logo

317 జీవోను ఉపసంహరించుకోవాలని వినతి

రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో 124ను సవరణ చేయాలని, 317 జీవోను రద్దు చేయాలని తెలంగాణ జన సమితి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, నియోజకవర్గ ఇన్‌ఛార్జి కుంట్ల

Published : 18 Jan 2022 02:40 IST

సూర్యాపేట: అదనపు కలెక్టర్‌కు వినతిపత్రం అందిస్తున్న తెజస రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ధర్మార్జున్‌, తదితరులు

సూర్యాపేట పట్టణం, న్యూస్‌టుడే: రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో 124ను సవరణ చేయాలని, 317 జీవోను రద్దు చేయాలని తెలంగాణ జన సమితి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, నియోజకవర్గ ఇన్‌ఛార్జి కుంట్ల ధర్మార్జున్‌ డిమాండ్‌ చేశారు. తెజస ఆధ్వర్యంలో సోమవారం అదనపు కలెక్టర్‌ మోహన్‌రావుకు వినతిపత్రం అందించి మాట్లాడారు. ఉద్యోగులు, నిరుద్యోగులు ఆత్మస్థైర్యం కోల్పోయి ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని తెలిపారు. తెజస జిల్లా ఉపాధ్యక్షుడు మాంద్ర మల్లయ్య, యువజన సమితి రాష్ట్ర ఉపాధ్యక్షుడు కిరణ్‌, పగిళ్ల శ్రీను, సతీష్‌, శంకర్‌, వినయ్‌ పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని