logo

పాఠశాల నిర్మాణానికి స్థల పరిశీలన

కొంపల్లి జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాల తరగతి గదులు శిథిలావస్థకు చేరుకుందని గతంలో ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి దృష్టికి స్థానికులు తీసుకొచ్చారు. ఆ సమయంలో ఇచ్చిన హామీ మేరకు కోమటిరెడ్డి సుశీలమ్మ ఫౌండేషన్‌ వారీ సహకారంతో రూ.కోటికి పైగా నిధులను వెచ్చించి

Published : 17 Jan 2022 06:13 IST

మునుగోడు, న్యూస్‌టుడే: కొంపల్లి జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాల తరగతి గదులు శిథిలావస్థకు చేరుకుందని గతంలో ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి దృష్టికి స్థానికులు తీసుకొచ్చారు. ఆ సమయంలో ఇచ్చిన హామీ మేరకు కోమటిరెడ్డి సుశీలమ్మ ఫౌండేషన్‌ వారీ సహకారంతో రూ.కోటికి పైగా నిధులను వెచ్చించి నూతన భవన నిర్మాణానికి కావాల్సిన స్థలాన్ని వెంటనే పరిశీలించాలని స్థానిక ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి ఆ పార్టీ నాయకులకు చెప్పారు. దీంతో ఆదివారం కాంగ్రెస్‌ మండల అధ్యక్షుడు పాల్వాయి గోవర్ధన్‌రెడ్డి, పీఏసీఎస్‌ ఛైర్మన్‌ కుంభం శ్రీనివాస్‌రెడ్డి పాఠశాల వద్దకు వెళ్లి స్థలాన్ని పరిశీలించారు.సర్పంచి వెంకన్న, ఎస్‌ఎంసీ ఛైర్మన్‌ యాదయ్య పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని