జిజ్ఞాసతో సృజనాత్మకత వెలికితీత
విద్యార్థి జీవితంలో స్థిరపడాలంటే ఇంటర్మీడియట్ తర్వాత వేసే అడుగు చాలా కీలకమైనది. వారు డిగ్రీలో ఎంచుకున్న సబ్జెక్టు, తీసుకునే నిర్ణయాలు భవిష్యత్ను ప్రతిబింబిస్తాయి. వారిలో ప్రతిభను వెలికితీసేందుకు కళాశాల జీవితం ముఖ్యమైనది. విద్యార్థులు వారు ఎంచుకున్న సబ్జెక్టుల్లో నూతన ఆవిష్కరణలు
ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 77 ప్రదర్శనలు
కోదాడ, న్యూస్టుడే: విద్యార్థి జీవితంలో స్థిరపడాలంటే ఇంటర్మీడియట్ తర్వాత వేసే అడుగు చాలా కీలకమైనది. వారు డిగ్రీలో ఎంచుకున్న సబ్జెక్టు, తీసుకునే నిర్ణయాలు భవిష్యత్ను ప్రతిబింబిస్తాయి. వారిలో ప్రతిభను వెలికితీసేందుకు కళాశాల జీవితం ముఖ్యమైనది. విద్యార్థులు వారు ఎంచుకున్న సబ్జెక్టుల్లో నూతన ఆవిష్కరణలు వెలికితీసేందుకు ప్రభుత్వం ప్రతి ఏటా ‘జిజ్ఞాస ప్రదర్శన’ల ద్వారా అవకాశం కల్పిస్తుంది. ఇందులో ప్రతిభ కనబరిచిన ప్రభుత్వ డిగ్రీ విద్యార్థులకు నగదుతో పాటు ప్రోత్సాహక బహుమతులు లభిస్తాయి. ఈ ఏడాది ఉమ్మడి జిల్లాలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల విద్యార్థులు తమ ప్రదర్శనలు పంపించారు. వచ్చే నెలలో వాటి ఫలితాలు రానున్నాయి. ఈ నేపథ్యంలో జిజ్ఞాస ప్రదర్శనలపై ‘న్యూస్టుడే’ కథనం.
గతంలో పీజీ, పీహెచ్డీ విద్యార్థులకు మాత్రమే వారు చదివే సబ్జెక్టుల ఆధారంగా ఈ ప్రదర్శనలు అందుబాటులో ఉండేవి. 2016-17 విద్యా సంవత్సరం నుంచి సీసీఈ( కమిషనరేట్ ఆఫ్ కాలేజీయేట్ ఎడ్యుకేషన్) వారు జిజ్ఞాస పేరిట ఈ కార్యక్రమాన్ని అమలు చేస్తున్నారు. దీంతో డిగ్రీ చదివే విద్యార్థులకు తమ సబ్జెక్టులకు సంబంధించిన పరిశోధనలు చేసే అవకాశం లభించింది. ప్రతి ఏడాది రాష్ట్రంలో కేవలం ప్రభుత్వ డిగ్రీ కళాశాల విద్యార్థులు మొత్తం 17 సబ్జెక్టుల్లో ఈ ప్రదర్శనలు చేయవచ్ఛు
నగదు ప్రోత్సాహం..
ప్రతి సబ్జెక్టుకు సంబంధించిన అయిదుగురు విద్యార్థులు ఒక బృందంగా ఏర్పడి ప్రాజెక్టును తయారు చేస్తారు. బృందానికి పర్యవేక్షకుడిగా సబ్జెక్టు అధ్యాపకుడు ఉంటారు. మొదటి సారిగా కళాశాల స్థాయిలో ఎంపికైన తర్వాత అదే ప్రదర్శనను ఐదు నిమిషాల వీడియోలో పొందుపరచాలి. ఆ వీడియోను రాష్ట్ర స్థాయి ఎంపిక జరిగే పోటీలకు పంపిస్తారు. ఈ ప్రాజెక్టుల్లో భాగస్వామ్యం కావాలంటే విద్యార్థులు ఎంచుకున్న సబ్జెక్టుకు అనుబంధగా సమకాలీన, వినూత్న అంశాలు ఉండాలి. ఆ ప్రాజెక్టును క్షేత్రస్థాయిలో విద్యార్థులు పరిశీలించాలి. రాష్ట్ర స్థాయిలో శాస్త్రవేత్తలు, అద్యాపకులు న్యాయనిర్ణేతలుగా ఉంటారు. ఈ పోటిల్లో గెలుపొందిన వారికి మొదటి బహుమతిగా బృందానికి రూ. 30 వేలు, పర్యవేక్షకుడికి రూ. ఐదు వేలు, ద్వితీయ బహుమతి పొందిన బృందానికి రూ. 18వేలు, పర్యవేక్షకుడికి రూ. మూడు వేలు, తృతీయ స్థానంలో నిలిచిన వారికి ప్రశంసా పత్రం అందజేస్తారు.
ఇదొక మంచి అవకాశం
- నాగు, ప్రిన్సిపల్, కేఆర్ఆర్ డిగ్రీ కళాశాల, కోదాడ
ప్రభుత్వ కళాశాలలో చదివే విద్యార్థులకు జిజ్ఞాన ప్రదర్శనల ద్వారా ప్రభుత్వం ఈ అవకాశం కల్పిస్తోంది. గతేడాది కరోనా విజృంభణతో ఈ ప్రదర్శనలు చేయలేదు. ఈ ఏడాది ప్రదర్శనలు చేసి వీడియో రూపంలో పంపించాం. విద్యార్థులో దాగి ఉన్న సృజనాత్మకత వెలికి తీసేందుకు ఇదొకటి చక్కటి అవకాశం.
జిల్లా డిగ్రీ విద్యార్థులు పంపించిన కళాశాలలు ప్రదర్శనలు
నల్గొండ 6 8,950 51
సూర్యాపేట 2 1,213 17
యాదాద్రి 2 760 9
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
భాజపా ఓటమే లక్ష్యం: బీవీ రాఘవులు
[ 19-04-2024]
భాజపా మతోన్మాద విధానాలను ఎదిరించి పోరాడేందుకు సీపీఎం పోటీ చేస్తుందిని పోలిట్ బ్యూరో సభ్యుడు బీవీ రాఘవులు అన్నారు. -
దాహం కేకలు తీర్చేందుకు...తరలి వస్తున్న కృష్ణమ్మ
[ 19-04-2024]
నాగార్జునసాగర్ జలాశయం డెడ్స్టోరేజీ దిగువకు చేరినా వేసవిలో హైదరాబాద్ జంట నగరాలు, జిల్లా వాసుల దాహం కేకలు తీర్చేందుకు కృష్ణాజలాల సరఫరాకు హెచ్ఎండబ్ల్యూఎస్ఎస్బీ (జలమండలి) అధికారులు చేపడుతున్న చర్యలు సఫలీకృతమయ్యాయి -
సైబర్ బాధితులకు వారియర్స్ తోడు
[ 19-04-2024]
చరవాణుల ద్వారా డిజిటల్ లావాదేవీలు పెరగడంతో నిత్యం ఎక్కడో చోట అమాయకులు సైబర్ నేరగాళ్ల వలలో పడి ఆర్థికంగా నష్టపోతున్నారు. -
రాష్ట్రంలోనే ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దుతా: మంత్రి ఉత్తమ్
[ 19-04-2024]
కోదాడ నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసి రాష్ట్రంలోనే ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దుతానని నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి అన్నారు. -
గాడితప్పిన గస్తీ
[ 19-04-2024]
జిల్లాలో దొంగలు రెచ్చిపోతున్నారు. వరుసగా గొలుసు చోరీలకు పాల్పడుతున్నారు. నిఘా పటిష్ఠం చేసి దొంగలను పట్టుకోవడంలో పోలీసులు విఫలమవుతున్నారు. -
ఆలయ భద్రతపై ఇంత నిర్లక్ష్యమా!
[ 19-04-2024]
యాదాద్రి పుణ్యక్షేత్రాన్ని నిత్యం వేల సంఖ్యలో భక్తులు సందర్శిస్తుంటారు. ఆలయంలోకి ప్రవేశించే ప్రతి ఒక్కరిని క్షుణ్ణంగా తనిఖీ చేసిన తరువాతే లోనికి అనుమతించేందుకు బ్యాగేజ్ స్కానింగ్, మెటల్ డిటెక్టర్, తదితర భద్రతా పరికరాలను వైటీడీఏ కొనుగోలు చేసింది. -
భక్తవత్సలుడికి సంప్రదాయ ఆరాధనలు
[ 19-04-2024]
యాదాద్రి పుణ్యక్షేత్రంలో గురువారం స్వయంభువులైన పంచనారసింహులను ఆరాధిస్తూ చేపట్టిన నిత్య పూజలు ఆలయ ఆచారంగా కొనసాగాయి -
కేసీఆర్కు సీఎం రేవంత్రెడ్డే సరైనోడు: రాజగోపాల్రెడ్డి
[ 19-04-2024]
తెలంగాణ ఇచ్చిన పదేళ్ల తర్వాత కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందని.. ఆలస్యం అయినా ప్రవేశపెట్టిన పథకాలను నెరవేర్చి.. రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలోకి తీసుకెళ్తామని భువనగిరి లోక్సభ ఇన్ఛార్జి, స్థానిక ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి అన్నారు. -
నాయకులొస్తున్నారు..!
[ 19-04-2024]
ఉమ్మడి జిల్లాలోని రెండు లోక్సభ స్థానాలైన నల్గొండ, భువనగిరిలో నామినేషన్ దాఖలు సందర్భంగా భారీ ఎత్తున ర్యాలీలు, సభలు నిర్వహించాలని అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష పార్టీలు భారాస, భాజపాలు నిర్ణయించాయి -
67 ఏళ్లలో 69 శాతమే!
[ 19-04-2024]
నల్గొండ లోక్సభ నియోజకవర్గం 1952లో ఏర్పడగా.. 2019 వరకు 17 సార్లు ఎన్నికలు జరిగాయి. 2019 నాటికి నియోజకవర్గానికి తొలి ఎన్నికలు జరిగి 67 ఏళ్లు గడిచాయి -
నల్గొండలో నలుగురు, భువనగిరిలో ముగ్గురు
[ 19-04-2024]
లోక్సభ ఎన్నికలకు నామినేషన్ల పర్వం మొదలైంది. తొలి రోజు గురువారం నల్గొండ లోక్సభ స్థానానికి నలుగురు అభ్యర్థులు ఆరు సెట్లు నామినేషన్లను రిటర్నింగ్ అధికారి, నల్గొండ జిల్లా కలెక్టరు హరిచందనకు అందజేశారు. -
నల్గొండ.. నాయకులకు అండ!
[ 19-04-2024]
నల్గొండ లోక్సభ నియోజకవర్గానికి 18వ సారి ఎన్నికలు జరుగనున్నాయి. ఉమ్మడి జిల్లాలో తొలిసారి ఏర్పడిన ఏకైక లోక్సభ నియోజకవర్గం నల్గొండ మాత్రమే. -
పార్లమెంటు.. ఎంపీ అంటే తెలుసా
[ 19-04-2024]
లోక్సభ ఎన్నికలకు సమయం దగ్గరపడుతోంది. ఇప్పటికే ప్రధాన పార్టీల అభ్యర్థులు తమదైన శైలిలో సమావేశాలు నిర్వహిస్తూ ఓటర్లను మచ్చిక చేసుకునే ప్రయత్నంలో ఉన్నారు -
వ్యాను ఢీకొని రైతు మృతి
[ 19-04-2024]
ద్విచక్రవాహనాన్ని వ్యాను ఢీకొనడంతో రైతు మృతి చెందిన ఘటన మఠంపల్లి మండలం రఘునాథపాలెం పరిధిలోని వెంకటాయపాలెంలో గురువారం జరిగింది. -
ఇంటి మీద.. అవార్డుల పంట
[ 19-04-2024]
మిద్దె తోటలు.. ఆరోగ్యానికి ఉపయోగపడే కూరగాయలతో పాటు పురస్కారాలనూ తీసుకొస్తున్నాయి.
తాజా వార్తలు (Latest News)
-
ఆగంతుకుడి అనుమానాస్పద కదలికలు.. ఇరాన్ కాన్సులేట్ వద్ద కలకలం!
-
ప్రైవేటు ఆస్పత్రిలో తెగిపడిన లిఫ్ట్.. 9 మందికి తీవ్ర గాయాలు
-
సీపీఎం కార్యాలయానికి భట్టి విక్రమార్క.. లోక్సభ ఎన్నికల్లో మద్దతుపై చర్చ
-
2026 నాటికి ఎయిర్ట్యాక్సీలు.. 7 నిమిషాల్లో 27 కిలోమీటర్లు!
-
‘ప్రేమలు 2’ ఫిక్స్.. రిలీజ్ ఎప్పుడంటే?
-
వేసవి రద్దీకి రైల్వే సిద్ధం.. రికార్డు స్థాయిలో 9,111 అదనపు ట్రిప్పులు!