కొవిడ్ నియంత్రణకు ప్రజలు సహకరించాలి: కలెక్టర్
అర్హలైన ప్రతి ఒక్కరూ రెండు డోసుల కొవిడ్ టీకా తీసుకోవాలని, నిబంధనల ప్రకారం ముందస్తు నివారణ టీకా వేయించుకోవాలని జిల్లా పాలనాధికారి పమేలా సత్పతి సూచించారు.
ఆత్మకూరు పీహెచ్సీలో కొవిడ్ టీకా పంపిణీ గురించి సిబ్బందిని ఆరా తీస్తున్న కలెక్టర్ పమేలా సత్పతి
ఆత్మకూరు(ఎం), న్యూస్టుడే: అర్హలైన ప్రతి ఒక్కరూ రెండు డోసుల కొవిడ్ టీకా తీసుకోవాలని, నిబంధనల ప్రకారం ముందస్తు నివారణ టీకా వేయించుకోవాలని జిల్లా పాలనాధికారి పమేలా సత్పతి సూచించారు. అందరూ మాస్కులు ధరించి, భౌతిక దూరంతోపాటు కొవిడ్ నిబంధనలను విధిగా పాటించాలని, జిల్లాలో కరోనా కట్టడికి ప్రజలు సహకరించాలని కోరారు. ఆత్మకూరు పీహెచ్సీని శుక్రవారం ఆమె ఆకస్మికంగా తనిఖీ చేశారు. కొవిడ్ నిర్ధారణ పరీక్షల గదిని పరిశీలించి రోజూ చేస్తున్న పరీక్షలను ఆరా తీశారు. ప్రసూతి, రోగులు, టీకా గది, ల్యాబ్ను పరిశీలించారు. అనంతరం మందుల నిల్వ వివరాలను అడిగి తెలుసుకున్నారు. సిబ్బంది కరుణాకర్, సాంబులమ్మ, సుజాత, జ్యోతి, సరిత, శీరిష, లలిత, తదితరులు ఉన్నారు. తరువాత తహసీల్ కార్యాలయంలో ధరణి రిజిస్ట్రేషన్లను ఆమె పరిశీలించారు. రైతుల భూ సమస్యల దరఖాస్తులను సత్వరం పరిష్కరించాలని తహసీల్దార్ ఎం.జయమ్మను ఆదేశించారు.
మోటకొండూరు: మండల కేంద్రంలోని పీహెచ్సీ, అంగన్వాడీ కేంద్రాలను కలెక్టర్ పమేలా సత్పతి శుక్రవారం ఆకస్మిక తనిఖీ చేశారు. ఇంటింటా ఆరోగ్య సర్వేను రెండు రోజుల్లో పూర్తి చేయాలని ఆధికారులను ఆదేశించారు. ఎంపీడీవో ఇ.వీరాస్వామి, ఐసీడీఎస్ సూపర్వైజర్ పద్మ, ఉపసర్పంచి రేగు శ్రీనివాస్, సిబ్బంది ఉన్నారు.
ఆరోగ్య వివరాలు సమగ్రంగా నమోదు చేయండి... యాదగిరిగుట్ట పట్టణం: జ్వర సర్వేలో భాగంగా ప్రతి ఇంటిని పరిశీలించి, ఆరోగ్య వివరాలను సమగ్రంగా నమోదు చేయాలని కలెక్టర్ పమేలా సత్పతి ఆదేశించారు. మండలంలోని మహబూబ్పేటలో ఇంటింటి ఆరోగ్య సర్వేను శుక్రవారం ఆమె ఆకస్మికంగా పరిశీలించి ఆరోగ్య సిబ్బందికి సూచనలు ఇచ్చారు. కుటుంబ సభ్యులందరి ఆరోగ్య వివరాలు, టీకా తీసుకున్నది, లేనిది నమోదు చేయాలన్నారు. వాక్సిన్ వేసుకోకుంటే వెంటనే ఇవ్వాలని సూచించారు. జ్వర లక్షణాలుంటే ఐసోలేషన్ కిట్ అందజేసి, ఔషధాలు తీసుకునే విధానం గురించి వివరంగా చెప్పాలన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ప్రభుత్వంపై విమర్శ.. రైతులకు భరోసా
[ 25-04-2024]
లోక్సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా బస్సుయాత్ర చేస్తున్న మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ దానిని ఉమ్మడి జిల్లా నుంచే ప్రారంభించడంతో.. భారాస నేతలు పెద్దఎత్తున ఏర్పాట్లు చేశారు. -
బాలికలు.. భళా
[ 25-04-2024]
విద్యార్థులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఇంటర్ ఫలితాలు విడుదలయ్యాయి. -
మోదీతో తెలంగాణకు తీరని అన్యాయం
[ 25-04-2024]
కేంద్ర ప్రభుత్వం, ప్రధాని మోదీ తెలంగాణకు తీరని అన్యాయం చేశారని నల్గొండ లోక్సభ ఇన్ఛార్జి, మంత్రి నల్లమాద ఉత్తమ్కుమార్రెడ్డి ఆరోపించారు. -
బాలికలదే హవా
[ 25-04-2024]
రాష్ట్ర వ్యాప్తంగా ఇంటర్ ప్రథమ, ద్వితీయ సంవత్సరం పరీక్ష ఫలితాలు బుధవారం విడుదలయ్యాయి. -
ఉపాధి కూలీల సౌకర్యాలపై సమీక్ష
[ 25-04-2024]
పని ప్రదేశాలలో ఉపాధి కూలీలకు మౌలిక సౌకర్యాలు సమకూర్చాలని జిల్లా పరిషతు ముఖ్య కార్యనిర్వహణాధికారి శోభారాణి, ఆదనపు డీఆర్డీవో జి.సురేష్, సూచించారు. -
ప్రథమంలో 26.. ద్వితీయంలో 25
[ 25-04-2024]
ఇంటర్ పరీక్ష ఫలితాల్లో బాలికలు సత్తా చాటారు. 2022-23లో జిల్లా ఉత్తీర్ణత శాతం 57 ఉండగా, ప్రస్తుతం 54.50 శాతానికి పడిపోయింది. -
ఊపందుకున్న నామినేషన్ల పర్వం
[ 25-04-2024]
నల్గొండ, భువనగిరి లోక్సభ స్థానాలకు బుధవారం వరకు 45 మంది చొప్పున నామినేషన్లు వేశారు. -
గిరిజన గురుకులాల్లో 88.60శాతం ఉత్తీర్ణత
[ 25-04-2024]
ఇంటర్ ఫలితాల్లో తెలంగాణ ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇనిస్టిట్యూషనల్ సొసైటీ ఆధ్వర్యంలో నల్గొండ, సూర్యాపేట జిల్లాల్లో కలిపి ఇంటర్ ద్వితీయ సంవత్సరంలో 88.60శాతం ఫలితాలు -
మతోన్మాద భాజపాను ఓడించండి: సీపీఐ
[ 25-04-2024]
దేశంలో మతోన్మాదం పేరుతో రాజకీయాలు చేస్తున్న భాజపాను ఓడించి కాంగ్రెస్ అభ్యర్ధులను భారీ మెజార్టీతో గెలిపించాలని సీపీఐ జాతీయ సమితి సభ్యుడు పల్లా వెంకట్రెడ్డి పిలుపునిచ్చారు. -
విభజన హామీల అమలుకు కృషి
[ 25-04-2024]
భువనగిరి లోక్సభ ఎంపీగా తనను గెలిపిస్తే విభజన హామీలను అమలు చేసేందుకు, నిధులు రాబట్టేందుకు కృషి చేస్తానని భువనగిరి లోక్సభ నియోజకవర్గ కాంగ్రెస్ అభ్యర్థి చామల కిరణ్కుమార్రెడ్డి అన్నారు. -
తొలి ఎన్నికలోనే అత్యధిక మెజారిటీ
[ 25-04-2024]
నల్గొండ లోక్సభ నియోజకవర్గం 1951లో ఏర్పడగా.. తొలి ఎన్నికలు 1952లో జరిగాయి. -
రైల్వే ఉద్యోగాలు ఇప్పిస్తానని మోసం, వ్యక్తి అరెస్ట్
[ 25-04-2024]
రైల్వేశాఖలో ఉద్యోగాలు ఇప్పిస్తానని 17 మంది బాధితుల నుంచి నగదు వసూలు చేసిన వ్యక్తిని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించినట్టు పోలీస్ ఇన్స్పెక్టర్ అశోక్రెడ్డి తెలిపారు.
తాజా వార్తలు (Latest News)
-
జూదరులతో కలిసి పుట్టిన రోజు వేడుకలు.. మంగళ్హాట్ డీఐ సస్పెన్షన్ ?
-
ఒకే ద్విచక్రవాహనంపై ప్రయాణం.. బస్సు ఢీకొని నలుగురు ఇంటర్ విద్యార్థుల మృతి
-
టీ20 ప్రపంచకప్నకు టీమ్ ఇండియాను మీరే ఎంపిక చేయండి!
-
సరిహద్దు దాటిన మానవత్వం.. భారతీయుడి దానంతో పాక్ యువతికి కొత్త జీవితం
-
టీ20 వరల్డ్ కప్.. ‘‘ధోనీ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇస్తే బాగుంటుంది’’
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (25/04/24)