స్త్రీనిధి బ్యాంకు ఏర్పాటుకు అడుగులు
మహిళల ఆర్థికాభివృద్ధికి దోహదపడేలా నల్గొండ మున్సిపాలిటీలో స్త్రీనిధి బ్యాంకు ఏర్పాటుకు మెప్మా యంత్రాంగం శ్రీకారం చుట్టింది. ఉమ్మడి జిల్లాలో అన్ని పురపాలికల్లో ఇప్పటికే ఏర్పాటు చేసి మహిళ సాధికారతకు
మహిళా సంఘాల ప్రతినిధులు
నల్గొండ పురపాలిక, న్యూస్టుడే: మహిళల ఆర్థికాభివృద్ధికి దోహదపడేలా నల్గొండ మున్సిపాలిటీలో స్త్రీనిధి బ్యాంకు ఏర్పాటుకు మెప్మా యంత్రాంగం శ్రీకారం చుట్టింది. ఉమ్మడి జిల్లాలో అన్ని పురపాలికల్లో ఇప్పటికే ఏర్పాటు చేసి మహిళ సాధికారతకు తోడ్పాటు అందిస్తుండగా నల్గొండలో మెప్మా అధికారుల నిర్లక్ష్యంతో జాప్యం నెలకొంది. పుర కమిషనర్గా బాధ్యతలు స్వీకరించిన రమణాచారి ఆదేశాల మేరకు నల్గొండ పట్టణంలో ఉన్న పొదుపు సంఘాల సభ్యులందరిని సభ్యులుగా చేర్చి బ్యాంకు ఏర్పాటు దిశగా అడుగులు పడ్డాయి.
స్త్రీ నిధి బ్యాంకు ఏర్పాటు చేస్తే నల్గొండ పట్టణంలో సుమారు 23000 మంది పొదుపు సంఘాల మహిళలకు ఆర్థిక ప్రయోజనం లభించనుంది. ఇప్పటికే బ్యాంకు ద్వారా రూ.10 లక్షల వరకు వడ్డీ లేని రుణాలు ప్రభుత్వం మంజూరు చేస్తుంది. వీటికి తోడు స్త్రీనిధి రుణాలు మంజూరైతే మహిళలు సాధికారత పొందేందుకు వెసులుబాటు లభించనుంది. బ్యాంకు రుణాలు మాత్రం సంఘానికి మంజూరు చేస్తుండగా వాటిని సభ్యులందరూ పంచుకుని ఇతర ఖర్చులు చేస్తున్నారు. అదే స్త్రీనిధి రుణాలు చిరు వ్యాపారం, ఇతరాత్ర పనులకు ఉపయోగించుకునే వారికి మాత్రమే మంజూరు చేయనున్నారు.
ఆర్పీలకు బాధ్యతలు
స్త్రీ నిధి బ్యాంకు ఏర్పాటు చేయాలంటే విధిగా కొంత మూలధనం ఉండా లి. అందులో సభ్యులందరికీ భాగస్వామం కల్పించాలి. ఇప్పటికే పట్టణ సమాఖ్యల వద్ద రూ.7 లక్షల వరకు నిధులు ఉన్నాయి. వాటితో ప్రారంభించేందుకు కొంత మంది ఆర్పీలు ఉత్సాహం చూపించినా కమిషనర్ అడ్డు చెప్పారు. సమాఖ్యల నిధులు పంచుకోవాల్సిన అవసరం లేదు. స్త్రీ నిధిలో భాగస్వాములయ్యేందుకు ఒక్కో సమాఖ్య రూ.25,000 చొప్పున మూల ధనం చెల్లించేలా చర్యలు తీసుకోవాలని మెప్మా సమన్వయకర్తలకు కమిషనర్ బాధ్యతలు అప్పగించారు. ఆర్పీలు రంగంలో దిగి మహిళా సంఘాల సభ్యులతో సంప్రదింపులు జరుపుతున్నారు.
ఈనెల చివరి నాటికి ఏర్పాటు; శ్రీనివాస్, టీఎంసీ నల్గొండ మున్సిపాలిటీ
నల్గొండ పట్టణంలో స్త్రీనిధి బ్యాంకు ఏర్పాటు చేసేందుకు చర్యలు చేపట్టాం. ఇప్పటికే రెండుసార్లు సమావేశం నిర్వహించాం. స్లమ్ ఫెడరేషన్ స్థాయిలో పొదుపు సంఘాల సభ్యులకు అవగాహన కల్పించి వారిని భాగస్వామ్యులను చేసేలా కృషి చేస్తున్నాం. ఈ నెల చివరి నాటికి స్త్రీనిధి బ్యాంకు ఏర్పాటు చేస్తాం.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
భాజపా ఓటమే లక్ష్యం: బీవీ రాఘవులు
[ 19-04-2024]
భాజపా మతోన్మాద విధానాలను ఎదిరించి పోరాడేందుకు సీపీఎం పోటీ చేస్తుందిని పోలిట్ బ్యూరో సభ్యుడు బీవీ రాఘవులు అన్నారు. -
దాహం కేకలు తీర్చేందుకు...తరలి వస్తున్న కృష్ణమ్మ
[ 19-04-2024]
నాగార్జునసాగర్ జలాశయం డెడ్స్టోరేజీ దిగువకు చేరినా వేసవిలో హైదరాబాద్ జంట నగరాలు, జిల్లా వాసుల దాహం కేకలు తీర్చేందుకు కృష్ణాజలాల సరఫరాకు హెచ్ఎండబ్ల్యూఎస్ఎస్బీ (జలమండలి) అధికారులు చేపడుతున్న చర్యలు సఫలీకృతమయ్యాయి -
సైబర్ బాధితులకు వారియర్స్ తోడు
[ 19-04-2024]
చరవాణుల ద్వారా డిజిటల్ లావాదేవీలు పెరగడంతో నిత్యం ఎక్కడో చోట అమాయకులు సైబర్ నేరగాళ్ల వలలో పడి ఆర్థికంగా నష్టపోతున్నారు. -
రాష్ట్రంలోనే ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దుతా: మంత్రి ఉత్తమ్
[ 19-04-2024]
కోదాడ నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసి రాష్ట్రంలోనే ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దుతానని నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి అన్నారు. -
గాడితప్పిన గస్తీ
[ 19-04-2024]
జిల్లాలో దొంగలు రెచ్చిపోతున్నారు. వరుసగా గొలుసు చోరీలకు పాల్పడుతున్నారు. నిఘా పటిష్ఠం చేసి దొంగలను పట్టుకోవడంలో పోలీసులు విఫలమవుతున్నారు. -
ఆలయ భద్రతపై ఇంత నిర్లక్ష్యమా!
[ 19-04-2024]
యాదాద్రి పుణ్యక్షేత్రాన్ని నిత్యం వేల సంఖ్యలో భక్తులు సందర్శిస్తుంటారు. ఆలయంలోకి ప్రవేశించే ప్రతి ఒక్కరిని క్షుణ్ణంగా తనిఖీ చేసిన తరువాతే లోనికి అనుమతించేందుకు బ్యాగేజ్ స్కానింగ్, మెటల్ డిటెక్టర్, తదితర భద్రతా పరికరాలను వైటీడీఏ కొనుగోలు చేసింది. -
భక్తవత్సలుడికి సంప్రదాయ ఆరాధనలు
[ 19-04-2024]
యాదాద్రి పుణ్యక్షేత్రంలో గురువారం స్వయంభువులైన పంచనారసింహులను ఆరాధిస్తూ చేపట్టిన నిత్య పూజలు ఆలయ ఆచారంగా కొనసాగాయి -
కేసీఆర్కు సీఎం రేవంత్రెడ్డే సరైనోడు: రాజగోపాల్రెడ్డి
[ 19-04-2024]
తెలంగాణ ఇచ్చిన పదేళ్ల తర్వాత కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందని.. ఆలస్యం అయినా ప్రవేశపెట్టిన పథకాలను నెరవేర్చి.. రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలోకి తీసుకెళ్తామని భువనగిరి లోక్సభ ఇన్ఛార్జి, స్థానిక ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి అన్నారు. -
నాయకులొస్తున్నారు..!
[ 19-04-2024]
ఉమ్మడి జిల్లాలోని రెండు లోక్సభ స్థానాలైన నల్గొండ, భువనగిరిలో నామినేషన్ దాఖలు సందర్భంగా భారీ ఎత్తున ర్యాలీలు, సభలు నిర్వహించాలని అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష పార్టీలు భారాస, భాజపాలు నిర్ణయించాయి -
67 ఏళ్లలో 69 శాతమే!
[ 19-04-2024]
నల్గొండ లోక్సభ నియోజకవర్గం 1952లో ఏర్పడగా.. 2019 వరకు 17 సార్లు ఎన్నికలు జరిగాయి. 2019 నాటికి నియోజకవర్గానికి తొలి ఎన్నికలు జరిగి 67 ఏళ్లు గడిచాయి -
నల్గొండలో నలుగురు, భువనగిరిలో ముగ్గురు
[ 19-04-2024]
లోక్సభ ఎన్నికలకు నామినేషన్ల పర్వం మొదలైంది. తొలి రోజు గురువారం నల్గొండ లోక్సభ స్థానానికి నలుగురు అభ్యర్థులు ఆరు సెట్లు నామినేషన్లను రిటర్నింగ్ అధికారి, నల్గొండ జిల్లా కలెక్టరు హరిచందనకు అందజేశారు. -
నల్గొండ.. నాయకులకు అండ!
[ 19-04-2024]
నల్గొండ లోక్సభ నియోజకవర్గానికి 18వ సారి ఎన్నికలు జరుగనున్నాయి. ఉమ్మడి జిల్లాలో తొలిసారి ఏర్పడిన ఏకైక లోక్సభ నియోజకవర్గం నల్గొండ మాత్రమే. -
పార్లమెంటు.. ఎంపీ అంటే తెలుసా
[ 19-04-2024]
లోక్సభ ఎన్నికలకు సమయం దగ్గరపడుతోంది. ఇప్పటికే ప్రధాన పార్టీల అభ్యర్థులు తమదైన శైలిలో సమావేశాలు నిర్వహిస్తూ ఓటర్లను మచ్చిక చేసుకునే ప్రయత్నంలో ఉన్నారు -
వ్యాను ఢీకొని రైతు మృతి
[ 19-04-2024]
ద్విచక్రవాహనాన్ని వ్యాను ఢీకొనడంతో రైతు మృతి చెందిన ఘటన మఠంపల్లి మండలం రఘునాథపాలెం పరిధిలోని వెంకటాయపాలెంలో గురువారం జరిగింది. -
ఇంటి మీద.. అవార్డుల పంట
[ 19-04-2024]
మిద్దె తోటలు.. ఆరోగ్యానికి ఉపయోగపడే కూరగాయలతో పాటు పురస్కారాలనూ తీసుకొస్తున్నాయి.
తాజా వార్తలు (Latest News)
-
‘ప్రేమలు 2’ ఫిక్స్.. రిలీజ్ ఎప్పుడంటే?
-
వేసవి రద్దీకి రైల్వే సిద్ధం.. రికార్డు స్థాయిలో 9,111 అదనపు ట్రిప్పులు!
-
20లక్షల ఉద్యోగాలు ఇచ్చే బాధ్యత నాది: చంద్రబాబు
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM
-
కాంగ్రెస్ ఎన్నికల ప్రచారంలో షారూఖ్ ఖాన్ ?... భాజపా అభ్యంతరం
-
హైదరాబాద్ శివారులో వర్ష బీభత్సం.. శ్రీశైలం హైవేపై ట్రాఫిక్ జామ్