logo

చికిత్స పొందుతూ మృతి

అన్నదమ్ముల నడుమ పాత భూ కక్షలతో పాటు, తాటి చెట్ల పంపకంలో ఏర్పడిన ఘర్షణలో గాయపడిన అన్న ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. అయిటిపాములకు చెందిన సోదరులు నీలం వెంకన్న(55), నీలం సైదులు

Published : 17 Jan 2022 05:50 IST

కట్టంగూరు, న్యూస్‌టుడే: అన్నదమ్ముల నడుమ పాత భూ కక్షలతో పాటు, తాటి చెట్ల పంపకంలో ఏర్పడిన ఘర్షణలో గాయపడిన అన్న ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. అయిటిపాములకు చెందిన సోదరులు నీలం వెంకన్న(55), నీలం సైదులు నడుమ ఏళ్లుగా భూతగాదాలు నడుస్తున్నాయి. దీంతో పాటు కల్లు గీసె తాటి చెట్ల పంపకంలో గత ఏడాది డిసెంబర్‌ 6న ఇద్దరి నడుమ ఘర్షణ తలెత్తింది. ఈ నేపథ్యంలో సైదులు ముంజ కొడవలి కత్తితో వెంకన్నపై దాడి చేసి తీవ్రంగా గాయపరిచాడు. వెంకన్నను బంధువులు నార్కట్‌పల్లిలోని కామినేని ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ శనివారం మృతి చెందినట్లు ఎస్సై శివప్రసాద్‌ ఆదివారం తెలిపారు. మృతదేహానికి నకిరేకల్‌ ప్రభుత్వాసుపత్రిలో శవపరీక్ష నిర్వహించి బంధువులకు అప్పగించారు. శాలిగౌరారం సీఐ రాఘవరావు కేసును దర్యాప్తు చేస్తున్నారు. మృతునికి భార్య, ఇద్దరు కుమార్తెలు, కుమారుడు ఉన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని