ధైర్యంగా ముందుకు సాగితేనే మహిళా సాధికారత
మగువలు తమ హక్కులను పరిరక్షించుకోవాల్సిన అవసరం ఉందని కలెక్టర్ పమేలా సత్పతి అన్నారు. ఆజాదీకా అమృత్ మహోత్సవ్ కార్యక్రమంలో భాగంగా శనివారం భువనగిరి పురపాలిక కార్యాలయంలోని
జ్యోతి వెలిగించి సదస్సును ప్రారంభిస్తున్న కలెక్టర్ పమేలా సత్పతి, చిత్రంలో జిల్లా అదనపు న్యాయమూర్తి భవాని, ఉమ్మడి జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి వేణు, సీనియర్ సివిల్ జడ్జి రజని, జూనియర్ సివిల్ జడ్జి నాగేశ్వర్రావు, అదనపు కలెక్టర్ దీపక్ తివారి, తదితరులు
భువనగిరి పట్టణం, న్యూస్టుడే: మగువలు తమ హక్కులను పరిరక్షించుకోవాల్సిన అవసరం ఉందని కలెక్టర్ పమేలా సత్పతి అన్నారు. ఆజాదీకా అమృత్ మహోత్సవ్ కార్యక్రమంలో భాగంగా శనివారం భువనగిరి పురపాలిక కార్యాలయంలోని సమావేశ మందిరంలో జాతీయ మహిళా కమిషన్, జిల్లా న్యాయసేవా అధికార సంస్థ ఆధ్వర్యంలో ‘మహిళా సాధికారత, న్యాయసేవలపై’ ఏర్పాటు చేసిన అవగాహన సదస్సులో ఆమె మాట్లాడారు. ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కొని ధైర్యంగా ముందుకు సాగి సాధికారత సాధించాలని సూచించారు. అతివలపై దురాగతాలకు పాల్పడే వారిని శిక్షించేందుకు చట్టాలు కఠినంగా ఉన్నాయన్నారు. కుటుంబ సభ్యులు మగువల హక్కులను గౌరవించాలని, లింగ వివక్ష చూపకుండా అన్ని రంగాల్లో రాణించే విధంగా ప్రోత్సహించాలన్నారు. దేశంలోని అన్ని వర్గాల ప్రజలకు రాజ్యాంగం సమాన హక్కులు కల్పించిందని నల్గొండ జిల్లా అదనపు న్యాయమూర్తి ఎం.భవాని తెలిపారు. చట్టాలపై అన్ని వర్గాలకు అవగాహన కల్పించేందుకు సదస్సులు నిర్వహిస్తున్నామని ఉమ్మడి జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి వేణు అన్నారు. చట్టాలపై పరిపూర్ణంగా ప్రజలకు అవగాహన లేని కారణంగా స్వాతంత్య్ర ఫలాలు పొందలేకపోతున్నారని పేర్కొన్నారు. మహిళా చట్టాలపై సీనియర్ సివిల్ జడ్జి రజని, జూనియర్ సివిల్ జడ్జి నాగేశ్వర్రావు, రాజ్యాంగ హక్కులపై లీగల్ ఎయిడ్ న్యాయవాది కేవీ రమణారావు అవగాహన కల్పించారు. సదస్సులో అదనపు కలెక్టర్ దీపక్ తివారి, పలు శాఖల జిల్లా అధికారిణులు, పలు ప్రభుత్వ శాఖల ఉద్యోగినులు, బార్ అసోసియేషన్ అధ్యక్షుడు గోద శ్రీనివాస్, పలువురు సీనియర్ న్యాయవాదులు, ఎంపీడీవోలు, సీడీపీవోలు, శిక్షణ ఎస్సైలు, మహిళా సర్పంచులు, ప్రధానోపాధ్యాయులు, డీఆర్డీఏ సహాయ మేనేజర్లు, పాల్గొన్నారు.
ప్రణాళికతో చదవండి: కలెక్టర్
భువనగిరి పట్టణం: ప్రణాళికతో చదివి ఉత్తమ ఫలితాలు సాధించాలని కలెక్టర్ పమేలా సత్పతి అన్నారు. పట్టణంలోని గిరిజన బాలికల ఆశ్రమ పాఠశాలను శనివారం ఆకస్మికంగా తనిఖీ చేసి మాట్లాడారు. జిల్లా గిరిజన సంక్షేమ అధికారి మంగ్తా నాయక్, ప్రధానోపాధ్యాయుడు జాన్సన్ పాల్గొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పోరు.. ఖరారు..!
[ 29-03-2024]
నల్గొండ, భువనగిరి లోక్సభ స్థానాల్లో ప్రధాన పార్టీలైన కాంగ్రెస్, భారాస, భాజపా తమ అభ్యర్థులను ఖరారు చేసింది. -
బలవంతులకే.. మరింత బలమై..
[ 29-03-2024]
పోషకాలతో కూడిన ఆహారంతోనే వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుందని భావించిన ప్రభుత్వం గత కొన్ని నెలలుగా రేషన్ బియ్యంలో పోషకాలు కలుపుతోంది. -
భూసారం తగ్గిపోతోంది
[ 29-03-2024]
పెరుగుతున్న రసాయన ఎరువుల వినియోగం.. సమగ్ర నీటి యాజమాన్య పద్ధతులు పాటించకపోవటం, సహజ ఎరువుల వాడకం పూర్తిగా తగ్గించటంతో ఏటా భూమిలో రసాయనాల ప్రభావంతో గాఢత పెరిగిపోతోంది. -
టెట్పై యువత గురి
[ 29-03-2024]
ఉపాధ్యాయ ఉద్యోగం పొందాలంటే ‘టెట్’ (టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్) తప్పనిసరి అయినందున.. ఈ పరీక్ష ప్రాధాన్యం సంతరించుకుంది. ప్రభుత్వం మెగా డీఎస్సీ ప్రకటించిన విషయం తెలిసిందే. -
బైండోవర్ అతిక్రమిస్తే జైలుకే
[ 29-03-2024]
సార్వత్రిక ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమల్లోకి రావడంతో శాంతి భద్రతల విఘాతానికి దారి తీసే అంశాలపై పోలీసులు నిఘా పెడుతున్నారు. -
బార్ అధ్యక్షుడిగా సుదర్శన్రెడ్డి ఎన్నిక
[ 29-03-2024]
సూర్యాపేట జిల్లా కోర్టు బార్ అసోసియేషన్కు గురువారం జరిగిన ఎన్నికల్లో అధ్యక్షుడిగా నూకల సుదర్శన్రెడ్డి ఎన్నికయ్యారు. -
కష్టాలెదురైనా విద్యాభ్యాసం కొనసాగించాలి
[ 29-03-2024]
బాలికలు కష్ట నష్టాలెదురైనా విద్యాభ్యాసాన్ని కొనసాగించాలని చౌటుప్పల్ న్యాయస్థానం జూనియర్ సివిల్ జడ్జి మహతి వైష్ణవి సూచించారు. -
లోక రక్షణ కోసమే క్రీస్తు రుధిర తర్పణం
[ 29-03-2024]
క్రీస్తు ప్రభువు మానవాళిని పాప విముక్తులుగా చేసేందుకే అవనిపై అవతరించాడు. -
యాదాద్రీశుడికి శతఘటాభిషేకం
[ 29-03-2024]
పంచనారసింహుల దివ్యక్షేత్రమైన యాదాద్రిలో గురువారం శ్రీలక్ష్మీనరసింహస్వామి జన్మ నక్షత్రమైన స్వాతి సందర్భంగా ప్రత్యేక వేడుకలు నిర్వహించారు. -
అప్పుతీర్చలేక హత్య చేశారు: డీఎస్పీ
[ 29-03-2024]
మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్నారు.. అవసరం కోసం ఆమె వద్ద అప్పు తీసుకున్నారు.. తీసుకున్న అప్పు తిరిగి తీర్చమని నిలదీస్తే హత్యచేసి ఆనవాళ్లు లేకుండా చేయాలని ప్రయత్నించిన ముగ్గురిని అరెస్టు చేసినట్లు నల్గొండ డీఎస్పీ శివరాంరెడ్డి తెలిపారు. -
మహిళ హత్య కేసులో దోషికి యావజ్జీవ కారాగార శిక్ష
[ 29-03-2024]
మహిళ హత్య కేసులో నిందితుడిగా ఉన్న ఆరె కుమార్ అలియాస్ చిన్నును దోషిగా తేల్చుతూ భువనగిరి మొదటి అదనపు జిల్లా సెషన్స్ కోర్టు తీర్పు చెప్పింది.
తాజా వార్తలు (Latest News)
-
కేజ్రీవాల్ అరెస్టుపై.. విపక్ష కూటమి నిరసన వాయిదా
-
కాలమే అన్నింటికీ సమాధానం చెబుతుంది: కేటీఆర్
-
ఉపాధ్యాయ బదిలీల్లో రూ.వందల కోట్ల కుంభకోణం: నాదెండ్ల మనోహర్
-
ఏప్రిల్ 1 నుంచి ఇ-బీమా.. ఇంతకీ ఏమిటిది? ఎవరికి ప్రయోజనం?
-
కేజ్రీవాల్కు సమయం లేదు.. అందుకే ఈ ప్రయత్నాలు! : పూరి
-
టెలీకాం శాఖ పేరుతో కాల్స్ వస్తున్నాయా..? అయితే జాగ్రత్త..!