జాన్పహాడ్ ఉర్సు ఉత్సవాలకు పకడ్బందీ ఏర్పాట్లు
జాన్పహాడ్ దర్గా ఉర్సు ఉత్సవాలకు పకడ్బందీగా ఏర్పాట్లు చేస్తున్నట్లు హుజూర్నగర్ ఆర్డీవో వెంకారెడ్డి తెలిపారు. జాన్పహాడ్ దర్గా ఆవరణలో శనివారం వివిధ శాఖల అధికారులతో నిర్వహించిన సమన్వయ సమావేశంలో మాట్లాడారు.
మాట్లాడుతున్న ఆర్డీవో వెంకారెడ్డి, పక్కన డీఎస్పీ రఘు, తదితరులు
పాలకవీడు గ్రామీణం, న్యూస్టుడే: జాన్పహాడ్ దర్గా ఉర్సు ఉత్సవాలకు పకడ్బందీగా ఏర్పాట్లు చేస్తున్నట్లు హుజూర్నగర్ ఆర్డీవో వెంకారెడ్డి తెలిపారు. జాన్పహాడ్ దర్గా ఆవరణలో శనివారం వివిధ శాఖల అధికారులతో నిర్వహించిన సమన్వయ సమావేశంలో మాట్లాడారు. కొవిడ్ నిబంధనలతో హాజరు కావాలని భక్తులకు సూచించారు. గతేడాది పార్కింగ్, విద్యుత్తు దీపాల ఏర్పాటు, పారిశుద్ధ్యం, తాగునీరు, ట్రాఫిక్జామ్ లాంటి మౌలిక వసతులు లేకపోవటంతో భక్తులు ఇబ్బందులు ఎదుర్కొన్న విషయాన్ని ప్రజాప్రతినిధులు ఉన్నతాధికారుల దృష్టికి తీసుకొచ్చారు. అసౌకర్యాలు కలగకుండా ప్రణాళికతో ఏర్పాటు చేయాలని ఆయా శాఖల అధికారులనూ ఆర్డీవో ఆదేశించారు. వక్ప్ బోర్డు అధికారులకు ఆదాయార్జనపై ఉన్న శ్రద్ధ సౌకర్యాలపై లేదని, వారి సహకారం లేకుండా ఏర్పాట్లు చేయటంతో గ్రామ పంచాయతీపై ఆర్థిక భారం పడుతోందని సర్పంచి రమావత్ గోరీ అన్నారు. గత ఉర్సు వేడుకలకు రూ.3 లక్షలు జీపీ సాధారణ నిధులు నుంచి ఇస్తే.. నేటి వరకు తిరిగి జమ చేయలేదని ఆవేదన వ్యక్తం చేశారు. దర్గా ఆవరణలో ప్రత్యేక శిబిరం ఏర్పాటు చేయనున్నట్లు ప్రతి శాఖకు సంబంధించిన అధికారి ఒకరు అందుబాటులో ఉండాలని డీఎస్పీ రఘు సూచించారు. బందోబస్తు కోసం 300 మందికి పైగా సిబ్బంది ఉంచినట్లు తెలిపారు. శౌచాలయాలు, తాగునీటి ఏర్పాటు ప్రదేశాలు ఎక్కడెక్కడ ఏర్పాటు చేశారో ప్రత్యేక సైన్ బోర్డులు ఏర్పాటు చేయాలని వక్ప్బోర్డు అధికారులను కోరారు. శూన్యపహాడ్, జాన్పహాడ్ రహదారుల వెంట పార్కింగ్ ప్రదేశాలను ఏర్పాటు చేస్తామన్నారు. వైద్య శాఖ మూడు శిబిరాలు, మిర్యాలగూడ, కోదాడ డిపోల నుంచి బస్సులు నడుపుతామని ఆయా డిపోల మేనేజర్లు తెలిపారు. వక్ఫ్ బోర్డు అధికారి షేక్ మహమూద్, ఎంపీపీ భూక్యా గోపాల్, జడ్పీటీసీ సభ్యురాలు మాలోతు బుజ్జి, స్థానిక ఎంపీటీసీ సభ్యురాలు కవిత, సీఐ రామలింగారెడ్డి, జిల్లా ప్రోగ్రాం అధికారిణి జయ, ఎంపీడీవో జానయ్య, ఆర్అండ్బీ డీఈ మహిపాల్రెడ్డి, ఎక్సైజ్ సీఐ శ్యామ్సుందర్, అగ్నిమాపక అధికారి రామలింగం పాల్గొన్నారు.
20 ప్రత్యేక బస్సులు
మిర్యాలగూడ పట్టణం : ఈ నెల 27, 28 తేదీల్లో నిర్వహించనున్న జానపహాడ్ ఉర్సుకు మిర్యాలగూడ ఆర్టీసీ డిపో నుంచి 20 ప్రత్యేక బస్సులు నడుపుతున్నట్లు డిపో మేనేజర్ బొల్లెద్దు పాల్ తెలిపారు. ఇటీవల పెంచిన కార్గో ఛార్జీలు ప్రజల కోరిక మేరకు తగ్గించారన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
దాహం కేకలు తీర్చేందుకు...తరలి వస్తున్న కృష్ణమ్మ
[ 19-04-2024]
నాగార్జునసాగర్ జలాశయం డెడ్స్టోరేజీ దిగువకు చేరినా వేసవిలో హైదరాబాద్ జంట నగరాలు, జిల్లా వాసుల దాహం కేకలు తీర్చేందుకు కృష్ణాజలాల సరఫరాకు హెచ్ఎండబ్ల్యూఎస్ఎస్బీ (జలమండలి) అధికారులు చేపడుతున్న చర్యలు సఫలీకృతమయ్యాయి -
సైబర్ బాధితులకు వారియర్స్ తోడు
[ 19-04-2024]
చరవాణుల ద్వారా డిజిటల్ లావాదేవీలు పెరగడంతో నిత్యం ఎక్కడో చోట అమాయకులు సైబర్ నేరగాళ్ల వలలో పడి ఆర్థికంగా నష్టపోతున్నారు. -
రాష్ట్రంలోనే ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దుతా: మంత్రి ఉత్తమ్
[ 19-04-2024]
కోదాడ నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసి రాష్ట్రంలోనే ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దుతానని నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి అన్నారు. -
గాడితప్పిన గస్తీ
[ 19-04-2024]
జిల్లాలో దొంగలు రెచ్చిపోతున్నారు. వరుసగా గొలుసు చోరీలకు పాల్పడుతున్నారు. నిఘా పటిష్ఠం చేసి దొంగలను పట్టుకోవడంలో పోలీసులు విఫలమవుతున్నారు. -
ఆలయ భద్రతపై ఇంత నిర్లక్ష్యమా!
[ 19-04-2024]
యాదాద్రి పుణ్యక్షేత్రాన్ని నిత్యం వేల సంఖ్యలో భక్తులు సందర్శిస్తుంటారు. ఆలయంలోకి ప్రవేశించే ప్రతి ఒక్కరిని క్షుణ్ణంగా తనిఖీ చేసిన తరువాతే లోనికి అనుమతించేందుకు బ్యాగేజ్ స్కానింగ్, మెటల్ డిటెక్టర్, తదితర భద్రతా పరికరాలను వైటీడీఏ కొనుగోలు చేసింది. -
భక్తవత్సలుడికి సంప్రదాయ ఆరాధనలు
[ 19-04-2024]
యాదాద్రి పుణ్యక్షేత్రంలో గురువారం స్వయంభువులైన పంచనారసింహులను ఆరాధిస్తూ చేపట్టిన నిత్య పూజలు ఆలయ ఆచారంగా కొనసాగాయి -
కేసీఆర్కు సీఎం రేవంత్రెడ్డే సరైనోడు: రాజగోపాల్రెడ్డి
[ 19-04-2024]
తెలంగాణ ఇచ్చిన పదేళ్ల తర్వాత కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందని.. ఆలస్యం అయినా ప్రవేశపెట్టిన పథకాలను నెరవేర్చి.. రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలోకి తీసుకెళ్తామని భువనగిరి లోక్సభ ఇన్ఛార్జి, స్థానిక ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి అన్నారు. -
నాయకులొస్తున్నారు..!
[ 19-04-2024]
ఉమ్మడి జిల్లాలోని రెండు లోక్సభ స్థానాలైన నల్గొండ, భువనగిరిలో నామినేషన్ దాఖలు సందర్భంగా భారీ ఎత్తున ర్యాలీలు, సభలు నిర్వహించాలని అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష పార్టీలు భారాస, భాజపాలు నిర్ణయించాయి -
67 ఏళ్లలో 69 శాతమే!
[ 19-04-2024]
నల్గొండ లోక్సభ నియోజకవర్గం 1952లో ఏర్పడగా.. 2019 వరకు 17 సార్లు ఎన్నికలు జరిగాయి. 2019 నాటికి నియోజకవర్గానికి తొలి ఎన్నికలు జరిగి 67 ఏళ్లు గడిచాయి -
నల్గొండలో నలుగురు, భువనగిరిలో ముగ్గురు
[ 19-04-2024]
లోక్సభ ఎన్నికలకు నామినేషన్ల పర్వం మొదలైంది. తొలి రోజు గురువారం నల్గొండ లోక్సభ స్థానానికి నలుగురు అభ్యర్థులు ఆరు సెట్లు నామినేషన్లను రిటర్నింగ్ అధికారి, నల్గొండ జిల్లా కలెక్టరు హరిచందనకు అందజేశారు. -
నల్గొండ.. నాయకులకు అండ!
[ 19-04-2024]
నల్గొండ లోక్సభ నియోజకవర్గానికి 18వ సారి ఎన్నికలు జరుగనున్నాయి. ఉమ్మడి జిల్లాలో తొలిసారి ఏర్పడిన ఏకైక లోక్సభ నియోజకవర్గం నల్గొండ మాత్రమే. -
పార్లమెంటు.. ఎంపీ అంటే తెలుసా
[ 19-04-2024]
లోక్సభ ఎన్నికలకు సమయం దగ్గరపడుతోంది. ఇప్పటికే ప్రధాన పార్టీల అభ్యర్థులు తమదైన శైలిలో సమావేశాలు నిర్వహిస్తూ ఓటర్లను మచ్చిక చేసుకునే ప్రయత్నంలో ఉన్నారు -
వ్యాను ఢీకొని రైతు మృతి
[ 19-04-2024]
ద్విచక్రవాహనాన్ని వ్యాను ఢీకొనడంతో రైతు మృతి చెందిన ఘటన మఠంపల్లి మండలం రఘునాథపాలెం పరిధిలోని వెంకటాయపాలెంలో గురువారం జరిగింది. -
ఇంటి మీద.. అవార్డుల పంట
[ 19-04-2024]
మిద్దె తోటలు.. ఆరోగ్యానికి ఉపయోగపడే కూరగాయలతో పాటు పురస్కారాలనూ తీసుకొస్తున్నాయి.