logo

ఎరువుల ధరలు తగ్గించండి: జూలకంటి

పెంచిన ఎరువుల ధరలను తక్షణమే తగ్గించాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు జూలకంటి రంగారెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. మిర్యాలగూడలోని రైల్వే స్టేషన్‌లో ఎరువులు దిగుమతి కేంద్రాన్ని బుధవారం పరిశీలించారు. అనంతరం కార్మికులతో నిర్వహించిన సమావేశంలో మాట్లాడారు

Published : 20 Jan 2022 02:45 IST

మిర్యాలగూడలో పర్యటిస్తున్న జూలకంటి రంగారెడ్డి, తదితరులు

మిర్యాలగూడ పట్టణం, న్యూస్‌టుడే: పెంచిన ఎరువుల ధరలను తక్షణమే తగ్గించాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు జూలకంటి రంగారెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. మిర్యాలగూడలోని రైల్వే స్టేషన్‌లో ఎరువులు దిగుమతి కేంద్రాన్ని బుధవారం పరిశీలించారు. అనంతరం కార్మికులతో నిర్వహించిన సమావేశంలో మాట్లాడారు. కేంద్రం అవలంబిస్తున్న కార్మిక, రైతు వ్యతిరేక విధానాలపై పోరాటం నిర్వహించాల్సిన సమయం ఆసన్నమైందన్నారు. కార్మికులకు కనీస ఉపాధి దక్కకుండా నూతన చట్టాలు చేస్తున్నారని ఆరోపించారు. కార్యక్రమంలో డబ్బీకార్‌ మల్లేష్‌, వీరేపల్లి వెంకటేశ్వర్లు, రవినాయక్‌, మల్లు గౌతంరెడ్డి, రాగిరెడ్డి మంగారెడ్డి, బావండ్ల పాండు, వేణు తదితరులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని