logo

మూడు రోజుల్లోనే విద్యా రుణాలు: గొంగిడి

దేశ, విదేశాలలో ఉన్నత చదువుల నిమిత్తం విద్యా రుణాలను కేవలం మూడు రోజుల వ్యవధిలోనే మంజూరు చేస్తున్నామని డీసీసీబీ ఛైర్మన్‌ గొంగిడి మహేందర్‌రెడ్డి అన్నారు. ఆలేరు డీసీసీబీ బ్రాంచిలో శనివారం విద్యార్థులకు

Published : 05 Dec 2021 03:19 IST


విద్యారుణం ప్రొసీడింగ్స్‌ను అందిస్తున్న డీసీసీబీ ఛైర్మన్‌ మహేందర్‌రెడ్డి

ఆలేరు, న్యూస్‌టుడే: దేశ, విదేశాలలో ఉన్నత చదువుల నిమిత్తం విద్యా రుణాలను కేవలం మూడు రోజుల వ్యవధిలోనే మంజూరు చేస్తున్నామని డీసీసీబీ ఛైర్మన్‌ గొంగిడి మహేందర్‌రెడ్డి అన్నారు. ఆలేరు డీసీసీబీ బ్రాంచిలో శనివారం విద్యార్థులకు విద్యా రుణాల ప్రొసీడింగ్స్‌ను అందజేసి మాట్లాడారు.  ఉమ్మడి జిల్లాలో ఇప్పటి వరకు సుమారు 13 వందల మంది విద్యార్థులకు ఉన్నత చదువులు, విదేశాల్లో చదువుల కోసం రుణాలు మంజూరు చేశామన్నారు. మేనేజర్‌ కె.ఉదయిశ్రీ, పీఏసీఎస్‌ ఛైర్మన్‌ ఎం.మల్లేశంగౌడ్‌, ఫీల్డ్‌ అధికారి అనిల్‌రెడ్డి, గ్యాదపాక నాగరాజు, సీహెచ్‌.చంద్రకళ తదితరులు ఉన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని