అద్దె గదుల్లోనే కొత్త పంచాయతీలు
గిరిజనులను అభివృద్ధి చేయాలని, వారు నివసించే తండాల్లో అన్ని సౌకర్యాలు కల్పించాలని రాష్ట్ర ప్రభుత్వం తండాలను గ్రామ పంచాయతీలుగా ఏర్పాటు చేసింది. మూడేళ్లయినా ఇప్పటి వరకు పంచాయతీలుగా రూపొందిన తండాల్లో సమస్యలు పరిష్కారం కావడం లేదు. అనేక పంచాయతీలకు ఇంకా రహదారి సౌకర్యం లేదు. గ్రామాల్లో కాలువలు లేక వీధుల్లో మురుగునీరు పారుతోంది.
నల్గొండ కలెక్టరేట్, తుర్కపల్లి, న్యూస్టుడే: గిరిజనులను అభివృద్ధి చేయాలని, వారు నివసించే తండాల్లో అన్ని సౌకర్యాలు కల్పించాలని రాష్ట్ర ప్రభుత్వం తండాలను గ్రామ పంచాయతీలుగా ఏర్పాటు చేసింది. మూడేళ్లయినా ఇప్పటి వరకు పంచాయతీలుగా రూపొందిన తండాల్లో సమస్యలు పరిష్కారం కావడం లేదు. అనేక పంచాయతీలకు ఇంకా రహదారి సౌకర్యం లేదు. గ్రామాల్లో కాలువలు లేక వీధుల్లో మురుగునీరు పారుతోంది.
కొత్త పంచాయతీలకు ఇప్పటివరకు సొంత భవనాలు నిర్మించలేదు. ఉమ్మడి జిల్లాలో 1740 గ్రామ పంచాయతీలున్నాయి. వీటిలో 561 కొత్తగా ఏర్పాటయ్యాయి. ఉమ్మడి జిల్లాలో 673 పంచాయతీలకు సొంత భవనాలు లేక అద్దె భవనాల్లో కొనసాగుతున్నాయి. పంచాయతీ కార్యాలయాలను అసౌకర్యాలతో అద్దె భవనాల్లో నిర్వహిస్తున్నారు. అనేక తండాల్లోని పంచాయతీలను ఒక గది అద్దెకు తీసుకుని కొనసాగిస్తున్నారు. కనీసం పంచాయతీ సమావేశాలు నిర్వహించుకునేందుకు వసతి లేక అద్దె గదుల ఆవరణల్లో, సమీపంలోని చెట్ల కింద సమావేశాలు నిర్వహించాల్సిన పరిస్థితి ఉంది. కొన్ని అద్దె భవన పంచాయతీల్లో వర్షమొస్తే అందులో ఉండే పరిస్థితి లేదు. కొన్ని శిథిలావస్థకు చేరాయి. కార్యాలయ దస్త్రాలు, ఇతర సామగ్రిని భద్రపర్చడంలో సమస్యలు ఏర్పడుతున్నట్లు పలువురు కార్యదర్శులు పేర్కొంటున్నారు.
సమావేశాలు ఆరుబయట నిర్వహిస్తున్నాం
- అర్జున్సింగ్, సర్పంచి, మోత్యతండా, చందంపేట మండలం
కొత్తగా ఏర్పాటు జరిగిన గ్రామ పంచాయతీలకు వెంటనే సొంత భవనాలు నిర్మించాలి. వసతి లేక సమావేశాలు ఆరుబయట నిర్వహించాల్సి వస్తోంది. సమస్యలు పరిష్కరించేందుకు ప్రభుత్వం కొత్త పంచాయతీలకు ప్రత్యేక నిధులు కేటాయించాలి. తాగునీటి వసతి, రోడ్లు, మురుగు కాల్వల నిర్మాణం చేపట్టాలి. పల్లె ప్రగతి కార్యక్రమంలో పలు అభివృద్ధి పనులు చేపట్టడం జరిగింది.
అద్దె చెల్లింపు భారంగా మారింది
- పూజార్ల ఆదిలక్ష్మీ, ఆరెగూడెం సర్పంచి, తిప్పర్తి మండలం
గ్రామ పంచాయతీకి సొంతభవనం లేకపోవడంతో ఇబ్బ ందులు ఎదురవుతున్నాయి. అద్దె భవనంలో పంచాయతీ నిర్వహించాల్సి వస్తోంది. అద్దె చెల్లింపు పంచాయతీకి భారంగా మారింది. సౌకర్యాలు సక్రమంగా లేవు. ఒక్క గదిలోనే కార్యాలయం నిర్వహించాల్సి వస్తోంది. కొత్త పంచాయతీ భవనానికి ప్రభుత్వం ని ధులు కేటాయించాలి.
నిధులు తక్కువే..
తక్కువ జనాభాతో ఏర్పాటైన కొత్త పంచాయతీలను నిధుల కొరత పీడిస్తోంది. ఆర్థిక సంఘం నిధులు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు జనాభా ప్రాతిపదికన కేటాయిస్తారు. దీంతో తక్కువ జనాభా కలిగి ఉన్న పంచాయతీలకు తక్కువ నిధులు మంజూరు కావడంతో సమస్యలు పరిష్కరించేందుకు వచ్చే నిధులు సరిపోవడం లేదు. కొత్తగా ఏర్పాటు జరిగిన పంచాయతీల్లో పన్నుల వసూలు అంతంతమాత్రంగానే జరుగుతుంది. ఫలితంగా నిధుల కొరత ఏర్పడుతోంది. దీనికి తోడు విద్యుత్తు బిల్లులు, సిబ్బంది వేతనాలు, కార్యాలయ భవనాలకు అద్దె చెల్లించడం వంటి ఆర్థిక సమస్యలు ఎదుర్కొంటున్నారు.
సొంత భవనం లేని పంచాయతీలు
కొత్త పంచాయతీలు మొత్తం
పంచాయతీలు
342
844
349
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
దాహం కేకలు తీర్చేందుకు...తరలి వస్తున్న కృష్ణమ్మ
[ 19-04-2024]
నాగార్జునసాగర్ జలాశయం డెడ్స్టోరేజీ దిగువకు చేరినా వేసవిలో హైదరాబాద్ జంట నగరాలు, జిల్లా వాసుల దాహం కేకలు తీర్చేందుకు కృష్ణాజలాల సరఫరాకు హెచ్ఎండబ్ల్యూఎస్ఎస్బీ (జలమండలి) అధికారులు చేపడుతున్న చర్యలు సఫలీకృతమయ్యాయి -
సైబర్ బాధితులకు వారియర్స్ తోడు
[ 19-04-2024]
చరవాణుల ద్వారా డిజిటల్ లావాదేవీలు పెరగడంతో నిత్యం ఎక్కడో చోట అమాయకులు సైబర్ నేరగాళ్ల వలలో పడి ఆర్థికంగా నష్టపోతున్నారు. -
రాష్ట్రంలోనే ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దుతా: మంత్రి ఉత్తమ్
[ 19-04-2024]
కోదాడ నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసి రాష్ట్రంలోనే ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దుతానని నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి అన్నారు. -
గాడితప్పిన గస్తీ
[ 19-04-2024]
జిల్లాలో దొంగలు రెచ్చిపోతున్నారు. వరుసగా గొలుసు చోరీలకు పాల్పడుతున్నారు. నిఘా పటిష్ఠం చేసి దొంగలను పట్టుకోవడంలో పోలీసులు విఫలమవుతున్నారు. -
ఆలయ భద్రతపై ఇంత నిర్లక్ష్యమా!
[ 19-04-2024]
యాదాద్రి పుణ్యక్షేత్రాన్ని నిత్యం వేల సంఖ్యలో భక్తులు సందర్శిస్తుంటారు. ఆలయంలోకి ప్రవేశించే ప్రతి ఒక్కరిని క్షుణ్ణంగా తనిఖీ చేసిన తరువాతే లోనికి అనుమతించేందుకు బ్యాగేజ్ స్కానింగ్, మెటల్ డిటెక్టర్, తదితర భద్రతా పరికరాలను వైటీడీఏ కొనుగోలు చేసింది. -
భక్తవత్సలుడికి సంప్రదాయ ఆరాధనలు
[ 19-04-2024]
యాదాద్రి పుణ్యక్షేత్రంలో గురువారం స్వయంభువులైన పంచనారసింహులను ఆరాధిస్తూ చేపట్టిన నిత్య పూజలు ఆలయ ఆచారంగా కొనసాగాయి -
కేసీఆర్కు సీఎం రేవంత్రెడ్డే సరైనోడు: రాజగోపాల్రెడ్డి
[ 19-04-2024]
తెలంగాణ ఇచ్చిన పదేళ్ల తర్వాత కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందని.. ఆలస్యం అయినా ప్రవేశపెట్టిన పథకాలను నెరవేర్చి.. రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలోకి తీసుకెళ్తామని భువనగిరి లోక్సభ ఇన్ఛార్జి, స్థానిక ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి అన్నారు. -
నాయకులొస్తున్నారు..!
[ 19-04-2024]
ఉమ్మడి జిల్లాలోని రెండు లోక్సభ స్థానాలైన నల్గొండ, భువనగిరిలో నామినేషన్ దాఖలు సందర్భంగా భారీ ఎత్తున ర్యాలీలు, సభలు నిర్వహించాలని అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష పార్టీలు భారాస, భాజపాలు నిర్ణయించాయి -
67 ఏళ్లలో 69 శాతమే!
[ 19-04-2024]
నల్గొండ లోక్సభ నియోజకవర్గం 1952లో ఏర్పడగా.. 2019 వరకు 17 సార్లు ఎన్నికలు జరిగాయి. 2019 నాటికి నియోజకవర్గానికి తొలి ఎన్నికలు జరిగి 67 ఏళ్లు గడిచాయి -
నల్గొండలో నలుగురు, భువనగిరిలో ముగ్గురు
[ 19-04-2024]
లోక్సభ ఎన్నికలకు నామినేషన్ల పర్వం మొదలైంది. తొలి రోజు గురువారం నల్గొండ లోక్సభ స్థానానికి నలుగురు అభ్యర్థులు ఆరు సెట్లు నామినేషన్లను రిటర్నింగ్ అధికారి, నల్గొండ జిల్లా కలెక్టరు హరిచందనకు అందజేశారు. -
నల్గొండ.. నాయకులకు అండ!
[ 19-04-2024]
నల్గొండ లోక్సభ నియోజకవర్గానికి 18వ సారి ఎన్నికలు జరుగనున్నాయి. ఉమ్మడి జిల్లాలో తొలిసారి ఏర్పడిన ఏకైక లోక్సభ నియోజకవర్గం నల్గొండ మాత్రమే. -
పార్లమెంటు.. ఎంపీ అంటే తెలుసా
[ 19-04-2024]
లోక్సభ ఎన్నికలకు సమయం దగ్గరపడుతోంది. ఇప్పటికే ప్రధాన పార్టీల అభ్యర్థులు తమదైన శైలిలో సమావేశాలు నిర్వహిస్తూ ఓటర్లను మచ్చిక చేసుకునే ప్రయత్నంలో ఉన్నారు -
వ్యాను ఢీకొని రైతు మృతి
[ 19-04-2024]
ద్విచక్రవాహనాన్ని వ్యాను ఢీకొనడంతో రైతు మృతి చెందిన ఘటన మఠంపల్లి మండలం రఘునాథపాలెం పరిధిలోని వెంకటాయపాలెంలో గురువారం జరిగింది. -
ఇంటి మీద.. అవార్డుల పంట
[ 19-04-2024]
మిద్దె తోటలు.. ఆరోగ్యానికి ఉపయోగపడే కూరగాయలతో పాటు పురస్కారాలనూ తీసుకొస్తున్నాయి.
తాజా వార్తలు (Latest News)
-
సిద్దిపేటలో సెర్ప్ ఉద్యోగుల సస్పెన్షన్పై హైకోర్టు స్టే
-
తొలి విడత పోలింగ్.. కొన్ని రాష్ట్రాల్లో ఉద్రిక్తతలు..!
-
చంద్రబాబు తరఫున నామినేషన్ వేసిన నారా భువనేశ్వరి
-
మమ్ముట్టితో విభేదాలు.. స్పందించిన ‘ది వారియర్’ దర్శకుడు
-
ట్రెక్కింగ్ చేస్తూ జారిపడి.. స్కాట్లాండ్లో ఇద్దరు తెలుగు విద్యార్థుల మృతి
-
మీ ప్రాంతంలో బ్రాడ్బ్యాండ్ సేవలందించే సంస్థలేవో ఎలా తెలుసుకోవాలి?