logo

ద్విచక్రవాహనం అదుపు తప్పి యువకుడు మృతి

తన స్నేహితుడిని ద్విచక్ర వాహనంపై అతడి స్వగ్రామంలో విడిచిపెట్టడానికి వెళ్లి తిరుగు ప్రయాణంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతిచెందిన ఘటన పెద్దవూర మండలం పోతునూరు

Published : 19 Jan 2022 04:17 IST

కలుకూరి మధు

పెద్దవూర(రూరల్‌), న్యూస్‌టుడే: తన స్నేహితుడిని ద్విచక్ర వాహనంపై అతడి స్వగ్రామంలో విడిచిపెట్టడానికి వెళ్లి తిరుగు ప్రయాణంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతిచెందిన ఘటన పెద్దవూర మండలం పోతునూరు గ్రామంలో మంగళవారం చోటుచేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం.. పెద్దవూర మండలం బట్టుగూడెం గ్రామానికి చెందిన కలుకూరి మధు (25).. ముసలమ్మచెట్టు గ్రామం వద్ద కొంతకాలం నుంచి ఫాస్ట్‌ఫుడ్‌ సెంటర్‌ నడుపుతూ జీవనం సాగిస్తున్నాడు. పెద్దఅడిశర్లపల్లి మండలం రంగారెడ్డిగూడెం గ్రామానికి చెందిన అతడి స్నేహితుడు తనని బైక్‌పై దింపి రావాలని కోరడంతో మధు వెళ్లి తిరుగుపయనమయ్యారు. కోదాడ-జడ్చర్ల హైవే రోడ్డు మరమ్మతులు చేస్తున్నందున బైక్‌ అదుపు తప్పి మట్టికుప్పలపై దూసుకెళ్లింది. ఈ క్రమంలో రోడ్డుపై పడిపోయిన మధు తలకు బలమైన గాయాలు కావడంతో అక్కడికక్కడే మృతిచెందినట్లు ఎస్సై పచ్చిపాల పరమేష్‌ తెలిపారు. మధుకు వివాహం కాలేదని, తల్లిదండ్రులు, తోబుట్టువులు ఎవరూ లేరని చెప్పారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని