logo

ఆచార్య పసునూరి శ్రీరాములు మృతి

విద్యావేత్త, ఆచార్య వసునూరి శ్రీరాములు (72) అనారోగ్యం కారణంగా శుక్రవారం రాత్రి హైదరాబాద్‌లోని ప్రైవేట్‌ ఆసుపత్రిలో మృతిచెందారు. ఆయన కొంతకాలంగా వెన్నెముఖ సంబంధిత వ్యాధితో బాధపడుతున్నారు. శ్రీరాములు స్వగ్రామం మోత్కూరు

Published : 23 Jan 2022 05:53 IST

వసునూరి శ్రీరాములు

మోత్కూరు, న్యూస్‌టుడే: విద్యావేత్త, ఆచార్య వసునూరి శ్రీరాములు (72) అనారోగ్యం కారణంగా శుక్రవారం రాత్రి హైదరాబాద్‌లోని ప్రైవేట్‌ ఆసుపత్రిలో మృతిచెందారు. ఆయన కొంతకాలంగా వెన్నెముఖ సంబంధిత వ్యాధితో బాధపడుతున్నారు. శ్రీరాములు స్వగ్రామం మోత్కూరు మండలం బుజిలాపురం. నల్గొండ డైట్‌ కళాశాల ప్రిన్సిపల్‌గా, నాగార్జునసాగర్‌, మెదక్‌, మహబూబ్‌నగర్‌ జిల్లాల్లో బీఈడీ కళాశాలల్లో లెక్చరర్‌గా, విద్యాశాఖలో వివిధ హోదాల్లో పనిచేశారు. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర విద్య పరిశోధనా శిక్షణా సంస్థ డైరెక్టర్‌ (ఎస్‌సీఈఆర్‌టీ)గా పదవీ విరమణ పొందారు. హైదరాబాద్‌లో శనివారం అంత్యక్రియలు పూర్తయ్యాయి. పద్మశాలి అఫీషియల్‌ అండ్‌ ప్రొఫెషనల్‌ అసోసియేషన్‌ (పోపా) యాదాద్రి భువనగిరి జిల్లా అధ్యక్షుడు వనం శాంతికుమార్‌, ప్రధాన కార్యదర్శి పెండెం నాగార్జున, ప్రజాభారతి సాహితి సంస్థ అధ్యక్ష, కార్యదర్శి టి.ఉప్పలయ్య, మర్రి జయశ్రీ, ప్రతినిధులు యాదగిరి, కృష్ణ తదితరులు సంతాపం ప్రకటించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని