logo

ఖాళీ బిందెలతో నిరసన

కాలనీలో నెలకొన్న తాగునీటి సమస్యలను తీర్చాలని డిమాండ్‌ చేస్తూ మిర్యాలగూడలోని రవీంద్రనగర్‌లో స్థానికులు ఖాళీ బిందెలతో రోడ్డుపై బుధవారం నిరసన వ్యక్తం చేశారు.

Published : 20 Jan 2022 03:08 IST

ఖాళీ బిందెలతో నిరసన వ్యక్తం చేస్తున్న రవీంద్రనగర్‌వాసులు

మిర్యాలగూడ పట్టణం, న్యూస్‌టుడే: కాలనీలో నెలకొన్న తాగునీటి సమస్యలను తీర్చాలని డిమాండ్‌ చేస్తూ మిర్యాలగూడలోని రవీంద్రనగర్‌లో స్థానికులు ఖాళీ బిందెలతో రోడ్డుపై బుధవారం నిరసన వ్యక్తం చేశారు. నిరసనకు మద్దతు పలికిన సీపీఎం రెండో పట్టణ కార్యదర్శి బావండ్ల పాండు మాట్లాడుతూ.. కాలనీ ఏర్పడి ఏళ్లు గడుస్తున్నా నేటికీ తాగునీటి సౌకర్యం కల్పించకపోవడంతో స్థానికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు. తక్షణమే తాగునీటి సమస్యను పరిష్కరించాలని.. లేనిపక్షంలో పుర కార్యాలయాన్ని ముట్టడిస్తామన్నారు. కార్యక్రమంలో నంద్యాల వేణుధర్‌రెడ్డి, సుబ్బయ్య, కమలమ్మ, నాగరాజు, జానయ్య, నర్సయ్య పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు