logo

రంగుల పరిశ్రమలో అగ్ని ప్రమాదం

జిల్లా కేంద్రం సమీపంలోని ఆర్జాలబావి వద్ద ఉన్న రేయిన్‌ రంగుల పరిశ్రమలో గురువారం రాత్రి ప్రమాదవశాత్తు విద్యుదాఘాతంతో యంత్రాలు, రంగులు దగ్ధమైనట్లు రూరల్‌ ఏఎస్సై షరీఫ్‌ తెలిపారు. పద్మనగర్‌కు చెందిన

Published : 15 Jan 2022 03:48 IST


పరిశ్రమలో దగ్ధమైన సామగ్రి

నల్గొండ నేరవిభాగం, న్యూస్‌టుడే: జిల్లా కేంద్రం సమీపంలోని ఆర్జాలబావి వద్ద ఉన్న రేయిన్‌ రంగుల పరిశ్రమలో గురువారం రాత్రి ప్రమాదవశాత్తు విద్యుదాఘాతంతో యంత్రాలు, రంగులు దగ్ధమైనట్లు రూరల్‌ ఏఎస్సై షరీఫ్‌ తెలిపారు. పద్మనగర్‌కు చెందిన కోట నర్సింహ ఆర్జాలబాయి ఇండస్ట్రీయల్‌ కాలనీలో పెయింట్‌ సంస్థ నిర్వహిస్తున్నాడు. రోజు మాదిరిగా గురువారం రాత్రి 10 గంటల తరువాత పరిశ్రమ మూసి వేసి ఇంటికి వచ్చారు. విద్యుదాఘాతంతో మంటలు చెలరేగడంతో స్థానికులు సమాచారం అందించారు. వెంటనే అక్కడికి చేరుకుని అగ్నిమాపక సిబ్బంది ద్వారా మంటలు ఆర్పించారు. సుమారు రూ.50 లక్షలకు పైగా ఆస్తి నష్టం వాటిల్లినట్లు శుక్రవారం ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఏఎస్సై చెప్పారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని