సర్కారు భూమి.. సమర్పయామి
కృష్ణపట్టి మండలాలు దామరచర్ల, అడవిదేవులపల్లిలో 24వేల ఎకరాల ప్రభుత్వ భూములున్నాయి. ఉన్నతాధికారుల పర్యవేక్షణ కొరవడటంతో వీటిని కొందరు ఆక్రమిస్తున్నారు. నిబంధనలకు విరుద్ధంగా 15 ఏళ్లుగా రెవెన్యూ అధికారులు పాసుపుస్తకాలు జారీ చేయడంతో వాటిని అడ్డుపెట్టుకుని వేలాది ఎకరాల భూములను కొందరు సాగులోకి తెచ్చారు. కొంతమంది స్వాధీనంలో వందలాది ఎకరాలున్నాయి. గతంలో ప్రభుత్వ భూములకు మించి భూయాజమాన్య హక్కు పుస్తకాలు ఉండటంతో సమగ్ర భూసర్వే సమయంలో వీటిని పార్ట్-బీలో ఉంచారు. వీటిలో ప్రస్తుతం 22 వేల ఎకరాలు సాగులో ఉన్నాయని అధికారులు...
దామరచర్ల, న్యూస్టుడే: కృష్ణపట్టి మండలాలు దామరచర్ల, అడవిదేవులపల్లిలో 24వేల ఎకరాల ప్రభుత్వ భూములున్నాయి. ఉన్నతాధికారుల పర్యవేక్షణ కొరవడటంతో వీటిని కొందరు ఆక్రమిస్తున్నారు. నిబంధనలకు విరుద్ధంగా 15 ఏళ్లుగా రెవెన్యూ అధికారులు పాసుపుస్తకాలు జారీ చేయడంతో వాటిని అడ్డుపెట్టుకుని వేలాది ఎకరాల భూములను కొందరు సాగులోకి తెచ్చారు. కొంతమంది స్వాధీనంలో వందలాది ఎకరాలున్నాయి. గతంలో ప్రభుత్వ భూములకు మించి భూయాజమాన్య హక్కు పుస్తకాలు ఉండటంతో సమగ్ర భూసర్వే సమయంలో వీటిని పార్ట్-బీలో ఉంచారు. వీటిలో ప్రస్తుతం 22 వేల ఎకరాలు సాగులో ఉన్నాయని అధికారులు గుర్తించారు. సమగ్ర భూసర్వే అనంతరం రెండేళ్ల క్రితం సుమారు 5 వేల ఎకరాల భూములను ధరణి పోర్టల్లో నమోదు చేసి సాగుదారులకు పాసుపుస్తకాలు ఇచ్చారు.
క్షేత్రస్థాయిలో విచారణ
ఆయా గ్రామాల్లో భూముల ఆక్రమణలపై అడవిదేవులపల్లి మండలానికి చెందిన కొందరి ఫిర్యాదు మేరకు రెండు రోజుల క్రితం ఆర్డీవో క్షేత్రస్థాయిలో విచారణ జరిపారు. ఉల్సాయిపాలెం, మొల్కచర్ల, బాలెంపల్లి, చిట్యాలలో ప్రభుత్వ భూములు పలువురి ఆక్రమణలో ఉన్నట్లు గుర్తించారు. మండల కేంద్రంలో సర్వే నంబరు 25లో అక్రమ కట్టడాల నిర్మాణదారులకు తాఖీదులు జారీ చేయాలని నిర్ణయించారు.
అక్రమ పట్టాల రద్దు
వాడపల్లి, ఇర్కిగూడెం, టీవీగూడెం, కొత్తపల్లి, ముదిమాణిక్యం రెవెన్యూ గ్రామాల పరిధిలోని ప్రభుత్వ భూముల్లో నాపరాయి క్వారీలు ఉన్నాయి. వీటిపై లీజు హక్కులు పొందినవారు పక్కనున్న వందల ఎకరాలను ఆక్రమించుకున్నారు. ప్రభుత్వ భూములను అక్రమంగా ధరణిలో నమోదు చేసి పట్టాపాసుపుస్తకాలు ఇచ్చినట్లు తేలడంతో గతేడాది కేశవాపురం వీఆర్వోపై అధికారులు సస్పెన్షన్ వేటు వేశారు. కొన్ని గ్రామాల్లో ప్రభుత్వ భూములపై స్వాతంత్య్ర సమరయోధుల పేరిట పట్టాలు సృష్టించగా వాటినీ రద్దు చేశారు.
నోటీసులు జారీ చేస్తున్నాం
-బి.రోహిత్సింగ్, ఆర్డీవో, మిర్యాలగూడ
అడవిదేవులపల్లి మండలంలో ప్రభుత్వ స్థలాల ఆక్రమణలపై అందిన ఫిర్యాదు ఆధారంగా క్షేత్రస్థాయిలో విచారణ జరిపాం. ఆక్రమణదారులకు నోటీసులు జారీ చేస్తున్నాం. వాస్తవ పరిస్థితులను ప్రభుత్వానికి నివేదించాం. తదుపరి ఆదేశాలకనుగుణంగా చర్యలు తీసుకుంటాం.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
నీటిలోని చేపొచ్చి.. నేలమీద పడుతోంది..!
[ 28-03-2024]
తగ్గుతున్న భూగర్భ జలాలతో రైతులతో పాటు మత్స్యకారులు నష్టపోతున్నారు. ఉమ్మడి జిల్లాలోని చెరువుల నీటిమట్టాలు రోజురోజుకూ తగ్గుముఖం పడుతున్నాయి. దీంతో చెరువుల్లోని చేపలు తగినంత పరిమాణం పెరగక ముందే పట్టేసి విక్రయించాల్సిన దుస్థితి నెలకొంది. -
వారివి చుట్టపు చూపులే..!
[ 28-03-2024]
గ్రామ పంచాయతీల్లో ప్రత్యేకాధికారుల పాలన అస్తవ్యస్తంగా మారింది. ఎంపీడీవోలు, పంచాయతీరాజ్, నీటిపారుదల, పశుసంవర్థక,రెవెన్యూ, విద్యాశాఖాధికారులను క్లస్టర్ల వారీగా ప్రత్యేకాధికారులుగా ప్రభుత్వం నియమించింది. -
కోడిపిల్లల అరుపు.. వినిపించదేం..!
[ 28-03-2024]
ఉమ్మడి జిల్లా నుంచి కొందరు రాయితీ కోడి పిల్లల పథకానికి దరఖాస్తు చేసుకున్నారు. ఏడాది క్రితం రూ.1030, రూ.600 చొప్పున డీడీలు తీశారు. అప్పటి నుంచి పశుసంవర్ధక శాఖ అధికారుల చుట్టూ తిరుగుతున్నా.. -
నేటి నుంచి ధాన్యం కొనుగోళ్లు: అదనపు కలెక్టర్
[ 28-03-2024]
ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో మౌలిక సదుపాయాలు కల్పించాలని రెవెన్యూ అదనపు కలెక్టర్ శ్రీనివాస్ తెలిపారు. జిల్లాలో యాసంగి ధాన్యం కొనుగోలు కేంద్రాలు గురువారం నుంచి ప్రారంభించేందుకు సిద్ధంగా ఉన్నట్లు చెప్పారు. -
పురంలో.. దాహం తీరేలా..!
[ 28-03-2024]
ఉమ్మడి నల్గొండ జిల్లాలోని పురపాలికల్లో ప్రజల దాహార్తిని తీర్చేందుకు అమృత్-2.0 పథకం కింద కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల భాగసామ్యంతో రూ.491.46 కోట్లతో చేపట్టనున్న పనులకు సెప్టెంబరు 2023లో రాష్ట్ర పురపాలకశాఖ పరిపాలనా అనుమతి మంజూరు చేసింది. -
దగా ఆలోచనలపై.. నిఘా
[ 28-03-2024]
గత అసెంబ్లీ ఎన్నిల సందర్భంగా 28 ఏళ్ల యువకుడు భువనగిరి నియోజకవర్గంలో ప్రధాన పార్టీ అభ్యర్థికి సంబంధించిన అభ్యంతరకరమైన వీడియోను సృష్టించి సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేశాడు. -
గ్రామాల్లో డ్రోన్ కలకలం
[ 28-03-2024]
యాదాద్రి భువనగిరి జిల్లా గుండాల మండలంలోని పాచిల్ల, తుర్కలషాపురం, రామారం, వంగాల, గుండాల గ్రామాల మీదుగా నిత్యం డ్రోన్లు ఎగురవేస్తుండటంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. -
ఆట కట్టించలేరా..?
[ 28-03-2024]
జిల్లాలో జూదం జోరుకు కళ్లెం పడటం లేదు. పచ్చని కాపురాల్లో ఈ ఆట చిచ్చుపెడుతోంది. పోలీసుల దాడులకూ వెరవడం లేదు. ఈ నెల 16న ‘ఈనాడు’లో ప్రచురితమైన ‘తోటలో కాసుల వేట’... -
చివరికి అందేలా..ఆశలు నెరవేరేలా..!
[ 28-03-2024]
కొత్త ప్రభుత్వం ముక్త్యాల బ్రాంచి కాలువ పనులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. నాగార్జునసాగర్ ఎడమ కాలువ పరిధిలోని అతిపెద్ద బ్రాంచి కాలువ అయిన ముక్త్యాలకు ఆధునికీకరణ పనులు మళ్లీ మొదలయ్యాయి. -
వాడే ముందు జాగ్రత్త
[ 28-03-2024]
రోడ్డు ప్రమాదంలో కోదాడ పట్టణానికి చెందిన ఓ వ్యక్తి కాలికి స్వల్ప గాయమవడంతో పట్టణంలోని ఓ ఆస్పత్రికి వెళ్లారు. అక్కడ కాలపరిమితి దాటిన బ్యాండేజీ కాలుకి కట్టడంతో వాపు తగ్గలేదు. -
బంధం ఎందుకో.. బలహీన పడుతోంది
[ 28-03-2024]
వివాహేతర సంబంధం, వేధింపులు.. కారణం ఏదైనా కడదాక కలిసి ఉంటామని పెళ్లి మండపంలో ప్రమాణం చేసిన కొందరు మహిళలు కట్టుకున్న భర్తలను అర్ధంతరంగా కానరాని లోకాలకు పంపేస్తున్నారు. -
ప్రచార అనుమతులకు సువిధ
[ 28-03-2024]
ఓటింగ్ ప్రక్రియను సులభతరం చేయడంతో పాటు సాంకేతికతను ఉపయోగించడం ద్వారా సమయాన్ని ఆదా చేయడంతో పాటు ఎన్నికలు పారదర్శకంగా నిర్వహించేందుకు ఎన్నికల సంఘం ప్రత్యేక చర్యలు చేపడుతోంది. -
సాఫ్ట్గా రాణిస్తూ.. పతకాలు కొట్టేస్తూ..!
[ 28-03-2024]
గ్రామీణ ప్రాంతాల వారికి కబడ్డీ, ఖో ఖో, వాలీబాల్ లాంటి ఆటలు మాత్రమే ఎక్కువగా పరిచయం. సాఫ్ట్బాల్ క్రీడ చాలామందికి కొత్తదే. అయినప్పటికీ పల్లెల్లో దశాబ్దకాలంగా విద్యార్థులు ఈ క్రీడపై ఆసక్తి కనబర్చుతున్నారు. -
భువనగిరి బరిలో చామల
[ 28-03-2024]
ఎడతెగని ఉత్కంఠ నడుమ అధికార కాంగ్రెస్ పార్టీ తమ భువనగిరి లోక్సభ ఎంపీ అభ్యర్థిగా చామల కిరణ్కుమార్రెడ్డిని ప్రకటించింది. ఆయన ఇక్కడి నుంచి ఎంపీగా పోటీ చేయడం ఇదే తొలిసారి.
తాజా వార్తలు (Latest News)
-
భారత సరిహద్దులు పూర్తి సురక్షితం - రాజ్నాథ్ సింగ్
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5 PM
-
మహబూబ్నగర్ ఎమ్మెల్సీ ఉప ఎన్నికలో 99.86 శాతం పోలింగ్
-
పుష్ప3’ టైటిల్ ఇదేనా.. వైరలవుతోన్న న్యూస్!
-
పరిశ్రమలు తెచ్చి కొడంగల్ను అభివృద్ధి చేస్తా: సీఎం రేవంత్
-
ఆ హంతకులకు, జగన్కు ఓటు వేయొద్దు: వివేకా కుమార్తె సునీత