అత్యాచారానికి యత్నించిన వ్యక్తికి జైలుశిక్ష
వివాహిత యువతిపై అత్యాచార యత్నం చేసి ఆమెను కులం పేరుతో దూషినందులకు మూడేళ్ల జైలుశిక్షను విధిస్తూ ప్రత్యేక ఎస్సీ ఎస్టీ కేసుల విచారణ జిల్లా సేషన్స్ న్యాయస్థానం
నల్గొండ లీగల్, న్యూస్టుడే: వివాహిత యువతిపై అత్యాచార యత్నం చేసి ఆమెను కులం పేరుతో దూషినందులకు మూడేళ్ల జైలుశిక్షను విధిస్తూ ప్రత్యేక ఎస్సీ ఎస్టీ కేసుల విచారణ జిల్లా సేషన్స్ న్యాయస్థానం సోమవారం తీర్పు వెలువర్చింది. జిల్లాలోని మర్రిగూడ మండలంలోని ఓ గ్రామానికి చెందిన వివాహితపై అత్యాచారయత్నానికి ప్రయత్నించిన అదే మండలంలోని శివన్నగూడెం గ్రామానికి చెందిన జంగిలి శ్రీశైలంకు మూడేళ్ల జైలుశిక్షను న్యాయమూర్తి భవాణీ విధించారు. ప్రాసిక్యూషన్ కథనం ప్రకారం కేసు వివరాలిలా ఉన్నాయి.. బాధితురాలు 2016 సెప్టెంబరు 8 మధ్నాహ్నం తన భర్తతో కలసి బ్యాంకు పనిమీద మర్రిగూడ మండలం, శివన్నగూడేనికి వెళ్లారు. అక్కడ భోజన విరామ సమయం కావడంతో ఆమె టిఫిన్ చేయడానికి సమీపంలోని హోటల్కు వెళ్లారు. అక్కడ మద్యం తాగిన మైకంలో ఉన్న శ్రీశైలం, బండి కృష్ణయ్య(ఎ2 చనిపోయాడు)లు బాధితురాలిని హత్యాచారం చేయబోయారు. ఆమె ఎదురుతిరగడంతో కులం పేరుతో దూషించి కాళ్లతో తన్నారు. అక్కడికి వచ్చిన భర్తను కర్రలతో కొట్టి గాయపర్చారు. అనంతరం బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొన్న మర్రిగూడ పోలీసులు, దర్యాప్తు ముగించి నిందితులుగా జంగిలి శ్రీశైలం, బండి కృష్ణయ్యలపై ఛార్జిషీటు కోర్టులో దాఖలు చేశారు. న్యాయస్థానంలో విచారణలో మొదటి ముద్దాయి జంగిలి శ్రీశైలంపై నేరనిర్ధారణ కావడంతో అతనికి అత్యాచారయత్నం చేసినందులకు మూడేళ్ల జైలుశిక్ష, కులం పేరుతో దూషించినందులకు ఆరునెలల జైలు, రూ.5వేలు జరిమానా, కొట్టినందులకు ఆరు నెలల జైలు శిక్షను న్యాయమూర్తి భవాణీ విధిస్తూ తీర్పు చెప్పారు. రెండవ ముద్దాయి చనిపోవడంతో అతనిపై కేసును నిలిపివేశారు. విధించిన అన్ని శిక్షలు ఏకకాలంలో అమలు జరుపబడతాయని న్యాయమూర్తి తన తీర్పులో పేర్కొన్నారు. ప్రాసిక్యూషన్ తరపున అదనపు పీపీలు జవహార్లాల్, సిరిగిరి వెంకట్రెడ్డిలు వాధించారు
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ప్రభుత్వంపై విమర్శ.. రైతులకు భరోసా
[ 25-04-2024]
లోక్సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా బస్సుయాత్ర చేస్తున్న మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ దానిని ఉమ్మడి జిల్లా నుంచే ప్రారంభించడంతో.. భారాస నేతలు పెద్దఎత్తున ఏర్పాట్లు చేశారు. -
బాలికలు.. భళా
[ 25-04-2024]
విద్యార్థులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఇంటర్ ఫలితాలు విడుదలయ్యాయి. -
మోదీతో తెలంగాణకు తీరని అన్యాయం
[ 25-04-2024]
కేంద్ర ప్రభుత్వం, ప్రధాని మోదీ తెలంగాణకు తీరని అన్యాయం చేశారని నల్గొండ లోక్సభ ఇన్ఛార్జి, మంత్రి నల్లమాద ఉత్తమ్కుమార్రెడ్డి ఆరోపించారు. -
బాలికలదే హవా
[ 25-04-2024]
రాష్ట్ర వ్యాప్తంగా ఇంటర్ ప్రథమ, ద్వితీయ సంవత్సరం పరీక్ష ఫలితాలు బుధవారం విడుదలయ్యాయి. -
ఉపాధి కూలీల సౌకర్యాలపై సమీక్ష
[ 25-04-2024]
పని ప్రదేశాలలో ఉపాధి కూలీలకు మౌలిక సౌకర్యాలు సమకూర్చాలని జిల్లా పరిషతు ముఖ్య కార్యనిర్వహణాధికారి శోభారాణి, ఆదనపు డీఆర్డీవో జి.సురేష్, సూచించారు. -
ప్రథమంలో 26.. ద్వితీయంలో 25
[ 25-04-2024]
ఇంటర్ పరీక్ష ఫలితాల్లో బాలికలు సత్తా చాటారు. 2022-23లో జిల్లా ఉత్తీర్ణత శాతం 57 ఉండగా, ప్రస్తుతం 54.50 శాతానికి పడిపోయింది. -
ఊపందుకున్న నామినేషన్ల పర్వం
[ 25-04-2024]
నల్గొండ, భువనగిరి లోక్సభ స్థానాలకు బుధవారం వరకు 45 మంది చొప్పున నామినేషన్లు వేశారు. -
గిరిజన గురుకులాల్లో 88.60శాతం ఉత్తీర్ణత
[ 25-04-2024]
ఇంటర్ ఫలితాల్లో తెలంగాణ ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇనిస్టిట్యూషనల్ సొసైటీ ఆధ్వర్యంలో నల్గొండ, సూర్యాపేట జిల్లాల్లో కలిపి ఇంటర్ ద్వితీయ సంవత్సరంలో 88.60శాతం ఫలితాలు -
మతోన్మాద భాజపాను ఓడించండి: సీపీఐ
[ 25-04-2024]
దేశంలో మతోన్మాదం పేరుతో రాజకీయాలు చేస్తున్న భాజపాను ఓడించి కాంగ్రెస్ అభ్యర్ధులను భారీ మెజార్టీతో గెలిపించాలని సీపీఐ జాతీయ సమితి సభ్యుడు పల్లా వెంకట్రెడ్డి పిలుపునిచ్చారు. -
విభజన హామీల అమలుకు కృషి
[ 25-04-2024]
భువనగిరి లోక్సభ ఎంపీగా తనను గెలిపిస్తే విభజన హామీలను అమలు చేసేందుకు, నిధులు రాబట్టేందుకు కృషి చేస్తానని భువనగిరి లోక్సభ నియోజకవర్గ కాంగ్రెస్ అభ్యర్థి చామల కిరణ్కుమార్రెడ్డి అన్నారు. -
తొలి ఎన్నికలోనే అత్యధిక మెజారిటీ
[ 25-04-2024]
నల్గొండ లోక్సభ నియోజకవర్గం 1951లో ఏర్పడగా.. తొలి ఎన్నికలు 1952లో జరిగాయి. -
రైల్వే ఉద్యోగాలు ఇప్పిస్తానని మోసం, వ్యక్తి అరెస్ట్
[ 25-04-2024]
రైల్వేశాఖలో ఉద్యోగాలు ఇప్పిస్తానని 17 మంది బాధితుల నుంచి నగదు వసూలు చేసిన వ్యక్తిని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించినట్టు పోలీస్ ఇన్స్పెక్టర్ అశోక్రెడ్డి తెలిపారు.
తాజా వార్తలు (Latest News)
-
విజయ్ మాల్యా అప్పుడు అలా అనడంతోనే..: కుంబ్లే
-
ఎక్స్ట్రా ఫీజుతో జొమాటోలో ఇక ఫాస్ట్ డెలివరీలు సేవలు..!
-
మస్క్ పేరుతో మస్కా.. మహిళకు రూ.41 లక్షలకు సైబర్ నేరగాడు టోకరా
-
మాజీ క్రికెటర్పై చిరుత దాడి.. కాపాడిన పెంపుడు శునకం
-
‘ఆ బ్లీచ్ జుట్టుకు చేరినట్టుంది’: ట్రంప్పై బైడెన్ వ్యక్తిగత విమర్శలు
-
323km రేంజ్.. 155km టాప్ స్పీడ్తో అల్ట్రావయోలెట్ కొత్త ఎలక్ట్రిక్ బైక్