మూడేళ్లయినా ముందుకు సాగని సంతలు
ఉమ్మడి జిల్లాలో 15 చోట్ల పంచాయతీల్లో నిర్వహించే సంతల ద్వారా ఆయా పాలకవర్గాలకు ఆదాయం సమకూరుతోంది. అయినా సంత స్థలాల్లో తాగునీరు, విద్యుత్తు, మరుగుదొడ్లు, పార్కింగ్ తదితర సౌకర్యాలు కల్పించకపోవడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు.
కట్టంగూర్లో సర్వీస్ రోడ్డుపై కొనసాగుతున్న సంత (పాత చిత్రం)
నల్గొండ కలెక్టరేట్, న్యూస్టుడే: ఉమ్మడి జిల్లాలో 15 చోట్ల పంచాయతీల్లో నిర్వహించే సంతల ద్వారా ఆయా పాలకవర్గాలకు ఆదాయం సమకూరుతోంది. అయినా సంత స్థలాల్లో తాగునీరు, విద్యుత్తు, మరుగుదొడ్లు, పార్కింగ్ తదితర సౌకర్యాలు కల్పించకపోవడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఈ నేపథ్యంలో ఉపాధి హామీ పథకం కింద పల్లెల్లో మార్కెట్ సౌకర్యాలు కల్పించాలని సంత ఏర్పాటుకు ప్రభుత్వం నిధులు కేటాయించింది. ఈ మేరకు పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ఉత్తర్వులు జారీ చేసి మూడేళ్లు గడిచినా ఉమ్మడి జిల్లాలో సంతల ఏర్పాటు జరగడం లేదు.
గ్రామాల్లో సంతలు (అంగళ్లు) నిర్వహించుకునేందుకు గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద షెడ్లు నిర్మించుకునేందుకు ప్రభుత్వం అవకాశం కల్పించింది. స్థానికుల అవసరాలు తీర్చడంలో భాగంగా పండ్లు, కూరగాయలు, తినుబండరాలు, సామగ్రి తదితర వాటిని విక్రయించుకునేందుకు వసతులు కల్పించనుంది. గ్రామ పంచాయతీలు, ప్రజాప్రతినిధులు, దాతలు చొరవ తీసుకుంటే అంగళ్ల నిర్వహణకు అనువైన ఏర్పాట్లు చేసుకోవచ్చు.
అవగాహన కరవు
* సంతలు నిర్వహించాలనే ఆసక్తి ఉన్న గ్రామాల్లో ఉపాధి ఉపాధి హామీ పథకం నిధులు వినియోగించుకునే అవకాశముంది. సంతల ఏర్పాటుకు స్థలం, మౌలిక వసతుల కల్పన పనులు చేపట్టవచ్చు.
* స్థలం ఎంపికతోపాటు పంచాయతీలు తీర్మానం చేసి జిల్లా అధికారులకు నివేదిక పంపిస్తే నిధులు మంజూరు చేస్తారు. తాగునీరు, ఫ్లాట్ఫారం, మురుగు కాలువలు, మూత్రశాలలు, వాహనాల పార్కింగ్ తదితర సౌకర్యాల కల్పనకు ఉపాధి హామీ పథకంలో చేపట్టవచ్చు.
* ప్రతి ఏటా ఆర్థిక సంవత్సరం ముగింపులోపు ఈ నిధులు వినియోగించుకోవల్సి ఉంటుంది. దీనిపై పంచాయతీల సర్పంచులకు అవగాహన లేకపోవడంతో ఎక్కడ నిర్మాణాలు ప్రారంభం కాలేదు.
* నల్గొండ జిల్లాలో మునుగోడు మండలం కామేపల్లి, తిరుమలగిరి సాగర్ మండలం బీబీబాయితండలో సంతల ఏర్పాటుకు ఆమోదం లభించింది. ఇంకా పనులు ప్రారంభించలేదు. సూర్యాపేట, యాదాద్రిల్లో జిల్లా సంతల నిర్మాణం జరుగలేదు.
సమకూరనున్న ఆదాయం
ఉమ్మడి జిల్లాలో 1740 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. పెద్ద గ్రామ పంచాయతీలు 600. చిన్నవి 1140 ఉన్నాయి. పెద్ద పంచాయతీలో 15 సంతలు ఉండగా మరో 18 పంచాయతీల్లో తైబజార్లు, దుకాణ సముదాయం కలిగి ఉన్నాయి. నల్గొండ జిల్లాలో కట్టంగూర్, గురిజాల, అమ్మనబోలు, నార్కట్పల్లి, చింతపల్లి, కొండమల్లేపల్లి, గొడకళ్ల, త్రిపురారం, కొండమడుగు, సూర్యాపేట జిల్లాలో నెమ్మికల్, తుంగతుర్తి, జాజిరెడ్డిగూడెం, యాదాద్రి భువనగిరి జిల్లాలో ఆత్మకూర్(ఎం), వలిగొండ, రామన్నపేటల్లో సంతలు జరుగుతున్నాయి. మిగతా గ్రామ పంచాయతీల్లో సంతలు లేవు. ఊరూరా మార్కెట్ సౌకర్యం కల్పించాలని నిర్ణయం తీసుకోవడం వల్ల ఇక సంతలు లేని వాటిల్లో నెలకొల్పేందుకు చక్కటి అవకాశం దక్కింది.
నిధుల కేటాయింపు ఇలా...
* కేటగిరి-1 విభాగంలో పెద్ద పంచాయతీకి రూ. 15 లక్షలు
* రూ. 10 లక్షలు ఉపాధి హామీ పథకం నిధులు
* రూ. 5 లక్షలు గ్రామ పంచాయతీ నిధులు
* ప్రతి గ్రామంలో 30 గదులు నిర్మించుకోవచ్చు
* కేటగిరి-2 విభాగంలో చిన్న పంచాయతీకి రూ. 12.50 లక్షలు
* రూ. 9 లక్షలు ఉపాధి హమీ పథకం నిధులు
* రూ 3.50 లక్షలు పంచాయతీ నిధులు
* ప్రతి గ్రామంలో 20 దుకాణాలతో సంత ఏర్పాటు చేసుకోవచ్చు.
ప్రతిపాదనలు ఇస్తే మంజూరు చేస్తాం: కాళిందిని, డీఆర్డీవో నల్గొండ
జిల్లాలో ఇప్పటి వరకు రెండు పంచాయతీల నుంచి ప్రతిపాదనలు రాగా నిధులు మంజూరు చేశాం. పనులు ఇంకా ప్రారంభం కాలేదు. సంతల్లో మౌలిక వసతుల కల్పనకు ఉపాధిహామీ పథకం నిధులు వినియోగించుకోవచ్చు. దీని కోసం స్థలాలు ఎంపిక చేసి ప్రతిపాదనలు పంపిస్తే పరిశీలించి నిధులు మంజూరు చేస్తాం. ఈ అవకాశంపై సర్పంచులు అవగాహన పొంది తమ గ్రామాల్లో సంతల ఏర్పాటుకు కృషి చేయాలి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మాటలే తూటాలై..!
[ 24-04-2024]
‘నల్గొండ జిల్లా సాగునీటి రంగానికి కేసీఆర్ తీరని అన్యాయం చేశారు. బస్సు యాత్ర కాదు, మోకాళ్ల యాత్ర చేసినా భారాసకు ఎవరూ ఓటేయరు. -
వైభవంగా హనుమాన్ జయంతి
[ 24-04-2024]
హనుమాన్ జయంతి సందర్భంగా మంగళవారం ఆలయాల్లో ప్రత్యేక పూజలు జరిపించారు. స్వామి వారికి సింధూరంతో అభిషేకం, తమల పాకులతో పూజలు నిర్వహించారు. -
పాఠాలకు బై.. ఆటలకు సై..!
[ 24-04-2024]
వేసవి సెలవులు వచ్చేశాయ్.. పది నెలల పాటు నిత్యం బడుల్లో పాఠాలు చదవడం, రాయడం తదితర పనుల్లో నిమగ్నమై ఉన్న చిన్నారులకు ఈ నెల 24 (బుధవారం) నుంచి మొదలయ్యే సెలవులతో ఉపశమనం లభించింది. -
అట్టహాసంగా కంచర్ల నామినేషన్
[ 24-04-2024]
లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నేతలకు తగిన బుద్ధి చెప్పడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారని మాజీ మంత్రి జగదీశ్రెడ్డి అన్నారు. -
పార్టీ గుర్తుల చరిత్ర ఇదే
[ 24-04-2024]
రాజకీయ పార్టీలనగానే గుర్తొచ్చేది వాటి గుర్తులే. ప్రధానంగా ఎన్నికల సమయంలో పార్టీ అభ్యర్థుల కంటే గుర్తులకే ప్రాధాన్యం ఉంటుంది. -
వారు.. శాసనసభకు, లోక్సభకు ఎన్నికయ్యారు!
[ 24-04-2024]
ఉమ్మడి నల్గొండ జిల్లాకు చెందిన కొందరు నేతలు శాసనసభకు, లోక్సభకు ఎన్నికయ్యారు. దేశంలోనే అత్యధిక ఓట్లు సాధించి రికార్డు సృష్టించారు. -
ప్రలోభాల ఎర.. తప్పదు చెర!
[ 24-04-2024]
లోక్సభ ఎన్నికలు మే 13న జరగనున్నాయి. ఇప్పటికే నామినేషన్ల పర్వం ప్రారంభం కావడంతో ప్రచారం ఊపందుకుంటోంది. -
ఆహారం సేకరించి.. అభాగ్యుల ఆకలి తీర్చి..
[ 24-04-2024]
దేశంలో ఒక వైపు రెండు పూటలా తినడానికి తిండి లేక వేలాది మంది అవస్థలు పడుతున్నారు. మరో వైపు నిత్యం లక్షల టన్నుల ఆహార పదార్థాలు వ్యర్థాలుగా మారుతున్నాయి. -
లోక్సభలో గళం విప్పే అవకాశం ఇవ్వండి: జహంగీర్
[ 24-04-2024]
ప్రజాసమస్యల పరిష్కారానికి జనం వెన్నంటే ఉండి నిరంతరం పోరాటాలు చేస్తున్న తనకు మద్దతుగా నిలిచి గెలిపిస్తే పార్లమెంటులో ఈ ప్రాంత సమస్యలపై గళం విప్పుతానని భువనగిరి లోక్సభ సీపీఎం అభ్యర్థి ఎండీ.జహంగీర్ అన్నారు. -
గత పొరపాట్లు పునరావృతం కావొద్దు: కలెక్టర్
[ 24-04-2024]
త్వరలో జరగబోయే లోక్సభ ఎన్నికల్లో సెక్టార్, పోలీసు అధికారులు సమన్వయంతో పని చేయాలని కలెక్టర్ వెంకటరావు అన్నారు. -
బడికి నిధులు
[ 24-04-2024]
యాదాద్రి జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో వసతుల కల్పనకు రాష్ట్ర ప్రభుత్వం రూ.25 కోట్లు మంజూరు చేసింది. ఈ పనులను అమ్మ ఆదర్శ కమిటీల ద్వారా చేపట్టనున్నారు. -
అతిథులు తరలొచ్చె.. బూర పూరించె..!
[ 24-04-2024]
ఓట్ల కోసం అనాదిగా మత రాజకీయాలు చేస్తున్నది కాంగ్రెస్ పార్టీయేనని భాజపా ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యుడు డాక్టర్ కె.లక్ష్మణ్ విమర్శించారు. -
వేస్తున్నారు నామినేషన్లు..!
[ 24-04-2024]
ఉమ్మడి నల్గొండ జిల్లాలోని నల్గొండ, భువనగిరి లోక్సభ స్థానాలకు నామినేషన్ల స్వీకరణ కార్యక్రమం కొనసాగుతోంది. -
అభ్యర్థులిద్దరూ ‘బీఎన్ రెడ్డి’లే..!
[ 24-04-2024]
మిర్యాలగూడ లోక్సభ నియోజకవర్గంలో 1989, 1991 ఎన్నికల్లో ప్రధాన అభ్యర్థులిద్దరూ బీఎన్రెడ్డిలే. ఒకరు వాస్తుశిల్పి బద్దం నర్సింహారెడ్డి. మరొకరు భీంరెడ్డి నర్సింహారెడ్డి. -
1,29,766 ఓట్లు కొల్లగొట్టిన స్వతంత్రులు
[ 24-04-2024]
ఫ్లోరైడ్కు వ్యతిరేకంగా జలసాధన సమితి ఆధ్వర్యంలో 1996 లోక్సభ ఎన్నికల్లో 476 మంది స్వతంత్ర అభ్యర్థులుగా బరిలో నిలిచారు. ఆ ఎన్నికల్లో వీరు 1,29,766 ఓట్లు సాధించారు.