చెదరని చిత్రం
యువత నయా ట్రెండ్ సృష్టించే పనిలో నిమగ్నమయ్యారు. పది మందిలో ప్రత్యేకంగా కనిపించడానికి శాశ్వత, తాత్కాలిక టాటూలను వేయించుకుంటున్నారు. పచ్చబొట్టంటే ఇనుప సూదులు..ఆకు పసర్లు వినియోగించే
పచ్చ బొట్టుపై యువత ఆసక్తి
నల్గొండ పురపాలిక, న్యూస్టుడే: యువత నయా ట్రెండ్ సృష్టించే పనిలో నిమగ్నమయ్యారు. పది మందిలో ప్రత్యేకంగా కనిపించడానికి శాశ్వత, తాత్కాలిక టాటూలను వేయించుకుంటున్నారు. పచ్చబొట్టంటే ఇనుప సూదులు..ఆకు పసర్లు వినియోగించే విధానం పాత మాటైతే.. చర్మానికి ఇబ్బంది లేకుండా దాని స్వభావాన్ని బట్టి ఆధునిక పద్ధతిలో వేసేది కొత్త ట్రెండ్. తమకు నచ్చిన మెచ్చిన డిజైన్లు, పువ్వులు, పక్షులు, జంతువుల రూపాలతో పాటు జీవిత కాలంపాటు స్నేహితులు, ఆత్మీయులు, తల్లితండ్రులు గుర్తుండే విధంగా వారి పేర్లను పచ్చబొట్ల రూపంలో చిత్రాలను అచ్చు వేయించుకొని యువత ఆనంద పడుతున్నారు. సందర్శకులు ఎక్కువగా వచ్చే తిరునాళ్లు, జాతర్లను లక్ష్యంగా చేసుకుని ఈ దుకాణాలు ఏర్పాటవుతున్నాయి. నల్గొండలో జరుగుతున్న ఉర్సు ఉత్సవాలను వేదికగా చేసుకుని దుకాణాలు ఏర్పాటు ఊపందుకుంది. బయట దుకాణాల్లో తాత్కాలిక పచ్చబొట్టు ధర కేవలం రూ. 100 నుంచి రూ.200 లోపు ఉండగా ఉర్సులో మాత్రం శాశ్వతపచ్చబొట్లకు డిజైన్ సైజును అనుసరించి రూ. 50 నుంచి రూ.250 వరకు తీసుకుంటున్నారు. ప్రస్తుతం శాశ్వత టాటూలతోపాటు తాత్కాలికమైనవి అందుబాటులోకి వచ్చాయి. ఇవి ఒకటీరెండ్రోజుల పాటు మాత్రమే ఉంటాయి. సబ్బుతో గట్టిగా కడిగేస్తే పోతాయి. వీటిపై యువత అధికంగా మక్కువ చూపిస్తున్నారు. శాశ్వత టాటూ వేయించుకోవాలనుకునేవారు ముందు తాత్కాలిక ముద్రను ప్రయత్నించి నచ్చితే శాశ్వతంగా పచ్చబొట్టు వేయించుకుంటున్నారు. గ్రామీణ ప్రాంతాల నుంచి పట్టణాలకు వచ్చే యువత ఎక్కువగా శాశ్వత పచ్చబొట్లను ఇష్టపడుతున్నారు. చేతులు, ఇతర శరీర భాగాలపై గాట్లు, ఇతర గాయాల తాలుక మచ్చలు కనిపించకుండా డిజైన్లతో పచ్చరంగుతో మాత్రమే కాకుండా నలుపు, పసుపు, ఎరుపు ఇలా విభిన్నమైన రంగులతో టాటూ వేయించుకుంటున్నారు. యువతులైతే తల్లి,తండ్రి నచ్చిన స్నేహితుల పేర్లు, పువ్వులు, సీతకోక చిలుకలు వంటి చిత్రాలను ఎక్కువగా వేయించుకోవడానికి ఇష్టపడుతున్నారు. యువకులు మాత్రం తల్లితండ్రుల పేర్లతో పాటు విభిన్నమైన కత్తులు, పుర్రెలు, మృగాలు, స్టార్ వంటి చిత్రాలను అచ్చు వేయించుకుంటున్నారు.
అభిరుచికి తగ్గట్టు
-వెంకట్, టాటూ డిజైనర్
యువత అభిరుచికి తగ్గట్టు టాటూలు వేస్తున్నాం. వారు ఎక్కువగా టాటూస్ ట్రెండ్ అనుసరిస్తున్నారు. పచ్చబొట్టులో వాడే సిరా, సూదులు ఇతర పరికరాలు విదేశాల నుంచి తెప్పించాం. యువత ఎక్కువగా చేతులు, మెడ భాగాలపై టాటూలు వేయించుకుంటున్నారు. శరీర స్వభావాన్ని బట్టి దానికి ఏ సూదీ అయితే సరిపోతుందో పరీక్షించి దానినే ఎంచుకుంటున్నాం. నల్గొండ ప్రజలు ఎక్కువ ప్రేమాభిమానానికి సంబంధించిన చిత్రాలు, సినీ స్టార్స్, సీతాకోక చిలుక వంటి టాటూలపై మక్కువ చూపిస్తున్నారు.
అమ్మానాన్నపై ప్రేమతో..
-మహేశ్, నాగార్జున డిగ్రీ కళాశాల, నల్గొండ
కనిపెంచిన తల్లితండ్రులపై ప్రేమ మసకబారకుండా ఎప్పుడు గుర్తుండేలా చేతిపై అమ్మానాన్న అంటూ టాటూ వేయించుకున్నా. నేను ఇంటి నుంచి ఇతర ప్రాంతాలకు వెళ్లినా టాటూ చూస్తున్నంత సేపు తల్లిదండ్రులు నా వెంటే ఉన్నట్లు అనుభూతి కల్గుతోంది. అందుకే ప్రేమను పదిలంగా ఉంచుకోవడానికి టాటూ వేయించుకున్నా.
పచ్చబొట్టుతో ఇబ్బంది లేదు
-డా. అనితారాణి, చర్మవ్యాధుల నిపుణురాలు
నల్గొండ అర్బన్: శరీరంపై పచ్చబొట్టు వేసుకోవడం వల్ల ఎలాంటి ఇబ్బంది ఉండదు. చర్మం లోపలికి, చర్మం పైపైన పచ్చబొట్లు వేస్తుంటారు. చర్మం పైపైన వేసే వాటితో ఎలాంటి సమస్యలుండవు. చర్మం లోపలికి దిగేలా వేసే పచ్చబొట్టు కొందరికి వికటించే అవకాశాలుంటాయి. అలాంటి వారు వాటికి దూరంగా ఉండటం మంచింది. పచ్చ బొట్టు అనేది ఒక్కసారి శరీరంపై వేసుకోవడం ద్వారా తిరిగి తొలగించడం సులభం కాదు. తొలగించాలనుకుంటే లేజర్ శస్త్రచికిత్సలు చేయించుకోవాల్సి ఉంటుంది. ఇటీవల యువతలో పచ్చబొట్టు వేసుకోవడానికి ఆసక్తి చూపుతున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
నామినేషన్ దాఖలు చేసిన బూర నర్సయ్య గౌడ్
[ 23-04-2024]
భువనగిరి పార్లమెంట్ నియోజకవర్గం అభ్యర్థిగా బూర నర్సయ్య గౌడ్ తమ నామినేషన్ పత్రాన్ని రిటర్నింగ్ అధికారి హనుమంతు కే జండగేకు మంగళవారం అందజేశారు. -
కేసీఆర్ రోడ్ షోను జయప్రదం చేయాలి: క్యామ మల్లేష్
[ 23-04-2024]
పార్లమెంట్ ఎన్నికల్లో భాగంగా ఈ నెల 25న జరిగే మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ రోడ్ షోను జయప్రదం చేయాలని భువనగిరి ఎంపీ అభ్యర్థి క్యామ మల్లేష్.. నాయకులు, కార్యకర్తలకు పిలుపునిచ్చారు. -
మోదీ హయాంలో దేశం అభివృద్ధి చెందింది: భాజపా
[ 23-04-2024]
భువనగిరి పార్లమెంట్ నియోజకవర్గ భాజపా అభ్యర్థి బూర నర్సయ్య గౌడ్కు మద్దతుగా పట్టణంలో ర్యాలీ నిర్వహించారు. -
సీపీఎం అభ్యర్థి ఎండీ జహంగీర్ను గెలిపిద్దాం
[ 23-04-2024]
భువనగిరి పట్టణ కేంద్రంలోని తారక రామ్ నగర్లో ఇంటింటి ప్రచార కార్యక్రమం నిర్వహించారు. -
భువనగిరిలో హనుమాన్ శోభయాత్ర ర్యాలీ
[ 23-04-2024]
హనుమాన్ జయంతి పురస్కరించుకొని భువనగిరి పట్టణంలో బజరంగ్దళ్ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. -
పతాక స్థాయికి ప్రచారం
[ 23-04-2024]
లోక్సభ ఎన్నికల ప్రచారం ఉమ్మడి నల్గొండ జిల్లాలో పతాక స్థాయికి చేరింది. భువనగిరి లోక్సభ కాంగ్రెస్ అభ్యర్థి చామల కిరణ్కుమార్రెడ్డికి మద్దతుగా ఆదివారం భువనగిరి పట్టణంలో -
కుటుంబ పాలనను తరిమికొట్టాలి
[ 23-04-2024]
ఉమ్మడి నల్గొండ జిల్లాకు మంత్రులు ఉత్తమ్, కోమటిరెడ్డి కుటుంబాలతో పాటూ జానారెడ్డి కుటుంబం చేసిందేమీ లేదని కామారెడ్డి ఎమ్మెల్యే కాటేపల్లి వెంకటరమణారెడ్డి విమర్శించారు. -
అనర్థం.. చెత్తలో బయో వ్యర్థం
[ 23-04-2024]
నల్గొండ జిల్లా పరిషత్తు, న్యూస్టుడే: ఆసుపత్రుల్లో జాగ్రత్తలు తీసుకునే వైద్యులు తమ ఆసుపత్రుల నుంచి వెలువడే వ్యర్థాలను మాత్రం నిర్లక్ష్యం చేస్తున్నారు. -
విత్తనం.. ఎవరిదీ పెత్తనం
[ 23-04-2024]
వరి విత్తనాలకు ప్రభుత్వం రాయితీ ఇవ్వడం లేదు. రైతన్నలపై విత్తన భారం పడుతోంది. రాష్ట్ర ప్రభుత్వం పరిశోధనా స్థానాలు, ఐఆర్ఆర్, ఐసీఏఆర్ తదితర కేంద్ర సంస్థల నుంచి విడుదలైన విత్తన రకాలనే సరఫరా చేస్తుంది. -
భగభగ మండే
[ 23-04-2024]
విపరీతమైన ఎండలకు మిర్యాలగూడ ప్రాంతం మాడిపోతోంది. సోమవారం మండల పరిధిలోని టీక్యాతండాలో రాష్ట్రంలోనే అత్యధిక ఉష్ణోగ్రత 45 డిగ్రీలు నమోదైంది. -
కరదీపిక.. సందేహాల నివృత్తికి వేదిక
[ 23-04-2024]
ఎన్నికల నిర్వహణలో పోలింగ్ విధులు నిర్వర్తించే అధికారుల పాత్ర కీలకం. ఉమ్మడి నల్గొండ జిల్లాలో నల్గొండ, భువనగిరి లోక్సభ నియోజకవర్గాల్లో నామపత్రాల స్వీకరణ -
పేదల హృదయాల్లో నిలిచె
[ 23-04-2024]
ప్రజాభీష్టంతో మూడు పర్యాయాలు నాటి మిర్యాలగూడ ఎంపీగా ఎన్నికై, పేదల అభ్యున్నతికి పాటుపడిన దివంగత జీఎస్ రెడ్డి(గోపు శౌరెడ్డి).. -
ఈవీఎంలకు 35 ఏళ్లు
[ 23-04-2024]
ఎన్నికల ప్రక్రియలో ఈవీఎంల పాత్ర అత్యంత ముఖ్యం. ఈ యంత్రం తొలుత వినియోగం, పుట్టు పూర్వోత్తరాలను పరిశీలించినట్లైతే.. -
అక్షరంతో సహవాసం.. వ్యక్తిత్వ వికాసం
[ 23-04-2024]
వ్యక్తి వికాసానికి, సమాజ చైతన్యానికి పుస్తకాలే ఆధారం. గతించిన కాలాన్ని భవిష్యత్ తరాలకు తెలియజేసే సాధనం పుస్తకం. పుస్తకాలను స్నేహితులుగా భావిస్తారు. -
జీవితంలో పాస్ అవుదాం..!
[ 23-04-2024]
పదో తరగతి, ఇంటర్, డిగ్రీ పరీక్షల్లో ఫెయిలయ్యామంటూ.. మార్కులు తక్కువ వచ్చాయంటూ.. పోటీ పరీక్షల్లో సీట్లు రాలేదంటూ.. ఏటా పలువురు విద్యార్థులు బలవన్మరణాలకు పాల్పడుతున్న తరుణంలో.. -
నిర్మాణాల్లో.. అమలు కాని నిబంధనలు
[ 23-04-2024]
ఆలేరు పురపాలికగా ఏర్పడ్డాక ఏటా వందకు పైగా ఇళ్ల నిర్మాణాల అనుమతుల కోసం దరఖాస్తులు వస్తున్నాయి. కొత్త పురపాలిక చట్టం అమలులోకి వచ్చాక నిర్మాణాల అనుమతుల నిబంధనలు కఠినతరం చేశారు. -
బాలుడు మరణించిన 10 రోజులకు తండ్రి ఫిర్యాదు
[ 23-04-2024]
సంపులో పడి 22 నెలల బాలుడు మృతి చెందిన ఘటన మండలంలోని రెడ్డినాయక్తండాలో ఈ నెల 11న చోటు చేసుకుంది. -
ఎన్నికలయ్యే వరకు అప్రమత్తంగా ఉండండి: కలెక్టర్
[ 23-04-2024]
పోలింగ్ ప్రక్రియ ముగిసేంత వరకు ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉంటూ విధులు నిర్వర్తించాలని జిల్లా కలెక్టర్, ఎన్నికల అధికారి వెంకటరావు అన్నారు.
తాజా వార్తలు (Latest News)
-
దీదీకి ఆ ధైర్యం లేదు: అమిత్ షా
-
ఆడిషన్ అంటూ పది మందిని ముద్దు పెట్టుకోమన్నారు: స్టార్ హీరోయిన్
-
గుంపులో స్మార్ట్ఫోన్లు కొట్టేస్తే.. చిన్న ట్రిక్తో పట్టేశాడు..!
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5 PM
-
రివ్యూ: ఆర్టికల్ 370.. యామి గౌతమ్, ప్రియమణి నటించిన పొలిటికల్ థ్రిల్లర్ ఎలా ఉంది?
-
మద్యం మత్తులో విమాన సిబ్బందిపై ప్రయాణికుడి దాడి