అతివలు కలిసి.. ఉపాధితో మెరిసి
కరోనా ప్రభావంతో అన్నిరంగాలు దెబ్బతింటున్నాయి. ఎంతో మంది ఉపాధి కోల్పోయి ఇతర ఆదాయ మార్గాలను ఎంచుకుంటున్నారు. ఇంతటి సంక్షోభంలోనూ నల్గొండ పట్టణంలోని చర్లపల్లికి చెందిన మహిళలు స్వయం ఉపాధి పొందుతూ ఎంతో మందికి స్ఫూర్తిగా నిలుస్తున్నారు.
శానిటరీ న్యాప్కిన్ తయారీలో రాణిస్తున్న మహిళలు
ఇంట్లోనే నెలకొల్పిన శానిటరీ న్యాప్కిన్ ప్యాడ్ల యూనిట్
నల్గొండ పురపాలిక, న్యూస్టుడే: కరోనా ప్రభావంతో అన్నిరంగాలు దెబ్బతింటున్నాయి. ఎంతో మంది ఉపాధి కోల్పోయి ఇతర ఆదాయ మార్గాలను ఎంచుకుంటున్నారు. ఇంతటి సంక్షోభంలోనూ నల్గొండ పట్టణంలోని చర్లపల్లికి చెందిన మహిళలు స్వయం ఉపాధి పొందుతూ ఎంతో మందికి స్ఫూర్తిగా నిలుస్తున్నారు. బ్యాంకు ద్వారా రుణం తీసుకొని మహిళలకు సంబంధించిన శానిటరీ వస్తువులు తయారీ యూనిట్ నెలకొల్పారు. స్వయంగా తయారీ, మార్కెంటింగ్ చేస్తూ ఆర్థికంగా బాటలు పర్చుకుంటూ, మరో ఆరుగురికి ఉపాధి కల్పిస్తూన్నారు.
ప్రగతి బాటలో మహిళలు..
నల్గొండ మున్సిపాలిటీ పరిధిలోని చర్లపల్లికి చెందిన లక్ష్మిగణపతి సమభావన సంఘం సభ్యురాలు సీహెచ్ జ్యోతి, వినాయక సెల్ప్హెల్ప్ గ్రూపు సభ్యురాలు విజయ సుమారు రూ.4లక్షల వ్యయంతో 2021లో చిన్నతరహా పరిశ్రమగా మహాలక్ష్మి సంస్థ పేరుతో శానిటరీ న్యాప్కిన్ ప్యాడ్ వంటి వస్తువల తయారీ యూనిట్ నెలకొల్పారు. దిల్లీ, పచ్చిమబంగ్లా నుంచి ముడి సరకులు తీసుకొచ్చి మహిళలే స్వయంగా తయారు చేస్తున్నారు. ప్రత్యేకంగా ‘మై ఛాయిస్’ బ్రాండ్తో ప్యాకింగ్ చేసిన న్యాప్కిన్ ప్యాడ్లను తయారు చేస్తున్నారు. నల్గొండ, నార్కట్పల్లి, నకిరేకల్ పట్టణాల్లోని దుకాణాలకు వీటిని సరఫరా చేస్తున్నారు. ప్రారంభంలో మార్కెటింగ్ చేయడంతో కాస్త ఒడిదొడుకులు ఎదురైనా ఆ తర్వాత పరిచయాలు పెరగడంతో కరోనా సమయంలోనూ మార్కెటింగ్లో ఎలాంటి ఇబ్బందులు రాకుండా వ్యాపారం కొనసాగుతుందని నిర్వాహకులు తెలిపారు. కొవిడ్ కారణంగా పనులు లేక ఇబ్బందులు ఎదుర్కొన్నామని చెప్పారు. ఖర్చులన్ని పోను ఒక్కొక్కరూ ప్రతి నెల రూ. 15వేల వరకు సంపాదిస్తూ ఇతరులకు ఉపాధి కల్పించే స్థాయికి చేరారు. ప్రభుత్వం ప్రోత్సహిస్తే యూనిట్ స్థాయి పెంచి వ్యాపారాన్ని విస్తరించి మరికొంత మందికి ఉపాధి కల్పిస్తామంటున్నారు.
కరోనా సంక్షోభంలో ఇబ్బంది పడేవాళ్లం
-చెరుపల్లి జ్యోతి, లక్ష్మిగణపతి సమభావన సంఘం సభ్యురాలు
పాఠశాలల విద్యార్థుల దుస్తులు కుట్టేవాళ్లం. కరోనాతో టైలరింగ్పై ప్రభావం పడింది. పనులు లేక ఆర్థికంగా ఇబ్బంది పడ్డాం. కుటుంబం సాఫీగా సాగాలంటే నిత్యం మార్కెట్లో డిమాండ్ ఉన్న వస్తువులను గుర్తించి లాభసాటి వ్యాపారం చేయాలని నిర్ణయించుకున్నాం. శానిటరీ నాప్కిన్ ప్యాడ్ పరిశ్రమను ఏర్పాటు చేశాం. ఇప్పుడు వ్యాపారం బాగా సాగుతోంది. మాతోపాటు మరో ఆరుగురికి ఉపాధి కల్పిస్తున్నాం.
దుకాణాలకు సరఫరా
-విజయ, వినాయక సెల్ప్ హెల్ప్గ్రూపు సభ్యురాలు
తయారు చేస్తున్న శానిటరీ నాప్కిన్ ప్యాడ్లను జిల్లా కేంద్రమైన నల్గొండతోపాటు చుట్టుపక్కల మండలంలోని దుకాణాలకు విక్రయిస్తున్నాం. మార్కెటింగ్ కోసం మా కుటుంబ సభ్యుల్లోనే కొంత మందిని ఏర్పాటు చేసుకొని నడిపిస్తున్నాం. దాని ద్వారా కుటుంబ సభ్యులకు కూడా ఉపాధి లభిస్తుంది. ప్రభుత్వం రాయితీ రుణాలు అందిస్తే వ్యాపారాన్ని విస్తరించి మరికొంత మందికి ఉపాధి అవకాశం కల్పిస్తాం.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
దాహం కేకలు తీర్చేందుకు...తరలి వస్తున్న కృష్ణమ్మ
[ 19-04-2024]
నాగార్జునసాగర్ జలాశయం డెడ్స్టోరేజీ దిగువకు చేరినా వేసవిలో హైదరాబాద్ జంట నగరాలు, జిల్లా వాసుల దాహం కేకలు తీర్చేందుకు కృష్ణాజలాల సరఫరాకు హెచ్ఎండబ్ల్యూఎస్ఎస్బీ (జలమండలి) అధికారులు చేపడుతున్న చర్యలు సఫలీకృతమయ్యాయి -
సైబర్ బాధితులకు వారియర్స్ తోడు
[ 19-04-2024]
చరవాణుల ద్వారా డిజిటల్ లావాదేవీలు పెరగడంతో నిత్యం ఎక్కడో చోట అమాయకులు సైబర్ నేరగాళ్ల వలలో పడి ఆర్థికంగా నష్టపోతున్నారు. -
రాష్ట్రంలోనే ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దుతా: మంత్రి ఉత్తమ్
[ 19-04-2024]
కోదాడ నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసి రాష్ట్రంలోనే ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దుతానని నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి అన్నారు. -
గాడితప్పిన గస్తీ
[ 19-04-2024]
జిల్లాలో దొంగలు రెచ్చిపోతున్నారు. వరుసగా గొలుసు చోరీలకు పాల్పడుతున్నారు. నిఘా పటిష్ఠం చేసి దొంగలను పట్టుకోవడంలో పోలీసులు విఫలమవుతున్నారు. -
ఆలయ భద్రతపై ఇంత నిర్లక్ష్యమా!
[ 19-04-2024]
యాదాద్రి పుణ్యక్షేత్రాన్ని నిత్యం వేల సంఖ్యలో భక్తులు సందర్శిస్తుంటారు. ఆలయంలోకి ప్రవేశించే ప్రతి ఒక్కరిని క్షుణ్ణంగా తనిఖీ చేసిన తరువాతే లోనికి అనుమతించేందుకు బ్యాగేజ్ స్కానింగ్, మెటల్ డిటెక్టర్, తదితర భద్రతా పరికరాలను వైటీడీఏ కొనుగోలు చేసింది. -
భక్తవత్సలుడికి సంప్రదాయ ఆరాధనలు
[ 19-04-2024]
యాదాద్రి పుణ్యక్షేత్రంలో గురువారం స్వయంభువులైన పంచనారసింహులను ఆరాధిస్తూ చేపట్టిన నిత్య పూజలు ఆలయ ఆచారంగా కొనసాగాయి -
కేసీఆర్కు సీఎం రేవంత్రెడ్డే సరైనోడు: రాజగోపాల్రెడ్డి
[ 19-04-2024]
తెలంగాణ ఇచ్చిన పదేళ్ల తర్వాత కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందని.. ఆలస్యం అయినా ప్రవేశపెట్టిన పథకాలను నెరవేర్చి.. రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలోకి తీసుకెళ్తామని భువనగిరి లోక్సభ ఇన్ఛార్జి, స్థానిక ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి అన్నారు. -
నాయకులొస్తున్నారు..!
[ 19-04-2024]
ఉమ్మడి జిల్లాలోని రెండు లోక్సభ స్థానాలైన నల్గొండ, భువనగిరిలో నామినేషన్ దాఖలు సందర్భంగా భారీ ఎత్తున ర్యాలీలు, సభలు నిర్వహించాలని అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష పార్టీలు భారాస, భాజపాలు నిర్ణయించాయి -
67 ఏళ్లలో 69 శాతమే!
[ 19-04-2024]
నల్గొండ లోక్సభ నియోజకవర్గం 1952లో ఏర్పడగా.. 2019 వరకు 17 సార్లు ఎన్నికలు జరిగాయి. 2019 నాటికి నియోజకవర్గానికి తొలి ఎన్నికలు జరిగి 67 ఏళ్లు గడిచాయి -
నల్గొండలో నలుగురు, భువనగిరిలో ముగ్గురు
[ 19-04-2024]
లోక్సభ ఎన్నికలకు నామినేషన్ల పర్వం మొదలైంది. తొలి రోజు గురువారం నల్గొండ లోక్సభ స్థానానికి నలుగురు అభ్యర్థులు ఆరు సెట్లు నామినేషన్లను రిటర్నింగ్ అధికారి, నల్గొండ జిల్లా కలెక్టరు హరిచందనకు అందజేశారు. -
నల్గొండ.. నాయకులకు అండ!
[ 19-04-2024]
నల్గొండ లోక్సభ నియోజకవర్గానికి 18వ సారి ఎన్నికలు జరుగనున్నాయి. ఉమ్మడి జిల్లాలో తొలిసారి ఏర్పడిన ఏకైక లోక్సభ నియోజకవర్గం నల్గొండ మాత్రమే. -
పార్లమెంటు.. ఎంపీ అంటే తెలుసా
[ 19-04-2024]
లోక్సభ ఎన్నికలకు సమయం దగ్గరపడుతోంది. ఇప్పటికే ప్రధాన పార్టీల అభ్యర్థులు తమదైన శైలిలో సమావేశాలు నిర్వహిస్తూ ఓటర్లను మచ్చిక చేసుకునే ప్రయత్నంలో ఉన్నారు -
వ్యాను ఢీకొని రైతు మృతి
[ 19-04-2024]
ద్విచక్రవాహనాన్ని వ్యాను ఢీకొనడంతో రైతు మృతి చెందిన ఘటన మఠంపల్లి మండలం రఘునాథపాలెం పరిధిలోని వెంకటాయపాలెంలో గురువారం జరిగింది. -
ఇంటి మీద.. అవార్డుల పంట
[ 19-04-2024]
మిద్దె తోటలు.. ఆరోగ్యానికి ఉపయోగపడే కూరగాయలతో పాటు పురస్కారాలనూ తీసుకొస్తున్నాయి.
తాజా వార్తలు (Latest News)
-
వైకాపాకి ఓటు వేస్తే డ్రైనేజీలో వేసినట్టే: వైఎస్ షర్మిల
-
నారాయణమూర్తి మనవడికి జాక్పాట్.. ఒక్క రోజులో ₹4 కోట్లు!
-
మా ఎమ్మెల్యేలను టచ్ చేస్తే.. మాడి మసైపోతావ్: కేసీఆర్పై సీఎం రేవంత్ ఫైర్
-
‘ఇద్దరు యువ రాజుల చిత్రాన్ని’ యూపీ ప్రజలు తిరస్కరించారు: మోదీ
-
‘స్పీడ్’ స్టార్లు vs సిక్సర్ల వీరులు... రెండు జట్లలో ‘హ్యాట్రిక్’ ఎవరికి?
-
‘దుబాయ్ ప్రయాణాలను రీషెడ్యూల్ చేసుకోండి’ - ఇండియన్ ఎంబసీ అడ్వైజరీ