బహుజనులకు అండగా ెకేసీఆర్: బడుగుల
బడుగు బలహీన వర్గాల ప్రజలను అభివృద్ధి బాటలో తీసుకెళ్లడానికి సీఎం కేసీఆర్ అండగా ఉంటూ అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారని రాజ్యసభ సభ్యులు బడుగుల లింగయ్య యాదవ్ అన్నారు. గొర్రెల మేకల పెంపకం దారుల అబివృద్ధి సంస్థ ఛైర్మన్గా ఎంపికైన డాక్టర్ దూదిమెట్ల బాలరాజు యాదవ్
దూదిమెట్ల బాలరాజు యాదవ్ను సన్మానిస్తున్న ఎంపీ బడుగుల లింగయ్య యాదవ్, పక్కన డీసీఎంఎస్ ఛైర్మన్ వట్టె జానయ్య, తదితరులు
నీలగిరి, న్యూస్టుడే: బడుగు బలహీన వర్గాల ప్రజలను అభివృద్ధి బాటలో తీసుకెళ్లడానికి సీఎం కేసీఆర్ అండగా ఉంటూ అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారని రాజ్యసభ సభ్యులు బడుగుల లింగయ్య యాదవ్ అన్నారు. గొర్రెల మేకల పెంపకం దారుల అబివృద్ధి సంస్థ ఛైర్మన్గా ఎంపికైన డాక్టర్ దూదిమెట్ల బాలరాజు యాదవ్ ఆత్మీయ సన్మానం ఆదివారం స్థానిక యాదవ సంఘం భవన్లో జరిగింది. ఈ సందర్భంగా బడుగుల మాట్లాడుతూ.. ప్రతి కుటుంబానికి ఒక పథకం అందేలా కేసీఆర్ కృషి చేశారని చెప్పారు. జిల్లాలో యాదవులకు మంచి ప్రాధాన్యత ఇచ్చారని చెప్పారు. బాలరాజు యాదవ్ మాట్లాడుతూ విద్యార్థి ఉద్యమంలో తనను గుర్తించిన సీఎం తనకు పదవి అప్పగించారని చెప్పారు. తనపై ఉంచిన నమ్మకాన్ని వమ్ముచేయకుండా గొర్రెల మేకల పెంపకం దారుల సమస్యలు పరిష్కరిస్తానని చెప్పారు. కార్యక్రమంలో యాదవ సంఘం జిల్లా అధ్యక్షుడు లోడంగి గోవర్థన్, డీసీఎంఎస్ ఛైర్మన్ వట్టె జానయ్య, ఉద్యోగుల సంఘం రాష్ట్ర నాయకుడు బొబ్బల గోపాలకృష్ణ, జిల్లా అధ్యక్షుడు తరాల పరమేశ్యాదవ్, నాయకులు తండు శ్రీనివాస్ యాదవ్, చీర పంకజ్యాదవ్, పల్ల్లెబోయిన కాశీరాములు యాదవ్, కొలగాని పర్వతాలు యాదవ్, సోమనబోయిన సుధాకర్ యాదవ్, నూక కిరణ్యాదవ్, ఏడుకొండలు , రజకసంఘం నాయకులు కొండూరి సత్యనారాయణ, ఎస్సీ ఎస్టీ విద్యార్థి సంఘం అధ్యక్షుడు కట్టెల శివకుమార్ తదితరులు పాల్గొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మాటలే తూటాలై..!
[ 24-04-2024]
‘నల్గొండ జిల్లా సాగునీటి రంగానికి కేసీఆర్ తీరని అన్యాయం చేశారు. బస్సు యాత్ర కాదు, మోకాళ్ల యాత్ర చేసినా భారాసకు ఎవరూ ఓటేయరు. -
వైభవంగా హనుమాన్ జయంతి
[ 24-04-2024]
హనుమాన్ జయంతి సందర్భంగా మంగళవారం ఆలయాల్లో ప్రత్యేక పూజలు జరిపించారు. స్వామి వారికి సింధూరంతో అభిషేకం, తమల పాకులతో పూజలు నిర్వహించారు. -
పాఠాలకు బై.. ఆటలకు సై..!
[ 24-04-2024]
వేసవి సెలవులు వచ్చేశాయ్.. పది నెలల పాటు నిత్యం బడుల్లో పాఠాలు చదవడం, రాయడం తదితర పనుల్లో నిమగ్నమై ఉన్న చిన్నారులకు ఈ నెల 24 (బుధవారం) నుంచి మొదలయ్యే సెలవులతో ఉపశమనం లభించింది. -
అట్టహాసంగా కంచర్ల నామినేషన్
[ 24-04-2024]
లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నేతలకు తగిన బుద్ధి చెప్పడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారని మాజీ మంత్రి జగదీశ్రెడ్డి అన్నారు. -
పార్టీ గుర్తుల చరిత్ర ఇదే
[ 24-04-2024]
రాజకీయ పార్టీలనగానే గుర్తొచ్చేది వాటి గుర్తులే. ప్రధానంగా ఎన్నికల సమయంలో పార్టీ అభ్యర్థుల కంటే గుర్తులకే ప్రాధాన్యం ఉంటుంది. -
వారు.. శాసనసభకు, లోక్సభకు ఎన్నికయ్యారు!
[ 24-04-2024]
ఉమ్మడి నల్గొండ జిల్లాకు చెందిన కొందరు నేతలు శాసనసభకు, లోక్సభకు ఎన్నికయ్యారు. దేశంలోనే అత్యధిక ఓట్లు సాధించి రికార్డు సృష్టించారు. -
ప్రలోభాల ఎర.. తప్పదు చెర!
[ 24-04-2024]
లోక్సభ ఎన్నికలు మే 13న జరగనున్నాయి. ఇప్పటికే నామినేషన్ల పర్వం ప్రారంభం కావడంతో ప్రచారం ఊపందుకుంటోంది. -
ఆహారం సేకరించి.. అభాగ్యుల ఆకలి తీర్చి..
[ 24-04-2024]
దేశంలో ఒక వైపు రెండు పూటలా తినడానికి తిండి లేక వేలాది మంది అవస్థలు పడుతున్నారు. మరో వైపు నిత్యం లక్షల టన్నుల ఆహార పదార్థాలు వ్యర్థాలుగా మారుతున్నాయి. -
లోక్సభలో గళం విప్పే అవకాశం ఇవ్వండి: జహంగీర్
[ 24-04-2024]
ప్రజాసమస్యల పరిష్కారానికి జనం వెన్నంటే ఉండి నిరంతరం పోరాటాలు చేస్తున్న తనకు మద్దతుగా నిలిచి గెలిపిస్తే పార్లమెంటులో ఈ ప్రాంత సమస్యలపై గళం విప్పుతానని భువనగిరి లోక్సభ సీపీఎం అభ్యర్థి ఎండీ.జహంగీర్ అన్నారు. -
గత పొరపాట్లు పునరావృతం కావొద్దు: కలెక్టర్
[ 24-04-2024]
త్వరలో జరగబోయే లోక్సభ ఎన్నికల్లో సెక్టార్, పోలీసు అధికారులు సమన్వయంతో పని చేయాలని కలెక్టర్ వెంకటరావు అన్నారు. -
బడికి నిధులు
[ 24-04-2024]
యాదాద్రి జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో వసతుల కల్పనకు రాష్ట్ర ప్రభుత్వం రూ.25 కోట్లు మంజూరు చేసింది. ఈ పనులను అమ్మ ఆదర్శ కమిటీల ద్వారా చేపట్టనున్నారు. -
అతిథులు తరలొచ్చె.. బూర పూరించె..!
[ 24-04-2024]
ఓట్ల కోసం అనాదిగా మత రాజకీయాలు చేస్తున్నది కాంగ్రెస్ పార్టీయేనని భాజపా ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యుడు డాక్టర్ కె.లక్ష్మణ్ విమర్శించారు. -
వేస్తున్నారు నామినేషన్లు..!
[ 24-04-2024]
ఉమ్మడి నల్గొండ జిల్లాలోని నల్గొండ, భువనగిరి లోక్సభ స్థానాలకు నామినేషన్ల స్వీకరణ కార్యక్రమం కొనసాగుతోంది. -
అభ్యర్థులిద్దరూ ‘బీఎన్ రెడ్డి’లే..!
[ 24-04-2024]
మిర్యాలగూడ లోక్సభ నియోజకవర్గంలో 1989, 1991 ఎన్నికల్లో ప్రధాన అభ్యర్థులిద్దరూ బీఎన్రెడ్డిలే. ఒకరు వాస్తుశిల్పి బద్దం నర్సింహారెడ్డి. మరొకరు భీంరెడ్డి నర్సింహారెడ్డి. -
1,29,766 ఓట్లు కొల్లగొట్టిన స్వతంత్రులు
[ 24-04-2024]
ఫ్లోరైడ్కు వ్యతిరేకంగా జలసాధన సమితి ఆధ్వర్యంలో 1996 లోక్సభ ఎన్నికల్లో 476 మంది స్వతంత్ర అభ్యర్థులుగా బరిలో నిలిచారు. ఆ ఎన్నికల్లో వీరు 1,29,766 ఓట్లు సాధించారు.