logo

మరోసారి సర్పంచి సస్పెన్షన్‌

నార్కట్‌పల్లి సర్పంచి దూదిమెట్ల స్రవంతిని గ్రామ పంచాయతీ నిధులు దుర్వినియోగం చేసిన కారణంగా సస్పెండ్‌ చూస్తూ కలెక్టర్‌ ప్రశాంత్‌ జీవన్‌ పాటిల్‌ ఉత్తర్వులు జారీ చేశారు. గత నెల డిసెంబర్‌ 2న ఇదే విషయమై

Published : 21 Jan 2022 02:35 IST

నార్కట్‌పల్లి గ్రామీణం, న్యూస్‌టుడే: నార్కట్‌పల్లి సర్పంచి దూదిమెట్ల స్రవంతిని గ్రామ పంచాయతీ నిధులు దుర్వినియోగం చేసిన కారణంగా సస్పెండ్‌ చూస్తూ కలెక్టర్‌ ప్రశాంత్‌ జీవన్‌ పాటిల్‌ ఉత్తర్వులు జారీ చేశారు. గత నెల డిసెంబర్‌ 2న ఇదే విషయమై డీపీవో విష్ణువర్ధన్‌రెడ్డి సర్పంచిని సస్పెండ్‌ చేయడంతో ఆమె హైకోర్టును ఆశ్రయించారు. న్యాయస్థానం స్టే ఉత్తర్వులు జారీ చేయడంతో అదే నెల 25న కలెక్టర్‌ ఆదేశాల మేరకు బాధ్యతలు స్వీకరించారు. నేటికి గ్రామ పంచాయతీ నిధులు దుర్వినియోగంపై సక్రమంగా నివేదిక ఇవ్వకపోవడంతో రెండోసారి సస్పెండ్‌ చేసినట్లు ఉత్తర్వులో తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని