అక్రమ కట్టడాలను కూల్చేయండి: మంత్రి
సూర్యాపేట పట్టణంలో నాలాలను ఆక్రమించి నిర్మించిన కట్టడాలను వెంటనే కూల్చేయాలని విద్యుత్తు శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి మున్సిపల్ అధికారులను ఆదేశించారు.
సూర్యాపేట: మానసనగర్లో నాలాను పరిశీలించి అధికారులకు సూచనలిస్తున్న మంత్రి జగదీశ్రెడ్డి,
చిత్రంలో డీసీఎంఎస్ ఛైర్మన్ వట్టె జానయ్యయాదవ్, తదితరులు
సూర్యాపేట పురపాలిక: సూర్యాపేట పట్టణంలో నాలాలను ఆక్రమించి నిర్మించిన కట్టడాలను వెంటనే కూల్చేయాలని విద్యుత్తు శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి మున్సిపల్ అధికారులను ఆదేశించారు. ఇటీవల కురిసిన వర్షాలకు కాలనీలు జలమయం కావడంతో పలువురు మంత్రి దృష్టికి తీసుకెళ్లగా మానసనగర్లో అధికారులతో కలిసి నాలా ఆక్రమణ ప్రాంతాన్ని జగదీశ్రెడ్డి శుక్రవారం సందర్శించారు. నాలా వెడల్పు ఎంత ఉండాలి అనే దానిపై అధికారులతో చర్చించి హద్దును ఏర్పాటు చేయాలని ఆదేశించారు. మరోసారి కాలనీని సందర్శించి అభివృద్ధి పనులు ప్రారంభిస్తామని చెప్పారు. కార్యక్రమంలో డీసీఎంఎస్ ఛైర్మన్ వట్టె జానయ్యయాదవ్, పుర కమిషనర్ పి.రామాంజులరెడ్డి పాల్గొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (26/04/24)
-
ముయిజ్జు పార్టీకి ‘సూపర్ మెజార్టీ’.. భారత్ స్పందనిదే...
-
బంగ్లాదేశ్ను చూసి సిగ్గు పడుతున్నాం - పాకిస్థాన్ ప్రధాని
-
ప్రీమియర్ షోలో మెరిసిన తారలు.. అలియా అలా.. రష్మిక ఇలా..
-
ఎట్టకేలకు తెలుగులో ‘OMG2’.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
-
‘హీరామండీ’తో నా కల నెరవేరింది: సోనాక్షి సిన్హా