వేలం మాటున వ్యాపారమా!
పీడీఎస్ బియ్యం అక్రమార్కుల సంపాదనకు వరం. పేదల నుంచి సేకరించి వాటి ప్రాసెస్ చేసి సన్న బియ్యంగా మార్కెట్లోకి వదిలి సొమ్ము చేసుకుంటారు.
అనుమానం వ్యక్తం చేస్తున్న అధికారులు
విచారణ చేపట్టిన పోలీసులు
హుజూర్నగర్, న్యూస్టుడే
హుజూర్నగర్: పోలీస్ స్టేషన్ ఎదుట బియ్యం లారీలు
పీడీఎస్ బియ్యం అక్రమార్కుల సంపాదనకు వరం. పేదల నుంచి సేకరించి వాటి ప్రాసెస్ చేసి సన్న బియ్యంగా మార్కెట్లోకి వదిలి సొమ్ము చేసుకుంటారు. అయితే ఇటీవల పోలీసులు మత్తు పదార్థాలు, బియ్యం అక్రమ రవాణాపై ఉక్కుపాదం మోపుతున్నారు. దీన్ని పరిగణనలోకి తీసుకున్న వ్యాపారులు రూటు మార్చారు. పలు సందర్భాల్లో ప్రభుత్వం స్వాధీనం చేసుకున్న రేషన్ బియ్యాన్ని ఇటీవల కాలంలో అధికారులు వేలం ద్వారా విక్రయిస్తున్నారు. వాటిని కొద్ది మొత్తంలో దక్కించుకుని.. ఆ పత్రాలను చూపుతూ తనిఖీల సమయంలో అధికారులకు చూపుతూ భారీగా పీడీఎస్ బియ్యాన్ని ఎల్లలు దాటిస్తున్నారు. అక్రమార్జనకు తెర తీస్తున్నారు.
పత్తా లేని వ్యాపారి
హుజూర్నగర్ పట్టణంలో సోమవారం అర్థరాత్రి పోలీసులు 500 క్వింటాళ్ల బియ్యంతో మిర్యాలగూడ నుంచి కాకినాడకు వెళ్తున్న రెండు లారీలను స్వాధీనం చేసుకున్నారు. అందులో మిర్యాలగూడ ఆర్ఎస్ ట్రేడర్స్ నుంచి బియ్యం సరఫరా చేస్తున్నట్లు వేబిల్లులు లభించాయి. వాటితో పాటు ఇటీవల ఓ వ్యాపారి మంచిర్యాల జిల్లాలో జరిగిన పీడీఎస్ బియ్యం వేలం దక్కించుకున్న సరకుకు సంబంధించిన ప్రభుత్వం ఇచ్చిన అనుమతులు సైతం లభించాయి. రెండు రకాల పత్రాలు లభించడంతో పోలీసులు ప్రాథమికంగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. సదరు ఆర్ఎస్ ట్రేడర్స్ యజమానికి సమాచారం అందించారు. ఆధారాలు చూపించి లారీలు, సరకును తీసుకెళ్లాలని కోరారు. అయితే ఘటన జరిగి ఐదు రోజులవుతున్నా.. సదరు వ్యాపారి పత్తా లేడు. పోలీసులనూ సంప్రదించలేదు. అధికారులకూ ఆధారాలూ అందించలేదు. ఈ విషయంపై పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అక్రమ బియ్యం కాబట్టే వ్యాపారి రాలేదని ప్రాథమికంగా నిర్థారణకు వచ్చినట్లు తెలిసింది.
నిఘా నుంచి తప్పించుకునేందుకే..
ఘటన జరిగిన వెంటనే అధికారులు రంగంలోకి దిగారు. నిజనిజాలు తెలుసుకునేందుకు మొదటగా పౌరసరఫరాల శాఖ అధికారులకు సమాచారం అందించారు. పోలీసులు విచారణలో ఇది నయా మోసంగా తేలినట్లు సమాచారం. మిర్యాలగూడ ప్రాంతానికి చెందిన ఇద్దరూ వ్యాపారులు ఈ రకం మోసాలకు పాల్పడుతున్నట్లు విచారణలో వెల్లడైంది. గతంలో ఓ వ్యాపారి ఇలా మోసం చేస్తూ పట్టుబడినట్లు తెలిసింది. వారూ తెలివిగా పీడీఎస్ బియ్యాన్ని వేలం ద్వారా కొద్ది మొత్తంలో కొనుగోలు చేస్తారు. అధికారులు అందించిన అనుమతి పత్రాలను ఫోర్జరీ ద్వారా తూకంలో తేడాలు చేసి వివిధ పద్దతుల్లో సేకరించిన అక్రమ బియ్యం రవాణా చేస్తున్న లారీల్లో అనుమతి పత్రాల మాదిరిగా ఉంచుతారు. కొన్ని దఫాలు వీళ్ల పాచిక పారుతుంది. ఫలితంగా రూ. లక్షల్లో ఆదాయం సమకూరుతుంది. ఇలాంటి వ్యాపారం చేసేందుకు మిర్యాలగూడలో మూత పడిన మిల్లులను లీజుకు తీసుకుని దందా సాగిస్తున్నట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది. కృష్ణపట్టె ప్రాంతాన్ని కేంద్రంగా చేసుకుని అక్రమ రవాణా జరుగుతుంది. ఫలితంగా నిఘా నుంచి తప్పించుకోవచ్చనే తలంపుతో ఉన్నారు.
పట్టుబడినవి రేషన్ బియ్యమే : -రాజశేఖర్, డీటీసీఎస్, హుజూర్నగర్
పట్టుబడిన రెండు లారీల బియ్యం రేషన్ బియ్యంగానే తేలింది. బియ్యాన్ని గోదాములో భద్రపరిచారం. రెండు లారీలను పోలీసులకు అప్పగించాం. ఆర్ ఎస్ ట్రేడర్స్ నుంచి సరఫరా అవుతున్నట్లు పత్రాలున్నప్పటికి ఇప్పటి వరకు వారు విచారణకు రాలేదు. విషయాన్ని ఉన్నతాధికారులకు తెలియజేశాం. వారి ఆదేశాల ప్రకారం నడుచుకుంటాం.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
భాజపా ఓటమే లక్ష్యం: బీవీ రాఘవులు
[ 19-04-2024]
భాజపా మతోన్మాద విధానాలను ఎదిరించి పోరాడేందుకు సీపీఎం పోటీ చేస్తుందిని పోలిట్ బ్యూరో సభ్యుడు బీవీ రాఘవులు అన్నారు. -
దాహం కేకలు తీర్చేందుకు...తరలి వస్తున్న కృష్ణమ్మ
[ 19-04-2024]
నాగార్జునసాగర్ జలాశయం డెడ్స్టోరేజీ దిగువకు చేరినా వేసవిలో హైదరాబాద్ జంట నగరాలు, జిల్లా వాసుల దాహం కేకలు తీర్చేందుకు కృష్ణాజలాల సరఫరాకు హెచ్ఎండబ్ల్యూఎస్ఎస్బీ (జలమండలి) అధికారులు చేపడుతున్న చర్యలు సఫలీకృతమయ్యాయి -
సైబర్ బాధితులకు వారియర్స్ తోడు
[ 19-04-2024]
చరవాణుల ద్వారా డిజిటల్ లావాదేవీలు పెరగడంతో నిత్యం ఎక్కడో చోట అమాయకులు సైబర్ నేరగాళ్ల వలలో పడి ఆర్థికంగా నష్టపోతున్నారు. -
రాష్ట్రంలోనే ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దుతా: మంత్రి ఉత్తమ్
[ 19-04-2024]
కోదాడ నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసి రాష్ట్రంలోనే ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దుతానని నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి అన్నారు. -
గాడితప్పిన గస్తీ
[ 19-04-2024]
జిల్లాలో దొంగలు రెచ్చిపోతున్నారు. వరుసగా గొలుసు చోరీలకు పాల్పడుతున్నారు. నిఘా పటిష్ఠం చేసి దొంగలను పట్టుకోవడంలో పోలీసులు విఫలమవుతున్నారు. -
ఆలయ భద్రతపై ఇంత నిర్లక్ష్యమా!
[ 19-04-2024]
యాదాద్రి పుణ్యక్షేత్రాన్ని నిత్యం వేల సంఖ్యలో భక్తులు సందర్శిస్తుంటారు. ఆలయంలోకి ప్రవేశించే ప్రతి ఒక్కరిని క్షుణ్ణంగా తనిఖీ చేసిన తరువాతే లోనికి అనుమతించేందుకు బ్యాగేజ్ స్కానింగ్, మెటల్ డిటెక్టర్, తదితర భద్రతా పరికరాలను వైటీడీఏ కొనుగోలు చేసింది. -
భక్తవత్సలుడికి సంప్రదాయ ఆరాధనలు
[ 19-04-2024]
యాదాద్రి పుణ్యక్షేత్రంలో గురువారం స్వయంభువులైన పంచనారసింహులను ఆరాధిస్తూ చేపట్టిన నిత్య పూజలు ఆలయ ఆచారంగా కొనసాగాయి -
కేసీఆర్కు సీఎం రేవంత్రెడ్డే సరైనోడు: రాజగోపాల్రెడ్డి
[ 19-04-2024]
తెలంగాణ ఇచ్చిన పదేళ్ల తర్వాత కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందని.. ఆలస్యం అయినా ప్రవేశపెట్టిన పథకాలను నెరవేర్చి.. రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలోకి తీసుకెళ్తామని భువనగిరి లోక్సభ ఇన్ఛార్జి, స్థానిక ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి అన్నారు. -
నాయకులొస్తున్నారు..!
[ 19-04-2024]
ఉమ్మడి జిల్లాలోని రెండు లోక్సభ స్థానాలైన నల్గొండ, భువనగిరిలో నామినేషన్ దాఖలు సందర్భంగా భారీ ఎత్తున ర్యాలీలు, సభలు నిర్వహించాలని అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష పార్టీలు భారాస, భాజపాలు నిర్ణయించాయి -
67 ఏళ్లలో 69 శాతమే!
[ 19-04-2024]
నల్గొండ లోక్సభ నియోజకవర్గం 1952లో ఏర్పడగా.. 2019 వరకు 17 సార్లు ఎన్నికలు జరిగాయి. 2019 నాటికి నియోజకవర్గానికి తొలి ఎన్నికలు జరిగి 67 ఏళ్లు గడిచాయి -
నల్గొండలో నలుగురు, భువనగిరిలో ముగ్గురు
[ 19-04-2024]
లోక్సభ ఎన్నికలకు నామినేషన్ల పర్వం మొదలైంది. తొలి రోజు గురువారం నల్గొండ లోక్సభ స్థానానికి నలుగురు అభ్యర్థులు ఆరు సెట్లు నామినేషన్లను రిటర్నింగ్ అధికారి, నల్గొండ జిల్లా కలెక్టరు హరిచందనకు అందజేశారు. -
నల్గొండ.. నాయకులకు అండ!
[ 19-04-2024]
నల్గొండ లోక్సభ నియోజకవర్గానికి 18వ సారి ఎన్నికలు జరుగనున్నాయి. ఉమ్మడి జిల్లాలో తొలిసారి ఏర్పడిన ఏకైక లోక్సభ నియోజకవర్గం నల్గొండ మాత్రమే. -
పార్లమెంటు.. ఎంపీ అంటే తెలుసా
[ 19-04-2024]
లోక్సభ ఎన్నికలకు సమయం దగ్గరపడుతోంది. ఇప్పటికే ప్రధాన పార్టీల అభ్యర్థులు తమదైన శైలిలో సమావేశాలు నిర్వహిస్తూ ఓటర్లను మచ్చిక చేసుకునే ప్రయత్నంలో ఉన్నారు -
వ్యాను ఢీకొని రైతు మృతి
[ 19-04-2024]
ద్విచక్రవాహనాన్ని వ్యాను ఢీకొనడంతో రైతు మృతి చెందిన ఘటన మఠంపల్లి మండలం రఘునాథపాలెం పరిధిలోని వెంకటాయపాలెంలో గురువారం జరిగింది. -
ఇంటి మీద.. అవార్డుల పంట
[ 19-04-2024]
మిద్దె తోటలు.. ఆరోగ్యానికి ఉపయోగపడే కూరగాయలతో పాటు పురస్కారాలనూ తీసుకొస్తున్నాయి.
తాజా వార్తలు (Latest News)
-
హైదరాబాద్ శివారులో వర్ష బీభత్సం.. శ్రీశైలం హైవేపై ట్రాఫిక్ జామ్
-
‘విక్రమార్కుడు’, ‘బజరంగీ భాయిజాన్’ సీక్వెల్స్ అప్డేట్.. ఎంతవరకు వచ్చాయంటే!
-
సుప్రీం లీడర్ పుట్టిన రోజే ఇరాన్పై దాడులు.. అమెరికాకు చివరి క్షణంలో తెలిసిందట!
-
ఎన్నికల కోడ్ ఉల్లంఘనపై షర్మిలకు ఈసీ నోటీసులు
-
కావ్య బాధ.. శారీలో లావణ్య, మౌనీరాయ్
-
విప్రో క్యూ4 ఫలితాలు.. లాభంలో 8 శాతం క్షీణత