ఆర్టీసీ బస్డిపో కల నెరవేరేనా..?
భువనగిరిలో ఆర్టీసీ బస్ డిపో ఏర్పాటు చేయాలన్న ప్రజల కోరిక నెరవేరడంలేదు. జిల్లా కేంద్రం ఏర్పాటు తదుపరి ప్రయాణికుల సంఖ్య గణనీయంగా పెరిగింది. ఎన్నో ఏళ్ల కలయిన భువనగిరి డిపో ఏర్పాటును
భువనగిరి పట్టణం, న్యూస్టుడే
భువనగిరి బస్టాండ్లో ప్రయాణికుల రద్దీ
భువనగిరిలో ఆర్టీసీ బస్ డిపో ఏర్పాటు చేయాలన్న ప్రజల కోరిక నెరవేరడంలేదు. జిల్లా కేంద్రం ఏర్పాటు తదుపరి ప్రయాణికుల సంఖ్య గణనీయంగా పెరిగింది. ఎన్నో ఏళ్ల కలయిన భువనగిరి డిపో ఏర్పాటును తెలంగాణ ప్రభుత్వం పరిష్కరించకపోవడం గమనార్హం. భువనగిరి మీదుగా నిత్యం వందలాది బస్సులు ప్రయాణిస్తున్నప్పటికీ ప్రయాణికుల అవసరాలు తీరడంలేదు. ప్రతి బస్ నిండుగా రావడంతో పలు ప్రాంతాలకు ప్రయాణించాల్సిన వారు నిత్యం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. బైపాస్ నిర్మాణం తదుపరి అత్యధిక డిపోల బస్సులు భువనగిరి బస్టాండ్లోకి రాకుండానే నేరుగా బైపాస్ మీదుగా ప్రయాణిస్తున్నాయి. హైదరాబాదు నుంచి రాత్రి వేళల్లో భువనగిరికి ప్రయాణించే ప్రయాణికులను బస్ డ్రైవర్లు, కండక్టర్లు అనుమతించడంలేదు. దీంతో బస్ ప్రయాణమే నరక ప్రాయంగా మారింది. పెరుగుతున్న జనాభా, జిల్లా అవసరాలను దృష్టిలో పెట్టుకొని భువనగిరి పట్టణంలో బస్ డిపో ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది. ఈ అంశం రాజకీయంగా ముడిపడి ఉండటంతో ప్రస్తుత ప్రజాప్రతినిధులు ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొస్తే తప్ప డిపో ఏర్పాటు అయ్యే పరిస్థితి లేదు.
ప్రత్యామ్నాయ ప్రయాణమే దిక్కు
జిల్లా పరిధిలో ప్రస్తుతం యాదగిరిగుట్ట డిపో ఉంది. ఈ డిపోకు సుమారు 50 నుంచి 70 కిలోమీటర్ల దూరంలో నార్కట్పల్లి, జనగాం డిపోలు ఉన్నాయి. ప్రస్తుతం జిల్లాలోని 17 మండలాల్లో యాదగిరిగుట్ట డిపో సేవలు అందిస్తుంది. ఇది డిపో నిర్వాహకులకు తలకు మించిన భారంగా పరిణమించింది. హైదరాబాద్ పరిసరాల్లో సుమారు 30 బస్డిపోలు ఉన్నప్పటికీ నగర శివారులోని కొన్ని గ్రామాలకు ఆయా డిపోల బస్సులను అధికారులు తిప్పుతున్నారు. పరిధి పెద్దగా ఉండటంతో గుట్ట డిపో సేవలు ప్రజలకు అందుబాటులో లేకుండా పోతున్నాయి. ప్రజల డిమాండ్ మేరకు బస్సులు లేని కారణంగా ప్రజలు ప్రత్యామ్నాయ రవాణా వ్యవస్థను వెతుక్కోవాల్సి వస్తుంది. భువనగిరి పట్టణం కన్నా చిన్న మండలాలైన దుబ్బాక, ఊట్నూర్లో బస్ డిపోలను ఏర్పాటు చేయడం గమనార్హం. బస్ డిపో ఏర్పాటుతో జిల్లా ప్రజల కష్టాలు గట్టెక్కనున్నాయి. డిపో నుంచి ప్రారంభమయ్యే బస్సులలో ప్రయిణికులకు సీట్లు లభించే అవకాశం ఉంది. భువనగిరిలో ఆర్టీసీ డిపో ప్రతిపాదన లేదని యాదగిరిగుట్ట డిపో మేనేజర్ లక్ష్మారెడ్డి ‘న్యూస్టుడే’కు తెలిపారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
నీటిలోని చేపొచ్చి.. నేలమీద పడుతోంది..!
[ 28-03-2024]
తగ్గుతున్న భూగర్భ జలాలతో రైతులతో పాటు మత్స్యకారులు నష్టపోతున్నారు. ఉమ్మడి జిల్లాలోని చెరువుల నీటిమట్టాలు రోజురోజుకూ తగ్గుముఖం పడుతున్నాయి. దీంతో చెరువుల్లోని చేపలు తగినంత పరిమాణం పెరగక ముందే పట్టేసి విక్రయించాల్సిన దుస్థితి నెలకొంది. -
వారివి చుట్టపు చూపులే..!
[ 28-03-2024]
గ్రామ పంచాయతీల్లో ప్రత్యేకాధికారుల పాలన అస్తవ్యస్తంగా మారింది. ఎంపీడీవోలు, పంచాయతీరాజ్, నీటిపారుదల, పశుసంవర్థక,రెవెన్యూ, విద్యాశాఖాధికారులను క్లస్టర్ల వారీగా ప్రత్యేకాధికారులుగా ప్రభుత్వం నియమించింది. -
కోడిపిల్లల అరుపు.. వినిపించదేం..!
[ 28-03-2024]
ఉమ్మడి జిల్లా నుంచి కొందరు రాయితీ కోడి పిల్లల పథకానికి దరఖాస్తు చేసుకున్నారు. ఏడాది క్రితం రూ.1030, రూ.600 చొప్పున డీడీలు తీశారు. అప్పటి నుంచి పశుసంవర్ధక శాఖ అధికారుల చుట్టూ తిరుగుతున్నా.. -
నేటి నుంచి ధాన్యం కొనుగోళ్లు: అదనపు కలెక్టర్
[ 28-03-2024]
ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో మౌలిక సదుపాయాలు కల్పించాలని రెవెన్యూ అదనపు కలెక్టర్ శ్రీనివాస్ తెలిపారు. జిల్లాలో యాసంగి ధాన్యం కొనుగోలు కేంద్రాలు గురువారం నుంచి ప్రారంభించేందుకు సిద్ధంగా ఉన్నట్లు చెప్పారు. -
పురంలో.. దాహం తీరేలా..!
[ 28-03-2024]
ఉమ్మడి నల్గొండ జిల్లాలోని పురపాలికల్లో ప్రజల దాహార్తిని తీర్చేందుకు అమృత్-2.0 పథకం కింద కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల భాగసామ్యంతో రూ.491.46 కోట్లతో చేపట్టనున్న పనులకు సెప్టెంబరు 2023లో రాష్ట్ర పురపాలకశాఖ పరిపాలనా అనుమతి మంజూరు చేసింది. -
దగా ఆలోచనలపై.. నిఘా
[ 28-03-2024]
గత అసెంబ్లీ ఎన్నిల సందర్భంగా 28 ఏళ్ల యువకుడు భువనగిరి నియోజకవర్గంలో ప్రధాన పార్టీ అభ్యర్థికి సంబంధించిన అభ్యంతరకరమైన వీడియోను సృష్టించి సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేశాడు. -
గ్రామాల్లో డ్రోన్ కలకలం
[ 28-03-2024]
యాదాద్రి భువనగిరి జిల్లా గుండాల మండలంలోని పాచిల్ల, తుర్కలషాపురం, రామారం, వంగాల, గుండాల గ్రామాల మీదుగా నిత్యం డ్రోన్లు ఎగురవేస్తుండటంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. -
ఆట కట్టించలేరా..?
[ 28-03-2024]
జిల్లాలో జూదం జోరుకు కళ్లెం పడటం లేదు. పచ్చని కాపురాల్లో ఈ ఆట చిచ్చుపెడుతోంది. పోలీసుల దాడులకూ వెరవడం లేదు. ఈ నెల 16న ‘ఈనాడు’లో ప్రచురితమైన ‘తోటలో కాసుల వేట’... -
చివరికి అందేలా..ఆశలు నెరవేరేలా..!
[ 28-03-2024]
కొత్త ప్రభుత్వం ముక్త్యాల బ్రాంచి కాలువ పనులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. నాగార్జునసాగర్ ఎడమ కాలువ పరిధిలోని అతిపెద్ద బ్రాంచి కాలువ అయిన ముక్త్యాలకు ఆధునికీకరణ పనులు మళ్లీ మొదలయ్యాయి. -
వాడే ముందు జాగ్రత్త
[ 28-03-2024]
రోడ్డు ప్రమాదంలో కోదాడ పట్టణానికి చెందిన ఓ వ్యక్తి కాలికి స్వల్ప గాయమవడంతో పట్టణంలోని ఓ ఆస్పత్రికి వెళ్లారు. అక్కడ కాలపరిమితి దాటిన బ్యాండేజీ కాలుకి కట్టడంతో వాపు తగ్గలేదు. -
బంధం ఎందుకో.. బలహీన పడుతోంది
[ 28-03-2024]
వివాహేతర సంబంధం, వేధింపులు.. కారణం ఏదైనా కడదాక కలిసి ఉంటామని పెళ్లి మండపంలో ప్రమాణం చేసిన కొందరు మహిళలు కట్టుకున్న భర్తలను అర్ధంతరంగా కానరాని లోకాలకు పంపేస్తున్నారు. -
ప్రచార అనుమతులకు సువిధ
[ 28-03-2024]
ఓటింగ్ ప్రక్రియను సులభతరం చేయడంతో పాటు సాంకేతికతను ఉపయోగించడం ద్వారా సమయాన్ని ఆదా చేయడంతో పాటు ఎన్నికలు పారదర్శకంగా నిర్వహించేందుకు ఎన్నికల సంఘం ప్రత్యేక చర్యలు చేపడుతోంది. -
సాఫ్ట్గా రాణిస్తూ.. పతకాలు కొట్టేస్తూ..!
[ 28-03-2024]
గ్రామీణ ప్రాంతాల వారికి కబడ్డీ, ఖో ఖో, వాలీబాల్ లాంటి ఆటలు మాత్రమే ఎక్కువగా పరిచయం. సాఫ్ట్బాల్ క్రీడ చాలామందికి కొత్తదే. అయినప్పటికీ పల్లెల్లో దశాబ్దకాలంగా విద్యార్థులు ఈ క్రీడపై ఆసక్తి కనబర్చుతున్నారు. -
భువనగిరి బరిలో చామల
[ 28-03-2024]
ఎడతెగని ఉత్కంఠ నడుమ అధికార కాంగ్రెస్ పార్టీ తమ భువనగిరి లోక్సభ ఎంపీ అభ్యర్థిగా చామల కిరణ్కుమార్రెడ్డిని ప్రకటించింది. ఆయన ఇక్కడి నుంచి ఎంపీగా పోటీ చేయడం ఇదే తొలిసారి.
తాజా వార్తలు (Latest News)
-
కేజ్రీవాల్పై వ్యాఖ్యలు.. మరోసారి అమెరికాకు భారత్ కౌంటర్
-
ఆ మాజీ సీఎం తనయుడి ఆస్తి ₹700 కోట్లు.. సొంత వాహనం లేదు!
-
రిటైల్ బ్రాండ్ల చూపు.. ఆలయ నగరాల వైపు
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM
-
మే 31 వరకు వేసవి సెలవులు.. ప్రకటించిన ఇంటర్ బోర్డు
-
పరిశ్రమలు తేవడం తెదేపా బ్రాండ్.. తరిమికొట్టడం జగన్ బ్రాండ్: చంద్రబాబు