నిలిచిన పథకం.. చేకూరని ప్రయోజనం
పాడి పరిశ్రమను ప్రోత్సహించేందుకు ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా ప్రారంభించిన పాడి పశువుల పంపిణీ పథకం అర్థాంతరంగా నిలిచిపోయింది. భారీ రాయితీతో ఈ పథకాన్ని 17 సెప్టెంబర్ 2017లో ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించారు. బ్యాంకు రుణంతో సంబంధం లేకుండా అప్పట్లో ప్రభుత్వమే ఈ పథకానికి నిధులు సమకూర్చింది
భువనగిరి పట్టణం, న్యూస్టుడే: పాడి పరిశ్రమను ప్రోత్సహించేందుకు ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా ప్రారంభించిన పాడి పశువుల పంపిణీ పథకం అర్థాంతరంగా నిలిచిపోయింది. భారీ రాయితీతో ఈ పథకాన్ని 17 సెప్టెంబర్ 2017లో ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించారు. బ్యాంకు రుణంతో సంబంధం లేకుండా అప్పట్లో ప్రభుత్వమే ఈ పథకానికి నిధులు సమకూర్చింది. ఉమ్మడి నల్గొండ జిల్లాతోపాటు మరో మూడు జిల్లాల్లో పాలను సేకరిస్తున్న నార్ముల్ డెయిరీ పాల ఉత్పత్తిదారుల్లోని 20049 మంది పాడి రైతులను ఎంపిక చేసి ఐదు నెలల వ్యవధిలో పాడి పశువులను పంపిణీ చేయాలన్నది పథకం లక్ష్యం. ప్రభుత్వ నిర్ణయం అమలుకు నేటికీ నోచుకోలేదు. ప్రభుత్వ నిర్ణయంతో పాడి పశువులపై ఆధారపడి జీవిస్తున్న రైతులు ఆర్థికంగా ఎదిగేందుకు అవకాశం ఉన్నప్పటికీ పథకం నిలిచిపోవడంతో పాడి రైతుల్లో నిరాశ నెలకొంది.
లక్ష్యం సాధించని పథకం... పాడి పశువుల పంపిణీ పథకం లక్ష్యం సాధించకుండానే అటకెక్కింది. కేవలం 6635 మందికి పథకం ప్రయోజనం చేకూర్చి పథకాన్ని నిలిపివేయడం గమనార్హం. దీంతో పాల ఉత్పత్తిపై ప్రభావం పడింది. భారీ రాయితీతో పాడి గేదెలు పొందుతామన్న రైతుల ఆశలు నెరవేరలేదు. పథకం దక్కని రైతుల బాధ ఒకలాగ ఉంటే, లబ్ధిదారుల ఆవేదన మరోలా ఉంది. 6635 గేదెల్లో ఇప్పటి వరకు వాతావరణం అనూకూలించక, ఇతర కారణాలతో ఇప్పటి వరకు 440 గేదెలు మృతి చెందాయి. వీటికి బీమా పరిహారం రాక రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. రూ.80 వేలు యూనిట్ ధర నిర్ణయించిన సందర్భంలోనే రవాణా, బీమా ఖర్చుల నిమిత్తం రూ.10వేలను యూనిట్ విలువ నుంచి మినహాయించి రెండు సదుపాయాలు కల్పించడం గమనార్హం. బీమా కింద ఇప్పటి వరకు 62 గేదెలను ఇప్పించినప్పటికీ వాటికి నేటికీ బీమా పత్రం ఇవ్వకపోవడం గమనార్హం. ఇందులో కొందరి గేదెలు మృతి చెందాయి. 315 బీమా క్లైంలు మంజూరయ్యాయని చెబుతున్న అధికారులు నేటికీ బీమా పరిహారం ఇప్పించకపోవడంతో రైతులు నష్టపోతున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి గేదెలు మృతి చెంది నష్టపోయిన తమకు బీమా పరిహారం చెల్లించాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు.
పథకం అమలు ఇలా.... అవినీతికి ఆస్కారం లేకుండా పకడ్బందీగా పథకాన్ని అమలు చేసేందుకు నాడు అధికారులు చర్యలు చేపట్టారు. గేదెలు కొనుగోలు విషయంలో లబ్ధిదారుడికి పూర్తి స్వేచ్ఛను అధికారులు ఇచ్చారు. పాల ఉత్పత్తిదారుల సంఘాల్లో ఎంపికైన లబ్ధిదారులు తమకు ఇష్టమున్న ప్రాంతంలో ఆవులు, గేదెలు కొనుగోలు స్వేచ్ఛను ఇచ్చారు. పథకం యూనిట్ విలువలో ఎస్సీ, ఎస్టీలకు 75 శాతం రాయితీపై, ఇతరులకు 50 శాతం రాయితీపై గేదెలను అందించారు. దాణా ఖర్చుల కింద రూ.5000 మంజూరు చేశారు. రూ.5140, మూడేళ్లపాలు బీమా కోసం మంజూరు చేశారు. ఎస్సీ, ఎస్టీ లబ్ధిదారులు తమ వాటా కింద చెల్లించాల్సి ఉన్న రూ.20వేలతో పాటు ప్రభుత్వం రూ.60 వేలు సమకూర్చింది. ఇతరులకు రూ.40వేలు రాయితీ కింద ప్రభుత్వం గేదెలను సమకూర్చింది. లబ్ధిదారుడు తన వాటా కింద మరో రూ.40వేలు చెల్లించారు.
ప్రభుత్వ నిర్ణయం మేరకు పంపిణీ
-డాక్టర్ కృష్ణ, జిల్లా పశువైద్య, సంవర్థకశాఖాధికారి
ప్రభుత్వ నిర్ణయం మేరకు అప్పట్లో డీడీలు చెల్లించిన 6635 మంది లబ్ధిదారులకు గేదెలను పంపిణీ చేశాం. ప్రస్తుతం పథకం అమలులో లేదు. గేదెలు చనిపోయిన రైతులకు నిబంధనల మేరకు బీమా ప్రయోజనాన్ని కల్పిస్తున్నాం. 315 మందికి బీమా క్లైంలు మంజూరయ్యాయి. విడతల వారీగా బీమా పరిహారం కింద గేదెలు అందజేస్తాం.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
నల్గొండలో 4... భువనగిరిలో 5
[ 20-04-2024]
లోక్సభ ఎన్నికల నామినేషన్ల స్వీకరణలో రెండో రోజైన శుక్రవారం నల్గొండ లోక్సభ పరిధిలో నలుగురు అభ్యర్థులు నామినేషన్లను దాఖలు చేశారు. -
పండుటాకులకు ఇంటివద్దే ఓటు
[ 20-04-2024]
రాబోయే లోక్సభ ఎన్నికల్లో ఓటర్లందరూ తమ హక్కు వినియోగించుకునేలా చేయాలని కేంద్ర ఎన్నికల సంఘం భావించింది.ఇందుకోసం పలు చర్యలు చేపట్టింది. -
యథేచ్ఛగా మట్టి దందా
[ 20-04-2024]
నార్కట్పల్లి మండలంలో మట్టి దందా యథేచ్ఛగా సాగుతోంది. గోపలాయపల్లి, యల్లారెడ్డిగూడెంలోని చెరువులు, బ్రాహ్మణవెల్లంల ప్రాజెక్ట్ కాల్వల మట్టిని అక్రమంగా ఇటుక బట్టీలకు, వెంచర్లకు తరలిస్తున్నారు. -
ఇక కఠిన చర్యలు
[ 20-04-2024]
సీఎంఆర్ బియ్యం బకాయిదారులపై కఠినంగా వ్యవహరించాలని రాష్ట్ర అత్యున్నత స్థాయిలో శుక్రవారం నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. -
పదమూడేళ్లుగా.. అభ్యున్నతే లక్ష్యంగా..!
[ 20-04-2024]
ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా పదమూడేళ్లుగా ప్రభుత్వ పాఠశాలల్లో చదివే పేద విద్యార్థుల అభ్యున్నతికి, చదువుల్లో ఉన్నత స్థాయికి ఎదిగేందుకు పాలిటెక్నిక్లో ప్రవేశానికి నిర్వహించే పాలిసెట్లో ఉచిత శిక్షణ అందిస్తుంది ప్రభుత్వ పాఠశాలల పరిరక్షణ సమితి. -
పార్టీ గుర్తు కావాలంటే బీ ఫారం ఉండాల్సిందే..
[ 20-04-2024]
లోక్సభ, శాసనసభ, జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నిక ఏదైనా సరే...రాజకీయ పార్టీ అభ్యర్థిగా గుర్తించి అతనికి ఆయా పార్టీలకు ఎన్నికల సంఘం నిర్ణయించిన గుర్తులను ఎన్నికల అధికారి కేటాయించాలంటే ‘బీ’ ఫారం ఉండాల్సిందే. -
ఎంపీలుగా ఎవరెవరంటే..
[ 20-04-2024]
లోక్సభకు ఉమ్మడి నల్గొండ జిల్లా నుంచి మహామహులు ప్రాతినిథ్యం వహించారు. వారు ప్రాతినిథ్యం వహించిన పార్టీతో పాటు వారు నిర్వహించిన ప్రజా ఉద్యమాలు, సచ్ఛీలత, వ్యక్తిగత పలుకుబడి తోడు కావడంతో ఎన్నికల బరిలో విజయబావుటా ఎగురవేశారు. -
ఏదీ నిఘా..!
[ 20-04-2024]
లోక్సభ ఎన్నికలు.. ఏపీలో అసెంబ్లీ ఎన్నికల వేళ ఉభయ తెలుగు రాష్ట్రాల సరిహద్దుగా ఉన్న కృష్ణానది తీరంలో మరింత నిఘా పెడితేనే అక్రమాలకు అడ్డుకట్ట పడనుంది. -
ఈవీఎం, వీవీప్యాట్లకు తేడా ఇదే!
[ 20-04-2024]
ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషీన్ (ఈవీఎం)లోని ఒక భాగమే ఓటర్ వెరిఫైడ్ పేపర్ ఆడిట్ ట్రయల్ (వీవీప్యాట్). అభ్యర్థి పేరు, గుర్తు, సీరియల్ నంబర్ దీనిపై కనిపిస్తాయి. -
వరుస దొంగతనాలకు పాల్పడుతున్న నిందితుడి అరెస్ట్
[ 20-04-2024]
జిల్లాతో పాటు ఇతర ప్రాంతాల్లో వరుస దొంగతనాలకు పాల్పడుతున్న దొంగను అదుపులోకి తీసుకున్నట్లు నల్గొండ జిల్లా మిర్యాలగూడ డీఎస్పీ రాజశేఖర్ రాజు తెలిపారు. -
చిన్నప్పుడు కథలు చెబితేనే నిద్రవచ్చేది
[ 20-04-2024]
మా ఊరు మోత్కూరు మండలం పాలడుగు గ్రామం. ప్రాథమిక విద్య ఇక్కడే చదువుకున్నాను. -
లోక్సభ ఎన్నికల తర్వాత భారాస అడ్రస్ గల్లంతు: ఉత్తమ్
[ 20-04-2024]
లోక్సభ ఎన్నికల్లో రాష్ట్ర వ్యాప్తంగా భారాస ఒక్క స్థానంలోనూ విజయం సాధించలేదని, డిపాజిట్లు కూడా దక్కవని రాష్ట్ర పౌర సరఫరా, నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి అన్నారు. -
పల్లె చెరువుల్లో మట్టి లూటీ..!
[ 20-04-2024]
పంట పొలాలకు సాగునీరందించే చెరువుల మట్టి వ్యాపారుల జేబులు నింపుతోంది. ముఖ్యంగా ఇటుక బట్టీల నిర్వాహకులు వివిధ గ్రామాల్లో కొన్నేళ్లుగా ఓ విధానమంటూ లేకుండా చెరువు మట్టిని పొక్లెయిన్లతో తవ్వి ట్రాక్టర్లలో తరలించి ఇటుకల తయారీకి వాడుతున్నారు. -
భాజపాను ఓడించేందుకు ఏకం కావాలి
[ 20-04-2024]
తెలంగాణలోని 17 లోక్సభ స్థానాల్లో అత్యధికంగా గెలవాలని ఉవ్విళ్లూరుతున్న భాజపా ఆశలను వమ్ము చేయడమే తమ ముందున్న లక్ష్యమని సీపీఎం పొలిట్బ్యూరో సభ్యుడు బీవీ రాఘవులు అన్నారు.