యాదాద్రీశుడి సేవలో దేవాదాయశాఖ మంత్రి
యాదాద్రి పుణ్యక్షేత్రాన్ని రాష్ట్ర దేవాదాయశాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి శుక్రవారం సందర్శించారు. కొండపైన గల బాలాలయంలోని పంచనారసింహుల ప్రతిష్ఠామూర్తులను దర్శించుకొని సువర్ణ పుష్పారాధనలో పాల్గొన్నారు.
పూజావిధానాల పుస్తకాన్ని ప్రధాన పూజారి నల్లందిగల్ లక్ష్మీనరసింహాచార్యతో కలిసి ఆవిష్కరిస్తున్న మంత్రి ఇంద్రకరణ్రెడ్డి,
చిత్రంతో ప్రభుత్వ విప్ గొంగిడి సునీత, దేవాదాయశాఖ కమిషనర్ అనిల్ కుమార్, ఈవో గీత, తదితరులు
యాదగిరిగుట్ట: యాదాద్రి పుణ్యక్షేత్రాన్ని రాష్ట్ర దేవాదాయశాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి శుక్రవారం సందర్శించారు. కొండపైన గల బాలాలయంలోని పంచనారసింహుల ప్రతిష్ఠామూర్తులను దర్శించుకొని సువర్ణ పుష్పారాధనలో పాల్గొన్నారు. ఆయనకు ఆలయ ప్రధాన పూజారులు, వేదపండితులు ఆశీస్సులు అందజేశారు. తొలుత మంత్రికి పూజారులు సంప్రదాయంగా స్వాగతం పలికారు. ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే గొంగిడి సునీత, దేవాదాయశాఖ రాష్ట్ర కమిషనర్ అనిల్ కుమార్, యాడా వైస్ ఛైర్మన్ కిషన్రావు, ఈఎన్సీ రవీందర్రావు, ఈఈ వెంకటేశ్వర్రెడ్డి, ఆర్కిటెక్ట్ ఆనంద్సాయి ఉన్నారు. క్షేత్రాన్ని సందర్శించిన మంత్రి ఇంద్రకరణ్రెడ్డికి ఆలయోద్యోగుల సంఘం అధ్యక్షుడు రమేశ్బాబు, ప్రతినిధి జె.కృష్ణ శాలువాలు కప్పి సత్కరించారు. అనంతరం మంత్రి పునర్నిర్మితమైన ప్రధానాలయంతోపాటు మహారాజగోపురానికి స్వర్ణ కలశాల స్థాపనకు నిర్మించిన పరంజా ఎక్కి పరిశీలించారు.
యాదగిరిగుట్ట: యాదాద్రి పంచనారసింహుల పుణ్యక్షేత్రంలో కొనసాగే నిత్య, వార, మాస, వార్షికోత్సవాలకు సంబంధించిన పూజా వివరాలతో కూడిన ప్రత్యేక పుస్తకాలను రాష్ట్ర దేవాదాయ, ధర్మాదాయశాఖ మంత్రి ఇంద్రకరణ్రెడ్డి శుక్రవారం ఆవిష్కరించారు. ఈ క్షేత్రంలో కొనసాగుతున్న వివిధ కైంకర్యాల వివరాలను ఆలయ ప్రధాన పూజారి నల్లందిగల్ లక్ష్మీనరసింహాచార్య పుస్తక రూపంలో పొందుపరిచారు. ఆ ఆధ్యాత్మిక పూజా పుస్తకాలను బాలాలయ ముఖమండపంలో మంత్రి ఆవిష్కరించారు. ప్రధాన పూజారిని శాలువా కప్పి సన్మానించారు. కార్యక్రమంలో రాష్ట్ర దేవాదాయశాఖ కమిషనర్ అనిల్కుమార్, ఆలయ ఈవో గీతారెడ్డి, పేష్కార్ రమేశ్బాబు, ఏఈవోలు కృష్ణ, శ్రవణ్కుమార్ పాల్గొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మాటలే తూటాలై..!
[ 24-04-2024]
‘నల్గొండ జిల్లా సాగునీటి రంగానికి కేసీఆర్ తీరని అన్యాయం చేశారు. బస్సు యాత్ర కాదు, మోకాళ్ల యాత్ర చేసినా భారాసకు ఎవరూ ఓటేయరు. -
వైభవంగా హనుమాన్ జయంతి
[ 24-04-2024]
హనుమాన్ జయంతి సందర్భంగా మంగళవారం ఆలయాల్లో ప్రత్యేక పూజలు జరిపించారు. స్వామి వారికి సింధూరంతో అభిషేకం, తమల పాకులతో పూజలు నిర్వహించారు. -
పాఠాలకు బై.. ఆటలకు సై..!
[ 24-04-2024]
వేసవి సెలవులు వచ్చేశాయ్.. పది నెలల పాటు నిత్యం బడుల్లో పాఠాలు చదవడం, రాయడం తదితర పనుల్లో నిమగ్నమై ఉన్న చిన్నారులకు ఈ నెల 24 (బుధవారం) నుంచి మొదలయ్యే సెలవులతో ఉపశమనం లభించింది. -
అట్టహాసంగా కంచర్ల నామినేషన్
[ 24-04-2024]
లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నేతలకు తగిన బుద్ధి చెప్పడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారని మాజీ మంత్రి జగదీశ్రెడ్డి అన్నారు. -
పార్టీ గుర్తుల చరిత్ర ఇదే
[ 24-04-2024]
రాజకీయ పార్టీలనగానే గుర్తొచ్చేది వాటి గుర్తులే. ప్రధానంగా ఎన్నికల సమయంలో పార్టీ అభ్యర్థుల కంటే గుర్తులకే ప్రాధాన్యం ఉంటుంది. -
వారు.. శాసనసభకు, లోక్సభకు ఎన్నికయ్యారు!
[ 24-04-2024]
ఉమ్మడి నల్గొండ జిల్లాకు చెందిన కొందరు నేతలు శాసనసభకు, లోక్సభకు ఎన్నికయ్యారు. దేశంలోనే అత్యధిక ఓట్లు సాధించి రికార్డు సృష్టించారు. -
ప్రలోభాల ఎర.. తప్పదు చెర!
[ 24-04-2024]
లోక్సభ ఎన్నికలు మే 13న జరగనున్నాయి. ఇప్పటికే నామినేషన్ల పర్వం ప్రారంభం కావడంతో ప్రచారం ఊపందుకుంటోంది. -
ఆహారం సేకరించి.. అభాగ్యుల ఆకలి తీర్చి..
[ 24-04-2024]
దేశంలో ఒక వైపు రెండు పూటలా తినడానికి తిండి లేక వేలాది మంది అవస్థలు పడుతున్నారు. మరో వైపు నిత్యం లక్షల టన్నుల ఆహార పదార్థాలు వ్యర్థాలుగా మారుతున్నాయి. -
లోక్సభలో గళం విప్పే అవకాశం ఇవ్వండి: జహంగీర్
[ 24-04-2024]
ప్రజాసమస్యల పరిష్కారానికి జనం వెన్నంటే ఉండి నిరంతరం పోరాటాలు చేస్తున్న తనకు మద్దతుగా నిలిచి గెలిపిస్తే పార్లమెంటులో ఈ ప్రాంత సమస్యలపై గళం విప్పుతానని భువనగిరి లోక్సభ సీపీఎం అభ్యర్థి ఎండీ.జహంగీర్ అన్నారు. -
గత పొరపాట్లు పునరావృతం కావొద్దు: కలెక్టర్
[ 24-04-2024]
త్వరలో జరగబోయే లోక్సభ ఎన్నికల్లో సెక్టార్, పోలీసు అధికారులు సమన్వయంతో పని చేయాలని కలెక్టర్ వెంకటరావు అన్నారు. -
బడికి నిధులు
[ 24-04-2024]
యాదాద్రి జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో వసతుల కల్పనకు రాష్ట్ర ప్రభుత్వం రూ.25 కోట్లు మంజూరు చేసింది. ఈ పనులను అమ్మ ఆదర్శ కమిటీల ద్వారా చేపట్టనున్నారు. -
అతిథులు తరలొచ్చె.. బూర పూరించె..!
[ 24-04-2024]
ఓట్ల కోసం అనాదిగా మత రాజకీయాలు చేస్తున్నది కాంగ్రెస్ పార్టీయేనని భాజపా ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యుడు డాక్టర్ కె.లక్ష్మణ్ విమర్శించారు. -
వేస్తున్నారు నామినేషన్లు..!
[ 24-04-2024]
ఉమ్మడి నల్గొండ జిల్లాలోని నల్గొండ, భువనగిరి లోక్సభ స్థానాలకు నామినేషన్ల స్వీకరణ కార్యక్రమం కొనసాగుతోంది. -
అభ్యర్థులిద్దరూ ‘బీఎన్ రెడ్డి’లే..!
[ 24-04-2024]
మిర్యాలగూడ లోక్సభ నియోజకవర్గంలో 1989, 1991 ఎన్నికల్లో ప్రధాన అభ్యర్థులిద్దరూ బీఎన్రెడ్డిలే. ఒకరు వాస్తుశిల్పి బద్దం నర్సింహారెడ్డి. మరొకరు భీంరెడ్డి నర్సింహారెడ్డి. -
1,29,766 ఓట్లు కొల్లగొట్టిన స్వతంత్రులు
[ 24-04-2024]
ఫ్లోరైడ్కు వ్యతిరేకంగా జలసాధన సమితి ఆధ్వర్యంలో 1996 లోక్సభ ఎన్నికల్లో 476 మంది స్వతంత్ర అభ్యర్థులుగా బరిలో నిలిచారు. ఆ ఎన్నికల్లో వీరు 1,29,766 ఓట్లు సాధించారు.
తాజా వార్తలు (Latest News)
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
-
అది మీ రికార్డు పోలింగ్ కంటే ఎక్కువే..: పాశ్చాత్య మీడియాకు జై శంకర్ కౌంటర్
-
‘‘వాళ్లింట్లో వ్యక్తులను ఇలాగే కామెంట్ చేస్తే..’’: నెటిజన్పై బిగ్బాస్ నటి ఆగ్రహం
-
ఉచిత ఆధార్ కోసం వార్నర్ పరుగులు.. వీడియో చూశారా..?
-
టీ20 ప్రపంచ కప్ కోసం నేనూ రేసులో ఉన్నా: లఖ్నవూ సెంచరీ హీరో
-
భారత్లోకి టెస్లా ఎంట్రీ.. ఇప్పట్లో లేనట్లేనా?