ఉద్యానవనాలపై నిర్లక్ష్యపు నీడ
ప్రజలకు ఆహ్లాదం పంచటంతో పాటు తీరిక సమయాల్లో సేద తీరేందుకు వీలుగా పురపాలికల్లో ఉద్యానవనాల ఏర్పాటుకు శ్రీకారం చుట్టారు. పాత పురపాలక సంఘాల్లో పార్కులు ఉన్నా నిర్వహణ అంతంత మాత్రంగానే ఉంది. కొన్ని చోట్ల నిర్మాణ దశలోనే ఉండగా మరికొన్ని చోట్ల నిర్మాణం పూర్తయినప్పటికీ నిర్లక్ష్యం కారణంగా ప్రారంభానికి నోచుకోవటం లేదు.
చండూరు పురపాలికలో గడ్డిమొక్కలు పెరిగి అధ్వానంగా మారిన ఉద్యానవనం
చండూరు, న్యూస్టుడే: ప్రజలకు ఆహ్లాదం పంచటంతో పాటు తీరిక సమయాల్లో సేద తీరేందుకు వీలుగా పురపాలికల్లో ఉద్యానవనాల ఏర్పాటుకు శ్రీకారం చుట్టారు. పాత పురపాలక సంఘాల్లో పార్కులు ఉన్నా నిర్వహణ అంతంత మాత్రంగానే ఉంది. కొన్ని చోట్ల నిర్మాణ దశలోనే ఉండగా మరికొన్ని చోట్ల నిర్మాణం పూర్తయినప్పటికీ నిర్లక్ష్యం కారణంగా ప్రారంభానికి నోచుకోవటం లేదు. ఇక కొత్త పురపాలికల్లో ఓపెన్ జిమ్లు ఊసే లేకుండా పోయింది. కొన్నింటిలో నిధులు మంజూరు చేసి చేతులు దులుపుకొంటున్నారు. సెలవు రోజుల్లో ఆహ్లాదంతో పాటు వ్యాయామం కోసం జిమ్ చేసుకోవటానికి బయటికి వెళ్లేందుకు పార్కులు, జిమ్లు లేని పరిస్థితి.
కొత్త పురపాలికల్లో చాలా వరకు ఎక్కడ పార్కులు, జిమ్లు లేవు. ప్రభుత్వ విద్యాసంస్థలకు చెందిన ఆట స్థలాల్లోనే ప్రజలు వాకింగ్ చేయటం, ఉదయం, సాయంత్రం వేళలో వచ్చి కూర్చొని సేదతీరుతున్నారు. వాహనాల రాకపోకలతో ప్రమాదమని తెలిసి కూడా చాలా వరకు రోడ్ల వెంట కూడా వాకింగ్ చేస్తున్నారు. ప్రైవేటుగా జిమ్లు కూడా అందుబాటులో ఉండవు. ఇళ్ల వద్దనే తోచిన వ్యాయామాలు చేస్తున్నారు. నిజానికి పురపాలికల్లో వాకింగ్ ట్రాక్లను కూడా నిర్మించాల్సి ఉంది. ఎవరూ పట్టించుకోవటం లేదు. ఇప్పటికైన అనువైన ప్రభుత్వ స్థలాలను గుర్తించి వీలైనంత ఎక్కువ చోట్ల ఉద్యానవనాలు, ఓపెన్ జిమ్లు ఏర్పాటు చెయ్యాలని ప్రజలు కోరుతున్నారు.
ఇదీ పరిస్థితి
* చండూరు పురపాలికలో పోలీసు ఠాణా పక్కన పార్కు నిర్మాణం పూర్తి కావొచ్చి నెలలు గడుస్తున్న ప్రారంభించే తీరుబాటు పాలకవర్గానికి లేకుండా పోయిందని స్థానికంగా విమర్శలు వినిపిస్తున్నాయి. ప్రభుత్వ డిగ్రీ కళాశాల పక్కన పార్కు నిర్మాణం దాదాపుగా పూర్తయ్యింది. పనులు ఆగిపోవటంతో ప్రస్తుతం పిచ్చిమొక్కలు పెరిగి అధ్వానంగా మారింది. ఇక ప్రభుత్వ జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాల మైదానంతో పాటు ఇతర ఖాళీ స్థలాల్లో ఓపెన్ జిమ్లు, వాకింగ్ ట్రాక్ వేయాలని స్థానికంగా కోరుతున్నా ఎవరు పట్టించుకోవటం లేదు.
* దేవరకొండ పురపాలికలో పార్కు నిర్మాణం కొనసాగుతోంది. రెండు ఓపెన్ జిమ్లు ఉన్నాయి.
* చిట్యాలలో రూ.32లక్షల అంచనాతో ఎకరం విస్తీర్ణంలో ఓపెన్ జిమ్, పార్కు పనులు చేపట్టారు. ఇంకా పూర్తి కాలేదు.
* సాగర్లో ఓపెన్ జిమ్లు లేవు, పార్కులు నిరుపయోగంగా ఉన్నాయి.
* మిర్యాలగూడలో ఓపెన్ జిమ్లు 6 ఉన్నాయి. నిర్వహణ లోపంతో పరికరాలు మరమ్మతులకు గురయ్యాయి.
* హాలియాలో పురపాలికలో పాత పశువుల సంతలో 2019లో మంత్రి జగదీశ్రెడ్డి రూ.18 లక్షలతో చిన్న పిల్లల పార్కు, ఓపెన్ జిమ్ నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. చుట్టు కంచె కూడా వేశారు. రెండేళ్లుగా నిలిచిపోయాయి.
* నేరుడుచర్లలో ఎకరం స్థలంలో పార్కు నిర్మాణానికి రూ.64 లక్షలు మంజూరు చేశారు. త్వరలోనే పనులు ప్రారంభం కానున్నాయి. ఓపెన్ జిమ్లకు నిధులు మంజూరు కాలేదు.
* చౌటుప్పల్లో ఓపెన్ జిమ్లు ఏర్పాటు కాలేదు. 3 మియావాకి పార్కులు 1.30 ఎకరాల్లో ఏర్పాటు చేశారు.
* ఆలేరు, యాదగిరిగుట్ట, మోత్కూరు, తిరుమలగిరి, పోచంపల్లి పార్కులు, ఓపెన్ జిమ్లు లేవు
పార్కులు ప్రారంభిస్తాం
- వెంకట్రాం, కమిషనర్, చండూరు పురపాలిక
చండూరులో రెండు పార్కుల నిర్మాణాలు తుది దశకు చేరుకున్నాయి. కొన్ని అనివార్య కారణాలతో ప్రారంభంలో జాప్యం జరిగింది. త్వరలోనే ప్రారంభించేందుకు తగిన చర్యలు తీసుకుంటాం. ఓపెన్ జిమ్లు ఏర్పాటు చేయమని పై నుంచి ఆదేశాలు ఏమి లేవు. దీనిపై కౌన్సిల్ సమావేశంలో చర్చిస్తాం. నూతన పురపాలిక కావటంతో కొన్ని మౌలిక సదుపాయాలు కల్పించేందుకు నిధులు, అనుమతులు రావటంలో కొంత మేర ఇబ్బందులు ఎదురవుతుంటాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ప్రభుత్వంపై విమర్శ.. రైతులకు భరోసా
[ 25-04-2024]
లోక్సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా బస్సుయాత్ర చేస్తున్న మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ దానిని ఉమ్మడి జిల్లా నుంచే ప్రారంభించడంతో.. భారాస నేతలు పెద్దఎత్తున ఏర్పాట్లు చేశారు. -
బాలికలు.. భళా
[ 25-04-2024]
విద్యార్థులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఇంటర్ ఫలితాలు విడుదలయ్యాయి. -
మోదీతో తెలంగాణకు తీరని అన్యాయం
[ 25-04-2024]
కేంద్ర ప్రభుత్వం, ప్రధాని మోదీ తెలంగాణకు తీరని అన్యాయం చేశారని నల్గొండ లోక్సభ ఇన్ఛార్జి, మంత్రి నల్లమాద ఉత్తమ్కుమార్రెడ్డి ఆరోపించారు. -
బాలికలదే హవా
[ 25-04-2024]
రాష్ట్ర వ్యాప్తంగా ఇంటర్ ప్రథమ, ద్వితీయ సంవత్సరం పరీక్ష ఫలితాలు బుధవారం విడుదలయ్యాయి. -
ఉపాధి కూలీల సౌకర్యాలపై సమీక్ష
[ 25-04-2024]
పని ప్రదేశాలలో ఉపాధి కూలీలకు మౌలిక సౌకర్యాలు సమకూర్చాలని జిల్లా పరిషతు ముఖ్య కార్యనిర్వహణాధికారి శోభారాణి, ఆదనపు డీఆర్డీవో జి.సురేష్, సూచించారు. -
ప్రథమంలో 26.. ద్వితీయంలో 25
[ 25-04-2024]
ఇంటర్ పరీక్ష ఫలితాల్లో బాలికలు సత్తా చాటారు. 2022-23లో జిల్లా ఉత్తీర్ణత శాతం 57 ఉండగా, ప్రస్తుతం 54.50 శాతానికి పడిపోయింది. -
ఊపందుకున్న నామినేషన్ల పర్వం
[ 25-04-2024]
నల్గొండ, భువనగిరి లోక్సభ స్థానాలకు బుధవారం వరకు 45 మంది చొప్పున నామినేషన్లు వేశారు. -
గిరిజన గురుకులాల్లో 88.60శాతం ఉత్తీర్ణత
[ 25-04-2024]
ఇంటర్ ఫలితాల్లో తెలంగాణ ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇనిస్టిట్యూషనల్ సొసైటీ ఆధ్వర్యంలో నల్గొండ, సూర్యాపేట జిల్లాల్లో కలిపి ఇంటర్ ద్వితీయ సంవత్సరంలో 88.60శాతం ఫలితాలు -
మతోన్మాద భాజపాను ఓడించండి: సీపీఐ
[ 25-04-2024]
దేశంలో మతోన్మాదం పేరుతో రాజకీయాలు చేస్తున్న భాజపాను ఓడించి కాంగ్రెస్ అభ్యర్ధులను భారీ మెజార్టీతో గెలిపించాలని సీపీఐ జాతీయ సమితి సభ్యుడు పల్లా వెంకట్రెడ్డి పిలుపునిచ్చారు. -
విభజన హామీల అమలుకు కృషి
[ 25-04-2024]
భువనగిరి లోక్సభ ఎంపీగా తనను గెలిపిస్తే విభజన హామీలను అమలు చేసేందుకు, నిధులు రాబట్టేందుకు కృషి చేస్తానని భువనగిరి లోక్సభ నియోజకవర్గ కాంగ్రెస్ అభ్యర్థి చామల కిరణ్కుమార్రెడ్డి అన్నారు. -
తొలి ఎన్నికలోనే అత్యధిక మెజారిటీ
[ 25-04-2024]
నల్గొండ లోక్సభ నియోజకవర్గం 1951లో ఏర్పడగా.. తొలి ఎన్నికలు 1952లో జరిగాయి. -
రైల్వే ఉద్యోగాలు ఇప్పిస్తానని మోసం, వ్యక్తి అరెస్ట్
[ 25-04-2024]
రైల్వేశాఖలో ఉద్యోగాలు ఇప్పిస్తానని 17 మంది బాధితుల నుంచి నగదు వసూలు చేసిన వ్యక్తిని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించినట్టు పోలీస్ ఇన్స్పెక్టర్ అశోక్రెడ్డి తెలిపారు.
తాజా వార్తలు (Latest News)
-
టీ20 ప్రపంచకప్నకు టీమ్ ఇండియాను మీరే ఎంపిక చేయండి!
-
సరిహద్దు దాటిన మానవత్వం.. భారతీయుడి దానంతో పాక్ యువతికి కొత్త జీవితం
-
టీ20 వరల్డ్ కప్.. ‘‘ధోనీ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇస్తే బాగుంటుంది’’
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (25/04/24)
-
ఎన్నికల బరిలో ‘పొలిమేర’ నటి..
-
శిక్షణ నుంచి తప్పించుకున్న గుర్రాలు.. లండన్ వీధుల్లో హల్చల్!