నైపుణ్య శిక్షణ.. ఉపాధికి రక్షణ
స్వయం ఉపాధి అవకాశాలను మెరుగుపర్చుకుంటే.. భవిష్యత్తు ఉజ్వలంగా సాగుతుంది. అందుకే మహిళలు, యువతీయువకులకు వృత్తి నైపుణ్యంపై మెలకువలు అందించేందుకు జిల్లా యువజన, క్రీడల శాఖ ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి దత్తత గ్రామమైన
వాసాలమర్రిలో వృత్తి నైపుణ్య శిక్షణకు హాజరైన మహిళలు
తుర్కపల్లి, న్యూస్టుడే: స్వయం ఉపాధి అవకాశాలను మెరుగుపర్చుకుంటే.. భవిష్యత్తు ఉజ్వలంగా సాగుతుంది. అందుకే మహిళలు, యువతీయువకులకు వృత్తి నైపుణ్యంపై మెలకువలు అందించేందుకు జిల్లా యువజన, క్రీడల శాఖ ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి దత్తత గ్రామమైన తుర్కపల్లి మండలం వాసాలమర్రిలో వృత్తి నైపుణ్య శిక్షణ కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఈ కేంద్రంలో కుట్టు, బ్యూటీషియన్, కంప్యూటర్ (ఎంఎస్ ఆఫీసు), ఎలక్ట్రిషియన్, మొబైల్ సర్వీసింగ్ రంగాలపై తర్ఫీదు ఇస్తున్నారు. ప్రస్తుతం మొదటి బ్యాచ్లో మొత్తం 151 మంది పలు కోర్సుల్లో మూడు నెలల శిక్షణ పూర్తి చేసుకుని అర్హత పరీక్షలకు సిద్ధమవుతున్నారు. పరీక్ష తేదీ ఖరారు కావాల్సి ఉంది. ఉత్తీర్ణులైన వారికి ధ్రువపత్రాలు అందజేస్తారు.
ఉత్తీర్ణులకు ధ్రువపత్రాల జారీ: ధనుంజయ్, జిల్లా యువజన, క్రీడల శాఖ అధికారి... వాసాలమర్రి గ్రామంలో ఏర్పాటు చేసిన వృత్తి నైపుణ్య శిక్షణ కేంద్రంలో 49 మంది కుట్టు, 29 మంది బ్యూటీషియన్, 20 మంది ఎలక్ట్రిషియన్, 15 మంది మొబైల్ సర్వీసింగ్, 30 మంది యువతీ యువకులు కంప్యూటర్ శిక్షణ పొందారు. వారికి త్వరలో పరీక్షలు నిర్వహిస్తాం. ఉత్తీర్ణులైన వారికి ధ్రువపత్రాలు జారీ చేస్తాం.
బ్యూటీషియన్ రంగానికి మంచి డిమాండ్: పలుగుల ప్రశాంతి, బీటెక్
బీటెక్ పూర్తయ్యాక సాఫ్ట్వేర్ ఉద్యోగం చేశాను. నాకు ఇద్దరు చిన్నపిల్లలు ఉన్నారు. పిల్లల కారణంగా ఉద్యోగం వదులుకోవాల్సి వచ్చింది. శిక్షణ కేంద్రంలో బ్యూటీషియన్లో తర్ఫీదు పొందాను. మంచి డిమాండ్ ఉన్న బ్యూటీషియన్ రంగంలో రాణించి స్వయం ఉపాధి అవకాశాలు మెరుగుపరుచుకుంటాను.
ఎంఎస్ ఆఫీసు నేర్చుకున్నా: కొక్కొండ నాగరాణి, డిగ్రీ
ప్రస్తుతం ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాలే కాకుండా అనేక సంస్థల్లోనూ కంప్యూటర్ ప్రాధాన్యం పెరిగింది. అందుకే శిక్షణ కేంద్రంలో కంప్యూటర్ ఎంఎస్ ఆఫీసు నేర్చుకున్నా. భవిష్యత్తులో ఎక్కడైనా పనిచేయగలననే నమ్మకం కలిగింది. ఉచిత శిక్షణ ఇచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. పరీక్ష రాసి ధ్రువపత్రం పొందుతాను.
శిక్షణతో భవిష్యత్తుపై భరోసా: పలుగుల లావణ్య, ఇంటర్
నేర్చుకున్న వృత్తి విద్య భవిష్యత్తుపై భరోసానిస్తోంది. కేంద్రంలో జాకెట్లు, పంజాబీ డ్రెస్సులు, ఫ్రాక్లు, చిన్న పిల్లల షర్టులు, నిక్కర్లు కుట్టడం నేర్పించారు. సొంతంగా ఇంట్లోనే ఉంటూ దర్జీ షాపు నడిపిస్తా. నా వంతు బాధ్యతగా స్వశక్తితో డబ్బులు సంపాదించి కుటుంబానికి అండగా నిలుస్తా.
కుటుంబానికి ఆసరాగా నిలుస్తా: దుబ్బాక రాధిక
వృత్తి నైపుణ్య శిక్షణ కేంద్రానికి రావటం నాకు మేలు జరిగింది. మార్కెటింగ్ రంగంలో పని చేస్తూ నా భర్త మాకోసం నిత్యం చాలా కష్టపడుతున్నారు. ఇద్దరం కష్టపడితేనే సంతోషంగా ఉంటాం. అందుకే శిక్షణ కేంద్రంలో ఇక్కడ పలు రకాల జాకెట్లు, చిన్న పిల్లలు, పెద్దలు దుస్తులు, పంజాబీ డ్రెస్సులు కుట్టడం నేర్చుకున్నాను. కోర్సు పూర్తయ్యింది. త్వరలో టైలరింగ్ షాపు ఏర్పాటు చేసుకుని స్వయం ఉపాధి పొందుతూ కుటుంబానికి ఆసరాగా ఉంటా.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
నల్గొండలో 4... భువనగిరిలో 5
[ 20-04-2024]
లోక్సభ ఎన్నికల నామినేషన్ల స్వీకరణలో రెండో రోజైన శుక్రవారం నల్గొండ లోక్సభ పరిధిలో నలుగురు అభ్యర్థులు నామినేషన్లను దాఖలు చేశారు. -
పండుటాకులకు ఇంటివద్దే ఓటు
[ 20-04-2024]
రాబోయే లోక్సభ ఎన్నికల్లో ఓటర్లందరూ తమ హక్కు వినియోగించుకునేలా చేయాలని కేంద్ర ఎన్నికల సంఘం భావించింది.ఇందుకోసం పలు చర్యలు చేపట్టింది. -
యథేచ్ఛగా మట్టి దందా
[ 20-04-2024]
నార్కట్పల్లి మండలంలో మట్టి దందా యథేచ్ఛగా సాగుతోంది. గోపలాయపల్లి, యల్లారెడ్డిగూడెంలోని చెరువులు, బ్రాహ్మణవెల్లంల ప్రాజెక్ట్ కాల్వల మట్టిని అక్రమంగా ఇటుక బట్టీలకు, వెంచర్లకు తరలిస్తున్నారు. -
ఇక కఠిన చర్యలు
[ 20-04-2024]
సీఎంఆర్ బియ్యం బకాయిదారులపై కఠినంగా వ్యవహరించాలని రాష్ట్ర అత్యున్నత స్థాయిలో శుక్రవారం నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. -
పదమూడేళ్లుగా.. అభ్యున్నతే లక్ష్యంగా..!
[ 20-04-2024]
ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా పదమూడేళ్లుగా ప్రభుత్వ పాఠశాలల్లో చదివే పేద విద్యార్థుల అభ్యున్నతికి, చదువుల్లో ఉన్నత స్థాయికి ఎదిగేందుకు పాలిటెక్నిక్లో ప్రవేశానికి నిర్వహించే పాలిసెట్లో ఉచిత శిక్షణ అందిస్తుంది ప్రభుత్వ పాఠశాలల పరిరక్షణ సమితి. -
పార్టీ గుర్తు కావాలంటే బీ ఫారం ఉండాల్సిందే..
[ 20-04-2024]
లోక్సభ, శాసనసభ, జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నిక ఏదైనా సరే...రాజకీయ పార్టీ అభ్యర్థిగా గుర్తించి అతనికి ఆయా పార్టీలకు ఎన్నికల సంఘం నిర్ణయించిన గుర్తులను ఎన్నికల అధికారి కేటాయించాలంటే ‘బీ’ ఫారం ఉండాల్సిందే. -
ఎంపీలుగా ఎవరెవరంటే..
[ 20-04-2024]
లోక్సభకు ఉమ్మడి నల్గొండ జిల్లా నుంచి మహామహులు ప్రాతినిథ్యం వహించారు. వారు ప్రాతినిథ్యం వహించిన పార్టీతో పాటు వారు నిర్వహించిన ప్రజా ఉద్యమాలు, సచ్ఛీలత, వ్యక్తిగత పలుకుబడి తోడు కావడంతో ఎన్నికల బరిలో విజయబావుటా ఎగురవేశారు. -
ఏదీ నిఘా..!
[ 20-04-2024]
లోక్సభ ఎన్నికలు.. ఏపీలో అసెంబ్లీ ఎన్నికల వేళ ఉభయ తెలుగు రాష్ట్రాల సరిహద్దుగా ఉన్న కృష్ణానది తీరంలో మరింత నిఘా పెడితేనే అక్రమాలకు అడ్డుకట్ట పడనుంది. -
ఈవీఎం, వీవీప్యాట్లకు తేడా ఇదే!
[ 20-04-2024]
ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషీన్ (ఈవీఎం)లోని ఒక భాగమే ఓటర్ వెరిఫైడ్ పేపర్ ఆడిట్ ట్రయల్ (వీవీప్యాట్). అభ్యర్థి పేరు, గుర్తు, సీరియల్ నంబర్ దీనిపై కనిపిస్తాయి. -
వరుస దొంగతనాలకు పాల్పడుతున్న నిందితుడి అరెస్ట్
[ 20-04-2024]
జిల్లాతో పాటు ఇతర ప్రాంతాల్లో వరుస దొంగతనాలకు పాల్పడుతున్న దొంగను అదుపులోకి తీసుకున్నట్లు నల్గొండ జిల్లా మిర్యాలగూడ డీఎస్పీ రాజశేఖర్ రాజు తెలిపారు. -
చిన్నప్పుడు కథలు చెబితేనే నిద్రవచ్చేది
[ 20-04-2024]
మా ఊరు మోత్కూరు మండలం పాలడుగు గ్రామం. ప్రాథమిక విద్య ఇక్కడే చదువుకున్నాను. -
లోక్సభ ఎన్నికల తర్వాత భారాస అడ్రస్ గల్లంతు: ఉత్తమ్
[ 20-04-2024]
లోక్సభ ఎన్నికల్లో రాష్ట్ర వ్యాప్తంగా భారాస ఒక్క స్థానంలోనూ విజయం సాధించలేదని, డిపాజిట్లు కూడా దక్కవని రాష్ట్ర పౌర సరఫరా, నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి అన్నారు. -
పల్లె చెరువుల్లో మట్టి లూటీ..!
[ 20-04-2024]
పంట పొలాలకు సాగునీరందించే చెరువుల మట్టి వ్యాపారుల జేబులు నింపుతోంది. ముఖ్యంగా ఇటుక బట్టీల నిర్వాహకులు వివిధ గ్రామాల్లో కొన్నేళ్లుగా ఓ విధానమంటూ లేకుండా చెరువు మట్టిని పొక్లెయిన్లతో తవ్వి ట్రాక్టర్లలో తరలించి ఇటుకల తయారీకి వాడుతున్నారు. -
భాజపాను ఓడించేందుకు ఏకం కావాలి
[ 20-04-2024]
తెలంగాణలోని 17 లోక్సభ స్థానాల్లో అత్యధికంగా గెలవాలని ఉవ్విళ్లూరుతున్న భాజపా ఆశలను వమ్ము చేయడమే తమ ముందున్న లక్ష్యమని సీపీఎం పొలిట్బ్యూరో సభ్యుడు బీవీ రాఘవులు అన్నారు.
తాజా వార్తలు (Latest News)
-
బస్సులు జగన్ సభకు.. కష్టాలు ప్రయాణికులకు
-
వైకాపా నేతల సిఫార్సులతో పోస్టు.. మహిళా ఉద్యోగినులతో వెకిలి చేష్టలు
-
విశాఖ-బెంగళూరు మధ్య ప్రత్యేక రైలు
-
ఒలింపిక్స్లో పతకం తెస్తే బీఎండబ్ల్యూ కారు
-
పెళ్లి ఘట్టం.. క్యూఆర్ కోడ్లో నిక్ష్లిప్తం
-
పిల్లలతో అశ్లీల వీడియోలు తీయడం ఆందోళనకరం, నేరం : సుప్రీంకోర్టు