logo

కల్యాణం..రమణీయం

ధనుర్మాస వేడుకల్లో భాగంగా కొనసాగిన తిరుప్పావై వేడుకలను వేకువజామున నిర్వహించి రాత్రి వేళ బాలాలయ మండపంలో గోదాదేవి రంగనాథుల కల్యాణోత్సవాన్ని ఆలయ ఆచారంగా నిర్వహించారు.

Published : 15 Jan 2022 03:48 IST

యాదాద్రి పాతగుట్ట ఆలయంలో అధ్యయనోత్సవాల్లో భాగంగా గోవర్ధనగిరిధారి అలంకరణలో స్వామివారు

యాదగిరిగుట్ట, న్యూస్‌టుడే: ధనుర్మాస వేడుకల్లో భాగంగా కొనసాగిన తిరుప్పావై వేడుకలను వేకువజామున నిర్వహించి రాత్రి వేళ బాలాలయ మండపంలో గోదాదేవి రంగనాథుల కల్యాణోత్సవాన్ని ఆలయ ఆచారంగా నిర్వహించారు. శాస్త్రోక్త పర్వాల మధ్య పండితుల వేదం.. పూజారుల మంత్రం.. రుత్వికుల పర్వాల మధ్య కల్యాణోత్సవాన్ని జరిపారు. అనుబంధంగా కొనసాగుతున్న పాతగుట్ట ఆలయంలోనూ గోదా కల్యాణాన్ని శుక్రవారం ఉదయం చేపట్టారు. ప్రధాన, అనుబంధ ఆలయాల్లో జరిగిన గోదాదేవి కల్యాణోత్సవంలో ఆలయ ఈవో గీతారెడ్డి, ధర్మకర్త నరసింహమూర్తి, పేష్కార్‌ రమేశ్‌బాబు, భాస్కరశర్మతో పాటు ఆలయోద్యోగులు, పూజారులు, వేదపండితులు పాల్గొన్నారు.

బాలాలయంలో గోదా రంగనాథుల పరిణయోత్సవం

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని