సర్వాయి పాపన్న స్ఫూర్తితో కేసీఆర్ పాలన: మంత్రి
నాటి సమాజంలో వృత్తులు మాత్రమే ఉండేవని, కులాలన్నింటిని మానవులు సృష్టించుకున్నవేనని.. మారిన పరిస్థితుల నేపథ్యంలో మానవత్వమే మన కులం కావాలని ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్, పర్యాటక, సాంస్కృతికÛ, యువజన శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ అన్నారు. సోమవారం ఆలేరు మండలం శారాజీపేటలో గౌడ ఐక్యవేదిక ఆధ్వర్యంలో
శారాజీపేటలో సర్వాయి పాపన్నగౌడ్ విగ్రహాన్ని ఆవిష్కరిస్తున్న మంత్రి శ్రీనివాస్గౌడ్, చిత్రంలో ఎమ్మెల్యే గొంగిడి సునీత
ఆలేరు, న్యూస్టుడే: నాటి సమాజంలో వృత్తులు మాత్రమే ఉండేవని, కులాలన్నింటిని మానవులు సృష్టించుకున్నవేనని.. మారిన పరిస్థితుల నేపథ్యంలో మానవత్వమే మన కులం కావాలని ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్, పర్యాటక, సాంస్కృతికÛ, యువజన శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ అన్నారు. సోమవారం ఆలేరు మండలం శారాజీపేటలో గౌడ ఐక్యవేదిక ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సర్ధార్ సర్వాయి పాపన్నగౌడ్ విగ్రహాన్ని ఆవిష్కరించి మాట్లాడారు. మొగులుల పరిపాలనలో పీడనకు, దోపిడీకి గురవుతున్న అణగారిన వర్గాలను చైతన్య పరచి ఎదురించిన సర్వాయి పాపన్న సృహ కలిగిన నాయకుడని కొనియాడారు. బహుజన వీరుడైన పాపన్న గురించి కొందరికి మాత్రమే తెలియడం బాధాకరమన్నారు. సర్వాయి పాపాన్న స్ఫూర్తితో ముఖ్యమంత్రి కేసీఆర్ పరిపాలన చేస్తున్నారని పేర్కొన్నారు. భువనగిరి, యాదాద్రి, కొలనుపాక ప్రాంతాలను ఆధ్యాత్మిక, పర్యాటక ప్రాంతాలుగా అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందన్నారు. జాతీయ పార్టీలు అధికారంలో ఉన్న రాష్ట్రాలు, తెలంగాణతో పోల్చి చూసుకోవాలన్నారు. యాదాద్రి జిల్లాలోని నందనంలో రూ.8కోట్లతో నీరా కేంద్రం ఏర్పాటు కానుందని, హైదరాబాద్ ట్యాంకుబండ్ సమీపంలో రూ.14కోట్లతో నీరా కేంద్ర పనులు జరుగుతున్నాయని చెప్పారు. రానున్న రోజుల్లో యాదాద్రి జిల్లాలో మరో నీరా కేంద్రం ఏర్పాటుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని చెప్పారు. ఎమ్మెల్యే గొంగిడి సునీత మాట్లాడుతూ పాపన్నగౌడ్ పోరాటతీరు నేటి తరానికి స్పూర్తి కావాలన్నారు. ఆలేరు ప్రాంతాన్ని పర్యాటక స్పాట్గా గుర్తించి అభివృద్ధికి నిధులు మంజూరు చేయాలని కోరారు. రాజపేట, కొలనుపాక, జీడికల్ ప్రాంతాలను పర్యాటక శాఖలోకి తీసుకోవాలని, కొలనుపాకను దత్తత తీసుకోవాలని మంత్రిని కోరారు. అంతకుమందు ఆలేరులో గీత కార్మికులు మంత్రికి స్వాగతం పలికారు. కార్యక్రమంలో డీసీసీబీ ఛైర్మన్ గొంగిడి మహేందర్రెడ్డి, గౌడ ఐక్య సాధన సమితి వ్వవస్థాపక అధ్యక్షుడు అంబాల నారాయణగౌడ్, కార్య నిర్వాహక అధ్యక్షుడు బబ్బూరి భిక్షపతిగౌడ్ సర్పంచి బండ పద్మ, ఎంపీటీసీ సభ్యుడు బత్తుల నరేందర్రెడ్డి, గౌడ ఐక్య సాదన సమితి జిల్లా ప్రధాన కార్యదర్శి మొరిగాడి అశోక్, బెంజారం రవి, తదితరులు పాల్గొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పోరు.. ఖరారు..!
[ 29-03-2024]
నల్గొండ, భువనగిరి లోక్సభ స్థానాల్లో ప్రధాన పార్టీలైన కాంగ్రెస్, భారాస, భాజపా తమ అభ్యర్థులను ఖరారు చేసింది. -
బలవంతులకే.. మరింత బలమై..
[ 29-03-2024]
పోషకాలతో కూడిన ఆహారంతోనే వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుందని భావించిన ప్రభుత్వం గత కొన్ని నెలలుగా రేషన్ బియ్యంలో పోషకాలు కలుపుతోంది. -
భూసారం తగ్గిపోతోంది
[ 29-03-2024]
పెరుగుతున్న రసాయన ఎరువుల వినియోగం.. సమగ్ర నీటి యాజమాన్య పద్ధతులు పాటించకపోవటం, సహజ ఎరువుల వాడకం పూర్తిగా తగ్గించటంతో ఏటా భూమిలో రసాయనాల ప్రభావంతో గాఢత పెరిగిపోతోంది. -
టెట్పై యువత గురి
[ 29-03-2024]
ఉపాధ్యాయ ఉద్యోగం పొందాలంటే ‘టెట్’ (టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్) తప్పనిసరి అయినందున.. ఈ పరీక్ష ప్రాధాన్యం సంతరించుకుంది. ప్రభుత్వం మెగా డీఎస్సీ ప్రకటించిన విషయం తెలిసిందే. -
బైండోవర్ అతిక్రమిస్తే జైలుకే
[ 29-03-2024]
సార్వత్రిక ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమల్లోకి రావడంతో శాంతి భద్రతల విఘాతానికి దారి తీసే అంశాలపై పోలీసులు నిఘా పెడుతున్నారు. -
బార్ అధ్యక్షుడిగా సుదర్శన్రెడ్డి ఎన్నిక
[ 29-03-2024]
సూర్యాపేట జిల్లా కోర్టు బార్ అసోసియేషన్కు గురువారం జరిగిన ఎన్నికల్లో అధ్యక్షుడిగా నూకల సుదర్శన్రెడ్డి ఎన్నికయ్యారు. -
కష్టాలెదురైనా విద్యాభ్యాసం కొనసాగించాలి
[ 29-03-2024]
బాలికలు కష్ట నష్టాలెదురైనా విద్యాభ్యాసాన్ని కొనసాగించాలని చౌటుప్పల్ న్యాయస్థానం జూనియర్ సివిల్ జడ్జి మహతి వైష్ణవి సూచించారు. -
లోక రక్షణ కోసమే క్రీస్తు రుధిర తర్పణం
[ 29-03-2024]
క్రీస్తు ప్రభువు మానవాళిని పాప విముక్తులుగా చేసేందుకే అవనిపై అవతరించాడు. -
యాదాద్రీశుడికి శతఘటాభిషేకం
[ 29-03-2024]
పంచనారసింహుల దివ్యక్షేత్రమైన యాదాద్రిలో గురువారం శ్రీలక్ష్మీనరసింహస్వామి జన్మ నక్షత్రమైన స్వాతి సందర్భంగా ప్రత్యేక వేడుకలు నిర్వహించారు. -
అప్పుతీర్చలేక హత్య చేశారు: డీఎస్పీ
[ 29-03-2024]
మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్నారు.. అవసరం కోసం ఆమె వద్ద అప్పు తీసుకున్నారు.. తీసుకున్న అప్పు తిరిగి తీర్చమని నిలదీస్తే హత్యచేసి ఆనవాళ్లు లేకుండా చేయాలని ప్రయత్నించిన ముగ్గురిని అరెస్టు చేసినట్లు నల్గొండ డీఎస్పీ శివరాంరెడ్డి తెలిపారు. -
మహిళ హత్య కేసులో దోషికి యావజ్జీవ కారాగార శిక్ష
[ 29-03-2024]
మహిళ హత్య కేసులో నిందితుడిగా ఉన్న ఆరె కుమార్ అలియాస్ చిన్నును దోషిగా తేల్చుతూ భువనగిరి మొదటి అదనపు జిల్లా సెషన్స్ కోర్టు తీర్పు చెప్పింది.
తాజా వార్తలు (Latest News)
-
కేసీఆర్ చేసిన మొదటి తప్పు అదే: మంత్రి కోమటిరెడ్డి
-
కేసీఆర్ను దెబ్బతీయాలనుకునేవారికి ప్రజలే జవాబు చెప్తారు: కేటీఆర్
-
మాకు కొత్త కెప్టెన్ ఉన్నాడు..: యాంకర్ ప్రశ్నకు ధోనీ సమాధానం
-
కేజ్రీవాల్ ఫోన్లోని ఎన్నికల వ్యూహాల కోసం.. ఈడీ ప్రయత్నాలు: ఆతిశీ
-
‘ఫోన్ ట్యాపింగ్ కేసు.. రాధాకిషన్రావు చెప్పినట్లే చేశా!’
-
హెన్రిచ్ క్లాసెన్.. సన్రైజర్స్కు భలే దొరికాడు