నల్గొండ టూటౌన్ ఎస్సై నర్సింహులు దాడి చేశారని ఓ స్థిరాస్తి వ్యాపారి చెబుతున్న వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. తనను అకారణంగా ఎస్సై కేసులో ఇరికించారని శ్రీనివాసులు అనే వ్యాపారి గత నెల 16న ఎస్పీకి ఆయన లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేశారు. దీనిపై ప్రస్తుతం అంతర్గతంగా విచారణ సాగుతోంది. వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతుండటంపై సంబంధిత ఎస్సై నర్సింహులును ‘ఈనాడు’ సంప్రదించగా... నిబంధనల ప్రకారమే తామీ కేసులో వ్యవహరించామని వెల్లడించారు.
పోలీసుల అదుపులో ‘డిక్కీ’ దొంగలు
దేవరకొండ, న్యూస్టుడే: ఆదమరిచి ద్విచక్ర వాహనాల్లో డబ్బులు పెట్టి కార్యాలయం లోనికి గాని, బ్యాంకు లోపలికి గాని, ఇతర పనుల నిమిత్తం వాణిజ్య సముదాయాలకు వెళ్లినా ఆ డబ్బులు మాయం చేస్తున్నారు ఓ ముఠా సభ్యులు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన ఈ ముఠా సభ్యులను దేవరకొండ పోలీసులు పక్కా ప్రణాళికతో వల వేసి పట్టుకున్నారు. నవంబర్ 29న దేవరకొండ సబ్రిజిష్ట్రార్ కార్యాలయం సమీపంలో డాక్యుమెంట్ రైటర్ వద్ద పని చేసే శంకర్ రూ.70 వేలతో రిజిష్ట్రేషన్ డాక్యుమెంట్లకు సంబంధించిన చలాన్లు కట్టేందుకు బ్యాంకుకు బయల్దేరారు. బ్యాంకుకు వెళ్లే క్రమంలో శంకర్ ముందుగా దేవరకొండ పట్టణంలోని విష్ణు కాంప్లెక్స్ వద్దకు ఓ షాపుకు వెళ్లగా పసిగట్టిన ముఠా సభ్యులు డిక్కీలో ఉన్న డబ్బుల బ్యాగును తీసుకొని కల్వకుర్తి రోడ్డు వైపు వెళ్లారు. బాధితుడు దేవరకొండ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. పోలీస్ స్టేషన్లో సీసీ కెమెరాలో నిందితులను గుర్తించారు. దీంతో పోలీసులు కేసు నమోదు చేసుకొని వీరి కోసం నాగర్కర్నూల్, రంగారెడ్డి జిల్లాలో గాలింపు చర్యలు చేపట్టారు. కాగా తిరిగి ఆ ముఠా సభ్యులు మాటు వేసేందుకు దేవరకొండలోని స్టేట్ బ్యాంకు వద్దకు వచ్చారు. యథావిధిగా బాధితుడు శంకర్ మళ్లీ బ్యాంకుకు రావడంతో అప్పటికే అక్కడికి వచ్చిన డిక్కీ ముఠా సభ్యులను పసిగట్టి పోలీసులకు సమాచారం అందించడంతో ముఠా సభ్యులను పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నట్లు సమాచారం.
రాష్ట్రస్థాయి అవార్డుకు ఎంపిక
నల్గొండ టౌన్: మహాత్మాగాంధీ యూనివర్సిటీ మాజీ ఎన్ఎస్ఎస్ కో ఆర్డినేటర్ డా.దోమల రమేశ్ 2017-18 సంవత్సరానికి గాను రాష్ట్రస్థాయి ఉత్తమ కో ఆర్డినేటర్గా ఎంపికయ్యారు. వర్సిటీ పరిధిలో ఎన్ఎస్ఎస్ ఆధ్వర్యంలో నిర్వహించిన సేవా కార్యక్రమాలను పరిగణనలోకి తీసుకుని ఎన్ఎస్ఎస్ రాష్ట్ర అధికారులు శనివారం ఈ అవార్డును ప్రకటించారు. ఈ సందర్భంగా రమేశ్కు ఎంజీయూ వీసీ గోపాల్రెడ్డి, రిజిస్ట్రార్ విష్ణుదేవ్, అధ్యాపకులు అభినందనలు తెలిపారు.
నేడు కబడ్డీ క్రీడాకారుల ఎంపిక
మేళ్లచెరువు: జిల్లా కబడ్డీ అసోషియేసన్ ఆధ్వర్యంలో మేళ్లచెరువు జడ్పీ ఉన్నత పాఠశాలలో ఆదివారం కబడ్డీ క్రీడాకారుల ఎంపిక నిర్వహిస్తున్నట్టు అసోషియేషన్ జిల్లా ప్రధాన కార్యదర్శి నామ నర్సింహారావు తెలిపారు. శనివారం ఇక్కడ ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడారు. సబ్ జూనియర్ బాలబాలికల జిల్లా జట్టుకు వయసు 16 ఏళ్ల లోపు, 55 కేజీల బరువు గల వారు అర్హులని వివరించారు. ఆధార్ కార్డుతో హాజరవ్వాలని విజ్ఞప్తి చేశారు. అధ్యక్షుడు రామచందర్ గౌడ్, ఆర్గనైజరు నాగిరెడ్డి, సైదులు, సంధ్య, లక్ష్మీనారాయణ, సంతోష్, గోపి తదితరులు పాల్గొన్నారు.
ఏపీ నుంచి ధాన్యం రాకుండా నిఘా: ఏడీఏ
మఠంపల్లి, న్యూస్టుడే: రాష్ట్రంలో ధాన్యం ధర ఎక్కువగా ఉండడంతో ఏపీ నుంచి ఇక్కడకు తరలించే అవకాశం ఉందని దీనిని నిరోధించేందుకు వివిధ శాఖల సమన్వయంతో నిఘా ఏర్పాటు చేశామని హుజూర్నగర్ ఏడీఏ సంధ్యారాణి చెప్పారు. మట్టపల్లి వంతెన వద్ద ఉన్న తనిఖీ కేంద్రాన్ని శనివారం పరిశీలించి మాట్లాడారు. వ్యవసాయ, పోలీసు, రెవెన్యూ, మార్కెటింగ్ శాఖల సిబ్బంది నిరంతరం లారీలు, ఇతర వాహనలు తనిఖీ చేస్తారని తెలిపారు. అనంతరం పెదవీడులోని విత్తన దుకాణాన్ని తనిఖీ చేశారు. వరికి ప్రత్యామ్నాయంగా ఇతర పంటల విత్తనాలు రైతులకు అందుబాటులో ఉంచాలని డీలర్లను ఆదేశించారు. ఎంఏవో బుంగా రాజు, ఏఈవో ఝాన్సీ, పోలీస్, రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు.
పారిశుద్ధ్య సిబ్బందికి చేనేత వస్త్రాలు
చౌటుప్పల్, న్యూస్టుడే: జిల్లాలోని పురపాలిక సంఘాల్లో విధులు నిర్వహిస్తున్న పారిశుద్ధ్య సిబ్బందికి ఏకరూప దుస్తులుగా చేనేత వస్త్రాలను పంపిణీ చేయాలని జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి నిర్ణయించారు. చేనేత కార్మికులకు ఉపాధి కల్పించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నారు. ఖాకీ రంగు ప్యాంటు, ఆకుపచ్చ రంగులో ‘ఇక్కత్’ డిజైను చేనేత వస్త్రంతో కుట్టిన అంగీలు సరఫరా చేయనున్నారు. కొయ్యలగూడెంలోని చేనేత మగ్గాలపై 5700 మీటర్ల వస్త్రం నేసి సరఫరా చేస్తున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
నామినేషన్ దాఖలు చేసిన భువనగిరి కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి
[ 24-04-2024]
భువనగిరి కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థిగా చామల కిరణ్ కుమార్ రెడ్డి నామినేషన్ దాఖలు చేశారు. -
మాటలే తూటాలై..!
[ 24-04-2024]
‘నల్గొండ జిల్లా సాగునీటి రంగానికి కేసీఆర్ తీరని అన్యాయం చేశారు. బస్సు యాత్ర కాదు, మోకాళ్ల యాత్ర చేసినా భారాసకు ఎవరూ ఓటేయరు. -
వైభవంగా హనుమాన్ జయంతి
[ 24-04-2024]
హనుమాన్ జయంతి సందర్భంగా మంగళవారం ఆలయాల్లో ప్రత్యేక పూజలు జరిపించారు. స్వామి వారికి సింధూరంతో అభిషేకం, తమల పాకులతో పూజలు నిర్వహించారు. -
పాఠాలకు బై.. ఆటలకు సై..!
[ 24-04-2024]
వేసవి సెలవులు వచ్చేశాయ్.. పది నెలల పాటు నిత్యం బడుల్లో పాఠాలు చదవడం, రాయడం తదితర పనుల్లో నిమగ్నమై ఉన్న చిన్నారులకు ఈ నెల 24 (బుధవారం) నుంచి మొదలయ్యే సెలవులతో ఉపశమనం లభించింది. -
అట్టహాసంగా కంచర్ల నామినేషన్
[ 24-04-2024]
లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నేతలకు తగిన బుద్ధి చెప్పడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారని మాజీ మంత్రి జగదీశ్రెడ్డి అన్నారు. -
పార్టీ గుర్తుల చరిత్ర ఇదే
[ 24-04-2024]
రాజకీయ పార్టీలనగానే గుర్తొచ్చేది వాటి గుర్తులే. ప్రధానంగా ఎన్నికల సమయంలో పార్టీ అభ్యర్థుల కంటే గుర్తులకే ప్రాధాన్యం ఉంటుంది. -
వారు.. శాసనసభకు, లోక్సభకు ఎన్నికయ్యారు!
[ 24-04-2024]
ఉమ్మడి నల్గొండ జిల్లాకు చెందిన కొందరు నేతలు శాసనసభకు, లోక్సభకు ఎన్నికయ్యారు. దేశంలోనే అత్యధిక ఓట్లు సాధించి రికార్డు సృష్టించారు. -
ప్రలోభాల ఎర.. తప్పదు చెర!
[ 24-04-2024]
లోక్సభ ఎన్నికలు మే 13న జరగనున్నాయి. ఇప్పటికే నామినేషన్ల పర్వం ప్రారంభం కావడంతో ప్రచారం ఊపందుకుంటోంది. -
ఆహారం సేకరించి.. అభాగ్యుల ఆకలి తీర్చి..
[ 24-04-2024]
దేశంలో ఒక వైపు రెండు పూటలా తినడానికి తిండి లేక వేలాది మంది అవస్థలు పడుతున్నారు. మరో వైపు నిత్యం లక్షల టన్నుల ఆహార పదార్థాలు వ్యర్థాలుగా మారుతున్నాయి. -
లోక్సభలో గళం విప్పే అవకాశం ఇవ్వండి: జహంగీర్
[ 24-04-2024]
ప్రజాసమస్యల పరిష్కారానికి జనం వెన్నంటే ఉండి నిరంతరం పోరాటాలు చేస్తున్న తనకు మద్దతుగా నిలిచి గెలిపిస్తే పార్లమెంటులో ఈ ప్రాంత సమస్యలపై గళం విప్పుతానని భువనగిరి లోక్సభ సీపీఎం అభ్యర్థి ఎండీ.జహంగీర్ అన్నారు. -
గత పొరపాట్లు పునరావృతం కావొద్దు: కలెక్టర్
[ 24-04-2024]
త్వరలో జరగబోయే లోక్సభ ఎన్నికల్లో సెక్టార్, పోలీసు అధికారులు సమన్వయంతో పని చేయాలని కలెక్టర్ వెంకటరావు అన్నారు. -
బడికి నిధులు
[ 24-04-2024]
యాదాద్రి జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో వసతుల కల్పనకు రాష్ట్ర ప్రభుత్వం రూ.25 కోట్లు మంజూరు చేసింది. ఈ పనులను అమ్మ ఆదర్శ కమిటీల ద్వారా చేపట్టనున్నారు. -
అతిథులు తరలొచ్చె.. బూర పూరించె..!
[ 24-04-2024]
ఓట్ల కోసం అనాదిగా మత రాజకీయాలు చేస్తున్నది కాంగ్రెస్ పార్టీయేనని భాజపా ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యుడు డాక్టర్ కె.లక్ష్మణ్ విమర్శించారు. -
వేస్తున్నారు నామినేషన్లు..!
[ 24-04-2024]
ఉమ్మడి నల్గొండ జిల్లాలోని నల్గొండ, భువనగిరి లోక్సభ స్థానాలకు నామినేషన్ల స్వీకరణ కార్యక్రమం కొనసాగుతోంది. -
అభ్యర్థులిద్దరూ ‘బీఎన్ రెడ్డి’లే..!
[ 24-04-2024]
మిర్యాలగూడ లోక్సభ నియోజకవర్గంలో 1989, 1991 ఎన్నికల్లో ప్రధాన అభ్యర్థులిద్దరూ బీఎన్రెడ్డిలే. ఒకరు వాస్తుశిల్పి బద్దం నర్సింహారెడ్డి. మరొకరు భీంరెడ్డి నర్సింహారెడ్డి. -
1,29,766 ఓట్లు కొల్లగొట్టిన స్వతంత్రులు
[ 24-04-2024]
ఫ్లోరైడ్కు వ్యతిరేకంగా జలసాధన సమితి ఆధ్వర్యంలో 1996 లోక్సభ ఎన్నికల్లో 476 మంది స్వతంత్ర అభ్యర్థులుగా బరిలో నిలిచారు. ఆ ఎన్నికల్లో వీరు 1,29,766 ఓట్లు సాధించారు.
తాజా వార్తలు (Latest News)
-
సంపద పంచుతారంటూ మోదీ ఆరోపణలు.. రాహుల్ క్లారిటీ
-
ప్రమాదవశాత్తు పేలిన తుపాకీ.. సీఆర్పీఎఫ్ డీఎస్పీ మృతి
-
వారసత్వ ఆస్తుల్నీ వదలరట: పిట్రోడా వ్యాఖ్యలపై మోదీ విమర్శలు
-
జగన్పై రాయి దాడి కేసు.. నిందితుడి కస్టడీకి కోర్టు అనుమతి
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
-
అది మీ రికార్డు పోలింగ్ కంటే ఎక్కువే..: పాశ్చాత్య మీడియాకు జై శంకర్ కౌంటర్