logo

వైభవంగా గోదా రంగనాథస్వామి కల్యాణం

రెండో భద్రాద్రిగా పేరుగాంచిన నల్గొండ పట్టణంలోని రామగిరిలో గల సీతారామచంద్రస్వామి ఆలయంలో శుక్రవారం రాత్రి గోదా రంగనాథస్వామి కల్యాణ మహోత్సవం వైభవంగా జరిపించారు. తమిళనాడులోని

Published : 15 Jan 2022 03:48 IST

నల్గొండ: రామగిరిలోని రామాలయంలో గోదా రంగనాథ స్వామి కల్యాణానికి హాజరైన భక్తులు

నల్గొండ కల్చరల్‌, న్యూస్‌టుడే: రెండో భద్రాద్రిగా పేరుగాంచిన నల్గొండ పట్టణంలోని రామగిరిలో గల సీతారామచంద్రస్వామి ఆలయంలో శుక్రవారం రాత్రి గోదా రంగనాథస్వామి కల్యాణ మహోత్సవం వైభవంగా జరిపించారు. తమిళనాడులోని శ్రీరంగం ఆలయం స్థానాచార్యులు పరాశర లక్ష్మీనృసింహా భట్టర్‌ స్వామి పర్యవేక్షణలో ఆలయం స్థానాచార్యులు కొమాండూరి రామరంగాచార్య ఆధ్వర్యంలో అర్చక స్వాములు అమ్మవారి కల్యాణం మహోత్సవం జరిపించారు. ఎమ్మెల్సీ రవీందర్‌రావు దంపతులు, ఎమ్మెల్యే కంచర్ల భూపాల్‌రెడ్డి దంపతులు, ఎస్పీ రెమా రాజేశ్వరి, న్యాయమూర్తి పద్మజారెడ్డి, ఆలయ ఛైర్మన్‌ చకిలం వేణుగోపాల్‌రావు దంపతులు, డీఎస్పీ వెంకటేశ్వర్‌రెడ్డి, పాలక మండలి సభ్యులు అధికారులు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. భక్తులకు అన్నదానం చేశారు.

కల్యాణంలో పాల్గొన్న అర్చకులు, పక్కనే ఎమ్మెల్యే భూపాల్‌రెడ్డి దంపతులు, ఎమ్మెల్సీ తక్కెలపల్లి రవీందర్‌రావు దంపతులు, ఎస్పీ రెమా రాజేశ్వరి

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని