ఖాళీల భర్తీపై..వీడని సందిగ్ధం
సర్కారు పాఠశాలల్లో మన ఊరు- మన బడి పేరుతో ప్రభుత్వం మౌలిక సదుపాయాల కల్పనకు ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడంతో ఓ వైపు ఆనందం వ్యక్తమవుతున్నా.. తక్షణ అవసరాలపై స్పందించకపోవడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
నల్గొండ విద్యావిభాగం, న్యూస్టుడే: సర్కారు పాఠశాలల్లో మన ఊరు- మన బడి పేరుతో ప్రభుత్వం మౌలిక సదుపాయాల కల్పనకు ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడంతో ఓ వైపు ఆనందం వ్యక్తమవుతున్నా.. తక్షణ అవసరాలపై స్పందించకపోవడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఉపాధ్యాయులు, పారిశుద్ధ్య కార్మికుల భర్తీ విషయంలో స్పష్టత రాకపోవడంతో ఆందోళన చెందుతున్నారు. గ్రామపంచాయతీ, మున్సిపల్ కార్మికులు పాఠశాలల్లో పారిశుద్ధ్య ప్రక్రియను చేపట్టాలని గతంలో ప్రభుత్వం ఆదేశాలు జారీచేసినా క్షేత్రస్థాయి అమలు కావట్లేదు. దీంతో ఉపాధ్యాయులే సొంతంగా ఖర్చుచేస్తూ పారిశుద్ధ్య చర్యలు చేపడుతున్నారు. మరోవైపు ఉపాధ్యాయుల కొరత వెంటాడుతుంది.
తీరని కొరత..
ప్రభుత్వ పాఠశాలల్లో కొవిడ్ కారణంగా విద్యార్థుల సంఖ్య విపరీతంగా పెరిగింది. 25వేల వరకు కొత్తగా విద్యార్థుల సంఖ్య పెరిగింది. గతంలో నల్గొండ జిల్లాలో దాదాపు 400 మంది వరకు విద్యావాలంటీర్లను వినియోగించి విద్యాబోధన అందించారు. కొవిడ్కు ముందు నుంచే విద్యావాలంటీర్లను తొలగించి తిరిగి విధుల్లోకి తీసుకోకపోవడంతో ఉపాధ్యాయుల కొరత తీవ్రంగా ఏర్పడింది. పెరిగిన విద్యార్థులకు అనుగుణంగా ఉపాధ్యాయులను, విద్యార్థులను సమన్వయం చేసే విషయంలో కొంత కష్టంగా మారింది. విద్యాశాఖ అధికారులు కలెక్టర్ ఆమోదంతో విద్యార్థులు ఉన్న పాఠశాలలకు ఉపాధ్యాయుల సర్ధుబాటు చేపట్టినా వాళ్లంతా వెళ్లలేదు. ఇటీవల నల్గొండ, సూర్యాపేట, యాదాద్రి భువనగిరి జిల్లాలకు ఉపాధ్యాయుల కేటాయింపు జరిపారు. నల్గొండ జిల్లా నుంచి ఎస్జీటీలు 246 మంది ఇతర జిల్లాలకు వెళ్లగా అక్కడి నుంచి దాదాపు 376 మంది నల్గొండ జిల్లాకు వచ్చారు. ఈ లెక్కన నల్గొండ జిల్లాకు అదనంగా 130 మంది కొత్తగా వచ్చారు. డిండి, చందంపేట, నేరెడుగొమ్ము, పీఏ పల్లి తదితర మండలాల్లోని కొన్ని పాఠశాలలకు కొత్తగా టీచర్లు వచ్చినా.. ఇంకా చాలా పాఠశాలల్లో ఉపాధ్యాయుల కొరత స్పష్టంగా కనిపిస్తుంది. 2015 తరువాత ఉపాధ్యాయులకు పదోన్నతులు లేకపోవడం, స్కూల్ అసిస్టెంట్ పోస్టులు ఖాళీగా ఉండటం, ఉపాధ్యాయ పోస్టుల భర్తీ చేయకపోవడం, ఎంఈవో పోస్టుల ఖాళీలుగా ఉండటం తదితర అంశాలన్ని క్షేత్రస్థాయిలో సరైన బోధనకు, పర్యవేక్షణకు అడ్డంకిగా మారాయి. జిల్లాలోని ఎంఈవో పోస్టుల్లో ఉన్నవారంతా ఇంఛార్జిలే కావడం గమనార్హం. చందంపేట, డిండి ప్రాంతాల్లో గెజిటెడ్ హెచ్ఎంలు లేక స్కూల్ అసిస్టెంట్లే ఎంఈవోలుగా వ్యవహరిస్తున్నారు. స్కూల్ అసిస్టెంట్ పోస్టులు సైతం ఖాళీలున్నాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
నీటిలోని చేపొచ్చి.. నేలమీద పడుతోంది..!
[ 28-03-2024]
తగ్గుతున్న భూగర్భ జలాలతో రైతులతో పాటు మత్స్యకారులు నష్టపోతున్నారు. ఉమ్మడి జిల్లాలోని చెరువుల నీటిమట్టాలు రోజురోజుకూ తగ్గుముఖం పడుతున్నాయి. దీంతో చెరువుల్లోని చేపలు తగినంత పరిమాణం పెరగక ముందే పట్టేసి విక్రయించాల్సిన దుస్థితి నెలకొంది. -
వారివి చుట్టపు చూపులే..!
[ 28-03-2024]
గ్రామ పంచాయతీల్లో ప్రత్యేకాధికారుల పాలన అస్తవ్యస్తంగా మారింది. ఎంపీడీవోలు, పంచాయతీరాజ్, నీటిపారుదల, పశుసంవర్థక,రెవెన్యూ, విద్యాశాఖాధికారులను క్లస్టర్ల వారీగా ప్రత్యేకాధికారులుగా ప్రభుత్వం నియమించింది. -
కోడిపిల్లల అరుపు.. వినిపించదేం..!
[ 28-03-2024]
ఉమ్మడి జిల్లా నుంచి కొందరు రాయితీ కోడి పిల్లల పథకానికి దరఖాస్తు చేసుకున్నారు. ఏడాది క్రితం రూ.1030, రూ.600 చొప్పున డీడీలు తీశారు. అప్పటి నుంచి పశుసంవర్ధక శాఖ అధికారుల చుట్టూ తిరుగుతున్నా.. -
నేటి నుంచి ధాన్యం కొనుగోళ్లు: అదనపు కలెక్టర్
[ 28-03-2024]
ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో మౌలిక సదుపాయాలు కల్పించాలని రెవెన్యూ అదనపు కలెక్టర్ శ్రీనివాస్ తెలిపారు. జిల్లాలో యాసంగి ధాన్యం కొనుగోలు కేంద్రాలు గురువారం నుంచి ప్రారంభించేందుకు సిద్ధంగా ఉన్నట్లు చెప్పారు. -
పురంలో.. దాహం తీరేలా..!
[ 28-03-2024]
ఉమ్మడి నల్గొండ జిల్లాలోని పురపాలికల్లో ప్రజల దాహార్తిని తీర్చేందుకు అమృత్-2.0 పథకం కింద కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల భాగసామ్యంతో రూ.491.46 కోట్లతో చేపట్టనున్న పనులకు సెప్టెంబరు 2023లో రాష్ట్ర పురపాలకశాఖ పరిపాలనా అనుమతి మంజూరు చేసింది. -
దగా ఆలోచనలపై.. నిఘా
[ 28-03-2024]
గత అసెంబ్లీ ఎన్నిల సందర్భంగా 28 ఏళ్ల యువకుడు భువనగిరి నియోజకవర్గంలో ప్రధాన పార్టీ అభ్యర్థికి సంబంధించిన అభ్యంతరకరమైన వీడియోను సృష్టించి సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేశాడు. -
గ్రామాల్లో డ్రోన్ కలకలం
[ 28-03-2024]
యాదాద్రి భువనగిరి జిల్లా గుండాల మండలంలోని పాచిల్ల, తుర్కలషాపురం, రామారం, వంగాల, గుండాల గ్రామాల మీదుగా నిత్యం డ్రోన్లు ఎగురవేస్తుండటంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. -
ఆట కట్టించలేరా..?
[ 28-03-2024]
జిల్లాలో జూదం జోరుకు కళ్లెం పడటం లేదు. పచ్చని కాపురాల్లో ఈ ఆట చిచ్చుపెడుతోంది. పోలీసుల దాడులకూ వెరవడం లేదు. ఈ నెల 16న ‘ఈనాడు’లో ప్రచురితమైన ‘తోటలో కాసుల వేట’... -
చివరికి అందేలా..ఆశలు నెరవేరేలా..!
[ 28-03-2024]
కొత్త ప్రభుత్వం ముక్త్యాల బ్రాంచి కాలువ పనులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. నాగార్జునసాగర్ ఎడమ కాలువ పరిధిలోని అతిపెద్ద బ్రాంచి కాలువ అయిన ముక్త్యాలకు ఆధునికీకరణ పనులు మళ్లీ మొదలయ్యాయి. -
వాడే ముందు జాగ్రత్త
[ 28-03-2024]
రోడ్డు ప్రమాదంలో కోదాడ పట్టణానికి చెందిన ఓ వ్యక్తి కాలికి స్వల్ప గాయమవడంతో పట్టణంలోని ఓ ఆస్పత్రికి వెళ్లారు. అక్కడ కాలపరిమితి దాటిన బ్యాండేజీ కాలుకి కట్టడంతో వాపు తగ్గలేదు. -
బంధం ఎందుకో.. బలహీన పడుతోంది
[ 28-03-2024]
వివాహేతర సంబంధం, వేధింపులు.. కారణం ఏదైనా కడదాక కలిసి ఉంటామని పెళ్లి మండపంలో ప్రమాణం చేసిన కొందరు మహిళలు కట్టుకున్న భర్తలను అర్ధంతరంగా కానరాని లోకాలకు పంపేస్తున్నారు. -
ప్రచార అనుమతులకు సువిధ
[ 28-03-2024]
ఓటింగ్ ప్రక్రియను సులభతరం చేయడంతో పాటు సాంకేతికతను ఉపయోగించడం ద్వారా సమయాన్ని ఆదా చేయడంతో పాటు ఎన్నికలు పారదర్శకంగా నిర్వహించేందుకు ఎన్నికల సంఘం ప్రత్యేక చర్యలు చేపడుతోంది. -
సాఫ్ట్గా రాణిస్తూ.. పతకాలు కొట్టేస్తూ..!
[ 28-03-2024]
గ్రామీణ ప్రాంతాల వారికి కబడ్డీ, ఖో ఖో, వాలీబాల్ లాంటి ఆటలు మాత్రమే ఎక్కువగా పరిచయం. సాఫ్ట్బాల్ క్రీడ చాలామందికి కొత్తదే. అయినప్పటికీ పల్లెల్లో దశాబ్దకాలంగా విద్యార్థులు ఈ క్రీడపై ఆసక్తి కనబర్చుతున్నారు. -
భువనగిరి బరిలో చామల
[ 28-03-2024]
ఎడతెగని ఉత్కంఠ నడుమ అధికార కాంగ్రెస్ పార్టీ తమ భువనగిరి లోక్సభ ఎంపీ అభ్యర్థిగా చామల కిరణ్కుమార్రెడ్డిని ప్రకటించింది. ఆయన ఇక్కడి నుంచి ఎంపీగా పోటీ చేయడం ఇదే తొలిసారి.
తాజా వార్తలు (Latest News)
-
కేజ్రీవాల్కు ఈడీ కస్టడీ పొడిగింపు.. కోర్టులో సీఎం స్వీయ వాదనలు!
-
భారీ లాభాల్లో సూచీలు.. సెన్సెక్స్ 655, నిఫ్టీ 203
-
అదితితో పెళ్లి వార్తలు.. ఫొటో షేర్ చేసిన సిద్ధార్థ్
-
నాటో దేశాలపై దాడి చేయం.. ఎఫ్-16లను మాత్రం కూల్చివేస్తాం: పుతిన్
-
రసవత్తరంగా సాగుతున్న మెగా లీగ్.. తొలి రోజు వీక్షణల్లోనూ రికార్డే
-
అనుపమ బాధపడటానికి కారణమదే: సిద్ధు జొన్నలగడ్డ