‘తెలంగాణ అభివృద్ధిలో భాగస్వామినవుతా’
తెలంగాణ అభివృద్ధిలో భాగస్వామ్య అయ్యేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ అవకాశం కల్పించడం అదృష్టంగా భావిస్తున్నానని రాష్ట్ర గొర్రెలు, మేకల అభివృద్ధి కార్పొరేషన్ ఛైర్మన్ దూదిమెట్ల బాలరాజుయాదవ్ అన్నారు. భువనగిరి పురపాలిక పరిధిలోని రాయగరిలో సోమవారం గొల్లకుర్మ సంఘం ఆధ్వర్యంలో బాలరాజ్యాదవ్కు ఆత్మీయ సన్మానోత్సవాన్ని నిర్వహించారు.
దూదిమెట్ల బాలరాజుయాదవ్ సన్మానోత్సవంలో పాల్గొన్న ఎంపీ లింగయ్యయాదవ్, ఎమ్మెల్యే శేఖర్రెడ్డి, అయిల్ఫెడ్ ఛైర్మన్ రామకృష్ణారెడ్డి, తదితరులు
భువనగిరి నేరవిభాగం, న్యూస్టుడే: తెలంగాణ అభివృద్ధిలో భాగస్వామ్య అయ్యేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ అవకాశం కల్పించడం అదృష్టంగా భావిస్తున్నానని రాష్ట్ర గొర్రెలు, మేకల అభివృద్ధి కార్పొరేషన్ ఛైర్మన్ దూదిమెట్ల బాలరాజుయాదవ్ అన్నారు. భువనగిరి పురపాలిక పరిధిలోని రాయగరిలో సోమవారం గొల్లకుర్మ సంఘం ఆధ్వర్యంలో బాలరాజ్యాదవ్కు ఆత్మీయ సన్మానోత్సవాన్ని నిర్వహించారు. సన్మానోత్సవ కార్యక్రమానికి ముందు ఆయన భువనగిరి శివారులోని ఎల్లమ్మ ఆలయంలో పూజలు చేశారు. అక్కడ నుంచి ర్యాలీగా గార్డెన్కు చేరుకున్నారు. పట్టణంలోని అమరవీరుల స్తూపం వద్ద వద్ద నివాళి అర్పించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథులగా హాజరైన రాజ్యసభ సభ్యుడు బడుగుల లింగయ్యయాదవ్, ప్రభుత్వ విఫ్ సునీత, ఎమ్మెల్యే పైళ్ల శేఖర్రెడ్డి, అయిల్ఫెడ్ రాష్ట్ర కార్పొరేషన్ ఛైర్మన్ కంచర్ల రామకృష్ణారెడ్డి తదితరులు పాల్గొని సన్మానించారు. ఈ సందర్భంగా బాలరాజ్యాదవ్ మాట్లాడుతూ సీఎం కేసీఆర్ లేకుంటే తెలంగాణ రాష్ట్ర లేదని, అలాంటి వ్యక్తిని విమర్శిస్తున్న బండి సంజయ్, రేవంత్రెడ్డి తెలంగాణ ఉద్యమంలో ఎక్కడ ఉన్నారని ప్రశ్నించారు. ఎంపీ బడుగుల లింగయ్య మాట్లాడుతూ యాదవ్ తెలంగాణ రాష్ట్ర వచ్చిన తర్వాత బడుగు బలహీన వర్గాల వారికి రాజకీయంగా ఎన్నో అవకాశాలను సీఎం కేసీఆర్ ఇచ్చారన్నారు. ప్రభుత్వ విప్ గొంగిడి సునీత మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమకారులందరికి ఎప్పుడోకప్పడు అవకాశాలు వస్తాయన్నారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే పైళ్ల శేఖర్రెడ్డి, గొల్లకుర్మల సంఘం రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షుడు క్యాస మల్లేషం, మాజీ ఎంపీ బూర నర్సయ్యగౌడ్, రైతుబంధుసమితి జిల్లా కన్వీనర్ కొల్లుల అమరేందర్, గ్రంథాలయ సంస్థ ఛైర్మన్ అమదరేందర్గౌడ్, మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్రెడ్డి, తెరాస నాయకులు, గొల్లకుర్మసంఘ నాయకులు పాల్గొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ప్రభుత్వంపై విమర్శ.. రైతులకు భరోసా
[ 25-04-2024]
లోక్సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా బస్సుయాత్ర చేస్తున్న మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ దానిని ఉమ్మడి జిల్లా నుంచే ప్రారంభించడంతో.. భారాస నేతలు పెద్దఎత్తున ఏర్పాట్లు చేశారు. -
బాలికలు.. భళా
[ 25-04-2024]
విద్యార్థులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఇంటర్ ఫలితాలు విడుదలయ్యాయి. -
మోదీతో తెలంగాణకు తీరని అన్యాయం
[ 25-04-2024]
కేంద్ర ప్రభుత్వం, ప్రధాని మోదీ తెలంగాణకు తీరని అన్యాయం చేశారని నల్గొండ లోక్సభ ఇన్ఛార్జి, మంత్రి నల్లమాద ఉత్తమ్కుమార్రెడ్డి ఆరోపించారు. -
బాలికలదే హవా
[ 25-04-2024]
రాష్ట్ర వ్యాప్తంగా ఇంటర్ ప్రథమ, ద్వితీయ సంవత్సరం పరీక్ష ఫలితాలు బుధవారం విడుదలయ్యాయి. -
ఉపాధి కూలీల సౌకర్యాలపై సమీక్ష
[ 25-04-2024]
పని ప్రదేశాలలో ఉపాధి కూలీలకు మౌలిక సౌకర్యాలు సమకూర్చాలని జిల్లా పరిషతు ముఖ్య కార్యనిర్వహణాధికారి శోభారాణి, ఆదనపు డీఆర్డీవో జి.సురేష్, సూచించారు. -
ప్రథమంలో 26.. ద్వితీయంలో 25
[ 25-04-2024]
ఇంటర్ పరీక్ష ఫలితాల్లో బాలికలు సత్తా చాటారు. 2022-23లో జిల్లా ఉత్తీర్ణత శాతం 57 ఉండగా, ప్రస్తుతం 54.50 శాతానికి పడిపోయింది. -
ఊపందుకున్న నామినేషన్ల పర్వం
[ 25-04-2024]
నల్గొండ, భువనగిరి లోక్సభ స్థానాలకు బుధవారం వరకు 45 మంది చొప్పున నామినేషన్లు వేశారు. -
గిరిజన గురుకులాల్లో 88.60శాతం ఉత్తీర్ణత
[ 25-04-2024]
ఇంటర్ ఫలితాల్లో తెలంగాణ ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇనిస్టిట్యూషనల్ సొసైటీ ఆధ్వర్యంలో నల్గొండ, సూర్యాపేట జిల్లాల్లో కలిపి ఇంటర్ ద్వితీయ సంవత్సరంలో 88.60శాతం ఫలితాలు -
మతోన్మాద భాజపాను ఓడించండి: సీపీఐ
[ 25-04-2024]
దేశంలో మతోన్మాదం పేరుతో రాజకీయాలు చేస్తున్న భాజపాను ఓడించి కాంగ్రెస్ అభ్యర్ధులను భారీ మెజార్టీతో గెలిపించాలని సీపీఐ జాతీయ సమితి సభ్యుడు పల్లా వెంకట్రెడ్డి పిలుపునిచ్చారు. -
విభజన హామీల అమలుకు కృషి
[ 25-04-2024]
భువనగిరి లోక్సభ ఎంపీగా తనను గెలిపిస్తే విభజన హామీలను అమలు చేసేందుకు, నిధులు రాబట్టేందుకు కృషి చేస్తానని భువనగిరి లోక్సభ నియోజకవర్గ కాంగ్రెస్ అభ్యర్థి చామల కిరణ్కుమార్రెడ్డి అన్నారు. -
తొలి ఎన్నికలోనే అత్యధిక మెజారిటీ
[ 25-04-2024]
నల్గొండ లోక్సభ నియోజకవర్గం 1951లో ఏర్పడగా.. తొలి ఎన్నికలు 1952లో జరిగాయి. -
రైల్వే ఉద్యోగాలు ఇప్పిస్తానని మోసం, వ్యక్తి అరెస్ట్
[ 25-04-2024]
రైల్వేశాఖలో ఉద్యోగాలు ఇప్పిస్తానని 17 మంది బాధితుల నుంచి నగదు వసూలు చేసిన వ్యక్తిని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించినట్టు పోలీస్ ఇన్స్పెక్టర్ అశోక్రెడ్డి తెలిపారు.