తేలికగా దాటొచ్చని.. దొరికిపోయారు
పోలీసుల కన్నుగప్పి గంజాయిను సరిహద్దు దాటించాలని ప్రయత్నించిన అంతర్రాష్ట్ర ముఠా ఆటలకు పోలీసులు అడ్డుకట్ట వేశారు. కొత్తూరు మండలం, తిమ్మాపూర్
అంతర్రాష్ట్ర గంజాయి ముఠా అరెస్టు
రూ.69 లక్షల విలువైన సొత్తు స్వాధీనం
పట్టుబడిన సరకుతో పోలీసు అధికారులు, సిబ్బంది
ఈనాడు, హైదరాబాద్ కొత్తూరు, న్యూస్టుడే: పోలీసుల కన్నుగప్పి గంజాయిను సరిహద్దు దాటించాలని ప్రయత్నించిన అంతర్రాష్ట్ర ముఠా ఆటలకు పోలీసులు అడ్డుకట్ట వేశారు. కొత్తూరు మండలం, తిమ్మాపూర్ జాతీయరహదారిపై శంషాబాద్ ఎస్వోటీ, కొత్తూరు పోలీసులు సంయుక్త తనిఖీల్లో 214 కిలోల గంజాయి స్వాధీనం చేసుకున్నారు. మహారాష్ట్రకు చెందిన బాబా సౌ చందేకర్(45), పుక్మలి తిరుమలి బాలు(39), గణేష్ నొలారి(39), రాజేంద్ర(45), సూర్యాపేట నివాసి మాలోత్ వినోద్(28)ను అరెస్ట్ చేశారు. ప్రధాన సరఫరాదారులు రవి, నాగరాజు, బాల్రాజ్, గణేష్, రాథోడ్ రవి పరారయ్యారు. సోమవారం షాద్నగర్ ఏసీపీ కుశల్కర్, ఇన్స్పెక్టర్లు వెంకటరెడ్డి, శ్రీధర్ భూపాల్తో కలిసి కొత్తూరు పోలీసుస్టేషన్లో శంషాబాద్ డీసీపీ జగదీశ్వర్రెడ్డి మీడియాకు వివరాలు వెల్లడించారు. మహారాష్ట్రకు చెందిన ప్రధాన నిందితుడు బాబా సౌ చందేకర్, రాజేంద్రతో కలసి గంజాయి రవాణా సాగిస్తున్నారు. ఏపీ అటవీ ప్రాంతాల్లో కొనుగోలు చేసి హైదరాబాద్ మీదుగా మహారాష్ట్ర తరలిస్తున్నాడు. వీరికి వరంగల్కు చెందిన రవి వాహనాలు సమకూర్చుతూ సరకును సరిహద్దు దాటించేందుకు సహాయపడుతున్నాడు. మిగిలిన నిందితులు సరుకు రవాణాకు భద్రతగా ఉండేవారు. వారం రోజుల క్రితం 250 కిలోల గంజాయి కావాలంటూ చందేకర్, రాజేంద్రలు గణేశ్ అనే దళారిని సంప్రదించారు. రవి ఏపీలోని సీలేరు అటవీ ప్రాంతంలో కిలో రూ.3,000ల చొప్పున 214 కిలోలు కొనుగోలు చేశాడు. సీలేరు నుంచి భద్రాచలం సరుకు చేరవేసేందుకు ఇద్దరు సాయపడ్డారు. అక్కడి నుంచి హైదరాబాద్ వరకూ మరో ఇద్దరు రక్షణగా వచ్చారు. సోమవారం తెల్లవారుజామున తిమ్మాపూర్ చేరుకున్నారు. గంజాయి పొట్లాలను ఒక కారు నుంచి మరో వాహనంలోకి మారుస్తుండగా పోలీసులు పట్టుకున్నారు. ఐదుగురిని అరెస్ట్ చేశారు. వారి నుంచి మూడు కార్లు, ఐదు సెల్ఫోన్లు, రూ.2.10 లక్షల నగదు స్వాధీనం చేసుకున్నారు. సొత్తు విలువ రూ.69.90 లక్షలు ఉంటుందని అంచనా వేశారు.
తనిఖీలు లేని మార్గాల్లో..
టోల్గేట్లు, తనిఖీ కేంద్రాల వద్ద పోలీసులను తప్పించుకునేందుకు గ్రామాలు, పంట పొలాల మీదుగా ప్రయాణం కొనసాగించారు. సహాయకులు, వాహనాలను తరచూ మార్చుతూ వచ్చారు. చివరకు విశ్వసనీయ సమాచారం మేరకు శంషాబాద్ ఎస్వోటీ సీఐ వెంకట్రెడ్డి, కొత్తూరు సీఐ శ్రీధర్ భూపాల్ ఆధ్వర్యంలో పోలీసు బృందాలు తిమ్మాపూర్ వద్ద పట్టుకున్నాయి. శంషాబాద్ ఎస్వోటీ, కొత్తూరు పోలీసులకు సైబరాబాద్ సీపీ స్టీఫెఫన్ రవీంద్ర రివార్డు ప్రకటించారని డీసీపీ జగదీశ్వర్రెడ్డి తెలిపారు. గంజాయి సరఫరా వెనకున్న గొలుసుకట్టును త్వరలోనే చేధిస్తామని ఆయన ధీమా వ్యక్తం చేశారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
దాహం కేకలు తీర్చేందుకు...తరలి వస్తున్న కృష్ణమ్మ
[ 19-04-2024]
నాగార్జునసాగర్ జలాశయం డెడ్స్టోరేజీ దిగువకు చేరినా వేసవిలో హైదరాబాద్ జంట నగరాలు, జిల్లా వాసుల దాహం కేకలు తీర్చేందుకు కృష్ణాజలాల సరఫరాకు హెచ్ఎండబ్ల్యూఎస్ఎస్బీ (జలమండలి) అధికారులు చేపడుతున్న చర్యలు సఫలీకృతమయ్యాయి -
సైబర్ బాధితులకు వారియర్స్ తోడు
[ 19-04-2024]
చరవాణుల ద్వారా డిజిటల్ లావాదేవీలు పెరగడంతో నిత్యం ఎక్కడో చోట అమాయకులు సైబర్ నేరగాళ్ల వలలో పడి ఆర్థికంగా నష్టపోతున్నారు. -
రాష్ట్రంలోనే ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దుతా: మంత్రి ఉత్తమ్
[ 19-04-2024]
కోదాడ నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసి రాష్ట్రంలోనే ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దుతానని నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి అన్నారు. -
గాడితప్పిన గస్తీ
[ 19-04-2024]
జిల్లాలో దొంగలు రెచ్చిపోతున్నారు. వరుసగా గొలుసు చోరీలకు పాల్పడుతున్నారు. నిఘా పటిష్ఠం చేసి దొంగలను పట్టుకోవడంలో పోలీసులు విఫలమవుతున్నారు. -
ఆలయ భద్రతపై ఇంత నిర్లక్ష్యమా!
[ 19-04-2024]
యాదాద్రి పుణ్యక్షేత్రాన్ని నిత్యం వేల సంఖ్యలో భక్తులు సందర్శిస్తుంటారు. ఆలయంలోకి ప్రవేశించే ప్రతి ఒక్కరిని క్షుణ్ణంగా తనిఖీ చేసిన తరువాతే లోనికి అనుమతించేందుకు బ్యాగేజ్ స్కానింగ్, మెటల్ డిటెక్టర్, తదితర భద్రతా పరికరాలను వైటీడీఏ కొనుగోలు చేసింది. -
భక్తవత్సలుడికి సంప్రదాయ ఆరాధనలు
[ 19-04-2024]
యాదాద్రి పుణ్యక్షేత్రంలో గురువారం స్వయంభువులైన పంచనారసింహులను ఆరాధిస్తూ చేపట్టిన నిత్య పూజలు ఆలయ ఆచారంగా కొనసాగాయి -
కేసీఆర్కు సీఎం రేవంత్రెడ్డే సరైనోడు: రాజగోపాల్రెడ్డి
[ 19-04-2024]
తెలంగాణ ఇచ్చిన పదేళ్ల తర్వాత కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందని.. ఆలస్యం అయినా ప్రవేశపెట్టిన పథకాలను నెరవేర్చి.. రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలోకి తీసుకెళ్తామని భువనగిరి లోక్సభ ఇన్ఛార్జి, స్థానిక ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి అన్నారు. -
నాయకులొస్తున్నారు..!
[ 19-04-2024]
ఉమ్మడి జిల్లాలోని రెండు లోక్సభ స్థానాలైన నల్గొండ, భువనగిరిలో నామినేషన్ దాఖలు సందర్భంగా భారీ ఎత్తున ర్యాలీలు, సభలు నిర్వహించాలని అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష పార్టీలు భారాస, భాజపాలు నిర్ణయించాయి -
67 ఏళ్లలో 69 శాతమే!
[ 19-04-2024]
నల్గొండ లోక్సభ నియోజకవర్గం 1952లో ఏర్పడగా.. 2019 వరకు 17 సార్లు ఎన్నికలు జరిగాయి. 2019 నాటికి నియోజకవర్గానికి తొలి ఎన్నికలు జరిగి 67 ఏళ్లు గడిచాయి -
నల్గొండలో నలుగురు, భువనగిరిలో ముగ్గురు
[ 19-04-2024]
లోక్సభ ఎన్నికలకు నామినేషన్ల పర్వం మొదలైంది. తొలి రోజు గురువారం నల్గొండ లోక్సభ స్థానానికి నలుగురు అభ్యర్థులు ఆరు సెట్లు నామినేషన్లను రిటర్నింగ్ అధికారి, నల్గొండ జిల్లా కలెక్టరు హరిచందనకు అందజేశారు. -
నల్గొండ.. నాయకులకు అండ!
[ 19-04-2024]
నల్గొండ లోక్సభ నియోజకవర్గానికి 18వ సారి ఎన్నికలు జరుగనున్నాయి. ఉమ్మడి జిల్లాలో తొలిసారి ఏర్పడిన ఏకైక లోక్సభ నియోజకవర్గం నల్గొండ మాత్రమే. -
పార్లమెంటు.. ఎంపీ అంటే తెలుసా
[ 19-04-2024]
లోక్సభ ఎన్నికలకు సమయం దగ్గరపడుతోంది. ఇప్పటికే ప్రధాన పార్టీల అభ్యర్థులు తమదైన శైలిలో సమావేశాలు నిర్వహిస్తూ ఓటర్లను మచ్చిక చేసుకునే ప్రయత్నంలో ఉన్నారు -
వ్యాను ఢీకొని రైతు మృతి
[ 19-04-2024]
ద్విచక్రవాహనాన్ని వ్యాను ఢీకొనడంతో రైతు మృతి చెందిన ఘటన మఠంపల్లి మండలం రఘునాథపాలెం పరిధిలోని వెంకటాయపాలెంలో గురువారం జరిగింది. -
ఇంటి మీద.. అవార్డుల పంట
[ 19-04-2024]
మిద్దె తోటలు.. ఆరోగ్యానికి ఉపయోగపడే కూరగాయలతో పాటు పురస్కారాలనూ తీసుకొస్తున్నాయి.
తాజా వార్తలు (Latest News)
-
నేను తిన్నది మూడు మామిడి పండ్లే: కేజ్రీవాల్
-
4 రోజుల నష్టాలకు బ్రేక్.. 599 పాయింట్లు లాభపడిన సెన్సెక్స్
-
భారాస అధినేత కేసీఆర్ బస్సు యాత్ర షెడ్యూల్ ఖరారు
-
మెటా ప్లాట్ఫామ్స్లో ఏఐ.. వాట్సప్లో ఇక చిత్రాలూ రూపొందించొచ్చు!
-
స్కూల్లో ఫేషియల్ చేయించుకున్న ప్రిన్సిపల్.. వీడియో తీసిన ఉపాధ్యాయురాలిపై దాడి
-
‘సివిల్స్’ టాపర్లకు వచ్చిన మార్కులెన్నో తెలుసా? UPSC పరీక్షల మార్కుల షీట్లు విడుదల