ఆటో ఇటో పోకుండా గమ్యానికి..
పురపాలికల్లో చెత్త సేకరణకు వినియోగిస్తున్న ట్రాక్టర్లు, ఆటోలను ఇకమీదట ఇతర పనులకు వినియోగించటం కుదరదు. వార్డుల్లో ఇంటింటికి తిరిగేందుకు వెళ్లి ఒకటి రెండు వీధుల్లో తిరిగి మొత్తం....
వాహనాలకు జీపీఎస్ అనుసంధానం
భువనగిరి పట్టణం, మిర్యాలగూడ, న్యూస్టుడే:
పురపాలికల్లో చెత్త సేకరణకు వినియోగిస్తున్న ట్రాక్టర్లు, ఆటోలను ఇకమీదట ఇతర పనులకు వినియోగించటం కుదరదు. వార్డుల్లో ఇంటింటికి తిరిగేందుకు వెళ్లి ఒకటి రెండు వీధుల్లో తిరిగి మొత్తం పూర్తి చేసినట్లుగా చూపించటం సాధ్యపడదు. వీటికి సాంకేతికతను జోడించి జీపీఎస్తో అనుసంధానించాలని పురపాలిక శాఖ ఉన్నతాధికారులు నిర్ణయించారు. ఈ మేరకు పురపాలిక శాఖ సంచాలకుడు డాక్టర్ సత్యనారాయణ ఇటీవల ఆదేశాలు జారీ చేశారు. పురపాలికల్లో చెత్త సేకరణకు వినియోగించే ట్రాక్టర్లు, ఆటోలకు గ్లోబల్ పొజిషనింగ్ సిస్టమ్ ( జీపీఎస్) పరికరాలను అనుసంధానించనున్నారు. ఈ విధానంతో రోజూ పురపాలికల్లో ఆటోలు ఇంటింటి చెత్త సేకరణ సక్రమంగా చేపట్టేలా చూడనున్నారు. ఇప్పటి వరకు పురపాలికల్లో తెల్లవారుజామున 5 గంటలకు పారిశుద్ధ్య సిబ్బంది, జవాన్లు అంతా ఒకచోట చేరి హాజరు తీసుకున్న తరువాత ట్రాక్టర్లు, ఆటోల్లో తమకు కేటాయించిన వార్డుల్లో చెత్త సేకరణ, వీధులు శుభ్రం చేయటం, డ్రైనేజీల్లో వ్యర్థాల తొలగింపు పనులు చేపడతారు.
మిర్యాలగూడ పురపాలికలో చెత్తసేకరణకు వినియోగిస్తున్న వాహనం
అనధికారిక వినియోగం ఇలా..
* పురపాలిక సిబ్బంది ఆటోలను ఇంటింటి చెత్త సేకరణకు తీసుకువచ్చి వాటిని ఇతర పనులకు వినియోగిస్తున్నారనే ఆరోపణలు వినవస్తున్నాయి.
* రోజువారి కేటాయించిన వార్డులోని అన్ని వీధులు తిరగకుండానే తిరిగినట్లు చూపుతూ డీజిల్ దుర్వినియోగానికి పాల్పడుతున్నారనే వాదనలు ఉన్నాయి.
* కొందరు సిబ్బంది ఇంటింటి నుంచి వెలువడే చెత్తలో ప్లాస్టిక్, అట్టలు ఇతర ఇనుప సామగ్రిని వేరు చేసి పాత ఇనుప సామగ్రి దుకాణాల్లో విక్రయించుకుంటున్నారు. ఇలా ఆదాయం సమకూరుతుండగా ఒక్కోసారి చెత్త సేకరణ పక్కన పెట్టి ఇలాంటి పనులకు వినియోగిస్తున్నారనే ఫిర్యాదులు వస్తున్నాయి.
* కొన్ని సందర్భాల్లో స్థానికంగా ప్రజాప్రతినిధులు సైతం ఇతర అవసరాలకు ట్రాక్టర్లు, ఆటోలు వినియోగిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి.
* నిత్యం ఇంటింటికి చెత్త సేకరిస్తే వీధుల్లో చెత్త వేసే పరిస్థితి ఉండదని భావించిన ఉన్నతాధికారులు జీపీఎస్ అనుసంధానించేందుకు నిర్ణయించారు.
* ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఉన్న పురపాలికల్లో చెత్త సేకరణ నిత్యం ట్రాక్టర్లు, ఆటోలతో చేపడుతున్నారు.
పురపాలికల వారీగా సమాచారం
ఉన్నతాధికారుల ఆదేశాలు అమలు చేస్తాం : - రవీందర్సాగర్, కమిషనర్, మిర్యాలగూడ
పురపాలిక సంచాలకుల ఆదేశాల మేరకు ఇటీవల జిల్లా అదనపు కలెక్టర్ రాహుల్శర్మ జీపీఎస్ అనుసంధానం చేస్తాం. మిర్యాలగూడలో ప్రస్తుతం 27 ఆటోలు ఉండగా మరో 21 కొనుగోలుకు ప్రతిపాదించాం. దీంతో 48 వార్డులకు వార్డుకు ఒకటి చొప్పున ఆటో వస్తుంది. అన్ని వాహనాలకు ఒకేసారి టెండర్లు పిలిచి జీపీఎస్ ఏర్పాటు చేయాలని అదనపు కలెక్టర్ సూచించారు. ఈ మేరకు ఏర్పాట్లు చేస్తాం.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
దాహం కేకలు తీర్చేందుకు...తరలి వస్తున్న కృష్ణమ్మ
[ 19-04-2024]
నాగార్జునసాగర్ జలాశయం డెడ్స్టోరేజీ దిగువకు చేరినా వేసవిలో హైదరాబాద్ జంట నగరాలు, జిల్లా వాసుల దాహం కేకలు తీర్చేందుకు కృష్ణాజలాల సరఫరాకు హెచ్ఎండబ్ల్యూఎస్ఎస్బీ (జలమండలి) అధికారులు చేపడుతున్న చర్యలు సఫలీకృతమయ్యాయి -
సైబర్ బాధితులకు వారియర్స్ తోడు
[ 19-04-2024]
చరవాణుల ద్వారా డిజిటల్ లావాదేవీలు పెరగడంతో నిత్యం ఎక్కడో చోట అమాయకులు సైబర్ నేరగాళ్ల వలలో పడి ఆర్థికంగా నష్టపోతున్నారు. -
రాష్ట్రంలోనే ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దుతా: మంత్రి ఉత్తమ్
[ 19-04-2024]
కోదాడ నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసి రాష్ట్రంలోనే ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దుతానని నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి అన్నారు. -
గాడితప్పిన గస్తీ
[ 19-04-2024]
జిల్లాలో దొంగలు రెచ్చిపోతున్నారు. వరుసగా గొలుసు చోరీలకు పాల్పడుతున్నారు. నిఘా పటిష్ఠం చేసి దొంగలను పట్టుకోవడంలో పోలీసులు విఫలమవుతున్నారు. -
ఆలయ భద్రతపై ఇంత నిర్లక్ష్యమా!
[ 19-04-2024]
యాదాద్రి పుణ్యక్షేత్రాన్ని నిత్యం వేల సంఖ్యలో భక్తులు సందర్శిస్తుంటారు. ఆలయంలోకి ప్రవేశించే ప్రతి ఒక్కరిని క్షుణ్ణంగా తనిఖీ చేసిన తరువాతే లోనికి అనుమతించేందుకు బ్యాగేజ్ స్కానింగ్, మెటల్ డిటెక్టర్, తదితర భద్రతా పరికరాలను వైటీడీఏ కొనుగోలు చేసింది. -
భక్తవత్సలుడికి సంప్రదాయ ఆరాధనలు
[ 19-04-2024]
యాదాద్రి పుణ్యక్షేత్రంలో గురువారం స్వయంభువులైన పంచనారసింహులను ఆరాధిస్తూ చేపట్టిన నిత్య పూజలు ఆలయ ఆచారంగా కొనసాగాయి -
కేసీఆర్కు సీఎం రేవంత్రెడ్డే సరైనోడు: రాజగోపాల్రెడ్డి
[ 19-04-2024]
తెలంగాణ ఇచ్చిన పదేళ్ల తర్వాత కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందని.. ఆలస్యం అయినా ప్రవేశపెట్టిన పథకాలను నెరవేర్చి.. రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలోకి తీసుకెళ్తామని భువనగిరి లోక్సభ ఇన్ఛార్జి, స్థానిక ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి అన్నారు. -
నాయకులొస్తున్నారు..!
[ 19-04-2024]
ఉమ్మడి జిల్లాలోని రెండు లోక్సభ స్థానాలైన నల్గొండ, భువనగిరిలో నామినేషన్ దాఖలు సందర్భంగా భారీ ఎత్తున ర్యాలీలు, సభలు నిర్వహించాలని అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష పార్టీలు భారాస, భాజపాలు నిర్ణయించాయి -
67 ఏళ్లలో 69 శాతమే!
[ 19-04-2024]
నల్గొండ లోక్సభ నియోజకవర్గం 1952లో ఏర్పడగా.. 2019 వరకు 17 సార్లు ఎన్నికలు జరిగాయి. 2019 నాటికి నియోజకవర్గానికి తొలి ఎన్నికలు జరిగి 67 ఏళ్లు గడిచాయి -
నల్గొండలో నలుగురు, భువనగిరిలో ముగ్గురు
[ 19-04-2024]
లోక్సభ ఎన్నికలకు నామినేషన్ల పర్వం మొదలైంది. తొలి రోజు గురువారం నల్గొండ లోక్సభ స్థానానికి నలుగురు అభ్యర్థులు ఆరు సెట్లు నామినేషన్లను రిటర్నింగ్ అధికారి, నల్గొండ జిల్లా కలెక్టరు హరిచందనకు అందజేశారు. -
నల్గొండ.. నాయకులకు అండ!
[ 19-04-2024]
నల్గొండ లోక్సభ నియోజకవర్గానికి 18వ సారి ఎన్నికలు జరుగనున్నాయి. ఉమ్మడి జిల్లాలో తొలిసారి ఏర్పడిన ఏకైక లోక్సభ నియోజకవర్గం నల్గొండ మాత్రమే. -
పార్లమెంటు.. ఎంపీ అంటే తెలుసా
[ 19-04-2024]
లోక్సభ ఎన్నికలకు సమయం దగ్గరపడుతోంది. ఇప్పటికే ప్రధాన పార్టీల అభ్యర్థులు తమదైన శైలిలో సమావేశాలు నిర్వహిస్తూ ఓటర్లను మచ్చిక చేసుకునే ప్రయత్నంలో ఉన్నారు -
వ్యాను ఢీకొని రైతు మృతి
[ 19-04-2024]
ద్విచక్రవాహనాన్ని వ్యాను ఢీకొనడంతో రైతు మృతి చెందిన ఘటన మఠంపల్లి మండలం రఘునాథపాలెం పరిధిలోని వెంకటాయపాలెంలో గురువారం జరిగింది. -
ఇంటి మీద.. అవార్డుల పంట
[ 19-04-2024]
మిద్దె తోటలు.. ఆరోగ్యానికి ఉపయోగపడే కూరగాయలతో పాటు పురస్కారాలనూ తీసుకొస్తున్నాయి.