logo

నేత్ర దానంతో ఇద్దరికి కంటి చూపు

తండ్రి మరణానంతరం ఆయన నేత్రాలను దానం చేయడం ద్వారా ఇద్దరికి కంటి చూపును ప్రసాదించేందుకు పరోక్షంగా దోహదపడ్డారు మృతుని కుమారుడు జి.శ్రీనివాసరావు. ఎన్‌సీఎల్‌

Published : 07 Dec 2021 03:59 IST

మఠంపల్లి, న్యూస్‌టుడే: తండ్రి మరణానంతరం ఆయన నేత్రాలను దానం చేయడం ద్వారా ఇద్దరికి కంటి చూపును ప్రసాదించేందుకు పరోక్షంగా దోహదపడ్డారు మృతుని కుమారుడు జి.శ్రీనివాసరావు. ఎన్‌సీఎల్‌ బైసన్‌ బోర్డ్స్‌లో పనిచేస్తున్న శ్రీనివాసరావు తండ్రి జి.సైదులు అనారోగ్యంతో మఠంపల్లిలో ఆదివారం రాత్రి మృతి చెందారు. ఈ విషయాన్ని పరిశ్రమ సీఎంవో డాక్టర్‌ జె.శ్రీహరిరావు దృష్టికి తీసుకువెళ్లడంతో ఖమ్మంలోని ఐబ్యాంకు నేత్రదానం చేయాలనుకుంటున్నట్లు సమాచారం ఇచ్చారు. అక్కడి నుంచి వచ్చిన సిబ్బంది నేత్రాలను సేకరించారు. కర్మాగారం అధ్యక్షుడు ఎస్‌ చక్రధర్‌, బోర్డ్సు డివిజన్‌ వీపీ రఘువర్మ శ్రీనివాసరావును అభినందించారు. నేత్రదానంపై గ్రామీణులకు అవగాహన కల్పిస్తున్నట్లు సీఎంవో చెప్పారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని